గ్రీష్మ భూమి వేంపల్లి గంగాధర్ రాసిన కథా సంకలనం.
డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్టపతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం ' గ్రీష్మ భూమి'. ఇందులో 13 కథలు ఉన్నాయి.
ఈ పుస్తకంలోని కథలు వాస్తవికతను ప్రతిబింబిస్తూ కడప జిల్లా మాండలికంలో రాయబడినవి. ఈ కథలను సాఫీగా చదువుకోవడానికి ప్రాంతీయ భాషా పడికట్టులు అడ్డు తగలవు. ఈ పుస్తకంలోని 13 కథల లోనూ కడప జిల్లా లోని పలు ప్రాంతాల మనుషులూ, వాతావరణం, రాజకీయాలకు ఇంకా అతకని మనస్తత్వాలు కనిపిస్తాయి. కథలన్నీ వాస్తవికతనూ, మానసిక దౌర్భల్యాల నుండి బయట పడీ పడకుండా ఉండే మనుషులను, దేశాభ్యుదయానికి జరగవలసిన మార్పు చేర్పులను సూచిస్తాయి.
This article uses material from the Wikipedia తెలుగు article గ్రీష్మ భూమి కథలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.