ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా భారతదేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థ.
దీని చట్టసభలలో 175 శాసనసభ్యులు ఐదు సంవత్సరాల పదవికాలంతో ప్రజలచే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు, వివిధ శాసనమండలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే 58 మంది శాససమండలి సభ్యులు వుంటారు. ఈ ప్రభుత్వానికి రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలకు బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ముఖ్యమంత్రి,మంత్రివర్గం చేతిలో చట్టాలు చేసే అధికారం వుంటుంది. శాసనవ్యవస్థతో పాటు శాసనాల అమలుకు కార్యనిర్వాహకవ్యవస్థ, హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ ఉన్నాయి.
పరిపాలన కేంద్రం | విశాఖపట్నం |
---|---|
చట్ట వ్యవస్థ | |
శాసనసభ | |
సభాపతి | తమ్మినేని సీతారాం |
శాసనసభ్యుల సంఖ్య | 175 |
శాసనమండలి | ఆంధ్రప్రదేశ్ శాసనమండలి |
అధ్యక్షుడు | కొయ్యే మోషేన్రాజు |
ఉప అధ్యక్షుడు | జకియా ఖానమ్ |
శాసనమండలి సభ్యులసంఖ్య | 58 |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
గవర్నర్ | సయద్ అబ్దుల్ నశీద్ |
ముఖ్యమంత్రి | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
ఉపముఖ్యమంత్రులు | |
ప్రధాన కార్యదర్శి | సమీర్ శర్మ, IAS |
న్యాయవ్యవస్థ | |
ఉన్నత న్యాయస్థానం | ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం |
ప్రధాన న్యాయమూర్తి | ప్రశాంత్ కుమార్ మిశ్రా |
2023 ఫిబ్రవరి 12న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్గా భారత రాష్ట్రపతి నియమించారు.
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, 2019 మే 30 న నవ్యాంధ్ర రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.
ప్రధాన వ్యాసం:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి
ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు 30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు ఉన్నాయి.
జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్ర స్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుంటారు.
శాసనాలు వెబ్ సైట్ లో లభ్యం.
రహస్యం కానివి ప్రభుత్వ ఆదేశాలు జాలంలో అందుబాటులో ఉన్నాయి.
2001 లో ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి ఏర్పడింది. As of 2021[update], దీనిని అన్ని ప్రభుత్వ డిజిటల్ సేవల కొరకు విస్తరించి మైఎపి (myap) అనే జాలస్థలి (గవాక్షం) ఏర్పడింది.
చూడండి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 2007 మార్చి 30 న పునరుద్ధరించబడింది.
అమరావతిలో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభించబడింది. దీనికి ప్రతి జిల్లాలో పౌర, నేర వివాదాల న్యాయస్థానాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పులు అంగీకరించని కక్షిదారులు భారత సుప్రీమ్ కోర్టులో వివాదం కొనసాగించవచ్చు.
This article uses material from the Wikipedia తెలుగు article ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.