జాదవ్పూర్ విశ్వవిద్యాలయం (JU ) (Bengali: যাদবপুর বিশ্ববিদ্যালয় ) భారత దేశంలోని ఒక విశ్వవిద్యాలయం , పరిశోధన సంస్థ.
పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో ఉన్న ఈ యూనివర్సిటీకి రెండు క్యాంపస్ లు ఉన్నాయి- ప్రధాన క్యాంపస్ జాదవ్పూర్లో ఉండగా రెండవది అయిన నూతన క్యాంపస్ సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉంది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ , సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ఎన్నో ప్రముఖ పరిశోధనా సంస్థలతో జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారతదేశంలోని అత్యున్నత ఇంజనీరింగ్ కళాశాలలలో ఈ సంస్థ ఒకటిగా ఉంది. "అత్యున్నత ప్రమాణాలు సాధించగలిగే సామర్థ్యం" ఉన్నయూనివర్సిటీలలో ఒకటిగా ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చే గుర్తింపు పొందింది. ఇంతే కాక జాదవ్పూర్ విశ్వవిద్యాలయం నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చే రెండు సందర్భాలలో ఫైవ్ స్టార్ యూనివర్సిటిగా గుర్తింపును కూడా పొందింది.
1906లో జాతీయ స్థాయిలో సాహిత్య, శాస్త్రీయ , సాంకేతిక విద్యను అందించే ఉద్దేశంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను స్థాపించడం జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో ఒకవైపు తూర్పు బెంగాల్ (ఇదే 1971 లో బంగ్లాదేశ్గా మారింది)గా మరో వైపు పశ్చిమ బెంగాల్ , ఒడిషాగా సంస్థానం విడిపోయిన ఈ సంవత్సరం బెంగాల్ చరిత్రలో ఎంతో కీలకమైన సంవత్సరం. ఇదే 1906 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్, అరబిందో ఘోష్, రాజా సుబోధ్ చంద్ర మల్లిక్ , బ్రజేంద్ర కిషోర్ రాయ్ చౌదరి వంటి వారు "జాతీయ నియంత్రణలో జాతీయ పద్ధతులలో" పేదలకు విద్యను అందించే ఒక సంస్థను స్థాపించడం ద్వారా బెంగాల్ విభజనను వ్యతిరేకించాలని నిర్ణయించడం జరిగింది. రాష్బేహరీ ఘోష్ మొదటి అధ్యక్షుడుగా NCE సంస్థ ప్రారంభించబడింది.
1921 లో భారతదేశంలో కెమికల్ ఇంజనీరింగ్ను ఒక బోధనాంశంగా ప్రవేశపెట్టిన మొదటి సంస్థగా ఈ సంస్థ గుర్తింపు పొందింది. 1940 వరకూ ఈ సంస్థ దాదాపు ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం గానే పనిచేసింది. 1947లో భారతదేశ స్వాతంత్రం తరువాత భారత ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసన సభ ఈ సంస్థను 1955 డిసెంబరు 24 న పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల జాదవ్పూర్ విశ్వవిద్యాలయంగా మార్చే ఉద్దేశంతో జాదవ్పూర్ యూనివర్సిటీ చట్టం 1955ను చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ రోజునే ఈ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరపడం జరుగుతుంది.
తామర రేకులతో ఆవరించబడి ఉన్న మూడు వత్తులతో వెలుగుతున్న దీపం ఈ విశ్వవిద్యాలయ చిహ్నంగా ఉంది. దీపం జ్ఞానానికి చిహ్నం. మూడు వత్తులూ మేధో శిక్షణ, భావోద్వేగాలు , సృజనాత్మకత లను పెంపొందించడం, ఆధ్యాత్మిక అభివృద్ధి లను సూచిస్తాయి. చుట్టూ ఆవరించి ఉన్న తామర రేకులు కళలు , సంస్కృతిని సూచిస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలోని కళా భవన్ లో పనిచేసిన అతి గొప్ప గురువులలో ఒకరు , బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఒక కీలక సభ్యుడు అయిన దివంగత నందన్లాల్ బోస్ చే ఈ చిహ్నం రూపొందించబడింది. 2005 డిసెంబరు 24 న జరిగిన యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా 'తెలుసుకోవడం అంటే ఎదగడమే' అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. ఇదే సంవత్సరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శతాబ్ది కాలాన్ని కూడా పూర్తి చేసుకుంది.
జాదవ్పూర్ విశ్వవిద్యాలయం రెండు పట్టణాలలో క్యాంపస్ లను కలిగి ఉండగా వీటిలో ఒకటి జాదవ్పూర్ (58 ఎకరాలు) లోను మరిఒకటి సాల్ట్ లేక్ (26 ఎకరాలు) లోను ఉన్నాయి. జాదవ్పూర్ లో పని చేయకుండా ఉన్న నేషనల్ ఇన్స్త్రుమెంట్స్ అనే CSIR ను స్వాధీనం చేసుకోవడం ద్వారా దేశంలో ఈ విధంగా చేసిన మొదటి యూనివర్సిటీగా ఇది పేరు పొందింది. ప్రధాన క్యాంపస్ అయిన జాదవ్పూర్ లో జాదవ్పూర్ విశ్వవిద్యాలయ కేంద్ర లైబ్రరీ , బ్లూ యర్త్ వర్క్ షాప్ తో పాటు ఇంజనీరింగ్, సైన్సు , ఆర్ట్స్ కు సంబంధించిన చాలా వరకు శాఖలు ఉన్నాయి. ఐదు ఇంజనీరింగ్ విభాగాలు సాల్ట్ లేక్ క్యాంపస్ నుండి పని చేస్తాయి. సాల్ట్ లేక్ క్యాంపస్ లోని ప్రధాన మైదానాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు లీజుకు ఇవ్వడంతో ఇక్కడ అనేక రాష్ట్ర స్థాయి , వివిధ రాష్ట్రాల మధ్య క్రికెట్ పోటీలు తరచుగా జరుగుతుంటాయి. కొత్తగా వచ్చిన నేషనల్ ఇన్స్త్రుమెంట్స్ క్యాంపస్ లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ , టెలికమ్యునికేషన్ తో సహా వివిధ శాఖలకు కొత్తగా పరిశోధనాశాలలు నిర్మించే స్థలం సమకూరుతుందని భావిస్తున్నారు.
ఐఐటిలు తప్ప చాలా వరకు భారత ఇంజనీరింగ్ కళాశాలలు దిగువపట్టభద్ర బోధన పై ప్రధానంగా దృష్టి పెడుతుండగా జాదవ్పూర్ విశ్వవిద్యాలయం మాత్రం తన పరిశోధనా కార్యక్రమాలకు పేరు పొందటమే కాక తన ఇంజనీరింగ్ విభాగం లోని పరిశోధనల ఫలితాలలో భారతదేశంలోనే 6వ స్థానంలో ఉంది.
ఈ విశ్వవిద్యాలయం సాధించిన మరికొన్ని ర్యాంకులు ఇలా ఉన్నాయి.
సుబీర్ రాహ భారత ఆయిల్ రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో తనదైన ముద్రను చూపించిన వ్యాపారవేత్త. గతంలో ఆయిల్ , నాచురల్ గ్యాస్ కమిషన్కు ఛైర్మన్ గా , మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసారు.
కబీర్ సుమన్ (గతంలో సుమన్ చటోపాధ్యాయ) వైవిధ్య బెంగాలీ గాయకులు-స్వరకర్త- పాటల రచయిత, తృణమూల్ కాంగ్రెస్ నుండి లోక్ సభకు ఎంపికైన పార్లమెంట్ సభ్యులు
ఋతుపర్ణ ఘోష్ అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమా దర్శకులు, మాటలు , స్క్రీన్ ప్లే రచయిత
మౌషుమి భౌమిక్ బెంగాలీ గాయకులు-స్వరకర్త- పాటల రచయిత , సాంప్రదాయ సంగీత విద్వాంసులు
సోహిని హల్దార్ ప్రముఖ బెంగాలీ నాటక నటి , జాతీయ అవార్డు పొందిన సినిమా నటి.
పరమిత మండల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని అర్బానా-చామ్పైన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్
కునాల్ బసు నవలా రచయిత , సెడ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్
సిద్ధార్థ దత్త జాదవ్పూర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి
చిరంజిబ్ భట్టాచార్జీ జాదవ్పూర్ విశ్వవిద్యాలయoలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్
దేబాసిష్ సర్కార్ కలకత్తా విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకులు
పాయల్ సర్కార్ జాదవ్పూర్ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ నుండి పట్టభద్రురాలైన ఈమె ఒక బెంగాలీ నటి.
This article uses material from the Wikipedia తెలుగు article జాదవ్పూర్ విశ్వవిద్యాలయం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.