ఓం బిర్లా (జ.1962 నవంబరు 23) భారతదేశ రాజకీయ నాయకుడు.
అతను భారతదేశానికి 17వ లోక్సభ స్పీకరుగా ఉన్నారు. అతను రాజస్థాన్ లోని కోటా-బుండి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అంతకు ముందు అతను రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు శాసనసభ్యునిగా కోటా దక్షిణ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2019 జూన్ 19 న అతను లోక్సభ స్పీకరుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు.
ఓం బిర్లా | |||
| |||
17వ లోక్సభ స్పీకరు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 జూన్ 2019 | |||
డిప్యూటీ | ఖాళీ | ||
---|---|---|---|
ముందు | సుమిత్రా మహాజన్ | ||
లోక్సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | లియారాజ్ సింగ్ | ||
నియోజకవర్గం | కోటా | ||
రాజస్థాన్ రాష్ట్ర శాసససభ సభ్యుడు | |||
పదవీ కాలం 8 డిసెంబరు 2003 – 16 మే 2014 | |||
ముందు | శాంతి ధరివాల్ | ||
తరువాత | సందీప్ శర్మ | ||
నియోజకవర్గం | కోటా సౌత్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | కోటా, రాజస్థాన్, భారతదేశం | 1962 నవంబరు 23||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | డా. అమితా బిర్లా | ||
సంతానం | 2 | ||
నివాసం | 20 అక్బర్ రోడ్, న్యూఢిల్లీ (అధికార) కోటా, రాజస్థాన్ (ప్రైవేట్) | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వ కామర్స్ కళాశాల, కోటా మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, పరోపకారి | ||
మతం | హిందూ మతం | ||
మూలం | సభ్యుని సమాచారం |
ఓం బిర్లా 1962 నవంబరు 23న శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. అతను కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తరువాత ఆజ్మీరు లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుండి కామర్స్ డిగ్రీని పొందాడు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను బిర్లా ఉత్తరప్రదేశ్ లో జైలుశిక్ష అనుభవించాడు.
అతను 2003లో మొట్టమొదటి సారి రాజస్థాన్ లోని కోటా దక్షిణ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను భారత కాంగ్రెస్ అభ్యర్థి శాంతి ధరివాల్ ను 10,101 ఓట్ల మెజారితో ఓడించాడు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అతను 24, 300 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాం కిషన్ వెర్మ చేతిలో ఓడిపోయాడు. పార్లమెంటు సభ్యునిగా ఎంపిక కాక ముందు అతను 2013లో మూడవసారి అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ మెహ్రాను 50,000 ఓట్ల తేడాతో ఓడించాడు. అతని 2003-08 పదవీ కాలంలో రాజస్థాన్ ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రటరీగా వ్యవహరించాడు.
అతను 16వ, 17వ లోక్సభలకు సభ్యునిగా కోట (రాజస్థాన్) పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపిక అయ్యాడు.అతను 16వ లోక్సభలో సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా వ్యవహరించాడు. 17వ లోక్సభలో లోక్సభ స్పీకరుగా ఎంపిక అయ్యాడు.
ఒక క్రియాశీల పార్లెమెంటు సభ్యునిగా కోట (రాజస్థాన్) పార్లమెంటు నియోజక వర్గ పరిథిలో అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాడు. అందులో "పరీధాన్" అనే కార్యక్రమళ్ 2012లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అతను బట్టలు, పుస్తకాలను సమాజంలో బలహీన వర్గాల ప్రజలకు అందజేయడం, రక్త దాన శిబిరాలను నిర్వహించాడు. అతను పేద ప్రజలకు ఉచితంగా భోజనం, మందులు సరఫరా కార్యక్రమం కూడా చేపట్టాడు.
లోక్సభ | ||
---|---|---|
అంతకు ముందువారు జయరాజ్ సింగ్ | పార్లమెంటు సభ్యుడు కోటా పార్లమెంటు నియోజకవర్గం 2014 – ప్రస్తుతం | తరువాత వారు Incumbent |
రాజకీయ కార్యాలయాలు | ||
అంతకు ముందువారు సుమిత్ర మహాజన్ | లోక్సభ స్పీకరు 2019 – ప్రస్తుతం | Incumbent |
This article uses material from the Wikipedia తెలుగు article ఓం బిర్లా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.