నాదెండ్ల భాస్కరరావు (జూన్ 23, 1935) కాంగ్రేస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు.
1984 లో ఆగస్టు 16 నుండి సెప్టెంబరు 16 వ తేది వరకు ఒక నెలపాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
నాదెండ్ల భాస్కరరావు | |||
| |||
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 1984 లో ఆగష్టు 16 నుండి సెప్టెంబర్ 16 | |||
ముందు | నందమూరి తారక రామారావు | ||
---|---|---|---|
తరువాత | నందమూరి తారక రామారావు | ||
నియోజకవర్గం | విజయవాడ తూర్పు నియోజక వర్గము | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | |||
రాజకీయ పార్టీ | కాంగ్రేసు పార్టీ | ||
సంతానం | నాదెండ్ల మనోహర్ | ||
నివాసం | హైద్రాబాద్ | ||
మతం | హిందూ |
భాస్కరరావు 1935, జూన్ 23 న గుంటూరు లో జన్మించాడు. ఈయన తండ్రి పిచ్చయ్య. 1958లో లలిత భాస్కరరావును వివాహము చేసుకొన్న ఈయనకు ఇద్దరు కుమారులు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి బి.ఏ ఎల్.ఎల్.బీ పట్టా పొందాడు.
1978 రాష్ట్ర శాసనసభ (భారతదేశం) ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజక వర్గము నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ సభ్యుడయ్యాడు.
1978 నుండి 1989 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (భారతదేశం) సభ్యునిగా కొనసాగిన ఈయన ఆ కాలములోనే మంత్రిగా, కేబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. నాదెండ్ల భాస్కరరావు, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గములో, టి.అంజయ్య మంత్రివర్గములో మంత్రిగా పనిచేశాడు. 1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి పన్నెండవ లోక్సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
1982, మార్చి29న నందమూరి తారక రామారావు అంధ్రుల ఆత్మాభిమానమే నినాదముగా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. పార్టీ, ప్రారంభించిన 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వం యేర్పాటు చేసింది. రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఆయన మంత్రి వర్గములో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన రాంలాల్ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ ఈయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో రామారావు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. నెలరోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా, భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. కేంద్ర ప్రభుత్వం తిరిగి రామారావును ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించింది. భాస్కరరావు తెలుగు దేశం పార్టీ తన ఆలోచనల రూపమే అని చెప్పుకున్నాడు. అయితే, ఈయనే ఆ తరువాత కాలములో అలా ప్రాంతీయ పార్టీని స్థాపించి తప్పుచేశానని చింతించాడు
ఇంతకు ముందు ఉన్నవారు: నందమూరి తారక రామారావు | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 16/08/1984—16/09/1984 | తరువాత వచ్చినవారు: నందమూరి తారక రామారావు |
This article uses material from the Wikipedia తెలుగు article నాదెండ్ల భాస్కరరావు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.