తిరుమల వెంకటేశ్వర ఆలయం లో ఉన్న విగ్రహం కొలువు శ్రీనివాసుడి విగ్రహం.
ఇది మూలవిరాట్టును పోలి ఉండే వెండి విగ్రహం కొలువు శ్రీనివాసుడు ఆలయ సంరక్షక దేవత. ఈ విగ్రహాన్ని బలిబేరం అని కూడా పిలుస్తారు. బలిబేరం నిర్వహించే విధులు గృహస్థు విధుల్లాగా ఉంటాయి. ప్రతిరోజు ప్రాతఃకాలంలో తోమాల సేవ తరువాత తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారిని బంగారు ఛత్రం క్రింద రజత సింహాసనంపై ఆసీనుని గావిస్తారు. ప్రధాన మూర్తికి బదులుగా కొలువు శ్రీనివాసుడు విగ్రహం అధ్యక్షతన ఇక్కడి కార్యక్రమం జరుగుతుంది. ఈయన అన్నివిధాల మూలదైవాన్ని పోలివుంటాడు. దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పర్యవేక్షిస్తుంటాడు. ప్రతిరోజు ఆనాటి తిథి వార నక్షత్రాది వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం ఈ మూర్తికి వినిపిస్తారు. అర్చకులకు మాత్రదానంగా ఇచ్చే బియ్యం, వారివంతునకు వచ్చే భాగం ఇక్కడ ఇవ్వబడుతుంది. బలిపీఠంలో గరుడుడు, హనుమంతుడు, విశ్వక్సేనులకు బలిని సమర్పించే ముందు బలిబేరం అనుమతి కోరతారు. బలిబేరం ఆలయ అంతర్భాగం లోని 16 స్తంభాల తిరుమామణి మంటపం దాటి బయటికి వచ్చిన దాఖలాలు లేవు.
ఉదయం తోమాలసేవ లేదా అభిషేకం జరిగిన తరువాత, ముందు రోజు నాటి ఖాతాలను మూసివేసి, స్వామికి సమర్పిస్తారు. ఈ కర్మను కొలువు అని పిలుస్తారు. దీనిని దర్బార్ అని కూడా పిలుస్తారు. కొలువు శ్రీనివాసుని తిరుమామణి మంటపానికి (గర్భగుడి లోపల) తీసుకువచ్చి, వెండి పూతతో కుర్చీపై, మైసూరు మహారాజా సమర్పించిన బంగారు ఛత్రం కింద కూర్చోబెడతారు. ఈ కర్మను ఏకాంతంలో నిర్వహిస్తారు. పూజారులు. తితిదే అధికారులూ మాత్రమే ఉంటారు. కింది ఆచారాలు జరుగుతాయి:
ఆర్థిక సంవత్సరం చివరలో (జూలైలో వస్తుంది) జరిగే ఆణివార అస్థానం అనేది ఒక వార్షికాచారం. దేవాలయ వార్షికాదాయ లెక్కలను భగవంతునికి సమర్పిస్తారు. ప్రధాన అధికారులందరి కార్యాలయ చిహ్నాలను ప్రభువుకు నివేదించి తిరిగి తీసుకుంటారు. ఆ విధంగా ఆయా కార్యాలయాలు నిర్వహించడానికి వారు తగినవారేనని ప్రభువు ఆమోదించినట్లు ఇది సూచిస్తుంది. వచ్చే ఏడాది లెక్కలు రాసేందుకు కొత్త పుస్తకాలు జారీ అవుతాయి. ఈ కార్యక్రమం ముగింపులో, దేవాలయ అధికారుల పట్ల ప్రభువుకున్న సంప్రీతికి సూచికగా ప్రధాన పూజారి ప్రధాన అధికారులందరికీ తాంబూలం ఇస్తాడు.
ఈ కర్మ ఏకాంతంలో జరుగుతుంది. ప్రజలకు ఇది అందుబాటులో ఉండదు. కర్మ తరువాత, ఉత్సవ మూర్తిని భార్యలతో సహా, పువ్వులతో అలంకరించిన పల్లకీలో ఊరేగిస్తారు. ఈ వేడుక ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
తిరుమల ఆలయము (ధారావాహికం-41), ఆంగ్లమూలం: డా.రమేశన్, తెలుగు అనువాదం: డా.కోరాడ రామకృష్ణ, సప్తగిరి మాసపత్రిక 2006 ఏప్రిల్ లో ప్రచురించిన వ్యాసం.
This article uses material from the Wikipedia తెలుగు article కొలువు శ్రీనివాసుడు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.