కుతుబ్ షాహీ వంశం (ఈ వంశస్థులను కుతుబ్ షాహీలు అంటారు) దక్షిణ భారతదేశం లోని గోల్కొండ రాజ్యం పాలించిన పాలక వంశం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వంశస్థులు తుర్కమేనిస్తాన్-ఆర్మేనియా ప్రాంతంలోని తుర్కమేన్ తెగకు చెందిన షియా ముస్లింలు.
కుతుబ్ షాహీ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1512–1687 | |||||||||
రాజధాని | హైదరాబాద్ | ||||||||
సామాన్య భాషలు | దక్కని, తర్వాత ఉర్దూ | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
కుతుబ్ షాహీ | |||||||||
• 1518-1748 | సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ | ||||||||
• 1672-1687 | అబుల్ హసన్ కుతుబ్ షా | ||||||||
చరిత్ర | |||||||||
• స్థాపన | 1512 | ||||||||
• పతనం | 1687 | ||||||||
విస్తీర్ణం | |||||||||
500,000 km2 (190,000 sq mi) | |||||||||
|
కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, 16వ శతాబ్దం ప్రారంభంలో కొందరు బంధువులు, స్నేహితులతో కలసి ఢిల్లీకి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేసాడు. అతడు గోల్కొండను జయించి హైదరాబాద్ రాజ్యానికి అధిపతి అయ్యెను. 1518లో బహుమనీ సామ్రాజ్యం పతనమై ఐదు దక్కన్ సల్తనత్ ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రం ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టం స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశం స్థాపించాడు.
ఈ వంశము తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశం. ఈ వంశం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు దక్కన్ని జయించేవరకు, 175 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత 1948లో హైదరాబాదు రాజ్యం, న్యూఢిల్లీ సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారతదేశంలో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది.
కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా, శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా, ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష, కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూ (దక్కనీ) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత హైదరాబాదు రాజ్యానికి రాజధానులుగా ఉండేవి, ఉభయ నగరాలును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.
ఈ వంశానికి చెందిన ఎనిమిది రాజులు క్రమంగా:
1.సుల్తాన్ కులీ కుతుబ్ షా: ఇతని కాలం లో ఇతనికి సమకాలికులు 1. శ్రీకృష్ణ దేవరాయలు 2. బాబర్, హుమాయూన్
ఇతని రాజ్య విస్తరణకు కారకులయిన సేనాధిపతులు 1. హైధర్ ఉల్ముల్క్ 2. మురారీరావ్. మురారి రావ్ అహోభిలమ్ దేవాలయం పై దండెత్తాడు
This article uses material from the Wikipedia తెలుగు article కుతుబ్ షాహీ వంశం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.