రువాండా

రువాండా అధికారికంగా ర్వాండా: ఇది మధ్య, తూర్పు ఆఫ్రికాలోని భూపరివేష్టిత దేశం.

ఆఫ్రికన్ ప్రధాన భూభాగంలో అతి చిన్న దేశాలలో ఒకటి. భూమధ్యరేఖకు దక్షిణాన కొన్ని డిగ్రీల దూరంలో ఉంది. దేశసరిహద్దులలో ఉగాండా, టాంజానియా, బురుండి, కాంగో గణతంత్ర రిపబ్లిక్ దేశాలు ఉన్నాయి. రువాండా ఆఫ్రికా గ్రేటు లేక్సు ప్రాంతంలో ఉంది. పశ్చిమప్రాంతంలో పర్వతాలను, తూర్పుప్రాంతంలో సవన్నాలను ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక సరస్సులు ఉన్నాయి. ఉపఉష్ణమండలీయ సమశీతోష్ణ స్థితి ఉంటుంది. వార్షికంగారెండు వర్షపు సీజన్లు, రెండు పొడి రుతువులు ఉంటాయి. ఈ దేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నా కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. 1994లో మారణ కాండ ఫలితంగా ఈ దేశం అంతర్జాతీయ దృష్టిలోకి వచ్చింది.

Republic of Rwanda

Repubulika y'u Rwanda  (Kinyarwanda)
République du Rwanda  (French)
The flag of Rwanda: blue, yellow and green stripes with a yellow sun in top right corner
జండా
The seal of Rwanda: central tribal devices, surmounted on a cog wheel and encircled by a square knot
Seal
నినాదం: "Ubumwe, Umurimo, Gukunda Igihugu"
"Unity, Work, Patriotism"
గీతం: [Rwanda nziza] Error: {{Lang}}: text has italic markup (help)
Beautiful Rwanda
Location of  రువాండా  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  రువాండా  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

రాజధానికిగాలీ
1°56.633′S 30°3.567′E / 1.943883°S 30.059450°E / -1.943883; 30.059450
అధికార భాషలు
పిలుచువిధం
  • Rwandan
  • Rwandese
ప్రభుత్వంఏకకేంద్రక అర్ధ-అధ్యక్షతరహా గణతంత్రరాజ్యము
Paul Kagame
Anastase Murekezi
శాసనవ్యవస్థపార్లమెంటు
• ఎగువ సభ
సెనేట్
• దిగువ సభ
ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్
స్వాతంత్య్రం
• బెల్జియం నుండి
1 జూలై 1962
విస్తీర్ణం
• మొత్తం
26,338 km2 (10,169 sq mi) (145th)
• నీరు (%)
5.3
జనాభా
• 2015 estimate
11,262,564 (76th)
• 2012 census
10,515,973
• జనసాంద్రత
445/km2 (1,152.5/sq mi) (29th)
GDP (PPP)2017 estimate
• Total
$24.717 billion
• Per capita
$2,090
GDP (nominal)2017 estimate
• Total
$8.918 billion
• Per capita
$754
జినీ (2010)51.3
high
హెచ్‌డిఐ (2015)Increase 0.498
low · 159th
ద్రవ్యంరువాండా ఫ్రాంక్ (RWF)
కాల విభాగంUTC+2 (CAT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+250
ISO 3166 codeRW
Internet TLD.rw

1994లో చెలరేగిన జాతుల వైరానికి బలైపోయిన వారిలో ఎక్కువ శాతం మగవాళ్లే. దాంతో ఆ దేశ జనాభాలో స్త్రీల శాతం 70కి పెరిగింది. దేశాన్ని అన్నివిధాలుగా ముందుకు నడిపించాల్సిన భారం స్త్రీలపై పడింది. 2003 లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ దేశ చట్ట సభలతోపాటు దేశ క్యాబినెట్‌లో కూడా 30 శాతం పదవులు మహిళలకి కేటాయించారు. మహిళలకి రిజర్వేషన్ 2008లో జరిగిన ఎన్నికల్లో వచ్చింది. 30 శాతం స్త్రీలు రిజర్వేషన్ ద్వారా ఎన్నికైతే, మరో 26 శాతం మంది రిజర్వేషన్ లేకుండానే ఎన్నికయ్యారు. వెరసి చట్ట సభలో వారి శాతం 56 అయ్యింది. పార్లమెంటులో స్త్రీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఏకైక దేశంగా రువాండా చరిత్రకెక్కింది.

జనాభాలో యువత అధికంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉంటుంది. ఈ సమూహంలో హుతు, టుట్సి, ట్వా అనే మూడు ఉపవిభాగాలు ఉన్నప్పటికీ రువాండియన్లు కేవలం ఒక సాంస్కృతిక, భాషా సమూహమైన బన్యార్వాండా సమాజానికి చెందినవారై ఉంటారు. రువాండాలో మొట్టమొదటి అటవీ నివాస పిగ్మీ ప్రజలు నివసించారని భావిస్తున్నారు. హుటు, టుట్సీల మధ్య మూలాల గురించి పరిశోధకులు విభేదిస్తున్నారు. కొంతమంది మాజీ సామాజిక కులాల సంబంధిత వ్యక్తులలో తేడాలు ఉన్నట్లు కొందరు అభిప్రాయపడ్డారు. ఇతరులు హుటు, టుట్సీ ప్రజలు విభిన్న ప్రాంతాల నుండి ఈ ప్రాంతంలో ప్రవేశించారని విశ్వసిస్తారు. దేశంలో క్రైస్తవ మతం అతి పెద్ద మతంగా ఉంది. ప్రధాన భాష కిన్నార్వాండ భాషను రువాండాలు చాలా మంది మాట్లాడతారు. ఆంగ్లం, ఫ్రెంచి అదనపు అధికార భాషలుగా ఉన్నాయి. రువాండా సార్వభౌమ ప్రభుత్వం అధ్యక్ష వ్యవస్థను కలిగి ఉంది. ప్రెసిడెంటు 2000 రువాండా మానవ హక్కుల సంస్థలు వాక్ స్వాతంత్ర్యం ప్రతిపక్ష అణిచివేయడం, భయపెట్టడం, ఆంక్షలతో అణిచివేత జరుగుతున్నాయని నివేదిస్తున్నాయి. పొరుగు దేశాలతో పోలిస్తే తక్కువ అవినీతి ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రువాండా అధ్యక్షుడు " పేట్రియాటిక్ ఫ్రంటు "కు చెందిన పాల్ కగమె (ఆర్పిఎఫ్). ఆయన 2000 లో అధికార బాధ్యతలు స్వీకరించాడు. వలసపాలన పూర్వ కాలపు కాలం నుండి దేశంలో నియంతృత్వ పాలన కొనసాగింది. 2006 లో ఐదు ప్రొవింసులు సరిహద్దులతో రూపొందించబడ్డాయి. జాతీయ పార్లమెంటులో మహిళల మెజారిటీ కలిగిన రెండు ప్రపంచదేశాలలో రువాండా ఒకటి.

రువాండా ఆర్థిక వ్యవస్థ 1994 లో సామూహిక హత్యాకాండలో అధకంగా బాధించబడినప్పటికీ తరువాత బలోపేతం అయ్యింది. ఆర్థిక వ్యవస్థ అధికంగా వ్యవసాయంపై ఆధారపడింది. కాఫీ, టీ వంటి ప్రధాన నగదు పంటలు ఎగుమతి చేయబడుతుంటాయి. పర్యాటకరంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది దేశంలోని ప్రముఖ విదేశీ మారకందారుగా ఉంది. పర్వత గొరిల్లాలను సురక్షితంగా సందర్శించగల రెండు దేశాలలో రువాండా ఒకటి. సందర్శకులు గొరిల్లాలు సంచరించే ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి కోసం అధిక ధరలను చెల్లిస్తారు. సంగీతం, నృత్యం రువాండా సంస్కృతిలో ఒక ప్రత్యేక భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రమ్సు, అత్యంత రమ్యంగా ప్రదర్శించబడే " ఇంటోరె " నృత్యం పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తుంది. సాంప్రదాయిక కళలు, చేతిపనులు దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడతాయి. ఇమిగోంగో, ఒక ప్రత్యేకమైన పశువుల పేడ కళ.

Etymology

The name "Rwanda" is derived from the Rwanda-Rundi word rwanda meaning "domain" or literally an "area occupied by a swarm". The official name of the country was "Rwandese Republic" until May 2003, when the adoption of a new national constitution changed it to its current name of "Republic of Rwanda".

చరిత్ర

ప్రస్తుతము రువాండా చివరి హిమనదీయ కాలానికి చెందినదని క్రీస్తుపూర్వం 8000 నాటి నియోలిథిక్ కాలములో లేదా క్రీ.పూ. 3000 కాలానికి చెందిన దీర్ఘకాల తేమ (నియోలిథిక్ సబ్ప్లూవియల్) ఉంటుంది. పురావస్తు త్రవ్వకాల్లో చివరి రాతి యుగంలో వేట, సంగ్రాహకులు నివసించిన చిన్న స్థావరం ఉన్నట్లు ఆధారాలు వెల్లడించాయి. తరువాత ఇనుప యుగంలో పెద్ద సంఖ్యలో ప్రలజలు స్థిరపడ్డారు. ఈ ప్రజలు మందమైన కుండలు, ఇనుప ఉపకరణాలను ఉత్పత్తి చేశారు. ఈ తొలి నివాసితులు ట్వా ప్రజల, ప్రస్తుత రువాండాలో ఉన్న ఆదిమవాసిలైన పిగ్మీ వేట-సంగ్రాహకుల పూర్వీకులుగా ఉన్నారు. క్రీ.పూ 700, సా.శ.. 1500 మధ్య అనేక బంటు సమూహాలు రువాండాకు వలస వచ్చాయి. వ్యవసాయానికి అటవీ భూమిని నిర్మూలించింది. అటవీ-నివాస స్థలము ట్వా వారి ఆవాస స్థలాన్ని కోల్పోయి పర్వతాల వాలులకు తరలించబడింది. బంటు వలసల గురించి చరిత్రకారులలో అనేక సిద్ధాంతాలను ఉన్నాయి. ఒక సిద్దాంతం మొట్టమొదట స్థిరనివాసులు హుటుప్రజలని భావిస్తుంది. టుట్సీ తరువాత ప్రత్యేకమైన జాతి సమూహాన్ని ఏర్పరచటానికి (బహుశా నీలో-హామిటిక్ మూలనికి చెందిన ప్రజలు) వచ్చారు. ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం వలసలు నెమ్మదిగా, స్థిరంగా ఉండి ప్రస్తుత సమాజాలను జయించటానికి ప్రయత్నించకుండా అంతకు పూర్వం ఉన్న ప్రజలతో కలిసిపోతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం హుటు, టుట్సీల విలక్షణత మొదలయ్యింది. జాతికి బదులుగా ఒక తరగతి వ్యత్యాసంగా భావించవచ్చు.

రువాండా 
A reconstruction of the King of Rwanda's palace at Nyanza

ఈ ప్రాంతంలోని సాంఘిక సంస్థ మొట్టమొదటి రూపం క్లాను (అబ్వొకొ). వంశాలు వంశావళికి చెందిన భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. వీరిలో అధికభాగం హుటు, టుట్సి, ట్వా విభాగాలు ఏర్పడ్డాయి. 15 వ శతాబ్దం నుండి, వంశాల నుండి రాజ్యాలు స్థాపించబడడం ప్రారంభమైంది. 1700 నాటికి ప్రస్తుత రువాండా ప్రాంతంలో ఎనిమిది రాజ్యాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రువాండా రాజ్యం. దీనిని టుట్సీ నిగిన్యా వంశం పాలించింది. 18 వ శతాబ్దం మధ్యకాలం నుండి ఆధిపత్యం పెరిగింది. 19 వ శతాబ్దంలో కిగెలి రాజ్యం రువాబుగిరి పాలనలో శిఖరాగ్రస్థితికి చేరుకుంది. రువాబుగిరి అనేక చిన్న రాజ్యాలను జయించాడు. రాజ్యం పశ్చిమ, ఉత్తర ప్రాంతాలను విస్తరించబడింది. తరువాత రువాబుగిరి పరిపాలనా సంస్కరణలను ప్రారంభించారు. ఉబురేట్వా విధానం ఇందులో ఒకటి. ఉబురేట్వా కర్వీ విధానం ఆధారంగా టుట్సీ నాకుల ఆధీనంలో పనిచేయాలని హుటూ ప్రజలు బలవంతానికి గురైయ్యారు. రువాబుగిరి మార్పులు హుటు, టుట్సీ జనాభాల మధ్య అంతరం అధికరించడానికి కారణమయ్యాయి. త్వా ప్రజలు సామ్రాజ్యపు పూర్వపు రోజులలో కన్నా మెరుగ్గా ఉండేవారు. కొంతమంది రాజ్యసభలో నాట్యకారులుగా ఉన్నారు. కానీ వారి సంఖ్య నిరంతరాయంగా తగ్గుతూ వచ్చింది.

1884 నాటి బెర్లిను సమావేశం తూర్పు ఆఫ్రికా జర్మనీ ప్రాంతానికి చెందినదిగా నిర్ణయిస్తూ ఈ భూభాగాన్ని జర్మనీసామ్రాజ్యానికి కేటాయించడంతో కాలనీల యుగం ప్రారంభమైంది. 1894 లో అన్వేషకుడు గుస్టావు అడాల్ఫు వాను గోట్జెను ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆయన ఈ ప్రాంతాన్ని అంవేషించిన మొదటి ఐరోపా వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఆయన కివుకు సరోవరం దక్షిణ-తూర్పు ప్రాంతంలో ప్రయాణం చేసి రాజును కలుసుకున్నాడు. జర్మన్లు ​​గణనీయంగా దేశ సామాజిక వ్యవస్థను మార్చలేదు. కానీ రాజు మద్దతు ఇవ్వడంతో, స్థానిక అధికారులకు అధికారాన్ని ఇవ్వటం ద్వారా ప్రభావం చూపారు. 1916 లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బెల్జియన్ దళాలు రువాండా, బురుండిల నియంత్రణను చేజిక్కించుకుని ప్రత్యక్ష వలసల పాలన ప్రారంభించింది. బెల్జియం " లీగు ఆఫ్ నేషన్సుగా " (రువాండా-ఉరుండి) రువాండా, బురుండి రెండింటిని పాలించింది. బెల్జియన్లు సరళీకృత విధానాలతో కేంద్రీకృత అధికారంతో ఈ ప్రాంతాన్ని పాలించారు.

బెల్జియం పాలనలో విద్య, ఆరోగ్యం, ప్రజా వ్యవహారాలు, వ్యవసాయ పర్యవేక్షణలో నూతన పంటలు, కరువును తట్టుకుని నిలవడానికి అవసరమైన సాంకేతికత అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు.

జర్మన్లు, బెల్జియన్లు హుటు, టుట్సీ వివిధ జాతులలో టుట్సీ ఆధిపత్యాన్ని ప్రాముఖ్యత ఇచ్చారు. 1935 లో బెల్జియం ప్రజలకు తుట్సీ, హుటు, ట్వా (నేచురైజ్డు) గా గుర్తించే గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది. అంతకు పూర్వం సంపన్నమైన హుటు గౌరవార్థమైన టుటుకి కావడానికి ఇది సాధ్యమయ్యింది. అయితే, గుర్తింపు కార్డులు ఈ తరగతులకు మధ్య అదనపు ఉద్రిక్తలను నిరోధించింది.

రువాండా 
Juvénal Habyarimana, president from 1973 to 1994

రువాండా, ఉరుండిలో బెల్జియం పాలన కొనసాగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ ట్రస్టు ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. తొలి స్వాతంత్ర్యానికి టుట్సీ ఆదరించింది. హుటూ విముక్తి ఉద్యమం 1959 రువాండా విప్లవంగా వర్ణించబడింది. టుట్సీ, హుటూ ప్రజల మధ్య ఉద్రిక్తతలు అధికరించాయి. హుటు కార్యకర్తలు టుట్సీని చంపడం, వారి గృహాలను నాశనం చేయడం ప్రారంభించారు. 1,00,000 కంటే అధికంగా ప్రజలు పొరుగు దేశాలలో ఆస్రయం కోరుకున్నారు. 1961 లో ప్రొ హుటు బెల్జియన్లు ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. ప్రజలు నియంతృత్వపాలనకు ముగిపు పలకాలని ఓటు వేసారు. రువాండా బురుండి నుండి వేరు చేయబడి 1962 జూలై 1 న స్వాతంత్ర్యం పొందింది. ఇది స్వాతంత్ర్య దినం, జాతీయ సెలవు దినంగా గుర్తించబడింది. హింసాత్మక చర్యల చక్రభ్రమణం కొనసాగింది. బహిష్కరించబడిన టుట్సి పొరుగు దేశాల నుండి దాడి చేసారు. హుటు ప్రజలు ప్రతీకారంతో భారీ ఎత్తున హత్యాకాండ సాగించి, తుట్సీ ప్రజల అణచివేతకు పూనుకున్నారు. 1973 లో జువెన్నాల్ హబీరీమానా సైనిక తిరుగుబాటుకు అధికారాన్ని తీసుకున్నాడు. ప్రో-హుటు వివక్ష కొనసాగింది. అయితే ఎక్కువ ఆర్థిక సంపద, తుట్సీకి వ్యతిరేకంగా హింసాకాండను తగ్గించడం జరిగింది. తవా పరిమితమైంది. 1990 నాటికి ప్రభుత్వ వత్తిడి కారణంగా ప్రజలు దాదాపుగా అటవీప్రాంతాల నుండి బయటకు వచ్చారు. వారిలో చాలామంది బిచ్చగాళ్ళు అయ్యారు. రువాండా జనాభా 1934 లో 1.6 మిలియన్లకు చేరింది. 1989 లో ఇది 7.1 మిలియన్లకు అభివృద్ధి చెందింది. ఇది భూమి కోసం పోటీకి దారి తీసింది.

రువాండా 
Human skulls at the Nyamata Genocide Memorial

1990 లో దాదాపు 5,00,000 తుట్సీ శరణార్థులతో కూడిన రెబండాన్ పేట్రియాటిక్ ఫ్రంటు ఉగాండాలోని వారి స్థావరం నుండి ఉత్తర రువాండాను చుట్టుముట్టింది. ఇది రువాండా అంతర్యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రజాస్వామ్యం విఫలమైనందుకు, శరణార్ధుల కారణంగా ఎదురైన సమస్యలను సమర్ధవంతంగా ఎదుకొనలేకపోయినందుకు హుటు-ఆధిపత్య ప్రభుత్వాన్ని ఖండించింది. యుద్ధంలో ఏ పక్షం నిర్ణయాత్మక ప్రయోజనాన్ని పొందలేకపోయింది. 1992 నాటికి హబీరీమానా అధికారం బలహీనపడింది. దేశీయ ప్రతిపక్షాలతో సంకీర్ణం సామూహిక నిరసన ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. చివరికి 1993 అరుషా ఒప్పందంపై సంతకం చేశాయి. 1994 ఏప్రెలు 6 న హబ్యారిమానా విమానం కిగాలీ విమానాశ్రయం సమీపంలో జరిగిన కాల్పులలో కూల్చివేయబడింది. విమానం కూల్చివేత కొన్ని గంటల లోపల ప్రారంభమైన రువాండా జాతిహత్యాకాండకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. దాదాపు 100 రోజులలో సుమారు 8,00,000 మంది ప్రణాళికా బద్ధంగా దాడులలో మధ్యంతర ప్రభుత్వం ఆదేశాలతో టుట్సీ, రాజకీయంగా పనిచేసిన హుటు ప్రజలు చంపబడ్డారు. నేరుగా లక్ష్యంగా లేనప్పటికీ అనేక మంది త్వా ప్రజలను కూడా హత్య చేశారు.

టుట్సీ దాడిని పునఃప్రారంభించి దేశవ్యాప్తంగా నియంత్రణను చేపట్టి జూలై మధ్యలో మొత్తం దేశం నియంత్రణను పొందింది. జాతి నిర్మూలనకు అంతర్జాతీయ ప్రతిస్పందన పరిమితం చేయబడింది. ప్రధాన అధికారాలు ఇప్పటికే విస్తరించిన ఐక్యరాజ్య శాంతి పరిరక్షక శక్తిని బలపరచటానికి ఇష్టపడలేదు.

పి.ఆర్.ఎఫ్. నియంత్రణ చేపట్టినప్పుడు ప్రతీకారచర్యలు జరుగుతాయని భయపడి సుమారు రెండు మిలియన్ల మంది హుటు ప్రజలు పొరుగు దేశాలకు (ముఖ్యంగా జైరెకు) పారిపోయారు. అదనంగా పి.ఆర్.ఎఫ్. నేతృత్వంలోని సైన్యం మొదటి, రెండవ కాంగో కీలక పోరాటంలో పాల్గొన్నది. రువాండాలో ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ఐ.సి.టి.ఆర్) స్థాపన, సంప్రదాయ గ్రామీణ న్యాయస్థాన వ్యవస్థ అయిన గాకకా పునఃప్రారంభం అయింది. 2000 - 2011 మధ్యకాలంలో రువాండా ఆర్థికవ్యవస్థ పర్యాటక సంఖ్య, మానవ అభివృద్ధి సూచిక వేగంగా వృద్ధి చెందాయి. 2006 నుండి 2011 వరకు పేదరిక రేటు 57% నుండి 45% వరకు తగ్గింది. 2000 లో అయితే ఆయుఃపరిమితి 46.6 సంవత్సరాలు. 2015 నాటికి 59.7 సంవత్సరాలు.

నిర్వహణా విభాగాలు

రువాండా 
Provinces of Rwanda

కాలనీపాలనకు పూర్వ కాలపు కాలం నుండి రువాండా నియంతృత్వంతో పాలించబడుతుంది. వలసరాజ్య స్థాపనకు ముందు, రాజు (మ్వామి) ప్రావింసులు, జిల్లాలు, కొండలు, పొరుగు ప్రాంతాల వ్యవస్థగత విభజన ద్వారా పాలన సాగించారు. . ప్రస్తుత రాజ్యాంగం రువాండాను ప్రొంసులు (ఇంటారా), (intara), జిల్లాలు (ఉతురెరె), (uturere), నగరాలు, మునిసిపాలిటీలు, పట్టణాలు, జోంసు (ఇమిరేంజి), (imirenge), మండలాలు (ఉతుగారి) (utugari), గ్రామాలు (ఇమిడుగుడు). పెద్ద విభాగాలు, వాటి సరిహద్దులు పార్లమెంటుచే స్థాపించబడ్డాయి.

ఐదు ప్రొవింసులు, వారి రాజ్యాంగం, జిల్లాల మధ్య మధ్యవర్తులగా జిల్లా స్థాయిలో జాతీయ విధానాలు అమలు చేయడానికి పనిచేస్తున్నాయి. స్థానిక ప్రభుత్వం మంత్రిత్వశాఖ అభివృద్ధి చేసిన "రువాండా డెవెలరేలైజేషను స్ట్రాటజికు ఫ్రేమ్వర్కు", " ప్రొవింసు పాలన సమస్యలను సమన్వయ పరచడం, అలాగే పర్యవేక్షణ, విలువకట్టడం " బాధ్యతను ప్రోత్సహిస్తుంది. ప్రతి ప్రొవింసుకు అధ్యక్షుడు నియమించి, సెనేటు అమోదం పొందిన ఒక గవర్నరు నేతృత్వం వహిస్తాడు. ప్రజా సేవల సరఫరా, ఆర్థిక అభివృద్ధి సమన్వయం కోసం జిల్లాలు బాధ్యత వహిస్తున్నాయి. జిల్లాలు తప్పనిసరిగా ప్రజా సేవల పంపిణీకి బాధ్యత వహిస్తాయి. జిల్లాలు, జోంసులకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లు ఉంటారు. ఆ కౌన్సిలరు ఎగ్జిక్యూటివు కమిటీని ఎన్నిక చేస్తాడు. మండలాలు, గ్రామాలు అతి చిన్న రాజకీయ విభాగాలు. ప్రజలు, రంగాల మధ్య ఒక అనుసంధానం అందిస్తున్నాయి. పౌరులు తమ స్థానిక సెల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నుకోబడుతుంది. కిగాలీ నగరానికి ఒక ప్రాంతీయ స్థాయి అధికారం ఉంది. ఇది నగరంలో పట్టణ ప్రణాళికను సమన్వయపరుస్తుంది.

2006 లో అధికార వికేంద్రీకరణ చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుత సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. అలాగే విధానం, జాతి విధ్వంసకర శక్తులను విడదీయటానికి, సంఘాలు తొలగించబడ్డాయి. అతిపెద్ద నగరాలతో ముడిపడిన పన్నెండు ప్రొవింసుల మునుపటి నిర్మాణం భర్తీ చేయబడింది. ఇది ప్రధానంగా భైగోళిక ఉపస్థితి ఆధారపడిన ఐదు ప్రొవింసులు రూపొందించబడ్డాయి. ఇవి ఉత్తర ప్రొవింసు, దక్షిణ ప్రొవింసు, తూర్పు ప్రొవింసు, పశ్చిమ ప్రొవింసు, కేగాలో మునిసిపాలిటీ (కేంద్రంలో).

భౌగోళికం

రువాండా 
The Kagera and Ruvubu rivers, part of the upper Nile

26,338 చ.కి.మీ (10,169 చదరపు మైళ్ళు)వైశాల్యంతో రువాండా ప్రపంచంలోని 149 వ అతిపెద్ద దేశంగా ఉంది. ఆఫ్రికా ఖండంలోని అతిచిన్న దేశాలలో 4 వ స్థానంలో (గాంబియా, ఈస్వాటిని, జిబౌటి తరువాత) ఉంది. ఇది బురుండి, హైతి, అల్బేనియాలకు సమానంగా ఉంటుంది. దేశం మొత్తం భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉంది. దేశంలోని లోతైన ప్రాంతంగా భావించబడుతున్న రుసింజి నది సముద్ర మట్టానికి 950 మీటర్ల (3,117 అడుగులు) ఎత్తున ప్రవహిస్తుంది. రువాండా తూర్పు మద్య ఆఫ్రికాలో ఉంది. పశ్చిమసరిహద్దులో కాంగో గణతంత్ర రిపబ్లిక్, ఉత్తరసరిహద్దులో ఉగాండా, తూర్పసరిహద్దులో టాంజానియా, దక్షిణసరిహద్దులో బురుండి ఉన్నాయి. ఇది భూమధ్యరేఖకు దక్షిణాన కొన్ని డిగ్రీల దూరంలో భూబంధిత దేశంగా ఉంది. రాజధాని కిగాలీ నగరం రువాండా కేంద్రంలో ఉంది.

ప్రధాన కాంగో, నైలు నదీ ముఖద్వారాల మధ్య ఉత్తరం నుండి దక్షిణానికి రువాండాలను ప్రవహిస్తుంటాయి. దేశంలోని 80% దేశం నైలు నదీపరీవాహక ప్రాంతంగా ఉండగా 20% నికి కాంగోలోకి రసీజి నది, టాంగ్యానికా సరస్సు ద్వారా నీటిపారుదల లభిస్తుంది. దేశంలో అతి పొడవైన నదిగా గుర్తించబడుతున్న నయాబారోంగోనది దేశం నైరుతీ భూభాగంలో జన్మించి ఉత్తరం, తూర్పు, ఆగ్నేయ దిక్కులుగా ప్రవహించి రుగూబు నదిలో సంగమిస్తుంది. కగెరా టాంజానియా తూర్పు సరిహద్దు వెంట ప్రవహిస్తుంది. న్యాబరొంగొ- కగెరా చివరకు విక్టోరియా సరసులో సంగమిస్తుంది. రువాండాలో అనేక సరస్సులు ఉన్నాయి. వాటిలో అతిపెద్దది కివూ సరస్సు. ఈ సరస్సు ఆల్బాటైన్ రిఫ్టు ఫ్లోరు ఆక్రమించింది. ఇది పశ్చిమ సరిహద్దుల పొడవు 480 మీటర్ల (1,575 అడుగులు) గరిష్ఠ లోతు480 metres (1,575 ft), ప్రపంచంలో ఇరవై లోతైన సరస్సులలో ఇది ఒకటి. ఇతర గణనీయమైన సరస్సులలో బ్యూర్రా, రుహొండో, ముహజీ, రర్వు, ఇహేమా సరసులు ఉన్నాయి.

రువాండా 
Lake and volcano in the Virunga Mountains

రువాండా ఒక సమశీతోష్ణ ఉష్ణ మండల వాతావరణాన్ని కలిగి ఉంది. అధిక ఎత్తైన ప్రాంతంగా ఉన్నందున భూమధ్యరేఖాప్రాత దేశాలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దేశం కేంద్రంలో ఉన్న కిగాలీ ప్రాంతంలో ఉష్ణోగ్రత 12 - 27 ° సెంటీగ్రేడు (54 - 81 ° ఫారెంహీటు) ల మధ్య రోజువారీ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది ఏడాది పొడవునా కొంచెం వ్యత్యాసంతో ఉంటుంది. దేశవ్యాప్తంగా కొన్ని ఉష్ణోగ్రత వైవిధ్యాలు ఉన్నాయి; పశ్చిమ పర్వత ప్రాంతం, ఉత్తర ప్రాంతాలలో సాధారణంగా దిగువ-తూర్పు ప్రాంతం కంటే చల్లగా ఉంటాయి. సంవత్సరంలో రెండు వర్షపు సీజన్లు ఉన్నాయి; ఫిబ్రవరి నుండి జూన్ వరకు మొదటి సీజను, సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు రెండవ సీజను ఉంటుంది. వీటిని రెండు పొడి సీజన్లు వేరు చేస్తాయి: జూన్ నుండి సెప్టెంబరు వరకు ప్రధానమైనది. ఈ సమయంలో తరచుగా వర్షాలు ఉండవు. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు తక్కువ ఉంటుంది. వర్షపాతం భౌగోళికంగా మారుతూ ఉంటుంది. తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల కంటే పశ్చిమ, నైరుతీ ప్రాంతాలలో వార్షికంగా అధిక వర్షపాతం నమోదవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వర్షపు రుతువుల ఆగమనంలో మార్పును కలిగించింది. స్ట్రాటజిక్ ఫోర్స్సిట్ గ్రూప్ నివేదిక ప్రకారం వాతావరణంలో మార్పు ఒక సంవత్సరంలో అనుభవించిన వర్షపు రోజుల సంఖ్యను తగ్గించింది. అయితే ఇది వర్షం కురిసే రోజులను అధికరించింది. రెండు మార్పులు రైతులకు ఇబ్బందులు కలిగించి తద్వారా వారి ఉత్పాదకత తగ్గింది.వ్యూహాత్మక దృష్టి రువాండాను వేగంగా వేడెక్కే దేశంగా వర్గీకరిస్తుంది. యాభై సంవత్సరాలుగా సగటు ఉష్ణోగ్రత 0.7 °C నుండి 0.9 °C వరకు అధికరించింది.

శీతోష్ణస్థితి డేటా - Kigali, Rwanda
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 26.9
(80.4)
27.4
(81.3)
26.9
(80.4)
26.2
(79.2)
25.9
(78.6)
26.4
(79.5)
27.1
(80.8)
28.0
(82.4)
28.2
(82.8)
27.2
(81.0)
26.1
(79.0)
26.4
(79.5)
26.9
(80.4)
సగటు అల్ప °C (°F) 15.6
(60.1)
15.8
(60.4)
15.7
(60.3)
16.1
(61.0)
16.2
(61.2)
15.3
(59.5)
15.0
(59.0)
16.0
(60.8)
16.0
(60.8)
15.9
(60.6)
15.5
(59.9)
15.6
(60.1)
15.7
(60.3)
సగటు అవపాతం mm (inches) 76.9
(3.03)
91.0
(3.58)
114.2
(4.50)
154.2
(6.07)
88.1
(3.47)
18.6
(0.73)
11.4
(0.45)
31.1
(1.22)
69.6
(2.74)
105.7
(4.16)
112.7
(4.44)
77.4
(3.05)
950.9
(37.44)
సగటు అవపాతపు రోజులు (≥ 0.1 mm) 11 11 15 18 13 2 1 4 10 17 17 14 133
Source:

జీవవైవిధ్యం

రువాండా 
Topis in Akagera National Park

ప్రస్తుత రువాండా భూభాగంలో చరిత్రపూర్వ కాలాలో మొన్టేనె అటవీ ప్రాంతం మూడవ వంతు ఆక్రమించింది. సహజసిద్ధంగా అభివృద్ధి చెందుతున్న వృక్షసంపద ఇప్పుడు మూడు జాతీయ పార్కులకు పరిమితం చేయబడింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో వ్యవసాయం ఆధిక్యత చేస్తుంది. అటవీ ప్రాంతంలోని అతిపెద్ద మిగిలిన భూభాగంలో ఉన్న న్యుంగ్వెలో 200 రకాల వృక్షాలు, ఆర్చిడ్లు (లతలు) బిగోనియా మొక్కలు ఉన్నాయి. అగ్నిపర్వతాల జాతీయ ఉద్యానవనంలో వృక్షసంపదలో అధికంగా వెదురు, మూర్ల్యాండు, అడవుల చిన్న ప్రాంతాలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా అకాగెరా ఒక సవన్నా పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో అకాసియా వృక్షసంపదను అధిగమించింది. అకేగెరాలో అరుదైన లేదా అంతరించిపోతున్న వృక్ష జాతులు ఉన్నాయి. వీటిలో మార్ఖమియా లుటియా, ఎలోఫియా గైనెనిస్సిసు ఉన్నాయి.

మూడు జాతీయ ఉద్యానవనాలలో బృహత్తర వైవిధ్యంతో అతిపెద్ద క్షీరదాలు కనిపిస్తాయి. ఇవి పరిరక్షణా ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. అకాగెరాలో జిరాఫీలు, ఏనుగుల వంటి ప్రత్యేక సవన్నా జంతువులను ఉన్నాయి. అగ్నిపర్వతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వత గొరిల్లా జనాభాలో మూడింట ఒక వంతుకు నివాసంగా ఉన్నాయని అంచనా. న్యుంగ్వే అరణ్యంలో పదమూడు ప్రైమేట్ జాతులు ఉన్నాయి. వీటిలో సాధారణ చింపాంజీలు, రువెంజోరి కోలోబసు ఆర్బోరియలు కోతులు ఉన్నాయి. రువెంజోరి కోలోబసు 400 బృందాలుగా మారడంతో ఇటువంటి బృందాలలో కోతులు ఉన్న ఆఫ్రికాప్రాంతాలలో ఇది ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద పరిమాణంగా ఇది భావించబడుతుంది. 1994 నాటి జాతినిర్మూలన హింసాకాండ తరువాత జాతీయ ఉద్యానవనాలు ప్రజలను శిబిరాలుగా మార్చబడిన కారణంగా మిగిలిపోయిన జంతువులు పశువుల మందల యజమానులు విషంతో సింగాల జనాభాను నాశనం చేశారు. 2015 జూనులో రెండు దక్షిణాఫ్రికా పార్కులు ఏడు సింగాలను అకాగెరా నేషనలు పార్కుకు విరాళంగా ఇవ్వడంతో రువాండాలో ఒక సింహం జనాభా పునఃస్థాపించబడింది. ప్రారంభంలో సింహాలను ఉద్యానవనంలో కంచెలు ప్రాంతంలో ఉంచి తరువాత ఒక నెల తరువాత అడవిలో పంపబడ్డాయి.

రువాండాలో 670 పక్షి జాతులు ఉన్నాయి. ఇవి తూర్పు, పడమర ప్రాంతాలలో ఉండే పక్షులలో మధ్య వైవిధ్యాలు ఉన్నాయి. పశ్చిమాన న్యాంగ్వే ఫారెస్టులో 280 పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో 26 ఆల్బెటిను రిఫ్ట్కు చెందినవి ఉన్నాయి. స్థానిక జాతులు రెవెన్జోరి టురాకో, అందమైన ఫ్రాంకోలిను పక్షులు ఉన్నాయి.

తూర్పు రువాండా దీనికి విరుద్ధంగా నల్ల-తల గల గోనాలేకు వంటి సవన్నా పక్షులు, చిత్తడినేలలు, సరస్సులతో సంబంధం కలిగి ఉండే స్టోర్కు, కొంగలు ఉంటాయి.దేశంలో ఇటీవలి ఎంటొమోలాజికల్ పని మొదలైంది. ఈ పరిశోధన "బుష్ టైగర్ మాంటిస్"గా పిలువబడే కొత్త జాతులలో ప్రేయింగ్ మంటిసెసు డిస్టాక్టా టిగ్రిఫ్రుటెక్సు గొప్ప వైవిధ్యంతో కూడిన పక్షులను వెలుగులోకి తీసుకువచ్చింది.

ఆర్ధికం

రువాండా 
Coffee beans drying in Maraba. Coffee is one of Rwanda's major cash crops.

1994 లో జరిగిన జాతినిర్మూలన హత్యాకాండలో రువాండా ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. విస్తృతమైన జీవితాన్ని కోల్పోయి ముఖ్యమైన నగదు పంటల మౌలిక సదుపాయాలను నిర్వహించడలంలో విఫలం కావడం, దోపిడీ, వాణిజ్య పంటలను నిర్లక్ష్యం చేయడం ఆర్థిక సంక్షోభానికి కారణంగా మారాయి. నిరాకరించింది. ఇది జి.డి.పి. భారీగా పడిపోవడానికి కారణం అయింది. ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దేశసామర్థ్యాన్ని ఇది నాశనం చేసింది. 1994 లో $ 416 అమెరికా డాలర్లతో పోల్చితే ఆర్థిక వ్యవస్థ బలపడి తలసరి జి.డి.పి. 2017 లో $ 2,090 అమెరికా డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. ప్రధాన ఎగుమతి మార్కెట్లలో చైనా, జర్మనీ, యునైటెడ్ స్టేట్సు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను కేంద్ర జాతీయ రువాండా బ్యాంక్ నిర్వహిస్తుంది. కరెన్సీ రువాండా ఫ్రాంకు. 2015 ఆగస్టులో, ఎక్స్చేంజి రేటు యునైటెడు స్టేట్సు డాలరుకు 755 ఫ్రాంకులు. రువాండా 2007 లో తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీలో చేరింది. యూనియన్ కోసం ఒక ప్రణాళికను ఆమోదించిన ఐదు సభ్యదేశాలలో రువాండా ఒకటి. ఇది చివరికి ఒక సాధారణ తూర్పు ఆఫ్రికా షిల్లింగుకు దారితీసింది.

రువాండా కొన్ని సహజ వనరులను ఉన్నాయి. ఆర్థికవ్యవస్థ స్థానిక రైతులచేసే (సాధారణ వ్యవసాయ సాధనాలను ఉపయోగించి చేసే వ్యవసాయం) జీవనాధార వ్యవసాయంపై అధికంగా ఆధారపడి ఉంది. సుమారుగా 90% కార్మికవర్గం పొలాలు, వ్యవసాయంలో పనిచేస్తుంటారు. 2014 లో జి.డి.పిలో వ్యవసాయం 32.5% ఉందని అంచనా వేశారు. చిన్న భూములు, ఏటవాలులు కలిగి ఉన్న వ్యవసాయ భూములలో వ్యవసాయం చేయబడుతూ ఉంటుంది. వ్యవసాయ పద్ధతులు ప్రాథమికంగా ఉంటాయి. 1980 ల మధ్యకాలం నుండి స్థానికుల పునరావాసంలో భాగంగా వ్యవసాయ పరిమాణాలు, ఆహార ఉత్పత్తి తగ్గుముఖం పట్టాయి. రువాండాలో సారవంతమైన పర్యావరణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆహార ఉత్పత్తి తరచూ జనాభా పెరుగుదలకు తగినంత ఉండదు కనుక ఆహార దిగుమతులు అవసరమవుతాయి.

దేశంలో పండించే పంటలలో మాటోక్ (ఆకుపచ్చ అరటి), బంగాళాదుంపలు, బీన్సు, చిలగడదుంపలు, కాసావా, గోధుమ, మొక్కజొన్న దేశంలోని వ్యవసాయ భూములలో మూడవ వంతు కంటే ఎక్కువగా ఆక్రమించాయి. కాఫీ, టీ వంటీ ఎగుమతి చేయబడే ప్రధాన నగదు పంటలకు అధిక ఎత్తు ఉన్న భూములు, ఏటవాలులు, అగ్నిపర్వత నేలలు అనుకూలమైన పరిస్థితులను అందిస్తాయి. 4,00,000 మందికి పైగా రువాండాలు తమ కాఫీ తోటల ఆధారంగా జీవిస్తున్నారని నివేదికలు తెలిపాయి. వ్యవసాయ ఎగుమతులను రువాండా ధరలలో మార్పులకు ప్రభావితం చేస్తుంటాయి. రువాండాలో పెంచబడున్న జంతువులలో ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, కోడి, కుందేళ్ళు సంఖ్యాపరంగా, భౌగోళికంగా వైవిధ్యం కలిగి ఉన్నాయి. కిగాలీ చుట్టుపక్కల కొన్ని ఇంటెన్సివ్ పాడి పరిశ్రమలు ఉన్నప్పటికీ ఉత్పత్తి వ్యవస్థలు సాంప్రదాయకంగా ఉంటాయి.జంతువుల పెంపకానికి భూమి కొరత, నీటి కొరత, పేలవమైన నాణ్యమైన ఆహార సరఫరా, తగినంత పశువైద్య సేవల లోపం కారణంగా వ్యాధి అంటువ్యాధులు ప్రబలడం ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని నియంత్రిస్తాయి. చేపల పరిశ్రమకు దేశంలోని సరస్సులు ఆధారంగా ఉన్నాయి. మత్స్య సంపద బాగా క్షీణిస్తుంది. పరిశ్రమ పునరుద్ధరించడానికి ప్రయత్నంలో చేపలను దిగుమతి చేస్తున్నారు.

రువాండా పారిశ్రామిక రంగం చిన్నది. ఇది 2014 లో జి.డి.పిలో 14.8% భాగస్వామ్యం వహించింది. పారిశ్రామికరంగం నుండి సిమెంటు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న తరహా పానీయాలు, సబ్బు, ఫర్నిచరు, పాదరక్షలు, ప్లాస్టికు వస్తువులు, వస్త్రాలు, సిగరెట్లు మొదలైన ఉత్పత్తులను తయారు చేయబడుతున్నాయి. రువాండా గనుల పరిశ్రమ ఒక ముఖ్యమైన ఆదాయవనరుగా ఉంది. ఇది 2008 లో $ 93 మిలియన్ల అమెరికా డాలర్ల ఉత్పత్తి చేసింది. రువాండాలో కాసిటరైటు, వుల్ఫ్రమైటు, బంగారం, కాల్టాను (వీటిని మొబైలు ఫోన్లు వంటి ఎలక్ట్రానికు, కమ్యూనికేషను పరికరాల తయారీలో ఉపయోగిస్తారు) వంటి ఖనిజాలు లభిస్తున్నాయి.

రువాండా 
ఆకుపచ్చ ఆకులను చుట్టుముట్టే ఆమె భుజాలపై ఒక బిడ్డతో స్త్రీ వయోజన గొరిల్లాను చిత్రీకరిస్తుంది

2000 ల చివర్లో మాంద్యం సమయంలో బ్యాంకు రుణాలు, విదేశీ సహాయ పథకాలు, పెట్టుబడులను తగ్గించటంతో రువాండా సేవారంగం బాధించబడింది. 2010 లో ఈ రంగం తిరిగి పుంజుకుంది. ఇది దేశం అతిపెద్ద ఉత్పాదక రంగంగా మారి జి.డి.పి.లో 43.6% భాగస్వామ్యం వహిస్తుంది. బ్యాంకింగు, ఫైనాన్సు, టోకు, చిల్లర వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు, రవాణా, గిడ్డంగి, సమాచారరంగం, భీమా, రియలు ఎస్టేటు, వ్యాపార సేవలు, విద్య, ఆరోగ్యంతో ప్రభుత్వ పరిపాలనా రంగాలు కీలక సేవాసంస్థలు సేవారంగంలో ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. 2007 లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వనరులలో పర్యాటక రంగం ఒకటి. ఇది దేశం ప్రముఖ విదేశీమారక వనరుగా మారింది. జాతినిర్మూలన హత్యాకాండల చరిత్ర ఉన్నప్పటికీ దేశం అంతర్జాతీయంగా సురక్షితమైన గమ్యంగా గుర్తించబడింది. 2013 లో పర్యాటకుల సంఖ్య 8,64,000 గా (2010 లో 5,04,000) ఉంది. పర్యాటక రంగం నుండి ఆదాయం 2014 లో $ 303 మిలియన్ల అమెరికా డాలర్లు (2000 లో $ 62 మిలియన్ల అమెరికా డాలర్లు)ఉంది. పర్వత గొరిల్లాలు సంచరిస్తున్న అగ్నిపర్వత జాతీయ ఉద్యానవనం ఈ రాబడికి అతిపెద్ద వాటాదారుగా ఉంది.; పర్వత గొరిల్లాలను సురక్షితంగా సందర్శించగల రెండు దేశాలలో రువాండా ఒకటి. గొరిల్లాలు సంవత్సరానికి వేల మంది సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటకులు అనుమతి కోసం అధిక ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇతర ఆకర్షణలలో న్యుంగ్వే ఫారెస్టు, చింపాంజీల నివాసం, రువెంజోరి కోలోబసు, ఇతర ప్రధానాంశాలు, కివూ సరోవర రిసార్టులు, తూర్పున ఒక చిన్న సవన్నా రిజర్వు అకాగెరా ఉన్నాయి.

మాధ్యమం, సమాచార రంగం

అతిపెద్ద రేడియో, టెలివిజన్ స్టేషన్లు ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి. వార్తాపత్రికలు ప్రభుత్వానికి స్వంతమైన వార్తాపత్రికలు అధికసంఖ్యలో ఉన్నాయి. చాలా మంది రువాండాలకు రేడియో సేవలు అందుబాటులో ఉన్నాయి. 1994 నాటి జాతినిర్మూలన హత్యాకాండ సమయంలో రేడియో స్టేషన్ లిపి డెస్ డిల్ మిల్లె కొల్లిన్స్ దేశవ్యాప్తంగా ప్రసారం చేసి టుట్సీ వ్యతిరేక ప్రచారం ద్వారా హత్యలకు ఇంధనంగా నింపేందుకు సహాయపడింది. As of 2015 2015 నాటికి ప్రభుత్వయాజమాన్య రేడియో రువాండా దేశవ్యాప్తంగా అతిపెద్ద స్టేషను, ప్రధాన వార్తా మూలంగా ఉంది. టెలివిజను అందుబాటు పరిమితం చేయబడింది. చాలా గృహాలు తమ సొంత టెలివిషను సెట్టును కలిగి ఉండవు. 2014 లో ప్రభుత్వం డిజిటలు టెలివిజనును తయారు చేసింది. ఒక సంవత్సరం తరువాత ఏడు జాతీయ స్టేషన్లు (2014 పూర్వపు అనలాగ్ కాలంలో కేవలం ఒకటి) పనిచేయడం ప్రారంభించాయి. పత్రికా యంత్రాంగం కఠినంగా పరిమితం చేయబడింది. వార్తాపత్రికలు ప్రభుత్వ ప్రతీకారాలను నివారించడానికి స్వీయ సెంసారును చేస్తాయి. ఏదేమైనా కిన్నార్వాండ, ఇంగ్లీషు, ప్రభుత్వాలను విమర్శించిన ఫ్రెంచివిమర్శనలు కిగాలీలో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అధిక స్వతంత్ర వార్తాపత్రికలు, ఉముసెసొ, ఉమూవుజిజిలను హై మీడియా కౌన్సిలు ఆరు నెలల సమయం సస్పెండు చేసింది.

2011 లో దేశం పురాతన టెలికమ్యూనికేషన్సు గ్రూపు రువాండాటెల్, లిక్డీకీకరణలోకి (లిబ్యాను కంపెనీ ఎల్.ఎ.పి. గ్రీను యాజమాన్యంలో 80% ఉంది) ప్రవేశించింది. ఈ సంస్థను తూర్పు, దక్షిణ ఆఫ్రికా అంతటా టెలీకమ్యూనికేషన్సు, ఫైబరు ఆప్టికు నెట్వర్కులు అందించే ఒక సంస్థ ద్వారా 2013 లో లిక్విడ్ టెలికాం పొందింది. 2015 నాటికి లిక్విడు టెలికాం 30,968 వినియోగదారులకు ల్యాండ్లైను సేవను అందిస్తుంది. మొబైలు ఆపరేటరు ఏం.టి.ఎన్. రువాండా 15,497 ఫిక్సెడు లైను చందాదారులకు సేవలు అందిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఎంజీవోలు, రాయబార కార్యాలయాలు ల్యాండు లైన్లను అధికంగా ఉపయోగిస్తున్నాయి. ప్రైవేటు చందాదారులు తక్కువగా ఉన్నారు. As of 2015 2015 నాటికి దేశంలో మొబైలు ఫోను వ్యాప్తి 72.6% ఉంది. 2011 లో 41.6%కి అధికరించింది. ఎం.టి.ఎన్. రువాండా 39,57,986 చందాదారులు, టిగో 28,87,328, భారతి ఎయిర్టెల్ 1,336,679 తో ప్రముఖ ప్రొవైడర్లుగా ఉన్నారు. రువాండాటెలు గతంలో కూడా ఒక మొబైలు ఫోను నెట్వర్కును నిర్వహించినప్పటికీ 2011 ఏప్రిలులో పరిశ్రమ రెగ్యులేటరు లైసెంసును రద్దు చేసింది. అంగీకరించిన పెట్టుబడుల కట్టుబాట్లను నియంత్రించడంలో సంస్థ వైఫల్యం చెందింది. ఇంటర్నెటు వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 2015 నాటికి 100 మందిలో 12.8 ఇంటర్నెటు వినియోగదారులు ఉన్నారు. 2007 లో 2.1 ఉండేది. 2011 లో 2,300 కిలోమీటర్ల (1,400 మైళ్ళు) పొడవైన ఫైబరు-ఆప్టికు టెలికమ్యూనికేషన్సు నెట్వర్కు పూర్తయింది. బ్రాడ్బ్యాండు సేవలను అందించేందుకు ఎలక్ట్రానికు వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. ఈ నెట్వర్కు దక్షిణ, తూర్పు ఆఫ్రికాలో కమ్యూనికేషను క్యారియర్లను అనుసంధానించే ఒక జలాంతర్గామి ఫైబరు-ఆప్టికు కేబులు అయిన సీకాంకు అనుసంధానించబడింది. రువాండా దేశంలోని పట్టణాలను కలుపుతూ ప్రధాన రహదారులతో తంతులు ఏర్పాటు చేయబడతాయి. ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షను ద్వారా కిగాలీ అనేక ప్రాంతాలలో మొబైలు ప్రొవైడరు ఎం.టి.ఎన్. ఒక వైర్లెసు ఇంటర్నెటు సర్వీసును కూడా నడుపుతుంది.

మౌలిక నిర్మాణాలు

రువాండా 
Rural water pump

2000 వ దశకంలో రువాండా ప్రభుత్వం నీటి సరఫరా అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి ముఖ్యత్వం ఇవ్వడం జాతీయ బడ్జెట్టు గణనీయంగా పెరిగడానికి కారణం అయింది.దాతల మద్దతుతో సేకరించి సమర్పించబడిన ఈ నిధులు సురక్షిత నీటి లభ్యతను వేగవంతంగా అభివృద్ధి చేసాయి. 2015 లో 74% మంది ప్రజలు సురక్షితమైన నీటిని పొందగలిగారు (2005 లో 55% మంది ఉన్నారు). 2017 నాటికి దీనిని 100%కు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని నీటి మౌలిక సదుపాయాలలో పట్టణ, గ్రామీణ వ్యవస్థలు ఉంటాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో స్టాండుపైపులు, పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు కనెక్షన్లు ఉన్నాయి. ఈ వ్యవస్థలు పనిచేయని ప్రాంతాలలో చేతి పంపులు, నిర్వహించబడే జలప్రవాహాలు ఉపయోగించబడతాయి. దేశం అధికభాగంలో వర్షపాతం 750 మిల్లీమీటర్ల (30 లక్షల) మించకుండా ఉంది.వర్షపునీటి సేలరణ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఇతర ఆఫ్రికా దేశాల వాడకంటే రువాండా నివాసితులు చాలా తక్కువగా నీటిని ఉపయోగించవలసిన వత్తిడికి లోనౌతూ ఉన్నారు. పారిశుధ్యం సౌకర్యం తక్కువగా ఉంటుంది. 2006 లో నగరంలో 34% పట్టణ, 20% మంది గ్రామీణ నివాసితులు మెరుగైన పారిశుద్ధ్యం పొందుతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వ చర్యలు పరిమితంగా ఉన్నాయి. ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తుంది. పట్టణ, గ్రామీణ జనాభాలో చాలామంది జనాభా ప్రభుత్వ భాగస్వామ్య పిట్ లైట్రిన్సు ఉపయోగిస్తుంటారు.

2000 ల ఆరంభం వరకు రువాండా విద్యుత్తు సరఫరా దాదాపు పూర్తిగా జలవిద్యుత్తు వనరుల నుండి ఉత్పత్తి చేయబడింది. బ్యూరో, రుహుండా సరసులలో విద్యుత్తు కేంద్రాలు దేశం విద్యుత్తు వినియోగంలో 90% అందించాయి. తక్కువగా ఉండే సగటు వర్షపాతం, మానవ కార్యకలాపాలు, రుగెజీ చిత్తడిభూములలో వ్యవసాయం, పశువుల మేత కొరకు నీటిపారుదల చేయడంతో 1990 నుండి రెండు సరస్సుల నీటి మట్టం పతనానికి కారణమైయ్యాయి. ఫలితంగా 2004 నాటికి 50% క్షీణించి విద్యుత్తు కేంద్రాల నుండి ఉత్పత్తి గణానీయమైన తరుగుదలకు దారితీసింది. ఇది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం వలన విద్యుత్తు అవసరాలు అధికం అయ్యాయి. 2004 లో విద్యుత్తు కొరత ఏర్పడింది. అత్యవసర పరిస్థితిలో కిగాలీకి ఉత్తరప్రాంతంలో డీజిలు జనరేటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2006 నాటికి ఇవి దేశానికి అవసరమైన విద్యుత్తును 56% అందిస్తున్నాయి. కానీ చాలా ఖరీదైనది. బురెరా, రుహండోకు నీటిని సరఫరా చేస్తున్న రుగెజి చిత్తడి భూములలో నివసిస్తున్న ప్రజలకు పునరావాసం కల్పించడం, కివూ సరసు నుండి మీథేను వాయువును సేకరించటానికి ఒక పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దాని మొదటి దశలో దేశ విద్యుత్తు ఉత్పత్తి 40% అధికరించవచ్చని భావించింది. 2012 లో జనాభాలో కేవలం 18% మాత్రమే విద్యుత్తు (2009 లో 10.8% ) పొందగలిగారు. ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి, పేదరిక తగ్గింపు వ్యూహం (2013-18) 2017 నాటికి 70% కుటుంబాలకు విద్యుచ్ఛక్తిని పెంచడం లక్ష్యంగా కృషిచేస్తూ ఉంది.

1994 లో అమెరికా సంయుక్తరాష్ట్రాలు, ఐరోపా సమాఖ్య, జపాన్, ఇతర దేశాల సహాయంతో ప్రభుత్వం 1994 నుండి సామూహిక హత్యాకాండ నుండి రువాండా మౌలికవసతులను పునర్నిర్మించడాని రవాణా మౌలిక పెట్టుబడులను అధికరించింది. రవాణా వ్యవస్థ ప్రధానంగా రహదారి నెట్వర్కులు కలిగి ఉంటుంది. ఇది కైగాలి, దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య నిర్మించిన రహదారులను అనుసంధానం చేస్తూ ఉంది. రువాండా రహదారులు తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీలోని ఉగాండా, టాంజానియా, బురుండి, కెన్యా, అలాగే వంటి తూర్పు కాంగో (గోమా, బుకావు నగరాలు) వంటి ఇతర దేశాలతో రువాండాను అనుసధానితం చేస్తున్నాయి. దేశం అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గం కంబాల నుండి నైరోబీ ద్వారా మొంబసా నౌకాశ్రయం వరకు నిర్మించిన రహదారి ఉత్తర కారిడారుగా పిలువబడుతుంది. దేశంలో ప్రజా రవాణా ప్రధాన ఆధారం మినీబస్ ఇది ప్రయాణీకుల వాహక అవసరాలను సగానికంటే అధికంగా తీరుస్తుంది. కొన్ని మినీబసులు (ముఖ్యంగా కిగాలీలో) ఒక భాగస్వామ్య టాక్సీ వ్యవస్థ ప్రణాళికారహితమైన చేయని సేవను నిర్వహిస్తుంది. ప్రధాన నగరాల మధ్య ఎక్స్ప్రెస్ మార్గాలను అందిస్తాయి. స్వల్ప సంఖ్యలో పెద్ద బస్సులు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా షెడ్యూల్ సేవలను నిర్వహిస్తుంది. ప్రధాన ప్రైవేటు అద్దె వాహనం మోటారుసైకిలు టాక్సీ. 2013 లో రువాండాలో 9,609 నమోదైన మోటారుసైకిలు టాక్సీలు ఉన్నాయి. కేవలం 579 టాక్సీకాబులతో పోలిస్తే ఇది అధికం. పొరుగు దేశాలలోని వివిధ గమ్యస్థానాలకు కోచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కిగాలీలో ఉన్న ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నైరోబీ, ఎంటెబ్బె వంటి అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరడానికి వసతి కల్పిస్తుంది. సైగన్గుకు సమీపంలోని కిగాలీ, కమేంబే విమానాశ్రయం మధ్య ఒక దేశీయ మార్గం ఉంది. 2017 లో కిగాలీకి దక్షిణాన ఉన్న బుగెసెరా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుత అతిపెద్ద కెజిలి విమానాశ్రయాన్ని తెరచినప్పుడు ఇది అతిపెద్దదిగా మారుతుంది. జాతీయ క్యారియరు రువాండా ఎయిర్, దేశంలో ఏడు విదేశీ విమానయాన సంస్థలు వాయుమార్గ సేవలు అందిస్తున్నాయి. As of 2015 2015 నాటికి దేశంలో రైల్వేలు లేవు. కాని బురుండి, టాంజానియాతో కలిసి టాంజానియా సెంట్రల్ రైలుమార్గాన్ని రువాండాలోకి విస్తరించడానికి ఒక ప్రణాళిక ఉంది. ఈ పథకం కోసం ఒక ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఏర్పరచటానికి మూడు దేశాలు ప్రైవేటు సంస్థల నుంచి టెండరులను ఆహ్వానించాయి.కివూ సరస్సు నౌకాశ్రయ నగరాల మధ్య పబ్లిక్ జల రవాణా లేదు. అయితే పరిమితమైన ప్రైవేటు సేవ ఉనికిలో ఉంది. పూర్తి సేవను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.అగగేరా నదిపై షిప్పింగ్ ద్వారా రువాండాను విక్టోరియా సరస్సుతో అనుసంధానించడానికి సాధ్యత గురించి మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తుంది.

గణాంకాలు

రువాండా 
Rural children
Population
Year Million
1950 2.2
1990 7.2
1995 5.9
2016 11.9
రువాండా 
Population pyramid 2016

2015 నాటికి " రువాండా నేషనలు ఇన్స్టిట్యూటు ఆఫ్ స్టాటిస్టిక్సు " రువాండా జనాభా 1,12,62,564 గా అంచనా వేసింది. 2012 గణాంకాలు 1,05,15,973 జనసంఖ్యను నమోదు చేసింది. ప్రజలలో యువతశాతం అధికంగా ఉంది. 2012 గణాంకాల ఆధారంగా ప్రజలలో 15 వయసుకన్న తక్కువ వయసున్న వారి శాతం 43.3% ఉంది. ​​16 నుండి 64 మధ్య వయసున్న వారు 53.4% ఉన్నారు. సి.ఐ.ఎ. వరల్డు ఫ్యాక్టు బుక్కు ఆధారంగా 2015 నాటికి వార్షిక జనన రేటు 1000 మందికి 40.2 జననాలు ఉన్నాయి. మరణాల రేటు 14.9 గా అంచనా వేయబడింది. సరాసరి ఆయుఃప్రమాణం 59.67 సంవత్సరాలు (స్త్రీలకు 61.27 సంవత్సరాలకు, పురుషులకు 58.11 సంవత్సరాలు). ఇది 224 ప్రపంచ దేశాలు, భూభాగాలలో అతి తక్కువ ఆయుఃప్రమాణం కలిగిన దేశాలలో 26 వ స్థానంలో ఉంది. దేశం లింగ నిష్పత్తిని సమానంగా ఉంటుంది.

చదరపు కిలోమీటరుకు (చ.మై 1,150) 445 నివాసితులలో రువాండా జనసాంద్రత ఆఫ్రికాదేశాలలో అత్యధిక స్థాయిలో ఉంది. జెరార్డు ప్యునియెర్ వంటి చరిత్రకారులు 1994 జాతినిర్మూల హత్యాకాండలు పాక్షికంగా జనాభా సాంద్రతకు కారణమని విశ్వసిస్తున్నారు.జనాభా ప్రధానంగా గ్రామీణ, కొన్ని పెద్ద పట్టణాలలో కేంద్రీకృతమై ఉంది. నివాసాలు దేశవ్యాప్తంగా నివాసాలు సమానంగా వ్యాపించాయి. తూర్పున ఉన్న ఉముతారా, అకాగెరా జాతీయ ఉద్యానవనంలో ఉన్న దేశంలోని సవన్నా భూభాగాలు దేశంలో అతి తక్కువ జనసాంధ్రత ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి.. కిగాలీ అతిపెద్ద నగరం కిగాలీలో సుమారు ఒక మిలియను ప్రజలు ఉన్నారు. వేగంగా పెరుగుతున్న జనాభా మౌలికనిర్మాణాల అభివృద్ధిని సవాలు చేస్తుంది. 2012 జనాభా లెక్కల ఆధారంగా రెండవ అతిపెద్ద నగరం గిసెన్ని. ఇది లేక్ కివూ సరస్సు, గోమా (కాంగో నగరం) సమీపంలో ఉంది. ఈ నగరంలో 1,26,000 ప్రజలు ఉన్నారు. ఇతర ప్రధాన పట్టణాలలో రుహేగేర్గీ, బుటేరే, ముఘంగా ఉన్నాయి. ఒక్కొక్క నగరంలో 1,00,000 కన్నా తక్కువ ప్రజలు ఉన్నారు. 2006 లో 16.6%కు అధికరించింది. 1990 నుండి జనసంఖ్య 6% అధికరించింది. అయినప్పటికీ 2011 నాటికి ఈ నిష్పత్తి కొంచెం పడిపోయి 14.8%కు తగ్గింది.రువాండా పూర్వ-వలసరాజ్యాల కాలం నాటి నుండి ఒక సమైక్య రాజ్యంగా ఉంది. జనాభాపరంగా సాంస్కృతిక, భాషా సమూహమైన బన్యార్వాండా ప్రజలు ఆధిక్యతలో ఉన్నారు. ఇది వలసరాజ్యాలు నిర్ణయించిన సరిహద్దులు ఉన్న, స్థానికా జాతుల సరిహద్దులు కాని వలసరాజ్యాలకు పూర్వం రాజ్యాలుగా లేని ఆధునిక ఆధునిక ఆఫ్రికా దేశాలకు ఇది విరుద్ధంగా ఉంది. బన్వార్వాండ ప్రజలలో మూడు వేర్వేరు గ్రూపులు (హుటు, టుట్సి, ట్వా) ఉన్నాయి. CIA వరల్డు ఫాక్టు బుక్కు 2009 లో హుటు జనాభా 84% మంది, టుట్సి 15%, ట్వి 1% ఉన్నారని ప్రకటించింది. రవాండా మొట్టమొదటి నివాసుల నుండి వచ్చిన తైవా పిగ్మీ సంతతికి చెందిన ప్రజలు, అయితే హుటు, టుట్సీ మూలాలను, వైవిధ్యాలపై పరిశోధకులు అంగీకరించరు. సుదీర్ఘమైన, ఇరుకైన తలలు, ముఖాలు, ముక్కులు " వంటి ఆకృతులతో టుట్సీ ప్రజలు ప్రత్యేక మూలాలకు చెందిన ప్రజలని భావిస్తున్నారు. విలియం జెఫ్రేమోవాస్ వంటి ఇతరులు, గుర్తించదగిన శారీరక వ్యత్యాసం, కేటగిరీలు చారిత్రాత్మకంగా లేవని విశ్వసిస్తున్నట్లు ఆంథ్రోపాలజిస్టు జీను హియెర్నాక్సు అభిప్రాయపడ్డాడు. ప్రోటొలానియల్ రువాండాలో టుట్సి పాలకులుగా ఉన్నారు. వీరి నుండి రాజులు, అధికారులు ఉత్పన్నమయ్యారు. హుటు ప్రజలు వ్యవసాయదారులుగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హుటు, టుట్సీ, ట్వా తేడాను నిరుత్సాహపరుస్తుంది. గుర్తింపు కార్డుల నుండి ఇటువంటి వర్గీకరణను తొలగించింది.1933 తరువాత మొదటిసారిగా 2002 జనాభా గణన నిర్వహించబడింది. ఇది రువాండా జనాభాను మూడు గ్రూపులుగా వర్గీకరించలేదు.

మతం

రువాండా 
Roman Catholic church in Rwamagana

రువాండాలో రోమను కాథలిసిజం అతి పెద్ద మతవిశ్వాసంగా ఉంది. అయితే జాతినిర్మూలన హత్యాకాండల తరువాత దేశంలోని మతపరమైన గణాంకాలలో గణనీయమైన మార్పులు సంభవించాయి. చాలా మంది ఎవాంజెలికలు క్రైస్తవాన్ని స్వీకరించగా, తక్కువ స్థాయిలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. 2012 గణాంకాల ఆధారంగా రోమను కాథలికు ప్రజలలో 43.7%, ప్రొటెస్టంట్లు (సెవెంత్-డే అడ్వెంటిస్ట్స్ మినహాయించి) 37.7%, సెవెంతు డే అడ్వెంటిస్టులు 11.8%, ముస్లింలు 2.0% ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 0.2% మత విశ్వాసాలు లేవని, 1.3% ఏ మతాన్ని ప్రకటించలేదు. సాంప్రదాయక స్థానిక మతం అధికారికంగా జనాభాలో కేవలం 0.1% మాత్రమే ఉన్నప్పటికీ ప్రభావంగా ఉంది. చాలామంది రువాండాప్రజలు క్రైస్తవ దేవుడిని సాంప్రదాయ రువాండాన్ దేవుడు ఇమ్నాతో పర్యాయంగా భావిస్తుంటారు.

భాషలు

దేశం ప్రధాన భాష కిన్యార్వాండా. ఇది రువాండాలందరికి వాడుకభాషగా ఉంది. కాలనీల కాలం నాటి ప్రధాన ఐరోపా భాషలలో జర్మనీ బోధనా భాషగా లేకున్నా విస్రారంగా వాడుకలో ఉంది. తరువాత ఫ్రెంచిభాష ఉంది. ఇది 1916 లో బెల్జియం ప్రవేశపెట్టింది. 1962 లో స్వాతంత్ర్యం తరువాత అధికారిక భాషగా విస్తారంగా వాడుకలో ఉన్న భాషగా మారింది. డచ్చిభాష కూడా వాడుకలో ఉంది. 1990 లలో ఇంగ్లీషు మాట్లాడే రువాండా శరణార్థుల తిరిగి రావడంతో ఆగ్లభాష భాష రువాండా భాషా వైవిధ్యంలో నూతన కోణాన్ని చేర్చింది. కిన్యార్వాండా, ఇంగ్లీషు, ఫ్రెంచి, స్వాహిలి అన్ని అధికారిక భాషలుగా ఉన్నాయి. కిన్యర్వాండా జాతీయ భాష, ఇంగ్లీషు అనేది ద్వితీయ, తృతీయ భాషగా బోధనా మాధ్యమంలో ప్రాధాన్యత వహిస్తుంది. స్వాహిలి, తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీకి చెందిన లింగ్యు ఫ్రాంకాగా ఉంది. ప్రత్యేకించి కెన్యా, టాంజానియా, కాంగో డెమొక్రాటికు రిపబ్లికు సరిహద్దులలో నివసించే శరణార్థులకు రెండవ భాషగా లింగ్యు ఫ్రాంకాగా వాడుకలో ఉంది. 2015 లో సెకండరీ పాఠశాలల్లో స్వాహిలిను నిర్బంధభాషగా పరిచయం చేశారు. రువాండాలోని కొంబో ద్వీపం నివాసితులకు మాని భాష వాడుకభాషగా ఉంది. ఇది కిన్యర్వాండాకు దగ్గరి సంబంధం కలిగి ఉంది.

సంస్కృతి

రువాండా 
Traditional Rwandan intore dancers

రువాండా వేడుకలు, పండుగలు, సాంఘిక సమావేశాలు, కథకులు కార్యక్రమాలలో సంగీతం నృత్యం అంతర్భాగంగా ఉన్నాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ నృత్యరూపకంలో మూడు విభాగాలు ఉంటాయి: స్త్రీలు పాల్గొనే ఉముషగిరిరో, కౌ డాంసు, పురుషులు ప్రదర్శించే " ఇంటోరె ", డ్రమ్మింగు సాంప్రదాయకంగా పురుషులు ఇమోమా అని పిలిచే డ్రమ్ముల మీద ప్రదర్శిస్తారు. " నేషనల్ బ్యాలెటు " ఉత్తమ నృత్య సమూహంగా గుర్తించబడుతుంది. దీనిని 1974 లో అధ్యక్షుడు హబీరీమానా స్థాపించాడు. ఇది దేశీయంగా, అంతర్జాతీయంగా నిర్వహించబడుతుంది. సాంప్రదాయకంగా సంగీతం సాంఘిక సమూహాల మధ్య మారుతూ ఉంటుంది. డ్రమ్సు గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. " రాయలు డ్రమ్మర్సు " రాజు (మ్వామి) కోర్టులో అధిక హోదా అనుభవించింది. డ్రమ్మర్లు వివిధ సమూహాలలో కలిసి ఆడతారు. సాధారణంగా ఏడు, తొమ్మిది మంది డ్రమ్మర్లు పాల్గొంటారు. దేశంలో ఆఫ్రికా గ్రేటు లేక్సు, కాంగోలీయుల, అమెరికా సంగీతాలతో ప్రభావితమైన ప్రజాదరణ పొందిన సంగీత పరిశ్రమ ఉంది. డ్యాన్సుహాలు, రాపు, రాగ్గా, ఆర్ & బి, డాంసు- పాపు మిశ్రమంతో రూపొందించబడిన హిప్ హాప్ అత్యంత ప్రజాదరణ పొందిన శైలిగా ఉంది.

రువాండా 
పొడవైన శంఖమును పోలిన మూత, నలుపు జిగ్జాగు నమూనాతో ఉన్న ఒక తెల్లని నేసిన బుట్టను చిత్రీకరించిన ఛాయాచిత్రం

సంప్రదాయక కళలలో చేతిపనులన్నీ దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. అయితే వీటిని అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఉపయుక్తమైన అంశాలుగా రూపొందించారు. నేసిన బుట్టలు, బౌల్సు ప్రత్యేకంగా ఉంటాయి. ఇమిగోంగో ఒక ప్రత్యేకమైన ఆవు పేడ కళ, రువాండా ఆగ్నేయప్రాంతంలో ఉత్పత్తి చేయబడుతుంది. ఈ ప్రాంతం స్వతంత్ర గిసాకా రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ పేడ వివిధ రంగుల సహజ మట్టితో కలుపుతారు తరువాత ఆకారాలను రూపొందిస్తారు. ఇతర కళల్లో మట్టిపాత్రలు, చెక్క బొమ్మలు ఉన్నాయి. సాంప్రదాయ నివాసాల శైలులు స్థానికంగా లభించే పదార్థాల వినియోగంతో తయారుచేయబడుతుంటాయి. గడ్డి-కప్పబడిన పైకప్పులతో వృత్తాకార, దీర్ఘచతురస్రాకార మట్టి గృహాలు (నయాకట్స్ అని పిలుస్తారు) చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ప్రభుత్వం వీటిని ప్రత్యామ్నాయ పద్ధతిలో పోతపోసిన ఇనుము వంటి ఆధునిక వస్తువులతో మార్చింది.

రువాండాకు వ్రాతపూర్వక సాహిత్యం సుదీర్ఘ చరిత్ర లేదు. కానీ కవిత్వం నుండి జానపద కథల వరకు బలమైన మౌఖిక సాంప్రదాయం ఉంది. దేశంలోని నైతిక విలువలు, చరిత్ర వివరాలు చాలా తరాల తరబడి క్రింద తరాలకు అందించబడింది. అత్యంత ప్రసిద్ధి చెందిన రువాండా సాహిత్యకారుడు అలెక్సిసు కగమే (1912-1981), ఆయన మౌఖిక సంప్రదాయాల్లో పరిశోధన చేసి ప్రచురించాడు. అలాగే తన స్వంత కవిత్వాన్ని వ్రాశాడు. రువాండా జాతినిర్మూలన హత్యాకాండ ఫలితంగా బెంజమిను సీను వంటి నూతన తరానికి చెందిన రచయితలు సాక్ష్యాధార కథనాలు, వ్యాసాలు, కాల్పనిక సాహిత్యం వెలుగులోకి వచ్చింది. గోల్డెను గ్లోబు-నామినేటెడు హోటల్ రువాండా, షేకు హాండ్సు విత్ ది డెవిలు, కొన్నిసార్లు ఏప్రిలు లో, షూటింగు డాగ్సు, రువాండాలో చిత్రీకరించిన చివరి రెండు చిత్రాలు.

ఏడాది పొడవునా పదిహేను సాధారణ జాతీయ సెలవు దినాలు గమనించబడతాయి. అప్పుడప్పుడూ ప్రభుత్వం ఇతర శలవులు చేర్చుతారు. ఏప్రిలు 7 న తాతినిర్మూలన హత్యాకాండ మెమోరియలు డే తరువాత వారానికి అధికారిక వారం సంతాపదినాలు ఉంటాయి. జూలై 4 న హుటు తీవ్రవాదులపై పి.ఆర్.ఎఫ్. విజయం లిబరేషన్ డేగా జరుపుకుంటారు. ప్రతి నెల చివరి శనివారం ఉదయం 8 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు " ఉముగండా " నిర్వహిస్తారు.   దీనిని సమాజ సేవ జాతీయ ఉదయంగా భావిస్తారు. ఈ సమయములో 18 నుండి 65 మధ్య వయసున్న ప్రజలు వీధుల శుభ్రపరచడం, పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజల కోసం గృహాలు నిర్మించడం చేస్తారు. ఉముగాండా సమయంలోచాలా సాధారణ సేవలు మూసివేయబడతాయి. ప్రజా రవాణా పరిమితంగా ఉంటుంది.

ఆహారవైవిధ్యం

రువాండా వంటకాలు వ్యవసాయం ద్వారా లభిస్తున్న అరటి, అకుకూరలు (ఐబిటోక్ అని పిలుస్తారు), పప్పుధాన్యాలు, చిలగడ దుంపలు, బీన్సు, కాస్సా (మనియోక్) వంటివి ఉపయోగించబడుతుంటాయి. చాలామంది రువాండాలు నెలలో కొన్ని సార్ల కంటే అధికంగా మాంసం తినరు. సరస్సులు దగ్గర నివసించే వారికి లభించే చేపలలో టిలాపియా ప్రసిద్ధి చెందింది. జర్మనీ, బెల్జియా వలసవాదులు రువాండాకు పరిచయం చేసిన బంగాళదుంప, చాలా ప్రజాదరణ పొందింది. ఉబుగరీ ( ఉమ్యుసిమా) అనే పేస్టును కాసావా లేదా మొక్కజొన్నతో నీటిని చేర్చి తయారుచేస్తారు. ఇది ఆఫ్రికా గ్రేటు లేక్సు ప్రాంతం అంతటా తింటారు. ఇది ఒక గంజి-లాగా ఉంటుంది. ఇసోమ్బే మెత్తని కసావా ఆకుల నుంచి తయారవుతుంది. దీనిని ఎండిన చేపలతో వడ్డిస్తారు. భోజన సామాన్యంగా మెలంగే అని పిలువబడే బఫేలో స్టేపుల్సు, కొన్నిసార్లు మాంసం ఉంటుంది. సాధారణంగా సాయంత్రం తినేటపుడు బ్రోకెట్లను అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారంగా చెప్పవచ్చు. ఇవి సాధారణంగా మేక నుండి తయారు చేస్తారు. కానీ కొన్నిసార్లు ట్రిపె, గొడ్డు మాంసం లేదా చేపతో చేస్తారు. గ్రామీణ ప్రాంతాలలో, అనేక బార్లు మేకలను కోసి మాంసాన్ని తయారు చేయడానికి కసాయి వారిని ఉద్యోగులుగా నియమించుకుంటారు. మాంసాహారాన్ని వండి కాల్చిన అరటితో వడ్డించడానికి వీరు బాధ్యత వహిస్తారు. పాలు, ప్రత్యేకించి పులియబెట్టిన పెరుగును " ఇకివిగుటో " అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఒక సాధారణ పానీయంగా ఉపయోగించబడుతుంది.ఇతర పానీయాలు సాంప్రదాయిక ఆచారాలు, వేడుకలలో అరటి నుండి తయారు చేయబడిన జొర్గ్యూ, ఉర్వాగ్వా నుండి తయారు చేయబడిన సాంప్రదాయ బీరును " ఐకిగాగె" సేవిస్తారు. రువాండాలో ప్రధాన పానీయాల తయారీసంస్థ బ్రాలిర్వా. ఇది 1950 లలో స్థాపించబడింది. ఇప్పుడు ర్వాండన్ స్టాక్ ఎక్స్ఛేంజిలో జాబితా చేయబడింది.బాలిర్వా కోకా-కోలా, ఫాంటా, స్ప్రైటు వంటి పానీయాలను ప్రీమసు, ముత్జిగు, అమస్టెలు, టర్బో కింగ్ల వంటి బీర్లను తయారు చేస్తుంది. 2009 లో బ్రస్సెరిసు డెసు మిల్లె కొల్లిన్సు (BMC) కొత్త బ్రివరీ ప్రారంభించబడింది. ఇది స్కొలు బీరు తయారీ, స్కోలు గాటను అని పిలవబడే ఒక స్థానిక బీరును ప్రారంభించింది. బి.ఎం.సి ఇప్పుడు బెల్జియం కంపెనీ యునిబ్రా యాజమాన్యంలో ఉంది. ఈస్టు ఆఫ్రికా బ్రూవరీసు కూడా దేశంలో పనిచేస్తుండగా గిన్నిసు, టస్కరు, బెలు, అలాగే విస్కీ, స్పిరిటులను దిగుమతి చేసుకున్నాయి.

క్రీడలు

రువాండా 
Adrien Niyonshuti, "one of the most famous people in Rwanda", competing in the cross-country mountain biking event at the 2012 Summer Olympics

క్రీడల అభివృద్ధి విధానం ద్వారా రువాండా ప్రభుత్వం " డెవెలెప్మెంటూ అండ్ పీసు బిల్డింగు " వేదికగా క్రీడలకు బలమైన ప్రోత్సాహం అందిస్తుంది. విద్య సహా అనేక అభివృద్ధి లక్ష్యాల కోసం క్రీడను ఉపయోగించుకొనేలా ప్రభుత్వం విధానాలు రూపొందించింది. రువాండాలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అసోసియేషన్ ఫుట్బాలు, వాలీబాలు, బాస్కెట్బాలు, అథ్లెటిక్సు, పారా ఒలింపికు క్రీడలు. క్రికెట్టు క్రీడకు ప్రజాదరణ అధికరిస్తుంది.సాంప్రదాయంగా రువాండాలో రవాణా చేసే పద్ధతిగా సాంప్రదాయకంగా కనిపించేది, క్రీడగా జనాదరణ పొందడంతోపాటు, క్రీడగా ప్రజాదరణ పొందింది; as a result of refugees returned from Kenya, where they had learned to play the game. రువాండాలో అత్యధికంగా రవాణాకు ఉపయోగిస్తున్న సైకిలింగుకు క్రీడగా ఆదరణ అధికరిస్తుంది. రువాండా పుస్తకం, ల్యాండ్ ఆఫ్ సెకండ్ చాంసెసు: ది ఇంపాజిబుల్ రైజ్ ఆఫ్ రువాండాస్ సైక్లింగ్ టీమ్, చిత్రం, రైసింగ్ ఫ్రమ్ యాషెస్.

1984 నుండి రువాండా ఒలిపికు క్రీడలలో పాల్గొంటున్నది. 2004 లో పారాలింపిక్ క్రీడలలో రువాండా 2012 సమ్మరు ఒలింపిక్సులో పాల్గొనడానికి స్విమ్మింగు, మౌంటెన్ బైకింగు, జూడో క్రీడలలో పాల్గొనడానికి ఏడుగురు అథ్లెటికు క్రీడాకారులను పంపింది. లండన్లోని 2012 వేసవి ఒలింపిక్సుకు పవర్ లిఫ్టింగు, సిటింగు వాలీబాలు క్రీడలలో పాల్గొనడానికి 15 మది అథ్లెట్లను పంపింది. 2009 లో కామన్వెల్తులో చేరిన తరువాత దేశం కామన్వెల్తు క్రీడలలో కూడా పాల్గొంది. 2000 మధ్యకాలం నుంచి దేశ జాతీయ బాస్కెట్బాలు జట్టు ప్రాముఖ్యతను సంతరించుకుంది. పురుషుల జట్టు 2007 నుండి వరుసగా నాలుగు సార్లు ఆఫ్రికా బాస్కెట్బాలు ఛాంపియన్షిపు ఫైనలు దశలలో పాల్గొనడానికి అర్హత సాధించింది. 2013 టోర్నమెంటులో ఆతిథ్యమివ్వటం నుండి వైదొలిగింది. రువాండా జాతీయ ఫుట్బాలు జట్టు 2004 ఆఫ్రికా కప్ ఆఫ్ ది టోర్నమెంటులో ఎడిషన్లో కనిపించింది. కానీ బృందం దశల కంటే ముందుగానే విఫలమైంది. ఈ పోటీ నుండి పోటీకి అర్హత సాధించటంలో జట్టు విఫలమయింది, ప్రపంచ కప్ కోసం ఎన్నడూ అర్హత సాధించలేదు. ర్వాండా అత్యున్నత దేశీయ ఫుట్బాల్ పోటీ " రువాండా నేషనల్ ఫుట్బాల్ లీగు " as of 2015, 2015 నాటికి ఆధిపత్య జట్టు కిగాలీ ఎ.పి.ఆర్. ఎఫ్.సి. గత 17 ఛాంపియన్షిప్లలో 13 చాంపియన్షిపు గెలిచింది. రువాండా క్లబ్బులు కేంద్ర, తూర్పు ఆఫ్రికన్ జట్ల కోసం కగమె ఇంటర్ క్లబులో పాల్గొంటాయి. ఇది 2002 నుండి అధ్యక్షుడు కగమే చేత స్పాన్సరు చేయబడింది.

విద్య

రువాండా ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో తొమ్మిది సంవత్సరాలు ఉచితంగా విద్యను బోధిస్తారు.కానీ ఇప్పటికీ చాలామంది పిల్లలు యూనిఫాం, పుస్తకాలు లాంటివి కొనలేక, ఇళ్ళలో పని చేసుకుంటూ పాఠశాలకు దూరంగానే ఉండిపోతున్నారు.

రువాండా 
Children in a Rwandan primary school, using laptops supplied by the One Laptop Per Child scheme

2012 కి ముందు రువాండా ప్రభుత్వం 9 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించింది: ఆరు సంవత్సరాల ప్రాథమిక, మూడు సంవత్సరాల మాద్యమిక విద్య. 2012 లో ఇది 12 సంవత్సరాలకు విస్తరించబడింది. ప్రాథమిక పాఠశాలల్లో నమోదు రేట్లు అధికగా ఉన్నప్పటికీ పూర్తిచేసే శాతం తక్కువగా ఉంటుంది. 2015 అధ్యయనం సూచిస్తుంది. పాఠశాలలు రుసుము లేదు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్య ఖర్చులకు వస్తువులు అందించడం ద్వారా ఉపాధ్యాయుల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం పాఠశాల నిర్మాణానికి ఒక సహకారాన్ని అందించడం ద్వారా భరించాల్సిన అవసరం ఉంది. ఈ ఖర్చులు విద్య నుండి పిల్లలను మినహాయించటానికి ఒక ప్రధానకారణంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. కొన్ని చర్చీలు నిర్వహిస్తున్న పాఠశాలలు ఉన్నాయి. ఇవి ఒకే సిలబసును ఫీజులను నిర్ణయిస్తాయి. 1994 నుండి 2009 వరకు మాధ్యమిక విద్య ఫ్రెంచి, ఆంగ్ల భాషల్లో అందించబడింది. తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ, కామన్వెల్తు దేశాలతో పెరుగుతున్న సంబంధాల కారణంగా ప్రస్తుతం ఆంగ్ల అక్షరమాలను మాత్రమే అందిస్తున్నారు. దేశంలో అనేక తృతీయ స్థాయి విద్యాలయాలు ఉన్నాయి. 2013 లో రువాండా నేషనల్ యూనివర్శిటీ, దేశంలోని ఇతర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల విలీనంతో " పబ్లిక్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా " సృష్టించబడింది. 2013 లో రువాండాలో తృతీయ విద్య కోసం స్థూల నమోదు (2006 లో 3.6%) 7.9% ఉంది. దేశంలో 15 లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు గల వారిలో చదవడం, రాయడం తెలిసినవారి శాతం 2009 లో 71%, 1978 లో 38%, 1991 లో 58% మంది ఉన్నారు.

ఆరోగ్యం

రువాండా 
Butaro Hospital at Burera, Northern Province

రువాండాలో ఆరోగ్యం స్థాయి చారిత్రాత్మకంగా చాలా తక్కువగా ఉంది. 1994 నాటికి ముందు తరువాత కూడా ఆరోగ్యం స్థాయి తక్కువగా ఉంది. 1998 లో ఐదవ పుట్టినరోజుకు ముందు ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరికంటే ఎక్కువ మంది మరణించారు. తరచుగా మలేరియా కారణంగా మరణించారు.

అధ్యక్షుడు కగమే ఆరోగ్య సంరక్షణ కొరకు " విజన్ 2020 డెవలప్మెంటు ప్రోగ్రాం " రూపొందించబడింది. ఆరోగ్య సంరక్షణ కొరకు 2013 లో దేశ స్థూల దేశీయ ఉత్పత్తిని 6.5%కు అధికరించారు. 1996 లో 1.9% మాత్రమే వ్యయం చేయబడింది. ఆరోగ్య బీమా అందించే మ్యుటెల్లెసు డి శాంటే అనే వ్యవస్థకు ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కొరకు నిధులు మంజూరు చేయడం, నిర్వహణ బాధ్యలు అప్పగించింది. 1999 లో మ్యుటెల్లెసు స్థాపించబడి అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాముల సహాయంతో 2000 మధ్యలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం కింద ప్రీమియాలు వార్షికంగా $ 2 అమెరికా డాలర్లు ఉంది. 2011 నుండి ఈ రేటు నెమ్మదిగా చెల్లిస్తుంది. పీలవమైన చెల్లింపుతో గరిష్ఠ ప్రీమియాలు $ 8 అమెరికా డాలర్ల వరకు అధికరిస్తుంటాయి. As of 2014 2014 నాటికి 90% కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ పథకంలో ఉన్నారు. 1997 లో ప్రభుత్వం కిగాలి హెల్త్ ఇన్స్టిట్యూటు వంటి శిక్షణా సంస్థలను స్థాపించింది. ఇప్పుడు ఇది రువాండా విశ్వవిద్యాలయంలో భాగంగా ఉంది. 2005 లో అధ్యక్షుడు కగమే కూడా ది ప్రెసిడెంట్సు మలేరియా ఇనిషియేటివు అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. రువాండాలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా నివారణకు దోమ తెరలు, మందులు వంటి అవసరమైన వస్తువులను పొందడానికి ఇది ఉద్దేశించబడింది.

ఇటీవలి సంవత్సరాలలో రువాండా ఆరోగ్య స్థితి మెరుగుపడింది. 2005 నుండి 2013 మధ్యకాలంలో ఆయుఃప్రమాణం 55.2 నుండి 64.0 కి అధికరించింది. 5 సంవత్సరాల లోపు పిల్లల మరణం 1,000 మందిలో 106.4 నుండి 1000 మందిలో 52.0 కు తగ్గింది. 1,00,000 మందిలో క్షయవ్యాధి 101 నుండి 69 కు తగ్గింది. ఆరోగ్య సంరక్షణలో దేశం సాధించిన పురోగతి అంతర్జాతీయ మీడియా, సేవా సంస్థలు ఉదహరించించాయి. ది అట్లాంటిక్ "రువాండా హిస్టారిక్ హెల్తు రికవరీ" పేరుతో ఒక వ్యాసం ప్రచురించింది. " పార్టనర్సు ఇన్ హెల్తు "గత 50 సంవత్సరాల్లో ప్రపంచంలోని అత్యంత నాటకీయమైన ఆరోగ్య ప్రయోజనాలని వివరించారు.

అయినప్పటికీ ఈ మెరుగుదలలు ఉన్నప్పటికీ దేశ ఆరోగ్యసంబంధమైన అంటువ్యాధులు, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, "ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లను" గురించి వర్ణించింది. ఇది ప్రసవసమయంలో తల్లుల మరణాల సంఖ్య సహా అంగీకరింపజాలని సమ్యలు అధికంగా ఉన్నాయని వర్ణించింది. అలాగే ఎయిడ్సు అంటువ్యాధి కొనసాగుతుంది. అమెరికా " సెంటర్సు ఫర్ డిసీజు కంట్రోలు అండు ప్రివెన్షను " ఆధారంగా రువాండాకు ప్రయాణించే ప్రయాణికులు మలేరియా మందులని తీసుకొని వెళ్ళాలని, యల్లో ఫీవరు వంటి జ్వరాలకు వాక్సిన్లు వేయించుకున్నారని నిర్ధారించుకోవాలని సిఫార్సు చేయబడింది.

రువాండాలో వైద్య నిపుణుల కొరత కూడా ఉంది. 1000 మందికి 0.84 మంది వైద్యులు, నర్సులు, మంత్రసానులు మాత్రమే ఉన్నారు. యునైటెడు నేషన్సు డెవలప్మెంటు ప్రోగ్రాం ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన " మిలీనియం డెవెలెప్మెంటు గోల్సు " 4-6 వైపు దేశం ఆరోగ్య పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తుంది. 2015 నాటి మధ్య యు.ఎన్.డి.పి. నివేదిక దేశంలో శిశు మరణాల మీద లక్ష్యాన్ని చేరుకోలేదని పేర్కొంది. ప్రసవసమయంలో తల్లుల మరణాలను తగ్గించడంలో దేశం లక్ష్య సాధనలో "మంచి పురోగతిని సాధించింది" తల్లుల మరణాల నిష్పత్తి నాగింట మూడు వంతులు తగ్గాయని భావించింది. ఎయిడ్సు వ్యాప్తిని నివారించడంలో దేశం గోల్ 6 కు ఇంకా చేరలేదు.

వెలుపలి లింకులు

మూలాలు

Tags:

రువాండా Etymologyరువాండా చరిత్రరువాండా నిర్వహణా విభాగాలురువాండా భౌగోళికంరువాండా ఆర్ధికంరువాండా మాధ్యమం, సమాచార రంగంరువాండా మౌలిక నిర్మాణాలురువాండా గణాంకాలురువాండా సంస్కృతిరువాండా విద్యరువాండా ఆరోగ్యంరువాండా వెలుపలి లింకులురువాండా మూలాలురువాండాఉగాండాకాంగో గణతంత్ర రిపబ్లిక్టాంజానియాబురుండిభూపరివేష్టిత దేశంభూమధ్య రేఖ

🔥 Trending searches on Wiki తెలుగు:

భీమా (2024 సినిమా)ఒంటెబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅక్బర్రేవతి నక్షత్రంబ్రాహ్మణ గోత్రాల జాబితాప్రభాస్శివుడుపరకాల ప్రభాకర్దాశరథీ శతకముగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుశత్రుఘ్నుడువిమల (రచయిత్రి)ప్రజాస్వామ్యంగూగుల్సూర్య నమస్కారాలుశ్రీలీల (నటి)యుద్ధకాండమహామృత్యుంజయ మంత్రంఇండియన్ సివిల్ సర్వీసెస్కాప్చాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాకేతువు జ్యోతిషంతెలుగు సినిమాలు 2023నాస్తికత్వంమంచు మనోజ్ కుమార్ఐక్యరాజ్య సమితిరక్త పింజరిరోహిత్ శర్మశక్తిపీఠాలుగరుత్మంతుడుమానవ శాస్త్రంవిజయ్ దేవరకొండఎస్. శంకర్నరేంద్ర మోదీ స్టేడియంమమితా బైజువసంత వెంకట కృష్ణ ప్రసాద్రామప్ప దేవాలయంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిమేరీ ఆంటోనిట్టేశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంనాగులపల్లి ధనలక్ష్మి2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఅమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంమృగశిర నక్షత్రముAశిబి చక్రవర్తిదివ్యభారతిరాశి (నటి)కౌసల్యవిశాఖపట్నంహిమాలయాలుబారసాలరామసేతురావి చెట్టుశ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లిమీనాక్షి అమ్మవారి ఆలయంశని (జ్యోతిషం)జీలకర్రశ్రవణ నక్షత్రముఅర్జునుడుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిజగ్జీవన్ రాంఇందిరా గాంధీభారత రాజ్యాంగ ఆధికరణలురైతుబంధు పథకంమొదటి పేజీఅమెజాన్ ప్రైమ్ వీడియోచెక్ (2021 సినిమా)సంపూర్ణ రామాయణం (1971 సినిమా)వాతావరణంతిక్కనఎస్త‌ర్ నోరోన్హాఅశ్వని నక్షత్రముపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరామాయణంపసుపు గణపతి పూజమానవ శరీరము🡆 More