నైనా దేవి

నైనాదేవి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గల పట్టణం.

నైనాదేవి
పట్టణం
నైనా దేవి ఆలయం
నైనా దేవి ఆలయం
దేశంనైనా దేవి India
రాష్ట్రంHimachal Pradesh
జిల్లాBilaspur
Population
 (2001)
 • Total1,161
భాషలు
 • అధికారహిందీ, పంజాబీ
Time zoneUTC+5:30 (IST)

జనాభా వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం , ఈ పట్టణ జనాభా 1161. అందులో పురుషులు 63% , స్త్రీలు 37% ఉన్నారు. ఇక్కడ సగటు అక్షరాస్యతా రేటు 81%, ఇది జాతీయ సగటు ఆక్షరాస్యత 59.5% కంటే ఎక్కువ;పురుషుల అక్షరాస్యత 84%, స్త్రీల అక్షరాస్యత 75%. నైనాదేవి పట్టణంలో 11% జనాభా 6 సంవత్సరాల కంటే లోపు ఉన్నవారే.

దేవాలయం

నైనాదేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో కొండ పైన నెలకొని ఉంది. ఈ దేవాలయం జాతీయ రహదారి 21 మార్గంలో ఉంటుంది. ఈ కొండపై ఉన్న దేవాలయాన్ని చేరుకొనుటకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. కొంత పైకి వెళ్ళీన తరువాత చివరి భాగంలో కొంతభాగం మెట్లద్వారా పైకి వెళ్ళవలసి ఉంటుంది. కొండ క్రింది భాగం నుండి పై భాగానికి యాత్రికులు చేరడానికి కేబుల్ కార్ సదుపాయం కూడా ఉంది.

ఈ దేవాలయ కొండపై భాగం నుండి గోవింద్ సాగర్ సరస్సు కనబడుతుంది. ఇది భాక్రానంగల్ ఆనకట్ట ద్వారా సృష్టించబడినది.

ఈ దేవాలయం గూర్చి అనేక పురాణ గాథలు ఉన్నాయి.

ఇతిహాసాల ప్రకారం దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని సహింపక ఆ యజ్ఞ గుండంలో దహనం చెందుతుంది. శివుడు క్రోధం లో సతీదేవి దేహాన్ని భుజాలపై ఉంచుకొని శివతాండవం చేస్తాడు. ఈ పరిణామానికి స్వర్గంలోని అందరు దేవతలు భయపడతారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా విభజించాడు. సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెబుతారు.

వేరొక కథనం ప్రకారం ఈ దేవాలయం ఒక నైనా అనే గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను కారుస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చాలా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలునికి కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ స్వాప్నిక వృత్తాంతాన్ని రాజా బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానికి నైనా యొక్క పేరును పెట్టాడు.

నైనాదేవి ఆలయం మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. పురాణ గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు. ఈ సంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది. జరిగిన యుద్ధంలో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు "జై నైనా" అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనా గా స్థిరపడింది.

2008 లో తొక్కిసలాట

2008 ఆగష్టు 3 న తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో 146 మంది ప్రజలు మరణించారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయ రహదారి మృత్యు మార్గమైంది. భక్తి మార్గంలో ప్రయాణిస్తూ అసువులు బాసిన పురుషులు మరికొందరు కాగా, అభం శుభం తెలియని మరో 36 మంది చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాటలో పద ఘట్టనలతో వారి శరీరాలు నలిగిపోయాయి. భక్తుల దుస్తులు బురద కొట్టుకుని మసకబారి పోయాయి. Another report claims that they were due to rumors of a fight at the temple causing panic. And another states it was due to police who hit the fleeing worshippers with canes to get them to continue moving.

మూలాలు

ఇతర లింకులు

Tags:

నైనా దేవి జనాభా వివరాలునైనా దేవి దేవాలయంనైనా దేవి 2008 లో తొక్కిసలాటనైనా దేవి మూలాలునైనా దేవి ఇతర లింకులునైనా దేవిహిమాచల్ ప్రదేశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

గుడ్ ఫ్రైడేశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)ఆది శంకరాచార్యులుభద్రాచలంఖమ్మంకన్యారాశివాయు కాలుష్యంజంద్యముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్నీతి ఆయోగ్క్వినోవావిజయశాంతిశ్రీశైలం (శ్రీశైలం మండలం)ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతెలుగు నెలలుప్రభాస్ఆంధ్రజ్యోతితులసిపాములపర్తి వెంకట నరసింహారావుత్రిఫల చూర్ణంఅకాడమీ పురస్కారాలుఊపిరితిత్తులుజాతీయములురామప్ప దేవాలయంశిబి చక్రవర్తిశాసన మండలిఇజ్రాయిల్సర్దార్ వల్లభభాయి పటేల్భారత ప్రధానమంత్రులుమలబద్దకందూదేకులజయలలిత (నటి)లోక్‌సభఆఫ్రికాదృశ్య కళలుదురదముహమ్మద్ ప్రవక్తహరికథఆశ్లేష నక్షత్రముసూర్యుడుబారసాలనవరసాలుమంగళసూత్రంవాల్తేరు వీరయ్యతెలుగు పత్రికలుభారత రాజ్యాంగ ఆధికరణలుఆంధ్రప్రదేశ్భారత రాజ్యాంగ పీఠికషిర్డీ సాయిబాబాకాశీనల్ల జీడియుద్ధకాండకృతి శెట్టికాలేయంపార్శ్వపు తలనొప్పివాతావరణంఉబ్బసముఇతిహాసములుకళలుకంప్యూటరుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఆవర్తన పట్టికతరిగొండ వెంగమాంబచార్మినార్ఖలిస్తాన్ ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమంఅంగుళంఇంద్రుడుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)దక్షిణ భారతదేశంత్రివిక్రమ్ శ్రీనివాస్రామాయణంలో స్త్రీ పాత్రలుకోణార్క సూర్య దేవాలయంగ్రామంమిథునరాశికేతువు జ్యోతిషంజ్ఞానపీఠ పురస్కారంసింగిరెడ్డి నారాయణరెడ్డిఎం. ఎం. కీరవాణి🡆 More