సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

మధ్య ఆఫ్రికా గణతంత్రం లేదా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు సెంట్రల్ ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం.

దేశ ఉత్తర సరిహద్దులో చాద్, ఈశాన్య సరిహద్దులో సూడాన్, తూర్పు సరిహద్దులో దక్షిణ సూడాన్, దక్షిణ సరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, నైరుతి సరిహద్దులో కాంగో రిపబ్లిక్, పశ్చిమ సరిహద్దులో కామెరూన్ ఉన్నాయి. సి.ఎ.ఆర్. సుమారు 6,20,000 చదరపు కిలో మీటర్ల (240,000 చదరపు మైళ్ళు) భూభాగ వైశాల్యాన్ని కలిగి ఉంది. 2016 నాటికి సుమారుగా అంచనా వేసిన జనాభా 4.6 మిలియన్లుగా అంచనా వేయబడింది.

République Centrafricaine
Ködörösêse tî Bêafrîka
Central African Republic
Flag of Central African Republic Central African Republic యొక్క Emblem
నినాదం
"Unité, Dignité, Travail"  (French)
"Unity, Dignity, Work"
Central African Republic యొక్క స్థానం
Central African Republic యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Bangui
4°22′N 18°35′E / 4.367°N 18.583°E / 4.367; 18.583
అధికార భాషలు Sango, French
ప్రభుత్వం Republic
 -  President François Bozizé
 -  Prime Minister Élie Doté
en:Independence from ఫ్రాన్స్ 
 -  Date en:August 13 1960 
విస్తీర్ణం
 -  మొత్తం 622,984 కి.మీ² (43వది)
240,534 చ.మై 
 -  జలాలు (%) 0
జనాభా
 -  2007 అంచనా 4,216,666 (124వది)
 -  2003 జన గణన 3,895,150 
 -  జన సాంద్రత 6.77 /కి.మీ² (191వది)
17.53 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $5.015 బిలియన్లు (153వది)
 -  తలసరి $1,198 (167th)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $1,488 billion (153rd)
 -  తలసరి $355 (160th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Decrease 0.353 (low) (172వది)
కరెన్సీ en:Central African CFA franc (XAF)
కాలాంశం WAT (UTC+1)
 -  వేసవి (DST) not observed (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .cf
కాలింగ్ కోడ్ +236

సి.ఎ.ఆర్.లో అధిక భాగం సుండో - గుయినీన్ సవన్నా ఉంది. కానీ దేశం ఉత్తరంలో ఉన్న సహెల్-సూడాన్ జోన్, దక్షిణాన ఒక ఈక్వెటోరియల్ అటవీ ప్రాంతం దేశంలో భాగంగా ఉన్నాయి. దేశంలో మూడింట రెండు వంతులభూభాగం ఉబాంగి నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది (కాంగోలో ప్రవహిస్తుంది). మిగిలిన మూడవ భూభాగం చారి ముఖద్వారంలో ఉంది. చారి నదీ జలాలు చాదు సరోవరంలోకి సంగమిస్తుంటాయి.

ప్రస్తుత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రాంతంలో వేల సంవత్సరాల నుండి మానవనివసిత ప్రాంతంగా ఉంది. ప్రస్తుత దేశం సరిహద్దులు ఫ్రాన్సుచే స్థాపించబడ్డాయి. 19 వ శతాబ్దం చివరలో ఈ భూభాగంలో కాలనీగా పాలన ప్రారంభం అయింది. 1960 లో ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కును పలువురు నిరంకుశ నాయకులు పాలించారు. ఒక రాచరిక పాలన విఫలమైంది. 1990 నాటికి ఈ ప్రజాస్వామ్యం 1993 లో మొట్టమొదటి బహుళ-పార్టీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దారి తీసింది. ఆంగె-ఫెలిక్స్ పాటాసు అధ్యక్షుడిగా నియమించబడ్డారు. కానీ తరువాత 2003 తిరుగుబాటులో జనరల్ ఫ్రాంకోయిస్ బోజీజేచే తొలగించబడింది. 2004 లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ బుష్ యుద్ధం ప్రారంభమైంది. 2007 లో శాంతి ఒప్పందం, 2011 లో మరొక యుద్ధం మొదలైంది. 2012 డిసెంబరులో పలు వర్గాల మధ్య జరిగిన పోరాటంలో ముస్లిం మైనారిటీ జాతి మతపరమైన ప్రక్షాళనలో భాగంగా 2013 - 2014 లో భారీ జనాభా స్థానభ్రంశం సంభవించింది.

దేశంలో యురేనియం నిల్వలు, ముడి చమురు, బంగారం, వజ్రాలు, కోబాల్ట్, కలప, జలశక్తి వంటి గణనీయమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. గణనీయమైన పరిమాణంలో సాగు భూమి వంటి ఇతర వనరులు ఉన్నాయి. ప్రపంచంలోని 10 పేద దేశాలలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఒకటి. 2017 నాటికి ప్రపంచములో అతి తక్కువ జి.డి.పి, కొనుగోలు శక్తిని కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. 2015 నాటికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ (హెచ్డిఐ) ప్రకారం అత్యల్ప మానవ అభివృద్ధిని కలిగిన దేశంగా 188 దేశాల్లో 188 వ స్థానంలో ఉంది. ఇది అత్యంత అనారోగ్యకరమైన దేశంగా గుర్తించబడుతుంది. అలాగే చిన్న వయస్సు ప్రజలకు అతి భయంకరమైన దేశంగా కూడా అంచనా వేయబడింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ యునైటెడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్, సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్ ఎకనామిక్ కమ్యూనిటీ, ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫొనీ, నాన్-అలైండ్ మూవ్మెంటు సభ్యదేశంగా ఉంది.

చరిత్ర

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
The Bouar Megaliths, pictured here on a 1967 Central African stamp, date back to the very late Neolithic Era (c. 3500–2700 BC).

ఆరంభకాల చరిత్ర

దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఎడారీకరణ వేటాడే-సంగ్రహణ సమాజాల దక్షిణం వైపు కదులుతూ మద్య ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలోని షాహెల్ ప్రాంతాలకు చేరుకోవలసిన అవసరం ఏర్పడింది. తరువాత కొన్ని సమూహాలు అక్కడే స్థిరపడ్డాయి. తరువాత నియోలిథిక్ విప్లవంలో భాగంగా వ్యవసాయం ప్రారంభమైంది. ప్రారంభ వ్యవసాయం వైట్ యాంతో మొదలై క్రీ.పూ. 3000 ముందు చిరుధాన్యాలు, జొన్నకు పురోగమించింది. ఆఫ్రికన్ ఆయిల్ పామ్ వ్యవసాయం అలవాటు చేసుకోవడం వలన సమూహాల పోషణను మెరుగుపరిచి స్థానిక జనాభా విస్తరణకు అనుమతించింది. ఈ వ్యవసాయ విప్లవం "ఫిష్-స్ట్యూ రివల్యూషన్"తో కలిసి చేపలు పట్టడం ప్రారంభమైంది. ఇది పడవలను ఉపయోగించడం, వస్తువులను రవాణా చేయడానికి అనుమతించింది. ఉత్పత్తులు తరచూ పింగాణీ కుండల ద్వారా తరలించబడ్డాయి. ఇవి ప్రాంతనివాసితుల కళాత్మక వ్యక్తీకరణ మొదటి ఉదాహరణ అయింది.

దేశంలోని పశ్చిమ ప్రాంతంలోని బౌర్ మెగలిత్స్ ప్రాంతంలో నియోలిథిక్ ఎరా చివరలో (సుమారుగా క్రీ.పూ. 3500-2700) మానవనివాసం మొదలైనట్లు సూచిస్తుంది. ఈ ప్రాంతంలోని బంటు సంస్కృతుల కాలంలో ( క్రీ.పూ. 1000 ) ఇనుము వాడకం మొదలైంది. ప్రస్తుత నైజీరియా, కుష్ రాజ్య రాజధాని అయిన మెరోయె నైలు నగరం నుండి ఈ ప్రాంతానికి వచ్చింది.

క్రీ.పూ 1000 నుండి సా.శ. 1000 వరకు బంటు వలసల సమయంలో ఉబాంగియన్ మాట్లాడే ప్రజలు తూర్పువైపు కామెరూన్ నుండి సూడాన్ వరకు విస్తరించారు. బంటు-మాట్లాడే ప్రజలు సి.ఎ.ఆర్. నైరుతి ప్రాంతాలలో స్థిరపడ్డారు. సెంట్రల్ సుడానిక్ మాట్లాడే ప్రజలు ఉబాంగి నదీతీరాలలో (ప్రస్తుత సెంట్రల్, తూర్పు సి.ఎ.ఆర్) స్థిరపడ్డారు.[ఆధారం చూపాలి]

బనానాస్ ఈ ప్రాంతానికి వచ్చిన సమయం గురించి స్పష్టత లేదు. వీరు ఆహారంలో కార్బోహైడ్రేట్లు ముఖ్యమైన వనరుగా జోడించారు. వారు మద్య పానీయాలు ఉత్పత్తిలో కూడా పిండిపదార్ధాలను ఉపయోగించారు. సెంట్రల్ ఆఫ్రికన్ ప్రాంతంలో వాణిజ్య పంటలుగా రాగి, ఉప్పు, ఎండిన చేప, వస్త్రాలు ఉత్పత్తి చేయబడ్డాయి.

16వ - 19 వ శతాబ్ధాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
The Sultan of Bangassou and his wives, 1906

16 వ - 17 వ శతాబ్దాలలో బానిస వ్యాపారులు సహరాన్, నైలు నది బానిస మార్గాల విస్తరణలో భాగంగా ఈ ప్రాంతంపై దాడి చేశారు. వారి బందీలను మధ్యధరా తీరం ఐరోపా, అరేబియా, పాశ్చాత్య అర్థగోళం, పశ్చిమ -ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఉబనిక్యూ - కాంగో నదుల తీరాలలో ఉన్న ఓడరేవులు, కర్మాగారాలకు బానిసలుగా రవాణా చేశారు. 19 వ శతాబ్దం మధ్యకాలంలో బాంగాగి ప్రజలు ప్రధాన బానిస వ్యాపారులుగా మారి తీరప్రాంతానికి చేరుకోవడానికి ఉబంగి నదిని ఉపయోగించి అమెరికాకు తమ బంధీలను విక్రయించారు. 18 వ శతాబ్దంలో బండియా-నజకరా ప్రజలు ఉంగాగి నది వెంట బంగస్సౌ రాజ్యాన్ని స్థాపించారు. 1875 లో సుడాన సుల్తాన్ " రబీహ్ అజ్-జుబీర్ " పాలించిన ఎగువ-ఓబూగుని భూభాగంలో ప్రస్తుత సి.ఎ.ఆర్. భూభాగం ఉంది.

ఫ్రెంచి కాలనీ పాలన

19 వ శతాబ్దం చివరలో మద్య ఆఫ్రికన్ భూభాగంలో ఐరోపా వ్యాప్తి ఆఫ్రికా కొరకు పెనుగులాటగా ప్రారంభమైంది. యూరోపియన్లు ప్రధానంగా ఫ్రెంచ్, జర్మన్లు ​, బెల్జియన్లు 1885 లో ఈ ప్రాంతానికి వచ్చారు. ఫ్రాన్స్ 1894 లో ఉబంగి-షరీ భూభాగాన్ని సృష్టించింది. 1911 లో ఫెజ్ ఒప్పందం ఆధారంగా ఫ్రాన్సు సంఘా, లోబే బేసిన్ల సుమారు 3,00,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని జర్మన్ సామ్రాజ్యానికి వదిలివేసింది. బదులుగా జర్మనీ కొంత చిన్న ప్రాంతం (నేటి చాడ్ లో) ఫ్రాంసుకు కేటాయించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్సు తిరిగి ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. కింగ్ లియోపోల్డ్ కాంగో ఫ్రీ స్టేటుగా రూపొందించిన ఈ భూభాగంలో ప్రైవేటు కంపెనీలకు మినహాయింపు ఇవ్వబడింది. ఫ్రెంచ్ ఖజానాలో వారి లాభాల శాతాన్ని డిపాజిటు చేయడానికి ముందు ఈ ప్రాంతం ఆస్తులను వీలైనంత త్వరగా, చౌకగా వీలైనంతగా తీర్చిదిద్దబడింది. మినహాయింపు పొందిన కంపెనీలు స్థానిక ప్రజల కుటుంబాలను బందీ చేసి వారి భాగం పంట ఉత్పత్తులను పొందేవరకు ఏ మాత్రం రాయితీ చెల్లించకుండా కాఫీ, రబ్బరు, ఇతర అత్యావసర పంటలను పండించేలా నిర్బంధం చేసాయి. 1890 ల మధ్య మొదటిసారిగా ఫ్రాన్సు ఇక్కడకు చేరుకున్న తరువాత 1940 లో జనాభా వ్యాధులు, కరువు, ప్రైవేటు సంస్థల దోపిడీ కారణంగా సగానికి తగ్గిపోయింది.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
చార్లెస్ డి గల్లే (బంగుయ్, 1940)

.

1920 లో ఫ్రెంచ్ ఈక్వెటోరియల్ ఆఫ్రికా స్థాపించబడింది. వారు బ్రెజివిల్లె నుండి ఉబంగి-షరీ వరకు ఆధిక్యత సాధించారు. 1920 - 1930 లలో ఫ్రెంచ్ వారు నిర్బంధంగా పత్తి సాగు విధానాన్ని ప్రవేశపెట్టారు. అనుసంధిత రహదారుల నిర్మాణం జరిగింది. నిద్రమత్తును నిరోధించడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రొటెస్టంటు మిషన్లు క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేసాయి. నిర్బంధ కార్మికుల నూతన విధానం కూడా ప్రవేశపెట్టబడింది. కాంగో-ఓషన్ రైల్వేలో పని చేయడానికి అనేక మంది ఉబాంగియన్లు పంపబడ్డారు. నిర్మాణ సమయంలో 1934 వరకు మానవ జీవితాలలో నిరంతర భారీ నష్టం జరిగింది. రైల్వే నిర్మాణంలో 17,000 మంది నిర్మాణ కార్మికుల కంటే అధికంగా పారిశ్రామిక ప్రమాదాలు, మలేరియాతో వ్యాధులతో మరణించారు. 1928 లో కొంగో-వరా తిరుగుబాటు (యుద్ధం యొక్క హ్యాండిల్ యొక్క యుద్ధం'), పశ్చిమ ఉబాంగి-షరీలో తీవ్రమైన తిరుగుబాటు అనేక సంవత్సరాలపాటు కొనసాగింది. ఫ్రెంచి పాలన, బలవంతంగా కార్మిక పాలనకు బలమైన వ్యతిరేకత ఉన్నట్లు రుజువు లభించినందున అంతర్యుద్ధ కాలంలో ఆఫ్రికాలో అతిపెద్ద వలసవాద వ్యతిరేక తిరుగుబాటు ఈ తిరుగుబాటు విస్తరించి ఫ్రెంచ్ నుండి జాగ్రత్తగా దూరం చేసింది.

1940 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ద సమయంలో గో-బాండ్ ఫ్రెంచ్ అధికారులు ఉబంగి- షారి మీద నియంత్రణ తీసుకుని జనరల్ లేక్లెర్కు బంగీలో ఫ్రీ ఫ్రెంచ్ ఫోర్సెస్ కొరకు తన ప్రధాన కార్యాలయాన్ని స్థాపించారు. 1946 లో ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి 9 వేల ఓట్లతో బర్తేల్మీ బోగాండా ఎన్నికై ఫ్రెంచి ప్రభుత్వంలో సి.ఎ.ఆర్ మొదటి ప్రతినిధిగా అయ్యాడు. బోగాండా జాత్యహంకారం, వలసవాద పాలనకు వ్యతిరేకంగా ఒక రాజకీయ వైఖరిని నిలుపుకుంది. 1950 లో కానీ క్రమంగా ఫ్రెంచ్ రాజకీయ వ్యవస్థ జోక్యంతో నిరాశచెందిన బ్లాక్ ఆఫ్రికా సామాజిక పరిణామం సి.ఎ.ఆర్.లో తిరిగి ఉద్యమం తీవ్రం కావడానికి దారితీసింది.

స్వతంత్రం తరువాత (1960–ప్రస్తుతకాలం)

1957 లో ఉబాంగి-షారీ ప్రాదేశిక అసెంబ్లీ ఎన్నికలో మెసాన్ పార్టీ మొత్తం 3,56,000 ఓట్లలో 347,000 మందిని స్వాధీనం చేసుకుని మొత్తం శాసనసభ స్థానాలను గెలుచుకున్నది. ఇది బోగాండా ఫ్రెంచి ఈక్వెటోరియలు ఆఫ్రికా గ్రాండు కౌన్సిలు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు, ఉబంగి- షారి ప్రభుత్వ కౌన్సిలు ఉపాధ్యక్షుడు. ఒక సంవత్సరం తరువాత ఆయన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ స్థాపన చేయాలని ప్రకటించి దేశం మొదటి ప్రధాన మంత్రిగా పనిచేశాడు. మేసన్ తన పనిలో కొనసాగినప్పటికీ ఆయన పాత్ర పరిమితమైందిగా ఉంది. 1959 మార్చి 29 న విమాన ప్రమాదంలో బోంగాడా మరణించిన తరువాత ఆయన బంధువు డేవిడ్ డాకో మేసన్ నియంత్రణను తీసుకుని సి.ఎ.ఆర్. ఫ్రాన్సు నుండి అధికారికంగా స్వాతంత్ర్యం పొందిన తరువాత దేశం మొట్టమొదటి అధ్యక్షుడు అయ్యాడు. మాజీ ప్రధానమంత్రి మౌవ్మెంట్ డిమినల్ డెమక్రటిక్ డి ఎల్ 'అప్రిక్ సెంట్రల్ నాయకుడు అబెల్ గౌమ్బా వంటి ప్రత్యర్థులను ఫ్రాంసుకు బహిష్కరిస్తానని వత్తిడి చేస్తూ నియంత్రించాడు. 1962 నవంబరు నాటికి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ అణచివేసి డాకో మేసన్ పార్టీని దేశ అధికారిక పార్టీగా ప్రకటించింది.

బొకస్సా, మద్య ఆఫ్రికా సాంమ్రాజ్యం (1965–1979)

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Jean-Bédel Bokassa, self-crowned Emperor of Central Africa.

1965 డిసెంబరు 31 న సెయింటు-సిల్వెస్ట్రే తిరుగుబాటు కార్యక్రమంలో కల్నల్ జీన్-బెడెల్ బొకోసాచే డాకోను తొలగించారు. అతను రాజ్యాంగ సస్పెండ్ చేసి నేషనల్ అసెంబ్లీని రద్దు చేశాడు. 1972 లో అధ్యక్షుడు బొకాసా స్వయంగా తన అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 1976 డిసెంబరు 4 న సెంట్రల్ ఆఫ్రికన్ సామ్రాజ్యంగా (దేశానికి పేరు మార్చి) తనకు తానుగా స్వయంగా చక్రవర్తి బొకాస్సాగా ప్రకటించుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత. చక్రవర్తి బొకాసా తనకు అత్యంత ఖరీదైన వేడుకలో కిరీటధారణ చేసాడు. ఇది ప్రపంచంలోని ఎక్కువ భాగంలో ఎగతాళికి గురైంది.

1979 ఏప్రెలులో బొకాసా భార్యలలో ఒకరికి స్వంతమైన సంస్థలోనే విద్యార్థులందరూ యూనిఫాంలను కొనుగోలు చేయాలని బొకస్సా జారీచేసిన డిక్రీకి వ్యతిరేకంగా యువ విద్యార్థులు నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వం హింసాత్మకంగా నిరసనలను అణిచివేసి 100 మంది పిల్లలు, యువకులను చంపివేసింది. బొకాసాకు స్వయంగా కొన్ని హత్యలతో వ్యక్తిగతంగా సంబంధం ఉందని భావించబడింది. 1979 సెప్టెంబరులో ఫ్రాన్సు బొకాస్సాను పడగొట్టి డాకోను అధికారంలోకి తీసుకువచ్చింది. (తరువాత దేశం పేరును సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కుగా పునరుద్ధరించింది). 1981 సెప్టెంబరు 1 న జనరల్ ఆండ్రే కోలింబ్యా తిరుగుబాటు ద్వారా డక్కోను పడగొట్టాడు.

కలింగ్బ పాలనలో మద్య ఆఫ్రికన్ రిపబ్లిక్కు

కలింగ్బా రాజ్యాంగను సస్పెండ్ చేసి 1985 వరకు సైనిక పాలన కొనసాగించాడు. 1986 లో దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాడు. తన కొత్త పార్టీ రస్సెంబ్లెమ్ డెమక్రటిక్క్యూ సెంట్రిప్సికైన్ సభ్యత్వం స్వచ్ఛందం చేయబడింది. 1987 - 1988 లలో పార్లమెంటుకు పాక్షిక - స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగాయి. కోలింబ్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు అబెల్ గౌంబ, ఆంగే-ఫెలిక్స్ పాటస్సేలు ఎన్నికలలో పాల్గొనడానికి అనుమతించబడలేదు.

1990 నాటికి బెర్లిన్ గోడ పతనం ప్రేరణతో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం ఏర్పడింది. అధికారం నిలుపుకోవడానికి ఎన్నికల ఫలితాలను నిలిపివేయడం వంటి అక్రమాలకు సంబంధించిన కారణాన్ని ఉపయోగించి ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ స్థానికంగా ప్రాతినిధ్యం వహించిన దేశాలు జి.ఐ.బి.ఎ.ఎఫ్.ఒ.ఆర్. (ఫ్రాంసు, యు.ఎస్. జర్మనీ, జపాన్, ఐరోపా, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి) వత్తిడి కారణంగా 1992 అక్టోబరులో ఎన్నికల కార్యాలయం సహాయంతో ఉచిత ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడు కోలిగ్బా జి.ఐ.బి.ఎ.ఎఫ్.ఒ.ఆర్. నుండి ఎదురైన తీవ్ర ఒత్తిడికి గురై "కాన్సీల్ నేషనల్ పొలిటిక్ ప్రొవిజొరెరె డి లా రిపబ్లిక్" (తాత్కాలిక జాతీయ రాజకీయ మండలి) అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో "మిశ్రమ ఎన్నికల కమిషన్"ను స్థాపించటానికి అంగీకరించాడు.

1993 లో జరిగిన రెండో రౌండ్ ఎన్నికలు జి.ఐ.బి.ఎ.ఎఫ్.ఒ.ఆర్. సమన్వయంతో అంతర్జాతీయ సమాజం సహాయంతో, అంగ్-ఫెలిక్స్ పాటస్సే ఓటింగ్లో 53% ఓట్ల నమోదుతో (గౌమబా 45.6% ) గెలిచింది. పాటస్సే పార్టీ " మూవ్మెంట్ పోర్ లా లాబ్రేరేజ్ డ్యూ పీపుల్ సెంట్రప్రికెయిన్ " (మూవ్మెంటు ఫర్ ది లిబరేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఆఫ్రికన్ పీపుల్), పెల్లియాలో కొంత సాధారణ ఫలితం సాధించినప్పటికీ కచ్చితమైన మెజారిటీ సీట్లు సాధించలేదు కనుక సంకీర్ణం అవసరమైంది.

పటస్సీ ప్రభుత్వం (1993–2003)

పాటస్సీ ప్రభుత్వం అనేక కలింగ్బా మూలాలను ప్రక్షాళన చేసింది. కలింగ్బా మద్దతుదారులు పకోస్సే ప్రభుత్వం యాకోమాకు వ్యతిరేకంగా ఒక "మంత్రగత్తె వేట" నిర్వహించారని ఆరోపించారు. 1994 డిసెంబరు 28 న కొత్త రాజ్యాంగం ఆమోదించబడింది. అయినప్పటికీ ఇది దేశం రాజకీయాల్లో తక్కువ ప్రభావం చూపింది. 1996-1997లో ప్రభుత్వం నియమరహిత ప్రవర్తన ప్రజలవిశ్వాసాన్ని క్రమంగా తగ్గించి పాటస్సే పరిపాలనకు వ్యతిరేకంగా మూడు తిరుగుబాట్లు విస్తృతమైన ఆస్తి నష్టం సంభవించింది, జాతి ఉద్రిక్తతలు అధికరించాయి. ఈ సమయంలో (1996) శాంతిదళాలు తమ వాలంటీర్లను పొరుగున ఉన్న కామెరూన్కు తరలించారు. తరువాత శాంతిదళాలు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కుకు తిరిగి రాలేదు. 1997 జనవరిలో బంగుయి ఒప్పందం మీద సంతకం చేసి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కుకు " ఇంటర్ ఆఫ్రికన్ మిలిటరీ మిషనును " నియమించి 1997 ఏప్రెలు 7 న మాజీ-ఉద్యమకారులను ప్రభుత్వంలోకి తిరిగి తీసుకువచ్చారు. ఇంటరు ఆఫ్రికన్ మిలిటరీ మిషనును తరువాత ఐక్యరాజ్యసమితి శాంతిదళాలు భర్తీ చేసాయి. 1997 నుండి దేశంలో దాదాపు డజను శాంతి దళాలు జోక్యం చేసుకున్నాయి. ఇది "శాంతి పరిరక్షణలో ప్రపంచ ఛాంపియన్" టైటిల్ను సంపాదించింది.

1998 లో పార్లమెంటరీ ఎన్నికలు కలింగ్బా ఆర్.డి.సి. 109 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 1999 లో, తన అవినీతి పాలనపై పట్టణ కేంద్రాలలో ప్రజల కోపం అధికంగా ఉన్నప్పటికీ పాటస్సే అధ్యక్షపదవిని రెండవసారి గెలిచాడు.

2001 మే 28 న తిరుగుబాటుదారులు తిరుగుబాటు ప్రయత్నంలో బంగుయిలో వ్యూహాత్మకంగా చేసిన దాడి విఫలం అయింది. సైన్యాధిపతి అబెల్ అబౌరా, జనరల్ ఫ్రాంకోయిస్ ఎన్'జజార్డర్ బెడయా చంపబడ్డారు. అయినప్పటికీ కాంగోల తిరుగుబాటు నాయకుడు జీన్-పియరీ బెంబా, లిబియన్ సైనికులలో కనీసం 300 మంది సైనికులను తీసుకురావడం ద్వారా పాటస్సే తిరిగి అధికారం చేపట్టాడు.[ఆధారం చూపాలి]

విఫలమైన తిరుగుబాటు తరువాత పాసస్కు విశ్వసనీయ సైనికులు బంగ్లాలోని అనేక పొరుగు ప్రాంతాలలో తిరుగుబాటుదారులపై పగ సాధించారు. పలు రాజకీయ ప్రత్యర్థుల హత్యలతో అశాంతికి అధికరించింది. జనరల్ ఫ్రాంకోయిస్ బోజిజె అతనిపై మరొక తిరుగుబాటు ప్రయత్నంలో పాల్గొన్నాడని పాటస్సే సందేహించాడు. తద్వారా జనరల్ బోజిజె నమ్మకమైన దళాలతో చాదుకు పారిపోవడానికి దారితీసింది. 2003 మార్చిలో దేశంలోని బయట ఉన్న పాటసీమీద బోజిజె ఒక ఆశ్చర్యకరమైన దాడిని ప్రారంభించాడు. లిబియను దళాలు, బెంబా కాంగో తిరుగుబాటు సంస్థ 1,000 మంది సైనికులు తిరుగుబాటుదారులను ఆపడంలో విఫలమయ్యారు. బోజిసె దళాలు పాటస్సేను పడగొట్టడంలో విజయం సాధించారు.

పౌర యుద్ధం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Rebel militia in the northern countryside, 2007.

ఫ్రాంకోయిస్ బోజిజె రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త మంత్రివర్గాన్ని ఎంపిక చేశాడు. ఇందులో చాలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అబేల్ గౌబ్బా ఉపాద్క్ష్యక్షుడుగా ప్రశంశాపూర్వకంగా పనిచేయడం బోజియేస్ నూతన ప్రభుత్వానికి సానుకూల ప్రతిష్ఠను ఇచ్చింది. నూతన రాజ్యాంగం రూపొందించడానికి బొజిజే మధ్యంతర నేషనల్ ట్రాన్సిషన్ కౌన్సిలును స్థాపించి తాను రాజీనామా చేస్తానని ప్రకటించాడు. కొత్త రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత అతను పోటీ చేస్తానని ప్రకటించారు.

2004 లో బోజియేకు వ్యతిరేకంగా ఉన్న దళాలు అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన కారణంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ బుష్ వార్ ప్రారంభమైంది. 2005 మేలో బోజిజ్ అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించాడు. ఇది పాటేసేను మినహాయించిన కారణంగా 2006 లో ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య పోరు కొనసాగింది.[విడమరచి రాయాలి] 2006 నవంబరులో బోజిజె ప్రభుత్వం దేశంలోని ఉత్తర ప్రాంతాలలో ఉన్న పట్టణాలను నియంత్రణలోకి తీసుకున్న తిరుగుబాటుదారులతో పోరాడడానికి ఫ్రెంచి నుండి సైనిక సహాయం అభ్యర్థించాడు.

2007 ఫిబ్రవరిలో సిర్టిల్ ఒప్పందం, 2007 ఏప్రెలులో బిరావో పీస్ ఒప్పందం ఎఫ్.డి.పి.సి. సమరయోధులతో ఎఫ్.ఎ.సి.ఎ.తో సమైక్యత, రాజకీయ ఖైదీల విముక్తి, ఎఫ్.డి.పి.సి. ప్రభుత్వం బాధ్యతలలో నియమించడం, యులెఫ్.డి.ఆర్.లకు క్షమాభిక్ష ఇచ్చి ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడం, దాని సైన్యాన్ని జాతీయ సైన్యంలోకి విలీనం చేసుకోవడం జరిగాయి. అనేక సమూహాలు పోరాడటం కొనసాగించినప్పటికీ ఇతర గ్రూపులు ఒప్పందానికి సంతకం చేశాయి. ఆ సమయములో ఒప్పందం మీద సంతకం చేయని ఒకే ఒక్క పెద్ద సమూహం సి.పి.జె.పి. దాని కార్యకలాపాలను కొనసాగిస్తూ 2012 ఆగస్టు 25 న ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకం చేసింది.

2011 లో బొజిజె ఒక ఎన్నికలో తిరిగి ఎన్నికయ్యాడు. ఇది దేశవ్యాప్తంగా మోసపూరితంగా పరిగణించబడింది.

2012 నవంబరులో సెలేకా తిరుగుబాటు గ్రూపుల సంకీర్ణమై దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలలోని పట్టణాలను చేపట్టింది. ఈ సమూహాలు చివరికి జనవరి బోజిజే ప్రభుత్వముతో ఒక శాంతి ఒప్పందం చేసుకుని అధికారంలో భాగస్వామ్యం వహించింది. కానీ ఈ ఒప్పందం విఫలమై తిరుగుబాటుదారులు 2013 మార్చిలో రాజధానిని స్వాధీనం చేసుకున్నారు. బోజియే దేశమునుండి పారిపోయారు.

మిచెల్ జొడాడియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన మంత్రి నికోలస్ టింగాయే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుండి శాంతి భద్రతా దళాన్ని కోరారు. 31 మే న మాజీ అధ్యక్షుడు బోజిజెని మానవహక్కులకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు, జెనోసైడ్ను ప్రేరేపించాడని ఆరోపించబడింది. సంవత్సరం చివరి జనోసైడుకు వ్యతిరేకంగా నాటికి అంతర్జాతీయ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి." పోరాటంలో ఎక్కువగా సెల్లా ముస్లిం యుద్ధవీరులు, "బాలేకా-వ్యతిరేక" అని భావించబడే క్రైస్తవ సైన్యం పౌరుల మీద ప్రతీకార దాడుల చేసారని భావించబడింది. 2013 ఆగస్టులో 2,00,000 కంటే అధికంగా ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Refugees of the fighting in the Central African Republic, January 2014

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, ఆఫ్రికన్ యూనియనులో దేశసభ్యత్వాన్ని స్థిరీకరించడానికి తమ ప్రయత్నాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. 2014 ఫిబ్రవరి 18 న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ దేశంలో ఇప్పటికే 6,000 మంది ఆఫ్రికన్ యూనియన్ సైనికులు 2,000 మంది ఫ్రెంచ్ దళాలను బలపరిచేందుకు వెంటనే దేశంలోకి 3,000 మంది సైనికులను పంపించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరాడు. 2013 సెప్టెంబరులో డ్జొటోడియా అధికారికంగా సెలేకాను తొలగించింది. కాని అనేక మంది తిరుగుబాటుదారులు నిరాయుధీకరణకు నిరాకరించారు. వీరు మాజీ సెలెకాగా పిలవబడి ప్రభుత్వ నియంత్రణ నుండి బయటపడ్డారు. మొదట సీలేకాపై ప్రారంభ నిరాయుధీకరణ ప్రయత్నాల దృష్టి అనుకోకుండా బాలాకు వ్యతిరేక అధికారాన్ని అప్పగించడం మీద కేంద్రీకరిమబడింది. దీంతో బలగై, పశ్చిమ సి.ఎ.ఆర్. బాలాక వ్యతిరేకులు ముస్లిం పౌరులను బలవంతంగా స్థానభ్రంశం చేశారు.

2014 జనవరి 11 న పొరుగున ఉన్న చాడ్ లో ప్రాంతీయ సదస్సులో చర్చలలో భాగంగా మైఖేలు డ్జొటోడియా, నికోలస్ టియెంగే రాజీనామా చేసారు. కాథరీన్ సాంబా-పన్జాను జాతీయ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షపదవికి ఎన్నిక చేసింది. ఇది ఆమెకు మొట్టమొదటి మహిళా సెంట్రల్ ఆఫ్రికన్ అధ్యక్షురాలిగా ప్రత్యేకతను ఇచ్చింది. మారింది. 2014 జూలై 23 న కాంగో మధ్యవర్తిత్వ ప్రయత్నాల తరువాత సెలెకా, బాలేకా వ్యతిరేక ప్రతినిధులు బ్రజ్జావిల్లో కాల్పుల విరమణ ఒప్పందం మీదన సంతకం చేశారు. 2014 చివరినాటికి ఈశాన్య ప్రాంతంలో నైరుతి, మాజీ సెలేకాలోని బాలాకా వ్యతిరేక దేశంగా విభజించబడింది. 2015 డిసెంబరు 14 న సెలెకా తిరుగుబాటు నాయకులు స్వతంత్ర రిపబ్లిక్ ఆఫ్ లాగోను ప్రకటించారు.

భౌగోళికం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Falls of Boali on the Mbali River
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
A village in the Central African Republic

ఆఫ్రికన్ ఖండంలో ఉన్న భూబంధిత దేశాలలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఒకటి. దేశ సరిహద్దులలో కామెరూన్, చాద్, సుడాన్, దక్షిణ సుడాన్, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దులుగా ఉన్నాయి. దేశం 2 ° నుండి 11 ° ఉత్తర అక్షాంశంలో, పొడవు 14 ° నుండి 28 ° తూర్పు రేఖాంశాల మద్య ఉంటుంది.

దేశంలో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్లు (1,640 అడుగులు) ఎత్తులో ఉంటుంది. రోలింగ్ పీఠభూమి సవన్నా కలిగి ఉంటుంది. ఉత్తర సగం చాలా వరకూ వరల్డ్ వన్యప్రాణి ఫండ్ ఈస్ట్ సుడానన్ సవన్నా పర్యావరణప్రాంతం లోపల ఉంది. సి.ఎ.ఆర్. ఈశాన్యంలో ఫెర్టిట్ కొండలతో పాటు, నైరుతి ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్న కొండలు ఉన్నాయి. వాయవ్య దిశలో గ్రానైట్ పీఠభూమి యదార్ మాసిఫ్ (348 మీటర్ల (1,143 అడుగులు ఎత్తు)) ఉంది.

6,22,941 చదరపు కిలో మీటర్లు (240,519 చ.మీ.) వైశాల్యం ఉన్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వైశాల్యపరంగా ప్రపంచంలో 45 వ అతిపెద్ద దేశంగా ఉంది. ఇది దాదాపు యుక్రెయిన్ వైశాల్యానికి సమానంగా ఉంటుంది.

దక్షిణ సరిహద్దులో కాంగో నది ఉపనదులు ఉన్నాయి. తూర్పున ఉన్న మొబోవో నది ఉలేగి నదితో సంగమించిన ఉబంగై నదిగా పిలువబడుతుంది. ఇది దక్షిణ సరిహద్దులో భాగాలలో కూడా ప్రవహిస్తుంది. దేశం పశ్చిమ ప్రాంతాలు గుండా సంఘా నది ప్రవహిస్తుంది. తూర్పు సరిహద్దు నైలు నది పరీవాహక ప్రాంతం అంచున ఉంది.

దేశంలో 8% వరకూ అటవీప్రాంతం ఉన్నట్లు అంచనా వేయబడింది. దక్షిణ ప్రాంతాలలో సాధారణంగా దట్టమైన అరణ్యం ఉంటుంది. అడవులు చాలా భిన్నంగా వాణిజ్యపరంగా ముఖ్యమైన ఐయుస్, సాపెల్లి, సిపో జాతి వృక్షాలు ఉంటాయి.

2008 లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలోనే అతి తేలికపాటి కాలుష్యానికి గురైన దేశంగా గుర్తించబడుతుంది. 2008 లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు అత్యల్ప జనసంఖ్య కలిగిన దేశంగా ఉంది.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ బంగ్లా మాగ్నెటిక్ అనోమాలీ కేంద్ర బిందువుగా ఉంది. ఇది భూమిపై అతిపెద్ద అయస్కాంత క్షేత్రాలుగా ఉన్నాయి.

వన్యప్రాణులు

నైరుతి ప్రాంతంలో దజంగా-సంగ నేషనల్ పార్క్ వర్షారణ్య ప్రాంతంలో ఉంది. అటవీ ఏనుగులు, పశ్చిమ లోతట్టు ప్రాంతం గొరిల్లాలకు ప్రసిద్ధి చెందినదిగా గుర్తించబడింది. ఉత్తరప్రాంతంలో మానోవో-గౌండ సెయింట్ ఫ్లోరిస్ నేషనల్ పార్క్ వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. సి.ఎ.ఆర్. ఈశాన్య ప్రాంతంలో చిరుతపులులు, సింహాలు, ఖడ్గమృగాలు, బేమింగ్యూ-బాంగోర్యన్ నేషనల్ పార్కు ఉన్నాయి. ఈ ఉద్యానవనాలు గత రెండు దశాబ్దాలుగా సూడాన్ వేటగాళ్ళ కార్యకలాపాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.[ఆధారం చూపాలి]

వాతావరణం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Central African Republic map of Köppen climate classification.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికులో సాధారణంగా ఉష్ణమండలం వాతావరణం ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు దేశంలోని ఉత్తర ప్రాంతాలలో, మే నుండి అక్టోబరు వరకు దక్షిణాన తేమ సీజను ఉంటుంది. తేమ సీజనులో వర్షపు గాలులు దాదాపు రోజువారీగా సంభవిస్తాయి. ఉదయం కాలంలో సాధారణంగా మంచు కురుస్తూ ఉంటుంది. గరిష్ఠ వార్షిక వర్షపాతం ఎగువ ఉబంగి ప్రాంతంలో సుమారుగా 1,800 మిల్లీమీటర్లు (71 అం) ఉంటుంది.

ఉత్తర ప్రాంతములు ఫిబ్రవరి నుండి మే వరకు వేడిగా, తేమగా ఉంటాయి. కానీ హర్మట్టన్ అని పిలవబడే వేడి, పొడి, ధూళితో కూడిన " ట్రేడ్ విండు " ఉంటుంది. దక్షిణ ప్రాంతాలకు ఎక్కువ భూమధ్యరేఖ వాతావరణం ఉంటుంది. కానీ అవి ఎడారీకరణకు లోబడి ఉంటాయి. ఈశాన్య ప్రాంతాలు ఇప్పటికే ఎడారిగా ఉన్నాయి.

మండలాలు, ఉపమండలాలు

రిపబ్లికు 16 పరిపాలనా మండలాలుగా విభజించబడింది. వీటిలో రెండు ఆర్థిక మండలాలు ఉన్నాయి. ఒక స్వయంప్రతిపత్తి గల నగరపాలితం ఉన్నాయి. మండలాలు అదనంగా 71 ఉప-మండలాలుగా విభజించారు.

మండలాలు: బామింగ్యూ-బాంగోరోన్, బస్సే-కోటో, హౌటే-కోటో, హట్-మోబోమో, కెమో, లోబాయే, మామ్బ్రే-కడేయి, మ్బోమౌ, నానా-మంబేరే, ఓమ్బెల్లా-ఎం పోకో, ఓవాకా, ఓహమ్, ఓహమ్-పెండే, ఒకగా. ఆర్థిక మండలాలు నానా-గ్రెబిజి, సంఘా-మ్బయేరే ఉన్నాయి. రాజధాని నగరం బంగుయి నగరపాలితంగా ఉంది.

ఆర్ధికం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Bangui shopping district

రిపబ్లిక్కు తలసరి ఆదాయం సంవత్సరానికి సుమారు $ 400 గా నమోదైంది. ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంది. ఈ సంఖ్య ఎక్కువగా ఎగుమతి అమ్మకాల మీద ఆధారపడింది. ఎగుమతులలో అధికంగా ఎక్కువగా ఆహారాలు, స్థానికంగా ఉత్పత్తి చేసే మద్య పానీయాలు, వజ్రాలు, దంతాలు, బుష్మీట్, సాంప్రదాయ వైద్యం సేవలు నమోదుకావడం లేదు.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికు ద్రవ్యం సి.ఎఫ్.ఎ. ఫ్రాంకు. ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికా మాజీ దేశాలలో ఇది ఆమోదించబడింది. యూరోకు స్థిర రేటు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. దేశం ఎగుమతులలో వజ్రాలు అత్యధికంగా ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఇవి 40-55% ఎగుమతి ఆదాయం అందిస్తున్నాయి. కానీ ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసిన వాటిలో 30% - 50% మధ్య అక్రమంగా దేశాన్ని విడిచిపెట్టినట్లు అంచనా వేయబడింది

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉత్పత్తి ఎగుమతుల గ్రాఫికల్ వర్ణన 28 రంగు-కోడెడ్ కేతగిరీలు

వ్యవసాయ పంటలలో కూర కాయలు, వేరుశెనగ, మొక్కజొన్న, జొన్నలు, చిరుధాన్యాలు, నువ్వులు, అరటి వంటి ఆహార పంటల పండించడం విక్రయించడం ప్రాధాన్యత వహిస్తున్నాయి. వార్షిక జి.డి.పి. వృద్ధిరేటు కేవలం 3% పైన ఉంది. ఎగుమతి చేయబడిన నగదు పంటలలో పలు సెంట్రల్ ఆఫ్రికన్ల ప్రధానమైన ఉత్పత్తి అయిన కాసావా ప్రాధాన్యత వహిస్తుంది. ఇది సంవత్సరానికి 2,00,000, 3,00,000 టన్నుల మధ్య ఉత్పత్తి చేయబడుతుంది. అదే సమయంలో పత్తి సంవత్సరానికి 25,000 నుండి 45,000 టన్నుల వరకు ఎగుమతి చేయబడుతుంది. ఆహార పంటలు పెద్ద పరిమాణంలో ఎగుమతి చేయబడనప్పటికీ ప్రధాన నగదు పంటలుగా ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ ఆఫ్రికన్లు పత్తి లేదా కాఫీ వంటి ఎగుమతి చేసిన నగదు పంటల కంటే మిగులు ఆహార పంటల అమ్మకపు అమ్మకం నుండి చాలా ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి.[ఆధారం చూపాలి]దేశంలో ఎక్కువ భాగం ఆహార పంటల్లో స్వయం సమృద్ధిగా ఉంటుంది. అయినప్పటికీ, పశుసంపద అభివృద్ధికి " త్సెత్సె ఈగ " ఆటంకమవుతుంది.[ఆధారం చూపాలి]

రిపబ్లికు ప్రాథమిక దిగుమతి భాగస్వామి నెదర్లాండ్స్ (19.5%). కామెరూన్ (9.7%), ఫ్రాన్స్ (9.3%), దక్షిణ కొరియా (8.7%) ఇతర దేశాల నుండి వస్తున్నాయి. దీని అతిపెద్ద ఎగుమతి భాగస్వామి బెల్జియం (31.5%), తరువాత చైనా (27.7%), కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ (8.6%), ఇండోనేషియా (5.2%), ఫ్రాన్స్ (4.5%)..

సి.ఎ.ఆర్. ఆఫ్రికా ఆర్గనైజేషన్ ఫర్ హార్మోనిజేషన్ ఆఫ్ బిజినెస్ లా సభ్యదేశంగా ఉంది. 2009 వరల్డ్ బ్యాంక్ గ్రూపు నివేదిక డూయింగ్ బిజినెసులో వ్యాపార కార్యకలాపాన్ని పెంపొందించే సంక్లిష్ట ఇండెక్సు వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరుచుకునే దేశాలలో ఇది 183 దేశాలలో 183 వ స్థానంలో ఉంది.

మౌలిక వసతులు

ప్రయాణ సౌకర్యాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Trucks in Bangui

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికు రవాణా కేంద్రంగా బంగుయి నగరం ఉంది. 1999 నాటికి నరంలోని ఎనిమిది రోడ్లు నగరాన్ని దేశంలోని ఇతర ప్రధాన పట్టణాలు, కామెరూన్, చాద్, దక్షిణ సుడానుతో అనుసంధానం చేసాయి. వీటిలో టోల్ రహదారులు మాత్రమే పేవ్మెంటు చేయబడ్డాయి. జూలై నుండి అక్టోబరు వరకు వర్షాకాలంలో కొన్ని రహదారులు ప్రయాణం చేయడానికి వీలుకాని స్థితిలో ఉంటాయి.

బంగుయి లోని నది నౌకాశ్రయం నుండి బ్రజ్జావిల్, జోంగో వరకు పడవలు ప్రయాణిస్తుంటాయి. ఈ నది సంవత్సరంలో చాలా భాగం బంగుయి, బ్రజ్జావిల్లే మధ్య ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. బ్రజ్జావిల్ నుండి వస్తువులు కాంగో అట్లాంటిక్ నౌకాశ్రయం పాయింటే-నోయిరేకి రైలు ద్వారా రవాణా చేయబడతాయి. దేశం లోని నది నౌకాశ్రయం అంతర్జాతీయ వాణిజ్యం అధికభాగాన్ని నిర్వహిస్తుంది. ఇది 3,50,000 టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అది 350 మీటర్ల (1,150 అడుగులు) పొడవు, 24,000 చదరపు మీటర్ల (260,000 చ.అ) వైశాల్యం కలిగి ఉంది.

బంగుయి ఎమ్'పొకొ అంతర్జాతీయ విమానాశ్రయం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికు ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది. 2014 జూన్ నాటికి అది బ్రజ్వవిల్లే, కాసాబ్లాంకా, కోటానావ్, డౌలా, కింషాషా, లోమె, లువాండా, మలాబో, నడ్జిమెనా, ప్యారిస్, పాయింటే-నోయిరే, యౌండేలకు విమానాలు నేరుగా నడుపబడుతున్నాయి. చేయబడ్డాయి.

2002 నుండి ట్రాంస్‌కెమరూన్ రైల్వేకి రైలు ద్వారా బంగుయిని అనుసంధానం చేయడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.

విద్యుత్తు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రధానంగా జలవిద్యుత్తును ఉపయోగిస్తుంది. అయినప్పటికీ విద్యుత్తు ఉత్పత్తికి కొన్ని ఇతర వనరులు ఉన్నాయి.

సమాచార రంగం

ప్రస్తుతం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికులో టెలివిజన్ సేవలు, రేడియో స్టేషన్లు, ఇంటర్నెటు సర్వీసు ప్రొవైడర్సు, మొబైలు ఫోను వాహకాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్టు మొబైల్ ఫోన్ లభ్యత కోసం సోకాటెల్ ప్రముఖ ప్రొవైడర్ పనిచేస్తుంది. టెలికమ్యూనికేషన్సు సేవలను ప్రభుత్వ సంస్థలు మినిస్టీర్ డెస్ పోస్టెసు, టెలికమ్యూనికేషన్సు ఎట్ డెస్ నౌవెల్లెస్ టెక్నాలజీలు నియంత్రిస్తున్నాయి. అదనంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అంతర్గత టెలికమ్యూనికేషన్ అభివృద్ధి కేంద్రం టెలికమ్యూనికేషన్ సంబంధిత కార్యకలాపాలకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్సు యూనియన్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి అంతర్జాతీయ మద్దతును అందుకుంటూ ఉంది.

గణాంకాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Fula women in Paoua

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికుకు స్వతంత్రం లభించినప్పటి నుండి జనసంఖ్య దాదాపు నాలుగు రెట్లు అధికరించింది. 1960 లో జనసంఖ్య 12,32,000 ఉంది. 2016 నాటి ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఇది సుమారుగా 45,94,621 ఉంది.

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 15 - 49 మధ్య వయస్కులలో సుమారు 4% జనాభా హెచ్.ఐ.వి. పాజిటివ్ బాధితులు ఉన్నారని భావిస్తున్నారు. పొరుగు దేశాలు చాదు, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో 17% కవరేజుతో పోలిస్తే దేశంలో 3% మందికి మాత్రమే యాంటిరెట్రోవైరల్ చికిత్స అందుబాటులో ఉంది.

ఈ దేశంలో 80 జాతుల సమూహాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జాతికి స్వంత భాషను ఉంది. అతిపెద్ద జాతి సమూహాలు బావా, బండా, మండ్జియా, సారా, మ్బోం, ఎమ్'బకా, యాకోమా, ఫులా (ఫులని). ఇతర యూరోపియన్లు ఎక్కువగా ఫ్రెంచ్ సంతతికి చెందినవారుగా ఉన్నారు.

మతం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
A Christian church in the Central African Republic.

2003 జాతీయ గణాంకాల ఆధారంగా ప్రజలలో 80.3% క్రైస్తవులు ఉన్నారు. వీరిలో 51.4% ప్రొటెస్టంట్లు, 28.9% రోమన్ కాథలిక్కులు ఉన్నారు. 10% ముస్లింలు ఉన్నారు. 2010 నాటికి ప్యూ రీసెర్చ్ సెంటర్ గణాంక వివరణ ఆధారంగా క్రైస్తవులు జనాభాలో 89.8% మంది ఉన్నారు (ప్రొటెస్టాంటిజం 60.7%, కాథలిక్కు 28.5% తో), ముస్లింలు 8.9% ఉన్నారని భావిస్తున్నారు. కాథలిక్కు చర్చిలో సుమారు 1.5 మిలియన్లకు కంటే అధికమైన సభ్యులు ఉన్నారు. ఇది జనసంఖ్యలో దాదాపు మూడింట ఒక వంతు. స్థానిక ప్రజలు అనిమిజం విశ్వాసం (ఆవిష్కరణ) కూడా అనుసరిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజలలో అనేకులు క్రైస్తవ, ఇస్లామిక్ మతాలను ఆచరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి డైరెక్టరు ఒకరు ముస్లింలు, క్రైస్తవుల మధ్య మతపరమైన ఉద్రిక్తతలను ఎక్కువగా ఉన్నట్లు వర్ణించాడు.

లూథరన్లు, బాప్టిస్టులు, కాథలిక్కులు, గ్రేసు బ్రద్రెన్లు, యెహోవాసాక్షులు వంటి అనేక మిషనరీ గ్రూపులు దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ మిషనరీలు అధికంగా యునైటెడ్ స్టేట్సు, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిను దేశాలకు చెందినవై ఉన్నాయి. నైజీరియా, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, ఇతర ఆఫ్రికన్ దేశాలలో కూడా చాలా మిషనరీలు ఉన్నాయి. 2002-3లో తిరుగుబాటు, ప్రభుత్వ దళాల మధ్య జరిగిన పోరాటంలో మిషనరీలు పెద్ద సంఖ్యలో దేశం విడిచివెళ్ళారు. కానీ చాలామంది తమ పని కొనసాగించడానికి తిరిగి వచ్చారు.

2012 నుండి కొనసాగుతున్న సంక్షోభం సమయంలో విదేశీ నేతృత్వ ఇంస్టిట్యూటు పరిశోధన ఆధారంగా మత నాయకులు కమ్యూనిటీలు, సాయుధ గ్రూపుల మధ్య మధ్యవర్తిత్వం చేశారు. వారి ఆశ్రయం కోరే ప్రజలకు శరణు అందించారు.

భాషలు

సెంటర్ ఆఫ్రికన్ రిపబ్లికులో రెండు అధికార భాషలు ఉన్నాయి. అవి శాంగో, క్రియోలు. జాతులను అనుసంధానించే భాషగా లిగువా ఫ్రాంకాగా అభివృద్ధి చెందింది. దీనికి నాగబంది భాష ఆధారంగా ఉంది. ఆఫ్రికన్ భాషను వారి అధికారిక భాషగా కలిగి ఉన్న కొన్ని ఆఫ్రికన్ దేశాలలో సి.ఎ.ఆర్. ఒకటి.

సంస్కృతి

క్రీడలు

బాస్కెట్ బాల్ దేశంలో ప్రజాదరణ క్రీడగా ఉంది. ఇది ప్రజలను అనుసంధానించడానికి సహకరిస్తుంది. జాతీయ జట్టు రెండుసార్లు ఆఫ్రికన్ ఛాంపియన్షిప్పును గెలుచుకుంది. బాస్కెట్ బాల్ ప్రపంచ కప్ కోసం అర్హత సాధించిన మొదటి సబ్ సహారా ఆఫ్రికా జట్టుగా గుర్తించబడుతుంది. దేశం జాతీయ ఫుట్బాల్ జట్టును కూడా కలిగి ఉంది. ఇది " ఫెడరేషన్ సెంట్రాఫ్రికేషనె డి ఫుట్ బాల్ " చేత నిర్వహించబడుతుంది. ఇది " బార్తేలిమీ బోగాండా స్టేడియం " వద్ద మ్యాచులను నిర్వహిస్తుంది.

విద్య

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Classroom in Sam Ouandja

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికులో ప్రజలకు విద్య ఉచితంగా అందించబడుతుంది. 6 - 14 సంవత్సరాల వయసు వరకు నిర్బంధ విద్య అమలులో ఉంది. అయినప్పటికీ దేశంలోని వయోజనులలో సగం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు.

ఉన్నత విద్య

బంగుయిలో ఉన్న రెండు ఉన్నత విద్యా సంస్థలలో ఒకటి ఒకే ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం అయిన బంగ్జీ విశ్వవిద్యాలయం ఇందులో వైద్య కళాశాల భాగంగా ఉంది) రెండవది బంగుయిలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అయిన యునిక్డ్ విశ్వవిద్యాలయం.

ఆరోగ్యరక్షణ

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
Mothers and babies aged between 0 and 5 years are lining up in a Health Post at Begoua, a district of Bangui, waiting for the two drops of the oral polio vaccine.

బంగుయి జిల్లాలో దేశంలోని అతిపెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్యదేశంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ టీకా సహాయాన్ని అందుకుంటున్నది. 2014 లో తట్టు వ్యాధిని నివారించడానికి సహాయం అందించబడింది. 2007 లో స్త్రీల ఆయుఃప్రమాణం 48.2 సంవత్సరాలు, పురుషుల ఆయుఃప్రమాణం 45.1 సంవత్సరాలుగా అంచనా వేయబడింది.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికులో మహిళల ఆరోగ్యం బలహీనంగా ఉంది. 2010 నాటికి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించిన దేశాలలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4 వ స్థానంలో ఉంది. 2014 లో మొత్తం సంతానోత్పత్తి రేటు 4.46 గా అంచనా వేయబడింది. దేశంలో ప్రసవాలు అధికంగా సంప్రదాయ మంత్రసానుల చేత నిర్వహించబడుతున్నాయి. వారు తక్కువగా శిక్షణ పొందిన వారుగా లేదా అధికారికంగా శిక్షణ పొందినవారుగా ఉంటారు.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికులో మలేరియా అనేది స్థానికంగా మరణానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. 2009 అంచనాల ఆధారంగా హెచ్.ఐ.వి. రేటు వయోజన జనాభాలో (వయస్సు 15-49) 4.7% ఉంటుంది. 2016 ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం దాదాపు 4%తో ఉంది. 2006 లో ప్రభుత్వ వ్యయంలో ఆరోగ్యరక్షణకు ప్రభుత్వ వ్యయం తలసరి US $ 20. ప్రభుత్వ జి.డి.పి.లో 10.9%. 2009 లో 20,000 మందికి 1 వైద్యుడు మాత్రమే ఉన్నాడు..

మానవహక్కులు

యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంటు ఆఫ్ స్టేట్ 2009 మానవ హక్కుల నివేదిక సి.ఎ.ఆర్.లో మానవ హక్కులు పేలవంగా సమేక్షించబడుతున్నాయని, ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం చేయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. భద్రతా దళాలు విచారణరహితంగా మరణశిక్షను అమలు చేయడం, హింసించడం, కొట్టడం, అనుమానితులు, ఖైదీల మీద అత్యాచారాలు వంటి అతి పెద్ద మానవ హక్కుల దుర్వినియోగం జరిగిందని యు.ఎస్. స్టేట్ డిపార్టుమెంటు ఆరోపించింది. ఇది జైళ్లలో, నిర్బంధ కేంద్రాల్లో కఠినమైన, ప్రాణాంతక పరిస్థితులు, నిరంతర అరెస్టులు, సుదీర్ఘమైన విచారణ పూర్వ నిర్బంధం, న్యాయమైన విచారణను తిరస్కరించడం, ఉద్యమ స్వేచ్ఛపై నియంత్రణలు, అధికారిక అవినీతి, కార్మికుల హక్కుల ఉల్లంఘన గురించి కూడా ఆరోపించింది.

స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక విస్తృతమైన అల్లరి మూకల హింస, మహిళల జననాంగ విస్ఫారణం, మహిళలూ పైగ్మీస్ పట్ల వివక్ష, మానవ రవాణా, నిర్బంధిత కార్మికులు, బాల కార్మికుల మీద వివక్షత వంటి మానవహక్కుల ఉల్లంఘన జరింగిదని తెలియజేస్తుంది. దేశ భద్రతా దళాలు, సాయుధ బందిపోట్లు, ఇతర అజమాయిషీ లేని సాయుధాల చర్యల కారణంగా దేశంలోని ఉత్తర భాగంలో ఉద్యమ స్వేచ్ఛ పరిమితం చేయబడింది. ప్రభుత్వ, ప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య పోరాటం కారణంగా అనేక మంది వ్యక్తులు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. మంత్రవిద్య ఆరోపణలకు సంబంధించి పిల్లలు, మహిళలపై హింస కూడా దేశంలో తీవ్రమైన సమస్యగా పేర్కొనబడింది. మంత్రవిద్య శిక్షాస్మృతి కోడ్ కింద క్రిమినల్ నేరం.

వాక్స్వాతంత్ర్యానికి ప్రభుత్వ బెదిరింపు సంఘటనలు. constitution, మాధ్యమాల విధినిర్వహణలో ప్రభుత్వ జోక్యం వంటివి సంభవించాయి. ఇంటర్నేషనల్ రీసెర్చి అండు ఎక్ఛేంజెస్ బోర్డు మీడియా సటెయిన్‌బిలిటీ ఇండెక్స్ ఒక నివేదిక ఆధారంగా ప్రభుత్వం "దేశంలో మీడియా వ్యవస్థను స్వేచ్ఛను వ్యతిరేకించే చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ చట్టపరమైన వ్యవస్థా విభాగాల లక్ష్యాలు తక్కువగా ఉన్నాయని " భావిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఎఫైర్స్ కూడా బాల కార్మిక, ఫోర్స్డ్ లేబర్ చేత ఉత్పత్తి చేయబడిన వస్తువుల జాబితా ఆఖరి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఐక్యరాజ్యసమితి " మానవాభివృద్ధి జాబితా "లో దేశం 188 దేశాలలో చివరిదైన 188 వ స్థానంలో ఉందని పేర్కొన్నది. బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ లేబరు అఫెయిర్స్ " బాలకార్మికులు లేదా బలవంతంగా పనిచేయిస్తున్న కార్మికుల ఉత్పత్తులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నది.

మూలాలు

Tags:

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ చరిత్రసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ భౌగోళికంసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆర్ధికంసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మౌలిక వసతులుసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ గణాంకాలుసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సంస్కృతిసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ విద్యసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆరోగ్యరక్షణసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మానవహక్కులుసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మూలాలుసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్కాంగో రిపబ్లిక్కామెరూన్చాద్సూడాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

అనుష్క శెట్టిశ్రీవిష్ణు (నటుడు)విశ్వనాథ సత్యనారాయణఅనుష్క శర్మన్యుమోనియాచిలుకూరు బాలాజీ దేవాలయంవిశాల్ కృష్ణభారతదేశంశ్రీరామకథసమ్మక్క సారక్క జాతరదేవదాసిగజేంద్ర మోక్షంఆంధ్రప్రదేశ్ చరిత్రశోభన్ బాబుమంజుమ్మెల్ బాయ్స్ఆశ్లేష నక్షత్రముసీతాదేవిగౌడసంజు శాంసన్జనసేన పార్టీగుమ్మలూరి శాస్త్రిశ్రీనాథుడుఅగ్నికులక్షత్రియులుదాశరథీ శతకమువిశ్వామిత్రుడుశ్రీదేవి (నటి)నాగులపల్లి ధనలక్ష్మిరాబర్ట్ ఓపెన్‌హైమర్ద్వాదశ జ్యోతిర్లింగాలుపుష్యమి నక్షత్రముజొన్నఎఱ్రాప్రగడతెలుగు భాష చరిత్రపి.సుశీలఅనూరాధ నక్షత్రంగూగుల్ఛందస్సుసిద్ధు జొన్నలగడ్డరజాకార్లురాశిమోత్కుపల్లి నర్సింహులుమొదటి ప్రపంచ యుద్ధంసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుప్రజాస్వామ్యంపులిసంగీత వాయిద్యంకామాక్షి భాస్కర్లశ్రీశ్రీభారత రాజ్యాంగ ఆధికరణలుఆది శంకరాచార్యులుయవలురమణ మహర్షిపంచభూతాలుతెలంగాణ గవర్నర్ల జాబితాభారత రాష్ట్రపతిఅల్లు అర్జున్శుభ్‌మ‌న్ గిల్సామజవరగమనబాలకాండతాజ్ మహల్అమెరికా సంయుక్త రాష్ట్రాలుహలం (నటి)దినేష్ కార్తీక్నర్మదా నదిపొడుపు కథలుకడప లోక్‌సభ నియోజకవర్గంఆయాసంసెక్స్ (అయోమయ నివృత్తి)భారత రాజ్యాంగ సవరణల జాబితాసమాసంలగ్నందత్తాత్రేయభోపాల్ దుర్ఘటననడుము నొప్పి2024 భారతదేశ ఎన్నికలుమండల ప్రజాపరిషత్భారత్ రాష్ట్ర సమితిఒంటిమిట్ట🡆 More