ప్రతిభా రాయ్ ఒరియా సాహిత్యవేత్త.
ఆమె అత్యుత్తమ భారతీయ సాహిత్య పురస్కారాల్లో ఒకటిగా పేరొందిన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందింది.
ప్రతిభా రాయ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | అలబొల్, బలికుడా, జగత్ సింగ్ పూర్ జిల్లా, ఒడిశా | 1943 జనవరి 21
భాష | ఒరియా |
జాతీయత | భారతీయత |
విద్య | ఎం.ఎ.(విద్య), పిహెచ్.డి.(విద్యా మానసికశాస్త్రం) |
పూర్వవిద్యార్థి | రవెన్ షా కళాశాల |
గుర్తింపునిచ్చిన రచనలు | యాజ్ఞసేని |
పురస్కారాలు | జ్ఞానపీఠ్ పురస్కారం మూర్తిదేవి పురస్కారం |
Website | |
http://www.pratibharay.org/ |
ఆమె 1943 జనవరి 21 న ఒడిషా రాష్ట్రంలోని కటక్ జిల్లా లోని పూర్వపు ప్రాంతమైన జగత్సింగపూర్ నకు చెందిన బలికుడ లోని మారుమూల గ్రామమైన ఆలబాల్ లో జన్మించింది. మూర్తిదేవి పురస్కారం అందుకున్న మహిళలలో ఆమె ప్రథమురాలు. ఆమెకు ఈ పురస్కారం 1991లో వచ్చింది.
ఆమె సమకాలీన భారతదేశంలో ఒక ప్రముఖ కాల్పనిక రచనల కర్త. ఆమె తన మాతృభాష ఒడియాలో నవలలు, చిన్న కథలను రాస్తుంది. ఆమె రాసిన నవలలలో మొదటి నవల "బర్షా బసంత బైశాఖ (1974)" అత్యధికంగా అమ్ముడయింది.
తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె సాహితీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి "సమానత్వం ఆధారంగా సామాజిక క్రమం, ప్రేమ, శాంతి, సమైక్యత" వంటి అంశాలపై శోధిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంది. సమానత్వం ఆధారంగా కుల, మత, లేదా లింగ వివక్ష లేకుండా సామాజిక అంశాలపై రాస్తూంటే, ఆమె విమర్శకులలో కొందరు ఆమెను కమ్యూనిస్టుగా, మరికొందరు స్త్రీవాదిగా చిత్రీకరించారు. కానీ ఆమె తనను తాను మానవతా వాదిగా అభివర్ణించుకుంటుంది.
సమాజ ఆరోగ్యకరమైన పనితీరు కోసం పురుషులు, మహిళలు విభిన్నంగా సృష్టించబడ్డారు. మహిళలకు గల ప్రత్యేకతలను వారు మరింత పెంచుకోవాలి. ఒక మానవునిగా స్త్రీ, పురుషుడు సమానమే. ఆమె తన వివాహం అయిన తరువాత కూడా రచనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పి.హెచ్.డి (విద్యా మనోవిజ్ఞానశాస్త్రం) లను పూర్తిచేసింది. ఆమె ఒడిశాలోని ఆదిమ గిరిజన తెగల గూర్చి పరిశోధించి "ట్రైబలిజం, క్రిమినాలజీ ఆఫ్ మాండో హైలాండర్" అనే అంశంపై పోస్టు డాక్టరల్ పరిశోధనను చేసింది.
ఆమె వృత్తిజీవితాన్ని పాఠశాల ఉపాధ్యాయినిగా ప్రారంభించింది. తరువాత 30 సంవత్సారాల పాటు ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలలలో బోధించింది. ఆమె డాక్టరల్ పరిశోధనలకు మార్గనిర్దేశం చేసి, అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించింది. ఆమె రాష్ట్రప్రభుత్వ సేవల నుండి విద్యారంగ ప్రొఫెసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. తరువాత ఒడిశాలోని పబ్లిక్ సర్వీసు కమిషనులో సభ్యురాలిగా చేరింది..
ఆమెకు సంఘ సంస్కరన అంటే ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక సందర్భాలలో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది. అందులో ముఖ్యమైన సంఘటన పూరీ జగన్నాథ దేవాలయంలో జరిగింది. ఆమె ఆ దేవాలయంలోని పూజారులు దేవాలయ ప్రవేశంలో వర్ణ వివక్ష (కుల/మత) పాటిస్తున్నందున దానికి వ్యతిరేకంగా పోరాడింది. పూజారుల అవాంఛనీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా వార్తా పత్రికలో "ద కలర్ ఆఫ్ రెలిజియన్ ఈస్ బ్లాక్" (ధర్మార రంగ కళ) శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆమె ఆ కథనానికి వ్యతిరేకంగా పూజారులు వేసిన పరువు నష్టం కేసుపై పోరాడుతోంది. 1999 అక్టోబరులో ఒడీశాలో సంభవించిన తుఫానుకు గురైన ప్రాంతాలను ఆమె సందర్శించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అనాథల, వితంతువుల పునరావాసం కోసం కృషి చేస్తోంది.
ఆమె భారతదేశంలో వివిధ జాతీయ సాహితీ కార్యక్రమాలలో , విద్యా సమావేశాలలో పాల్గొంది. ఆమె 1986లో పూర్వపు USSR లో గల ఐదు రిపబ్లిక్ దేశాలను సందర్శించి, ISCUS చే నిర్వహింపబడుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలలో పాల్గొన్నది. 1994 లో న్యూఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ నిర్వహించిన "ఇండియా టుడే 94" కార్యక్రమంలో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో భారతీయ సాహిత్యం , భాషల గూర్చి చర్చలు, ఉపన్యాసాలు చేసింది. ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్డం, ఫ్రాన్స్ దేశాలను సందర్శించి ఉపన్యాసాలిచ్చింది. 1996 లో బంగ్లాదేశ్లో జరిగిన "ఇండియన్ ఫెస్టివల్"లో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. 1999 జూన్ లో నార్వే లోని ట్రామ్సో విశ్వవిద్యాలయంలో జరిగిన 7వ అంతర్జాతీయ మహిళా అంతఃక్రమశిక్షణ కాంగ్రెస్" సభలకు అతిధిగా హాజరయింది. 1999లో నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలకు ఉపన్యాస పర్యటన చేసింది. 2000లో జూరిచ్, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన సెమినార్ లలో "ధర్డ్ యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్" అంశంపై పత్రాలను సమర్పించడానికి సందర్శించింది.
ఆమె అనేక అధ్యయన సమాజాలలో సభ్యురాలిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా, సెంట్రల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ మొదలైన సంస్థలతో సంబంధం కలిగి ఉంది. ఆమె దేశ విదేశాలలో పర్యటనను చేసి వివిధ విద్యా సదస్సులలో పాల్గొంది. ఆమె రాసిన సృజనత్మక రచనలకు గాను అనేక జాతీయ, స్టేట్ పురస్కారాలు పొందింది.
నవలలు
'యాత్రా చరిత వర్ణనా
లఘు కథలు
This article uses material from the Wikipedia తెలుగు article ప్రతిభా రాయ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.