ఉత్తర భారతదేశంలో, తూర్పు పాకిస్తాన్ లోని భూభాగాల్లో ఇది విస్తరించింది.
ఈ ప్రాంతంలో సింధు లోయ నాగరికత, వేద సంస్కృతి విలసిల్లాయి, అచేమెనిద్ సామ్రాజ్యం, గ్రీకులు, కుషాణులు, గజ్నవీదులు, తైమూరులు, మొగలులు, ఆఫ్ఘాన్లు, బ్రిటీష్ వారు మొదలైన విదేశీయులెందరో సాగించిన అసంఖ్యాకమైన, మేరలేని దండయాత్రలను చారిత్రికంగా చూస్తూనేవుంది. పంజాబ్కు చెందిన ప్రజల్ని పంజాబీలు అని, వారి భాషను పంజాబీ భాష అని పిలుస్తున్నారు. పంజాబ్ ప్రాంతంలోని ప్రధానమైన మతాలు ఇస్లాం, హిందూ మతం, సిక్ఖు మతాలు. ఇతర మత సమూహాల్లో క్రైస్తవం, జైన మతం, బౌద్ధం కూడా ఉన్నాయి.
1947లో బ్రిటీష్ ఇండియా పరిపాలన నుంచి భారత ఉపఖండం స్వతంత్రం కావడంతోటే ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజితమైంది.
పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతంలో పాకిస్తానీ పంజాబ్, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం, భీంబెర్, మీర్ పూర్ వంటి ప్రాంతాల చుట్టూ ఉన్న ఆజాద్ కాశ్మీర్ లోని దక్షిణ ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లోని కొన్ని ప్రాంతాలు (పెషావర్ వంటివి పంజాబ్ ప్రాంతాలుగా అక్కడ పిషోర్ గా పేరొందాయి).
భారతదేశంలో ఈ ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రం, చండీగఢ్, జమ్ము డివిజన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, ఢిల్లీలోని కొన్ని భాగాలు, రాజస్థాన్ లోని కొంత భాగం, ప్రధానంగా గంగానగర్ జిల్లా, హనుమాన్గర్ జిల్లా వంటివి ఉన్నాయి.
పదవ్యుత్పత్తి
ఈ ప్రాంతాన్ని మొదట్లో సప్త సింధు అని పిలిచేవారు, ఆ పదం ఏడు నదులు సముద్రంలోకి కలిసే వేదభూమిని సూచిస్తుంది. రామాయణం, మహాభారతాల్లో సంస్కృతంలో ప్రస్తావించిన సంస్కృత పదం - "పంచనద" అంటే ఐదు నదుల భూమి. ఇదే పదం ముస్లిం దండయాత్రల అనంతరం పర్షియన్లోకి "పంజాబ్"గా అనువదించారు. పంజాబ్ అన్న పదం రెండు పర్షియన్ పదాల కలయికతో ఏర్పడింది, పంజ్ (ఐదు), అబ్ (నీరు). ఈ పదం ఈ ప్రాంతాన్ని జయించిన టర్కో-పర్షియన్ దండయాత్రికులు పంజాబ్ అన్న పదానికి వ్యాప్తి కల్పించారు, మరీ ముఖ్యంగా, ముఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఈ పదం స్థిరపడింది. ఝేలం, చీనాబ్, సట్లెజ్, బియాస్ నదులను ఉద్దేశించే పంజాబ్ లేక పంచనద అని పిలిచారు. ఇవన్నీ సింధు నదికి ఉపనదులు.
రాజకీయ భూగోళం
పంజాబ్ ప్రాంతానికి ప్రధానంగా రెండు నిర్వచనాలు ఉన్నాయి: 1947 నాటి నిర్వచనం, 1846-1849 నాటి నిర్వచనం. మూడవ నిర్వచనం 1947 నాటి నిర్వచనం, 1946-49 నాటి నిర్వచనం కలుపుకుంటూ, దానితో పాటుగా భాషాపరంగానూ, ప్రాచీన నదుల గమనాన్ని అనుసరిస్తూ ఉత్తర రాజస్థాన్ ప్రాంతాలను కూడా కలుపుకుంటుంది.
1947 నిర్వచనం
1947 నిర్వచనం పంజాబ్ ప్రాంతాన్ని అప్పటికి విలీనమౌతూన్న బ్రిటీష్ ఇండియాలోని నాటి బ్రిటీష్ పంజాబ్ ప్రావిన్సుగా నిర్వచిస్తోంది. ఈ పంజాబ్ ప్రావిన్సు భారత విభజనలో భారత, పాకిస్తాన్ల నడుమ విభజితమైంది. ఇది పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్సు, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతాల్లోనూ, భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం, ఛండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించింది.
కాలరేఖ
- క్రీ.పూ.3300–1500: సింధు లోయ నాగరికత - పంజాబ్ ప్రధాన కేంద్రం
- క్రీ.పూ.1500–1000: (రుగ్వేద) వేద సంస్కృతికి పంజాబ్ ముఖ్య కేంద్రమైంది
- క్రీ.పూ.1000–500: మధ్య, తుది వేద సంస్కృతిలో పంజాబ్
- క్రీ.పూ.599: మహావీర జైనుని జననం
- క్రీ.పూ.567–487: గౌతమ బుద్ధుని కాలం
- క్రీ.పూ.550 – 600 CE: బౌద్ధం ప్రాచుర్యంలో ఉంది
- క్రీ.పూ.326: అలెగ్జాండర్ పంజాబ్ దండయాత్ర
- క్రీ.పూ.322–298: చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య కాలం
- క్రీ.పూ.273–232: అశోకుని పాలన
- క్రీ.పూ.125–160: శకుల వృద్ధి
- క్రీ.పూ.2: శకుల పాలన ప్రారంభం
- 45–180: కుషాణుల పరిపాలన
- 320–550: గుప్త సామ్రాజ్యం
- 500: పంజాబ్ ప్రాంతంలో హూణుల దండయాత్ర
- 510–650: హర్షవర్థనుడి యుగం
- 711–713: మహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రాంతాన్ని, పంజాబ్ లో కొద్ది భాగాన్ని ఆక్రమించి పరిపాలించారు.
- 713–1200: రాజపుత్రులు రాజ్యాలు, కాబూల్ షాహీలు, చిన్న చిన్న ముస్లిం రాజ్యాలు పంజాబ్ ప్రాంతాన్ని పాలించాయి.
- 1206–1290: మామ్లుక్ సుల్తానుల రాజ్యాన్ని మహమ్మద్ ఘోరీ స్థాపించారు.
- 1290–1320: ఖిల్జీ సామ్రాజ్యాన్ని జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ స్థాపించారు.
- 1320–1413: తుగ్లక్ వంశ పాలన గియాసుద్దీన్ తుగ్లక్ స్థాపించారు.
- 1414–1451: సయ్యద్ వంశ పాలన ఖిజ్ర్ ఖాన్ స్థాపించారు.
- 1451–1526: లోఢీ వంశ పాలన బాహ్లుల్ ఖాన్ లోఢీ స్థాపించారు.
- 1469–1539: గురు నానక్
- 1526–1707: మొఘల్ సామ్రాజ్యం పరిపాలన
- 1526–1530: బాబర్
- 1530–1540: హుమయూన్
- 1540–1545: ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షేర్షా సూరి
- 1545–1554: ఇస్లాం షా సూరి
- 1555–1556: హుమయూన్
- 1556–1556: హేమ్ చంద్ర విక్రమాదిత్య
- 1556–1605: అక్బర్
- 1605–1627: జహంగీర్
- 1627–1658: షాజహాన్
- 1658–1707: ఔరంగజేబు
- 1539–1675: గురు అంగద్ దేవ్ నుంచి గురు తేజ్ బహదూర్ వరకూ 8మంది సిక్ఖు గురువుల కాలం
- 1675–1708: గురు గోవింద సింగ్ (10వ సిక్ఖు గురువు)
- 1699: ఖల్సా జననం
- 1708–1713: బందా సింగ్ బహదూర్ యుద్ధాలు, పరిపాలన
- 1722: ముల్తాన్, పంజాబ్ లో కానీ, హేరత్, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ అహ్మద్ షా దురానీ జననం
- 1714–1759: సిక్ఖు సర్దార్లు ఆఫ్ఘాన్లు, మొఘల్ గవర్నర్లకు వ్యతిరేకంగా పోరాటం
- 1739: నాదిర్షా దండయాత్ర, బలహీనమైన మొఘల్ సామ్రాజ్యం ఓటమి
- 1747–1772: అహ్మద్ షా దురానీ నేతృత్వంలో దురానీ సామ్రాజ్యం
- 1756–1759: పంజాబ్ వరకూ మరాఠాల దండయాత్ర, విజయం. సిక్ఖు, మరాఠా సామ్రాజ్యాల సమన్వయం
- 1761: మూడవ పానిపట్టు యుద్ధంలో ఆఫ్ఘాన్ దురానీ సైన్యాల చేతిలో మరాఠాల ఓటమి.
- 1762: అహ్మద్ షా అబ్దాలీ 2వ దండయాత్రలో 2వ ఊచకోత
- 1765–1801: పంజాబ్ ప్రాంతంలో చెప్పుకోదగ్గ ప్రాంతాలను సిక్ఖు మిస్ల్ లు నియంత్రణ సాధించారు.
- 1801–1839: సర్కార్ ఖల్సాగా పేరొందిన సిక్ఖు సామ్రాజ్యం స్థాపన, మహారాజా రంజీత్ సింగ్ పరిపాలన
- 1845–1846: మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం
- 1846: జమ్ము డివిజన్ సరికొత్త జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో చేరిక
- 1848–1849: రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం
- 1849: పంజాబ్ పూర్తిగా బ్రిటీష్ ఇండియాలో చేరిక
- 1849–1947: బ్రిటీష్ పాలన
- 1901: పెషావర్, దాన్ని చేరిన ఇతర జిల్లాలు పంజాబ్ ప్రావిన్సు నుంచి విడిపోయాయి.
- 1911: పంజాబ్ ప్రావిన్సు నుంచి కొన్ని ప్రాంతాలు ఢిల్లీలో చేరిక
- 1947: భారత విభజనలో భాగంగా పంజాబ్ ను రెండుగా విభజించారు. తూర్పు భాగం (రెండు నదులతో) భారతీయ పంజాబ్, పశ్చిమ భాగం (మూడు నదులతో) పాకిస్తానీ పంజాబ్ ఏర్పడ్డాయి.
- 1947: పాకిస్తానీ పంజాబ్ ప్రావిన్సు నుంచి ఇస్లామాబాద్ విడిపోయింది.
- 1955: పాకిస్తానీ పంజాబ్ కు ప్రావిన్సు హోదా రద్దు
- 1966: భారతీయ పంజాబ్ మూడుగా విడిపోయి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో చేరిక
- 1971: పాకిస్తానీ పంజాబ్ కు తిరిగి ప్రావిన్సు హోదా
చిత్రాలు
-
మొఘల్ యుగానికి చెందిన
బాద్షాహీ మసీదు, లాహోర్
-
బతిందాలోని కోట
-
పటియాలాలోని ఖిలా ముబారక్ లోని ప్రధాన ద్వారం
-
అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం
-
హజురీ బాగ్ లో నిర్మించిన రంజీత్ సింగ్ బరదారీ
-
రంజీత్ సింగ్ సమాధి
-
1673లో నిర్మించిన ఆలంగిరీ ద్వారం, లాహోర్ కోట ప్రధాన ద్వారం
-
పటియాలాలోని ఫురా చౌక్
-
-
జలంధర్ రైల్వే స్టేషన్ రిసెప్షన్ బ్లాక్
-
పంజాబ్ లో నీటిపారుదల కలిగిన సస్యశ్యామల భూమి
-
షారుక్న్-ఎ-ఆలం సమాధి
-
లాహోర్ లోని షాలిమార్ గార్డెన్స్
-
రాత్రి పూట పాటియాలాలోని మోహీంద్ర కళాశాల
-
లాహోర్ లోని వజీర్ ఖాన్ మసీదు
-
షేఖుపురాలోని హిరణ్ మినార్, జహంగీర్ కు అత్యంత ఇష్టమైన జింకకు నివాళి
-
లాహోర్ లో నూర్జహాన్ సమాధి
-
లాహోర్ లోని జహంగీర్ సమాధి
-
బహవల్ పూర్ లోని నూర్ మహల్
-
జీలం నది, పంజాబ్ లో ప్రధానమైన ఐదు నదుల్లో ఒకటి
-
ఇస్లామాబాద్ సమీపంలోని మన్కియాలా స్తూపం
-
చండీగఢ్ లోని ఓపెన్ హ్యాండ్ చిహ్నం
-
జమ్మూలోని అమర్ మహల్ మ్యూజియం
-
-
ష్రైన్ బాబా బుద్ధా జీ, నాకోదర్
మూలాలు
This article uses material from the Wikipedia తెలుగు article పంజాబ్ ప్రాంతం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.