శీలా వీర్రాజు (1939 ఏప్రిల్ 22 - 2022 జూన్ 1) ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త.
ఆయన రాసిన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. దీనికిగాను 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం దక్కింది. అలాగే ఆయన రచించిన పలు రచనలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. ఆయన శీలావీ గా సుపరిచితుడు.
శీలా వీర్రాజు కవి, చిత్రకారుడు | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | రాజమండ్రి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ | 1939 ఏప్రిల్ 22
మరణం | 2022 జూన్ 1 |
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | సుభద్రాదేవి |
తల్లి | వీరబద్రమ్మ |
తండ్రి | శీలా సూర్యనారాయణ |
1939 ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించాడు. డిగ్రీ వరకు విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. కళాశాల విద్య అభ్యసించే సమయంలోనే ఆయన కథలు రాయడం ప్రారంభించాడు.
1961లో హైదరాబాదు నుండి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్గా చేరి రెండేళ్లు పనిచేశాడు. 1963 జులైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1990 జనవరి 31న స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు. యువభారతితో కలసి పనిచేసాడు. శీలా వీర్రాజు చిత్రాల ప్రదర్శనను రాజమహేంద్రవరంలోని దామెర్ల ఆర్ట్గ్యాలరీలో ఉంచారు.
కవిత్వం
నవలలు
కథాసంపుటాలు
ఇతరాలు
83 ఏళ్ళ శీలా వీర్రాజు 2022 జూన్ నెల 1వ తారీకు నాడు(బుధవారం) సాయంత్రం హైదరాబాదు సరూర్నగర్లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయనికి భార్య సుభద్ర, కూతురు పల్లవి ఉన్నారు. శీలా సుభద్రాదేవి కూడా సాహితీవేత్త.
This article uses material from the Wikipedia తెలుగు article శీలా వీర్రాజు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.