పాంచాల పరాభవము (పంజాబు దురంతములు) 1921లో దామరాజు పుండరీకాక్షుడు రాసిన అయిదంకముల నాటకం.
పంజాబ్లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతంను మహాభారత కథలో ఇమడ్చి ఈ నాటకం రాయబడింది.
పాంచాల పరాభవము | |
కృతికర్త: | దామరాజు పుండరీకాక్షుడు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | చంద్రికా ముద్రాక్షరశాల, గుంటూరు |
విడుదల: | 1921 |
పేజీలు: | 95 |
భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశంలో జరుగుతున్న పోరాటం గురించి ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతం చేయడంకోసం ఉద్యమ నేపథ్యంలో నాటకాలు రచించబడేవి.
జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండ నేపథ్యంలో జనరల్ డయ్యర్ ను దుశ్శాసునిగా, భారతమాతను పాంచాలిగా, మహాత్మా గాంధీని కృష్ణుడిగా పోలుస్తూ దామరాజు ఈ నాటకాన్ని రచించాడు. తెల్లదొరల చేతుల్లో ముక్కలైపోతున్న భారతమాతను ఓదార్చి మహాత్మా గాంధీ సత్యగ్రహ దీక్షతో ప్రజలను ఉద్యమంవైపుకు మరలిస్తాడు.
నాటక ప్రదర్శనలో వేదికమీద డయ్యర్ దిష్టిబొమ్మ తగులబెట్టడంతో దానిపై ఇంగ్లాడ్ పార్లమెంటులో చర్చ జరిగి బ్రిటీషు ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించడంతోపాటు, ప్రతులను తగులబెట్టించింది.
This article uses material from the Wikipedia తెలుగు article పాంచాల పరాభవము (నాటకం), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.