భారతీయ సినిమా |
సంఖ్యా పరంగా భారతీయ చలన చిత్ర రంగం ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ. దాదాపు అన్ని ప్రధాన భాషలలోను సినిమాలను నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, బెంగాలీ, మరాఠి భాషలలో సినిమా నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉంది. ఈ మధ్య కాలంలో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం భారతదేశం లోనే కాక దక్షిణాసియా, రష్యా, అరబ్బు, ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. కైరోలో జరిగిన ఆఫ్రో- ఆసియన్ చలన చిత్ర వేడుకల్లో భారతదేశం నుంచి శివాజీ గణేశన్, యెస్.వి.రంగా రావు లకు ఉత్తమ నటుడిగా పురస్కారలు లభించాయి. భారత చలన చిత్ర రంగాన్ని ముఖ్యంగా రెండు భాగాల కింద విభజించవచ్చు. ఉత్తర భారత చలన చిత్ర రంగం, దక్షిణ భారత చలన చిత్ర రంగం . ఉత్తర భారత చలన చిత్ర రంగంలో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలున్నా హిందీ చిత్ర రంగం బాలీవుడ్ దే పైచేయిగా వుంటుంది. మరో పక్కన దక్షిణ భారత చలన చిత్ర రంగంలో తెలుగు, తమిళం, మళయాళం , కన్నడ భాషల చిత్ర పరిశ్రమలు పొటా పోటీగా, కలసి మెలసి వుంటాయి.
1904లో మొట్టమొదటిసారి భారతదేశంలో "సినిమా చూపడం" జరిగింది. విదేశాలనుండి తెచ్చిన 'The Life of Christ' (క్రీస్తు జీవితం) అనే చిత్రాన్ని ఒక చేతితో త్రిప్పే ప్రొజెక్టర్పై చూపించారు. సరైన వేగంతో (ఎక్కువా, తక్కువా కాకుండా) రీలును త్రిప్పడం అనేది ప్రొజెక్టరు ఆపురేటరు నైపుణ్యంపై ఆధారపడింది.
వెండితెర సందడి | |
---|---|
తెలుగు సినిమా | |
• తెలుగు సినిమా వసూళ్లు | |
• చరిత్ర | |
• వ్యక్తులు | |
• సంభాషణలు | |
• బిరుదులు | |
• రికార్డులు | |
• సినిమా | |
• భారతీయ సినిమా | |
ప్రాజెక్టు పేజి |
'The Life of Christ ' సినిమాను మళ్ళీ మళ్ళీ చూసిన దాదాసాహెబ్ ఫాల్కేలో స్వయంగా సినిమా తీయాలనే కోరిక బలపడింది. 'ABCD of Cinematography' అనే పుస్తకాన్ని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. 1912లో ఇంగ్లాండు వెళ్ళి దాదాసాహెబ్ ఒక కెమెరాను (Williamson Camera), ఇతర పరికారలనూ కొని వాటిని ఉపయోగించడం నేర్చుకొన్నాడు. వాటితో ఆయన 1912లో తీసిన 'రాజా హరిశ్చంద్ర' భారతదేశపు మొదటి చలనచిత్రం. ఇది 1913 మే 17న విడుదల అయ్యింది. ఆ సినిమా పబ్లిసిటీలో తమచిత్రం 2 మైళ్ళ పొడవుంటుందనీ, అందులో 57వేల ఫొటోలున్నాయనీ చెప్పుకొన్నారు.ఈ చిత్రం లోని ఆడవారి వేషాలని మగవారే వేసారు. అలా దాదాసాహెబ్ ఫాల్కే 'భారతీయ చలనచిత్ర పితామహుడు' అయ్యాడు.
ఇదే సమయంలో మద్రాసులో రఘుపతి వెంకయ్య కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు.ఆయన ఆసియా లోని చాలా ప్రాంతాలు తిరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఆయన చాలా మూకీ చలన చిత్రాలు, టాకీ చిత్రాలు నిర్మించేవారు. అప్పట్లో మద్రాసులో ప్రప్రథమ సినిమా హాలను నిర్మించిన వ్యక్తి ఆయన.ఈ విధంగా నంది పురస్కారాలలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని చేర్చడం జరిగింది.
ఇరవయ్యొవ శతాబ్ది మొదటిలో చలన చిత్రాలు మామూలు, మధ్యతరగతి జనాలకు బాగా చేరువయ్యాయి. అందులోనూ చలన చిత్ర ప్రవేశ ధరలు బాగా తక్కువగా వుండడంతో ప్రజలు చలన చిత్రాలను వీక్షించి, ఈ పరిశ్రమను ఆదరించారు. ఇదే సమయంలో భారతీయ యువకులు కొందరు చలన చిత్ర దర్శకులై భారతీయ సంప్రదాయాల్ని చలన చిత్రాల్లోకి తేవడం మొదలుపెట్టారు.
తరువాత దాదాసాహెబ్ 1914లో 'మోహినీ భస్మాసుర', 'సత్యవాన్ సావిత్రి', అనే మరి రెండు మూకీ చిత్రాలు తీశాడు. లండన్నుండ వెలువడే 'Cinematography and Bioscope' అనే పత్రిక ఈ చిత్రాలను ప్రశంసించింది.
మొదటితరం కదిలే చిత్రాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
This article uses material from the Wikipedia తెలుగు article భారతీయ సినిమా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.