న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు.
గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.
యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య
అక్షరము
దేవతా మూర్తి
క్రమ సంఖ్య
అక్షరము
దేవతా మూర్తి
1
తత్
విఘ్నేశ్వరుడు
13
ధీ
భూదేవి
2
స
నరసింహస్వామి
14
మ
సూర్య భగవానుడు
3
వి
మహావిష్ణువు
15
హి
శ్రీరాముడు
4
తుః
శివుడు
16
ధి
సీతాదేవి
5
వ
శ్రీకృష్ణుడు
17
యో
చంద్రుడు
6
రే
రాధాదేవి
18
యో
యముడు
7
ణ్యం
శ్రీ మహాలక్ష్మి
19
నః
బ్రహ్మ
8
భ
అగ్ని దేవుడు
20
ప్ర
వరుణుదు
9
ర్గోః
ఇంద్రుడు
21
చో
శ్రీమన్నారాయణుడు
10
దే
సరస్వతీ దేవి
22
ద
హయగ్రీవుడు
11
వ
దుర్గాదేవి
23
య
హంసదేవత
12
స్య
ఆంజనేయస్వామి
24
త్
తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.
ఋషి పుంగవుల ప్రశంస
గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. —వ్యాస మహర్షి
ముక్తిపొందుటకు గాయత్రిమంత్రం మూలకారణం. —శృంగి మహర్షి
గాయత్రి మంత్రం జన్మమరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర మహర్షి
గాయత్రి మంత్రము లోని శబ్ధములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. —మహాత్మా హంసరాజ్
వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగ గ్రస్థుడు కాజాలడు. పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప కలుగును. ధార్మిక జీవన నియమము యథార్థముగా శరీరాత్మలను కాపాడకలదని నానిశ్చితాభిప్రాయము. ఇంతేకాక గాయత్రి మంత్ర జపము రాష్ట్రీయ విపత్కాలమున శాంతచిత్తముతో చేయబడిన యెడల అది సంకటములను రూపుమాపుటకై తన పరాక్రమ ప్రభావములను చూపెట్టకలదు. —గాంధీ మహాత్ముడు
This article uses material from the Wikipedia తెలుగు article గాయత్రీ మంత్రం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.