దర్బే కృష్ణానంద చౌట (1938 జూన్ 1 - 2019 జూన్ 19) భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు.
అతను మరణించే నాటికి కర్ణాటక చిత్రకళా పరిషత్ కు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు.
దర్బే కృష్ణానంద చౌట | |
---|---|
జననం | 1 జూన్ 1938 |
మరణం | 19 జూన్ 2019 (aged 81) బెంగళూరు, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతదేశం |
డా. డి.కె.చౌట కేరళ రాష్ట్రం లోని మంజీశ్వర్ సమీపంలో గల దర్బే మీయప్పాడౌ గ్రామంలో జన్మించాడు. అతనికి ఇద్దరు పిల్లలు. వారిలో సందీప్ చౌట సంగీతకారునిగా, ప్రజ్ఞా చౌట ఎత్నోగ్రాఫర్ గా ఉన్నారు.
ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అతను అనేక సంవత్సరాలు ఘనా, నైజీరియా, లండన్ లలో జీవితాన్ని గడిపాడు. తరువాత బెంగళూరు వచ్చి పరిశ్రమలు, ఎగుమతులు, కంట్రీ క్లబ్స్, వివిధ వ్యాపారాలను చేసి తన జీవితాన్ని కొనసాగించాడు. దీని ఫలితంగా అతను ఎం/ఎస్ పవర్ గేర్ లిమిటెడ్, ఎం/ఎస్ పి.సి. ఎక్స్పోర్ట్స్, సన్ వాలీ క్లబ్ వంటి కంపెనీలను స్థాపించాడు. ఎం/ఎస్ పి.సి. ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఐదుసార్లు ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ చే అవార్డులు పొందింది. వ్యాపార కార్యక్రమాలతో పాటు అతను సమాజ సేవ కూడా చేసేవాడు.
డా. చౌట "ఆనంద కృష్ణ" అనేకలం పేరుతో రచనలు చేసేవాడు. అతని సాహితీ సేవలలో "కరియవజ్జెరెన కథెక్కులు", "ప్లిలిపతిగదసు" అనే నాటకాలకు కర్ణాటక ప్రభుత్వ తుళు సాహిత్య అకాడమీ పురస్కారాలు అందజేసింది. అతని ఇతర రచనలలో పట్టు పజ్జెలు, డర్మెట్టిమాయె, యూరి ఉష్ణద మాయే, మిట్టబైలు యమునక్క" ముఖ్యమైనవి. అతనికి మంగుళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
This article uses material from the Wikipedia తెలుగు article డి.కె.చౌట, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.