సొమాలియా

సోమాలియా; (ఆంగ్లం: Somalia) (సోమాలియా భాష : సూమాలియా) ; (అరబ్బీ الصومال ; అస్-సూమాల్), ఆధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా (అల్ జమ్‌హూరియా అస్-సూమాల్ - جمهورية الصومال ).

ఇది ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిశలో(హార్ను ఆఫ్ ఆఫ్రికా) ఉంది. దీనికి వాయవ్యసరిహద్దులో జిబౌటి, నైరుతిసరిహద్దులో కెన్యా, ఉత్తరసరిహద్దులో "అడెను అఖాతము", యెమన్, తూర్పుసరిహద్దులో గుయార్డఫీ కాలువ - సొమాలీ సముద్రం, పశ్చిమసరిహద్దులో ఇథియోపియాలు ఉన్నాయి. ఆఫ్రికా ప్రధానభూభాగంలో సొమాలి పొడవైన సముద్రతీరం కలిగి ఉంది. ఈ దేశంలో దీర్ఘకాలిక అంతర్యుద్ధం వలన అభివృద్ధి క్షీణించినది. తద్వారా ఈ దేశపు కరెన్సీ విలువ తీవ్రంగా పతనమైంది. ఒక్క కప్పు కొనడానికి ఒక కేజీ కరెన్సీ కట్టలు పోసుకొని పోవాల్సివస్తుంది.ఈ దేశంలోని ఉత్తర ప్రాంతము స్వాతంత్రం ప్రకటించుకొని సోమాలిల్యాండ్ అనే దేశంగా ఏర్పడింది. కానీ ఈ దేశాన్ని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం ఇంకా గుర్తించలేదు. ఈ దేశం కి హిందూ మహాసముద్రం తో తీరరేఖ ఉండడంతో ఈ దేశ ప్రజలు ఉపాధి లేక అటుగా వెళ్ళే పడవలపై దొంగతనాలు చేసే వాళ్ళు దాంతో ఈ దేశం పై దొంగల దేశం అనే ముద్ర పడింది. ప్రస్తుతం అగ్ర దేశాల సహాయంతో కొంతమేరకు అంతర్యుద్ధాన్ని నిలువరించగలుగుతుంది. సొమాలీలో అధికంగా పీఠభూములు, మైదానాలు, పర్వతప్రాంతాలు ఉన్నాయి. సంవత్సరం అంతా వేడి వాతావరణం నెలకొని ఉంటుంది. క్రమానుగత పవనాలు, క్రమానురహిత వర్షాలు ఉంటాయి..ఈ దేశపు ఇటాలియన్ సోమాలీలాండ్ ఇటలీ నుండి జూలై 1 1960 లోను, అదే సంవత్సరం, బ్రిటిష్ సొమాలీలాండ్ తో కలుపబడి, జూన్ 26 1960 న స్వాతంత్ర్యం పొందినది.

[జమ్‌హూరియాద్దా సూమాలియా] Error: {{Lang}}: text has italic markup (help)
రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా (సోమాలియా గణతంత్రం)
Flag of సోమాలియా సోమాలియా యొక్క చిహ్నం
జాతీయగీతం
[Soomaaliyeey Toosoow] Error: {{Lang}}: text has italic markup (help)
సోమాలియా, వేక్ అప్
సోమాలియా యొక్క స్థానం
సోమాలియా యొక్క స్థానం
రాజధానిమొగదిషు
2°02′N 45°21′E / 2.033°N 45.350°E / 2.033; 45.350
అతి పెద్ద నగరం మొగదిషు
అధికార భాషలు సోమాలి, అరబిక్
ప్రజానామము సోమాలి
ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం
 -  అధ్యక్షుడు షేక్ షరిఫ్ షేక్ అహ్మద్
 -  ప్రధాన మంత్రి ఒమర్ అబ్దిరషిద్ అలి షర్ మర్కె
స్వాతంత్ర్యం బ్రిటన్, ఇటలీ నుండి 
 -  తేది 26 జూన్, 1 జూలై, 1960 
 -  జలాలు (%) 1.6
జనాభా
 -  2008 అంచనా 9,558,666 (85 వది)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $5.575 billion (153rd)
 -  తలసరి $600 (222nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2009) N/A (low) (Not Ranked)
కరెన్సీ సోమాలి షిల్లింగ్ (SOS)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ en:.so (currently not operating)
కాలింగ్ కోడ్ +252
1 The World Factbook
2 BBC News
3 Transitional Federal Charter of the Somali Republic

సోమాలియా జనాభా సుమారు 14.3 మిలియన్లు అంచనా వేయబడింది. సాంస్కృతికంగా ఇది ఆఫ్రికాలో అత్యంత ఏకజాతీయ దేశంగా వర్ణించబడింది. ప్రజలలో 85% సోమాలీ ప్రజలు ఉన్నారు. వీరు చారిత్రాత్మకంగా దేశంలోని ఉత్తర భాగంలో నివసిస్తూ ఉన్నారు. అల్పసంఖ్యాక వర్గాలు అధికంగా దక్షిణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.సోమాలీ, అరబిక్ అధికారిక భాషలుగా ఉన్నాయి. దేశంలో ముస్లింలు అధికంగా ఉన్నారు. వీరిలో సున్ని ముస్లిములు అధికంగా ఉంటారు.

ప్రాచీన కాలంలో సోమాలియా ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇది పూర్వపు పురాతన పుంటు ప్రజల అత్యంత ప్రభావవంతమైన ప్రదేశాలలో ఒకటి. మధ్యయుగ కాలంలో శక్తివంతమైన సోమాలి సామ్రాజ్యాలు అనేకం ప్రాంతీయ వాణిజ్యాన్ని ఆధారం చేసుకున్నాయి; అజురను సామ్రాజ్యం, అడాలు సుల్తానేటు, వార్సాంగి సుల్తానేటు, సుల్తానేటు ఆఫ్ ది గెలీడిలతో సహా. సోమాలియాకు ఈ పేరు ఇటాలీ అన్వేషకుడు లుయిగి రోబెచీ బ్ర్రిచెట్టీ (1855-1926) చేత పెట్టబడింది.


19 వ శతాబ్దం చివరలో బ్రిటిషు, ఇటాలీ సామ్రాజ్యాలు బ్రిటిషు సోమాలియాండు, ఇటలీ సోమాలిలాండు కాలనీలను స్థాపించాయి. అంతర్గత వ్యవహారాలలో మొహమ్మద్ అబ్దుల్లా హాసను దర్విషు తిరుగుబాటుతో బ్రిటీషును నాలుగు సార్లు తిప్పికొట్టాడు. సోమాలియాండు పోరాటంలో (1920) లొంగిపోకముందు తీరానికి తిరోగమనం చేయించాడు. పాలక మజెర్రిను సుల్తానేటు, హొబ్యో సుల్తానేటుకు వ్యతిరేకంగా పోరాటం విజయవంతంగా నిర్వహించిన తరువాత ఈ ప్రాంతం ఈశాన్య, మధ్య, దక్షిణ ప్రాంతాల మీద పూర్తి నియంత్రణ లభించింది. 1960 లో రెండు ప్రాంతాలు ఒక పౌర ప్రభుత్వానికి స్వతంత్ర సొమాలియా రిపబ్లికును ఏర్పరచటానికి విలీనం అయ్యాయి.

1969 లో సుప్రీం రివల్యూషనరీ కౌన్సిలు అధికారాన్ని స్వాధీనం చేసుకుని " సొమాలీ డెమొక్రటికు రిపబ్లికు " ను స్థాపించింది. 1991 లో సోమాలియా పౌర యుద్ధం ప్రారంభమైన తరువాత ఇది పతనం అయింది. ఈ కాలంలో చాలా ప్రాంతాలు సంప్రదాయ, మతపరమైన చట్టాలకు తిరిగి వచ్చాయి. 2000 ల ప్రారంభంలో తాత్కాలిక సమాఖ్య పాలనా యంత్రాంగం ఏర్పడింది. 2000 లో ట్రాన్స్మిషినలు నేషనలు గవర్నమెంటు (టి.ఎన్.జి) స్థాపించబడింది. దాని తరువాత 2004 లో ట్రాన్స్మిషను ఫెడరలు గవర్నమెంటు (టి.ఎఫ్.జి) ఏర్పడింది. తరువాత సైనిక ప్రభుత్వం పునఃస్థాపించబడింది.2006 లో టి.ఎఫ్.జి. కొత్తగా ఏర్పడిన ఇస్లామికు కోర్ట్సు యూనియను (ఐ.సి.యు) దేశం దక్షిణ వివాదాంతర మండలాల అధికారాన్ని నియంత్రించింది. తరువాత ఐ.సి.యు. అల్-షాబాబు వంటి మరింత తీవ్రమైన సమూహాలుగా చీలిపోయింది. ఇది ఈ ప్రాంతం నియంత్రణ కోసం టి.ఎఫ్.జి. దాని ఆఫ్రికన్ యూనియను మిషను టొ సోమాలియా మిత్ర పక్షాలతో పోరాడారు.

2012 మధ్య నాటికి తిరుగుబాటుదారులు తాము స్వాధీనం చేసుకున్న భూభాగంలోని చాలా ప్రదేశాలను కోల్పోయారు. మరింత శాశ్వత ప్రజాస్వామ్య సంస్థల కోసం ఒక శోధన ప్రారంభమైంది. 2012 ఆగస్టులో ఒక కొత్త తాత్కాలిక రాజ్యాంగం ఆమోదించబడింది, ఇది ఒక సమాఖ్యగా సోమాలియాను సంస్కరించింది. అదే నెలలో సోమాలియా ఫెడరలు ప్రభుత్వం ఏర్పడింది. మొగడిషులో పునర్నిర్మాణ కాలం ప్రారంభమైంది. సోమాలియా ఒక అనధికారిక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది; ప్రధానంగా పశువుల ఆధారంగా, సోమాలీ విదేశీ ఉపాధిదారుల వేతనాలు - టెలీకమ్యూనికేషంసు నుండి చెల్లింపులు. ఇది ఐక్యరాజ్యసమితి, అరబు లీగు, ఆఫ్రికన్ యూనియన్, నాన్- అలైండు మూవ్మెంటు, ఆర్గనైజేషను ఆఫ్ ఇస్లామికు కోపరేషనులలో సభ్యదేశంగా ఉంది.

చరిత్ర

సొమాలియా 
Pathway in old Erigavo.
సొమాలియా 
The Dahabshiil in Hargeisa.
సొమాలియా 
The Hargeisa International Airport in Hargeisa.
సొమాలియా 
Head details

చరిత్రకు పూర్వం

సోమాలియాను కనీసం పాలియోలిథికు కాలం నుండి మానవ నివాసితప్రాంతంగా ఉందని గుర్తించారు. రాతియుగం కాలంలో, డయాను, హర్జియిసెను సంస్కృతులు ఇక్కడ వృద్ధి చెందాయి. హార్ను ఆఫ్ ఆఫ్రికాలోని సోమాలియాలో క్రీ.పూ. 4 వ సహస్రాబ్ది నాటి సమాధులలో లభించిన ఖనన ఆచారాల పురాతన సాక్ష్యాలు లభించాయి. 1909 లో ఉత్తరాన జలేలో ప్రాంతంలో లభించిన రాతి ఉపకరణాలు తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య పాలోయోలితికు కాలానికి చెందిన కళాకృతులుగా పురావస్తు విశ్వవిద్యాలయం వర్గీకరించింది.

భాషావేత్తల ప్రకారం నియోలిథికు యుగంలో మొట్టమొదటి ఆఫ్రోయాసిటిక్-మాట్లాడే ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకుని నీలు వ్యాలీ (నియర్ ఈస్టు)ప్రాంతంలో నివసించారు.

వాయువ్య సోమాలియాలోని హర్జిసా శివార్లలో ఉన్న లాసు గీలు కాంప్లెక్సు సుమారు 5,000 సంవత్సరాలకు పూర్వం మానవ నివాసిత ప్రాంతంగా ఉందన్నదానికి సాక్ష్యంగా అడవి జంతువులను, అలంకరించబడిన ఆవులను చిత్రించిన రాతి చిత్రాలు ఉన్నాయి. ఉత్తర ధంబాలన్ ప్రాంతంలో ఇతర గుహా చిత్రాలు కనిపిస్తాయి. ఇది ఒక వేటగాడు గుర్రపువెనుకభాగంలో కూర్చున్న చిత్రం మొట్టమొదటి వర్ణనలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ రాతి కళ ప్రత్యేకమైన ఇథియోపియా- అరేబియా శైలిలో ఉంది. ఇది క్రీ.పూ. 3,000-1000 కాలానికి చెందినదని భావిస్తున్నారు. అదనంగా ఉత్తర సోమాలియాలోని లాసు ఖొరీ, ఎల్ అయో పట్టణాల మధ్య కరీన్హేగనె ప్రాంతంలో నిజమైన, పౌరాణిక జంతువుల అనేక గుహ చిత్రాలు ఉన్నాయి. ప్రతి చిత్రం క్రింద ఒక శిలాశాసనం ఉంది. ఇది సమిష్టిగా దాదాపు 2,500 సంవత్సరాల పూర్వం నాటివని అంచనా వేయబడింది.

సంప్రదాయ యుగం

పురాతన పిరమిడు నిర్మాణాలు, సమాధి స్థలాలు, శిధిలమైన నగరాలు, " వార్గాడే గోడ " వంటి రాతి గోడలు సోమాలి ద్వీపకల్పంలో వృద్ధి చెందిన పాత నాగరికతకు ఆధారాలుగా ఉన్నాయి. ఈ నాగరికత పురాతన ఈజిప్టు, మైసెనీయా గ్రీసుతో ఒక వ్యాపార సంబంధాన్ని అనుభవించింది. ఇది క్రీ.పూ రెండవ సహస్రాబ్ది నుండి సోమాలియా లేదా ప్రక్కనే ఉన్న ప్రాంతాలు పురాతన నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయనడానికి సాక్ష్యంగా ఉంది. ఈజిప్షియన్లు, ఫోనీషియన్లు, బాబిలోనియన్లు, భారతీయులు, చైనీయులు, రోమన్లు ​​వారి వ్యాపార నౌకాశ్రయాల ద్వారా మిర్త్, సుగంధ ద్రవ్యాలు, బంగారం, ఇబోనీ కలప, చిన్న కొమ్ముల పశువులు, దంతాలు, ఫ్రాంకింసెంసు వర్తకం చేశాయి. పుంటు ప్రజల మీద 18 వ రాజవంశం రాణి హాత్షెప్సుటు ప్రేరేపిత ఈజిప్టు దండయాత్ర జరిగిందని పుంటు రాజు పంపహు, క్వీను ఆతిల పాలనలో డేర్ ఎల్-బహరి ఆలయంలోని రిలీఫ్లపై నమోదు చేయబడింది. 2015 లో ఈజిప్టుకు పుంటు నుండి బహుమతిగా తీసుకొచ్చిన పురాతన బబూను మమ్మీల ఐసోటోపికు విశ్లేషణ ఈ నమూనాలు తూర్పు సోమాలియా, ఎరిట్రియా-ఇథియోపియా కారిడారుతో కూడిన ప్రాంతం నుండి వచ్చాయని సూచించింది.

సాంప్రదాయ శకంలో సోమాలిసుకు పూర్వం ఉండే మాక్రోబియన్లు ఈ ప్రాంతంలో గిరిజన రాజ్యాన్ని స్థాపించి ఆధునిక సోమాలియాలోని పెద్ద భాగాలను శక్తివంతంగా పరిపాలించారు. వారు దీర్ఘాయువు, సంపదకు పేరు గాంచారు. " పురుషులు ఎత్తైన, ఆకర్షణీయంగా " ఉన్నారని అని చెప్పబడింది. మాక్రోబియన్లు యోధుల జతుపోషణ, సముద్రయాననానికి ప్రసిద్ధి చెందారు. హెరోడోటసు నివేదిక ప్రకారం పర్షియా చక్రవర్తి రెండవ కాంబిసెసు క్రీ.పూ. 525 లో ఈజిప్టును జయించి మాక్రోబియాకు రాయబారులను పంపించాడు. మాక్రోబియాను రాజుకు లొంగిపోయి బహుమతిని ఇచ్చాడు. పర్షియన్లు తన డ్రాఫ్ట్, సౌందర్యాన్ని బట్టి ఎన్నుకోబడిన మాక్రోబాయ్ పాలకుడి బదులుగా అతని పర్షియాప్రత్యర్ధికి ఒక సవాలుగా ఉన్న విల్లు రూపంలో ఒక సవాలును బదులిచ్చారు: పర్షియన్లు దానిని డ్రా చేయగలిగితే వారు అతని దేశానికి దాడి చేసే హక్కు కలిగి ఉంటారు; కానీ అప్పటి వరకు మాక్రోబియస్ తమ సామ్రాజ్యాన్ని దాడి చేయటానికి నిర్ణయించని దేవతలను వారు కృతజ్ఞతలు తెలుపుతారు. మాక్రోబియన్లు వారి ఆధునిక వాస్తుశిల్పం, బంగారు సంపదకు పేరుగాంచిన ప్రాంతీయ శక్తిగా ఉన్నారు. వారు తమ ఖైదీలను బంగారు గొలుసులతో బంధించారు కనుక వారు చాలా సమృద్ధిగా ఉండేవారని భావిస్తున్నారు.

క్రీ.పూ 2 వ - 3 వ సహస్రాబ్ది మధ్య కాలంలో హార్న్ ప్రాంతంలో ఒంటె పెంపుడు జంతువులుగా అలవాటు చేయబడిందని భావిస్తున్నారు. అక్కడ నుండి ఈజిప్టు, మాగ్రేబులకు వ్యాపించింది. సాంప్రదాయ కాలములో ఉత్తర బెర్బరా నగరాలైన మోసిలాను, ఒపోనె, ముండసు, ఇసిసు, మాలావొ, అవాలైట్సు, ఎస్సిన, నికాను, సరపియాను లాంటివి వాణిజ్య లావాదేవీలను అభివృద్ధి చేశాయి. ఇవి టోలెమికు ఈజిప్టు, ప్రాచీన గ్రీసు, ఫెనోసియా, పార్టియను పర్షియా, సాబా, నాబాటీయను కింగ్డం, రోమను సామ్రాజ్యంలకు చెందిన వర్తకులతో వాణిజ్యం చేసారు. వారు వారి కార్గో రవాణా చేయడానికి " బెడెను " అని పిలిచే పురాతన సోమాలియా సముద్ర ఓడను ఉపయోగించారు.

నబటీయను సామ్రాజ్యం మీద రోమను విజయం తరువాత ఏడెను వద్ద రోమను నౌకాదళం ఆధిఖ్యత సాధించడానికి చేసిన ప్రయత్నంలో అరబు, సోమాలి వ్యాపారులు అరేబియా ద్వీపకల్పంలోని స్వేచ్ఛాయుత నౌకాశ్రయ నగరాలలో వాణిజ్యం నుండి భారత నౌకలను అడ్డుకునేందుకు రోమన్లతో చేయికలిపారు. ఎర్రసముద్రం, మధ్యధరా సముద్రాల మధ్య లాభదాయకమైన వాణిజ్యంలో సోమాలి, అరబు వ్యాపారులు అగ్రస్థానంలో ఉన్నారు. అయినప్పటికీ రోమను జోక్యం నుండి తప్పించుకుని భారతీయ వ్యాపారులు సోమాలి ద్వీపకల్పంలోని పోర్టు నగరాలలో వాణిజ్యాన్ని కొనసాగించారు.

సొమాలియా 
పంట్ యొక్క రాజు పెరుహు యొక్క భార్య రాణి ఆతి, డేర్ ఎల్-బహిరీలోని ఫారో హాత్షెప్సుట్ ఆలయంలో చిత్రీకరించబడింది

శతాబ్దాలుగా, భారతీయ వ్యాపారులు సిలోను, స్పైసు ఐలాండ్సు నుండి సోమాలియా, అరేబియాకు పెద్ద మొత్తంలో దాల్చినచెక్కలను తెచ్చారు. దాల్చినచెక్క, ఇతర మసాలా దినుసుల మూలాన్ని అరేబియా, సోమాలి వ్యాపారులు రోమను, గ్రీకు ప్రపంచాల నుండి దాచిన ఉత్తమంగా ఉంచబడిన రహస్యంగా చెప్పబడింది; రోమన్లు ​, గ్రీకులు అది సోమాలి ద్వీపకల్పంగా ఉన్నట్లు విశ్వసించారు. సోమాలి, అరబు వర్తకుల మధ్య ఉత్తర అమెరికా, నియరు ఈస్టు, ఐరోపాలో భారతీయ, చైనీసు దాల్చినచెక్క ధరను పెంచి, దాల్చిన చెక్క వాణిజ్యాన్ని చాలా లాభదాయక రాబడి జెనరేటరుగా ప్రత్యేకంగా సోమాలి వ్యాపారులకు పంపారు. వారు దీనిని పెద్ద మొత్తంలో సముద్ర, భూమార్గాలలో రవాణా చేసారు.

సొమాలియా 
లాస్ గీల్ కాంప్లెక్స్ వద్ద నియోలిథిక్ రాక్ కళ ఒక దీర్ఘ-కొమ్ముల ఆవును చిత్రీకరిస్తుంది

ఇస్లాం పుట్టుక

సొమాలియా 
The Silk Road extending from China to southern Europe, Arabia, Somalia, Egypt, Persia, India, and Java.

మసీదు అల్-ఖిబ్లతెను తర్వాత త్వరలోనే అరేబియా ద్వీపకల్పం నుండి సొమాలియాకు ఇస్లాంకు పరిచయం చేయబడింది. జైలా రెండు-మిహిబు మస్జిద్ అల్-ఖిబ్లతెను 7 వ శతాబ్దానికి చెందినది. ఇది ఆఫ్రికాలో అత్యంత పురాతనమైన మసీదు. 9 వ శతాబ్దం చివరలో, అల్-యాకుబీ ఉత్తర సోమాలియా సముద్రతీరంలో ముస్లింలు నివసిస్తున్నారని రాశారు. అడాలు రాజ్యం తన రాజధానిని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. లియో ఆఫ్రికానసు ప్రకారం అడాలు సుల్తానేటు స్థానిక సోమాలి రాజవంశాలు చేత పాలించబడింది. దాని రాజ్యం బాబెలు ఎల్ మండేబు, కేప్ గార్డఫూల మధ్య విస్తరించింది. ఇది అజ్రను సామ్రాజ్యం, పశ్చిమాన అబిస్సినియను సామ్రాజ్యం ద్వారా దక్షిణాన వ్యాపించింది.

సొమాలియా 
అడాలు సుల్తాను (కుడి), అతని సైనికులు రాజా యాగ్బీ-సియోను, అతని మనుషులతో పోరాడుతూ ఉన్నారు. లి లిర్వే డెసు మెర్వేలేసు, 15 వ శతాబ్దం నుండి

1332 లో అడాలు చక్రవర్తి అడా మొదటి సెలాను నగరాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించి చేసిన పోరాటంలో జైలాకు చెందిన అడాలు రాజు చంపబడ్డాడు. ఐజాటు చివరి సుల్తాను, సాద్దు రెండవ డిడిను 1410 లో జియాలోని చక్రవర్తి మొదటి డావిటు చంపబడినప్పుడు ఆయన పిల్లలు 1415 లో తిరిగి రావడానికి ముందు యెమెన్లో తప్పించుకున్నారు. 15 వ శతాబ్దం ప్రారంభంలో అడాలు రాజధాని దక్కరు పట్టణంలో మరింత అంతర్భాగంగా మారింది. ఇక్కడ సాదరు రెండవ అడ్విను, పెద్ద కుమారుడు రెండవ సబ్రే అద్ దిన్ యెమెన్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఒక నూతన స్థావరాన్ని స్థాపించాడు.

సొమాలియా 
అజురన్ సుల్తానేట్ మింగ్ రాజవంశం, ఇతర సామ్రాజ్యాలతో వాణిజ్యపరమైన సంబంధాలను కొనసాగించింది

అడాలు ప్రధాన కార్యాలయాలు తరువాతి శతాబ్దం తరువాత దక్షిణంగా హరార్కు మార్చబడ్డాయి. ఈ నూతన రాజధాని నుండి అడాలు అబిస్సినియను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఇమాము అహ్మదు ఇబ్ను ఇబ్రహీం అల్-ఘాజీ (అహ్మద్ "గెరీ" లేదా "గ్రాన్", రెండింటిని "ఎడమచేతివాదం") నేతృత్వంలో సమర్థవంతమైన సైన్యాన్ని నిర్వహించాడు. 16 వ శతాబ్దపు పోరాటం చారిత్రాత్మకంగా అబిస్సినియా (ఫుటుహ్ అల్-హబాష్) కాంక్వస్టుగా పిలువబడుతుంది. యుద్ధ సమయంలో ఇమాం అహ్మదు ఒట్టోమను సామ్రాజ్యం అందించిన ఫిరంగులను ఉపయోగించుకున్నాడు. అతను జైలా ద్వారా దిగుమతి చేసుకుని అబిస్సినియా దళాలకు, క్రిస్టోవ్వో డా గామా నేతృత్వంలో వారి పోర్చుగీసు మిత్రులకు వ్యతిరేకంగా నియమించాడు. ఈ వివాదం ఇరువైపుల వారి ఉపయోగం ద్వారా మ్యాచి లాకు మస్కెటు, ఫిరంగి, సాంప్రదాయ ఆయుధాల మీద తుపాకీల విలువను నిరూపించిందని కొందరు పరిశోధకులు వాదించారు.


అజురాను సుల్తానేటు కాలంలో మెర్కా, మొగడిషు, బరావా, అరేబియా, హొబ్యొ సుసంపన్నంగా ఉన్న సమయంలో భారతదేశం, వెనెటియాల పర్షియా, ఈజిప్టు, అజ్మీరు, నుండి వచ్చే నౌకలు, వారి సంబంధిత ఓడరేవులు, పోర్చుగలు, చాలా దూరంగా ఉన్న చైనాతో విలాసవంతమైన వాణిజ్య సంబధాలు అభివృద్ధి చేసారు. 15 వ శతాబ్దంలో మోగాదిషు చేత ఆమోదించబడిన వాస్కో డ గామా, ఇసుకతో కూడిన మినార్లతో ఉన్న అనేక మసీదులతో పాటు, దాని మధ్యలో ఉన్న అనేక పెద్ద, పెద్ద రాజభవనాలను కలిగి ఉన్న పెద్ద నగరాన్ని దాటాడని వర్ణించబడింది. సోమాలియా తర్చెర్చరు, హోర్ను లోని ఇతర ప్రాంతాలలో నివసించిన ఎత్తైన హమితి సమూహమైన హర్లాలో వివిధ తుమ్మూలను నిర్మించింది. జాతి సోమాలీయులకు ఈ మనుష్యులు పూర్వీకులుగా భావిస్తున్నారు.

16 వ శతాబ్దంలో, డ్యుర్టే బార్బోసా, ఆధునిక భారతదేశంలో కంబయ రాజ్యంలో అనేక నౌకలు వస్త్రాలు, సుగంధాలతో మోగాడిషుకు రవాణా చేయబడ్డాయి. వీటి కోసం వారు బంగారు, మైనపు, దంతం తీసుకుని తిరిగి వచ్చారు. బార్బోసా విఫణిలో మాంసం, గోధుమ, బార్లీ, గుర్రాలు, తీరప్రాంత విపణిలలో పండ్లు సమృద్ధిగా ఉండేవి. ఇది వ్యాపారులకు గొప్ప సంపదను సృష్టించింది. మొగడిషు, మెర్కా, బరావాతో " టోబాబు బెనాడిరు " (ఈజిప్టులోని మార్కెట్లు కోసం ప్రత్యేకమైనది, ఇతర ప్రదేశాలలో ) పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విఫణి మొంబాసా, మలిందికి చెందిన స్వాహిలీ వ్యాపారులకి, కిల్వా నుండి బంగారు కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది. హోర్ముజు నుండి యూదు వ్యాపారులు భారతీయ వస్త్రాలను, పండ్లకు బదులుగా సొమాలీకి చెందిన ధాన్యం, చెక్కకు కొనుగోలు చేయబడింది.


15 వ శతాబ్దంలో మలాక్కాలో ట్రేడింగు సంబంధాలు స్థాపించబడ్డాయి.ఈ విఫణిలో వస్త్రం, ఆమ్బెర్గ్రిసు, పింగాణీ వ్యాపారం ప్రధాన వస్తువులుగా ఉన్నాయి. జిరాఫీలు, జీబ్రాలు, ధూపం చైనా మింగు సామ్రాజ్యానికి ఎగుమతి చేయబడ్డాయి. తూర్పు ఆసియా, హార్ను మధ్య వాణిజ్యానికి సోమాలి వ్యాపారులు నాయకులుగా వ్యవహరించారు. సూరతు, ఆగ్నేయ ఆఫ్రికా వ్యాపారులు హిందూ వర్తకులు పోర్చుగీసు అడ్డగింత, ఒమాని జోక్యం రెండింటిని అధిగమించడానికి మెర్కా, బరావా సోమాలీ ఓడరేవులను ఉపయోగించారు (ఇవి రెండు శక్తుల అధికార పరిధికి దూరంగా ఉన్నాయి).

ఆధునిక కాలం ప్రారంభం

సొమాలియా 
Mohammed Abdullah Hassan, leader of the Dervish movement.

సోమాలియాలో ఆధునిక కాలంలో అడాలు సుల్తానేటు, అజురాను సుల్తానేటు తదుపరి రాష్ట్రాలు వృద్ధి చెందాయి. వీటిలో వార్సంగాలి సుల్తానేటు, బారి రాజవంశాలు, గెలీడి సుల్తానేటు (గోబ్రోను రాజవంశం), మాజెర్టిను సుల్తానేటు (మిగ్యుర్టినియ), హిందో సుల్తానేటు (ఓబ్బియా) ఉన్నాయి. వారు మునుపటి సోమాలి సామ్రాజ్యాలు స్థాపించిన కోట-నిర్మాణం, సముద్ర సంబంధ వర్తక సంప్రదాయాన్ని కొనసాగించారు.

గోబ్రోను హౌసు 3 వ సుల్తాను " సుల్తాను యూసుఫు మహాముదు ఇబ్రహీం " పాలనలో గోబ్రోను రాజవంశం స్వర్ణ యుగం ప్రారంభం అయింది. ఈ ప్రాంతంలో స్థిరత్వం పునరుద్ధరించబడింది. తూర్పు ఆఫ్రికా దంతపు వ్యాపారాన్ని పునరుజ్జీవింపజేసిన బర్దెరే జిహాదు సమయంలో ఆయన సైన్యం విజయం సాధించింది. ఆయన పొరుగు, సుదూరంలో ఉన్న ఒమాని, విటు, యెమెను సుల్తాను వంటి సాంరాజ్య పాలకుల బహుమతులను అందుకున్నాడు.

సుల్తాను ఇబ్రహీం కుమారుడు అహ్మదు యూసఫు ఆయన తరువాత వారసుడయ్యాడు. 19 వ శతాబ్దపు తూర్పు ఆఫ్రికాలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకడుగా ఒమాని గవర్నర్ల నుండి నివాళిని పొందాడు. తూర్పు ఆఫ్రికా తీరంలో ముఖ్యమైన ముస్లిం కుటుంబాలతో పొత్తులు సృష్టించాడు. ఉత్తర సోమాలియాలో గెరాడు రాజవంశం యెమెను, పర్షియాతో వాణిజ్యాన్ని నిర్వహించి బారి రాజవంశం వ్యాపారులతో పోటీ పడింది. గెరాడు, బారి సుల్తానులు ఆకట్టుకునే రాజభవనాలు, కోటలను నిర్మించారు. సమీప ప్రాచ్యంలో అనేక సామ్రాజ్యాలతో దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నారు.

సొమాలియా 
హఫూన్లో మేజిరీన్ సుల్తానేటు కోటలు ఒకటి.
సొమాలియా 
మొగడిషు డౌను టౌను ఇటాలీ సొమాలియాండు రాజధాని, కాథలికు కేథడ్రాలు, ఇటలీ రాజు మొదటి ఉంబెర్టో గౌరవించటానికి ఆర్చి స్మారక చిహ్నం

19 వ శతాబ్దం చివరలో 1884 నాటి బెర్లిను సమావేశం తరువాత ఐరోపా శక్తుల మద్య ఆఫ్రికాలో ఆధిఖ్యత కొరకు పెనుగులాట ప్రారంభమయింది. డెర్విషు నాయకుడు మొహమ్మదు అబ్దుల్లా హాసనును ప్రేరేపించింది. ఆయన " హార్ను ఆఫ్ ఆఫ్రికా " అంతటా మద్దతునివ్వటానికి దీర్ఘకాల వలసవాద నిరోధక యుద్ధాలలో ఒకదాన్ని ప్రారంభించింది. తన కవితలు, ఉపన్యాసాలలో అనేకమంది బ్రిటీష్వారు "మా మతాన్ని ధ్వంసం చేశారని, మా పిల్లలను వారి పిల్లలను చేశారని", బ్రిటీష్వారితో లీగులో క్రిస్టియను ఇథియోపియన్లు సోమాలి దేశాల రాజకీయ, మత స్వేచ్ఛను కొల్లగొట్టడానికి వత్తిడి చేసారని నొక్కి చెప్పాడు. ఆయన "తన దేశం రాజకీయ, మత స్వేచ్ఛ విజేతగా, క్రిస్టియను ఆక్రమణదారులకు వ్యతిరేకంగా దీనిని రక్షించే " దిశగా ఎదిగాడు.

సోమాలియా ఐక్యత లక్ష్యాన్ని అంగీకరించని, ఆయన నాయకత్వంలో పోరాడని సోమాలి జాతీయవాది కాఫిరు (గాల్గా) పరిగణించబడతారని హస్సను ఒక మతపరమైన శాసనం జారీ చేసాడు. ఒట్టోమను సామ్రాజ్యం, సూడాను, ఇతర ఇస్లామికు, అరేబియా దేశాల నుండి ఆయన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. సోమాలియాలోని వివిధ ప్రాంతాల నిర్వహణకు మంత్రులు, సలహాదారులను నియమించాడు. అదనంగా సోమాలి ఐక్యత, స్వాతంత్ర్యం కొరకు దళాలను నిర్వహించాలని ఆయన ఒక పిలుపునిచ్చాడు.

హస్సాను డెర్విషు ఉద్యమం ముఖ్యమైన సైనిక పాత్రను పోషించింది. డెర్విషు తిరుగుబాటు " సలిహియా బ్రదరు హుడు " నమూనాలో రూపొందించబడింది. ఇది దృఢమైన సోపానక్రమం, కేంద్రీకరణగా వర్గీకరించబడింది. సముద్రంలోకి క్రైస్తవులను నడుపుతానని హస్సాను బెదిరించి 20 ఆధునిక రైఫిల్సుతో తన 1,500 డెర్ర్విషులతో బ్రిటీషు సైనికుల మీద తన మొదటి ప్రధాన సైనిక దాడిని ప్రారంభించాడు. ఆయన బ్రిటీషును నాలుగు మార్లు సాహసంతో తిప్పికొట్టాడు. ఒట్టోమన్లు ​, జర్మనీ కేంద్రశక్తులతో సంబంధాలను అభివృద్ధి చేసాడు. 1920 లో బ్రిటీషు తీవ్ర వైమానిక బాంబు దాడుల తరువాత డెర్విషు ఉద్యమం కుప్పకూలింది. డర్వీషు భూభాగాలు తరువాత రక్షితప్రాంతాలుగా మార్చబడ్డాయి.

1920 ల ప్రారంభంలో ఫాసిజం పురోగమనం ఇటలీ వ్యూహాత్మక మార్పుకు కారణంగా మారింది. ఫాసిస్టు ఇటలీ ప్రణాళిక ప్రకారం ఉత్తర-తూర్పు సుల్తానేట్లు లా గ్రాండే సోమాలియా సరిహద్దులలోకి ప్రవేశించేలా వత్తిడి చేయబడ్డాయి. 1923 డిసెంబరు 15 న గవర్నరు " సిసారే మరియా డి వెచ్చి " నియమించిన తరువాత సొమాలియాండు భాగాన్ని ఇటాలీ సొమాలియాండు అని పిలిచారు. ఇటలీ ఈ ప్రాంతాలలో వరుస రక్షణ ఒప్పందాల ఆధీనత ప్రదర్శించింది కానీ ప్రత్యక్ష పాలన చేయలేదు.

ఫాసిస్టు ప్రభుత్వం బెనాడిరు భూభాగంలో మాత్రమే ప్రత్యక్ష పాలన చేసింది. 1935 లో బెనిటో ముస్సోలినీ నాయకత్వంలో ఫాసిస్టు ఇటలీ అబిస్సినియా (ఇథియోపియా) వలసరాజ్యంగా మార్చే లక్ష్యంతో దాడి చేసింది. ఈ దండయాత్రను లీగు ఆఫ్ నేషన్సు ఖండించింది. కానీ అది దాడిని ఆపడానికి లేదా ఆక్రమిత ఇథియోపియాని విముక్తి చేయటానికి చాలా తక్కువ ప్రయత్నం చేసింది. 1940 ఆగస్టు 3 న ఇటాలియను దళాలు సోమాలీ వలస భూభాలతో సహా ఇథియోపియాను స్వాధీనం చేసుకుని బ్రిటిషు సోమాలియాండు మీద దాడి చేసి ఆగస్టు 14 నాటికి బ్రిటిషు నుండి బెర్బెరాను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాయి.

అనేక ఆఫ్రికన్ దేశాల దళాలతో ఒక బ్రిటీషు దళం 1941 జనవరిలో కెన్యా నుండి బ్రిటిషు సోమాలియాండు ఇటలీ-ఆక్రమిత ఇథియోపియాను స్వాధీనం చేసుకునేందుకు పోరాటం చేసింది. ఫిబ్రవరి నాటికి ఇటాలీ సోమాలియాండు అధిక భాగం స్వాధీనం అయింది. మార్చి నాటికి బ్రిటిషు సోమాలీయాడు తిరిగి స్వాధీనం చేసుకోబడింది. సోమాలియాడు నుండి నిర్వహించబడిన బ్రిటీషు సామ్రాజ్యం దళాలు దక్షిణాఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా దళాలుగా మూడు విభాగాలుగా విభజించబడ్డాయి. అబ్దుల్లాహీ హసను నేతృత్వంలోని ఇస్సాకు, దుల్బహాంతే, వార్సాంగాలి వంశాలకు చెందిన సోమాలి దళాలు బ్రిటిషు దళాలకు నాయకత్వం వహించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటాలీ సోమాలీయుల సంఖ్య తగ్గిపోయింది. 1960 లో ఇది 10,000 కంటే తక్కువగా ఉంది.

స్వతంత్రం (1960–1969)

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటను సోమాలియాండు, ఇటాలీ సోమాలియాండు రక్షితభూభాల మీద బ్రిటిషు నియత్రణ సాధించింది. 1945 లో పోట్సుడాం కాన్ఫరెన్సు సమయంలో ఐక్యరాజ్యసమితి సోమాలి యూతు లీగు (ఎస్.వై.ఎల్), హజ్బియా డిగిలు మిరిఫ్లే (హెచ్.డి.ఎం.ఎస్), సోమాలి నేషనలు లీగు (ఎస్.ఎన్.ఎల్) వంటి ఇతర నవజాత సోమాలియా రాజకీయ సంస్థలు ప్రతిపాదించిన షరతుమీద సోమాలియాండు ట్రస్టు టెర్రిటరీగా ఇటలీ సోమాలియాండుకు ఇటలీ ట్రస్టీషిప్పును మంజూరు చేసింది. సోమాలియా పది సంవత్సరాలలో స్వాతంత్ర్యం సాధించాయి. బ్రిటీషు సోమాలిలాండు 1960 వరకు బ్రిటను సంరక్షిత రాజ్యంగా ఉంది.

ఐక్యరాజ్యసమితి ద్వారా స్వాధీనం చేసుకున్న ఇటలీ భూభాగం ట్రస్టీషిపు నిబంధనలు సోమాలీలకు పాశ్చాత్య రాజకీయ విద్య, స్వీయ-ప్రభుత్వనిర్వహణానుభవం పొందడానికి అవకాశం కల్పించింది. కొత్త సోమాలి రాష్ట్రంలో విలీనమైన బ్రిటిషు సోమాలియాండుకు ఈ అవకాశం లేదు. 1950 లలో గత బ్రిటిషు రక్షితప్రాంతాలను నిర్లక్ష్యం చేయడ వలన స్థభించిన అభివృద్ధిని తిరిగి పునరుద్ధరించడానికి బ్రిటీషు వలసరాజ్య అధికారులు వివిధ పరిపాలనా అభివృద్ధి ప్రయత్నాల ద్వారా ప్రయత్నించారు. ఆర్థిక అభివృద్ధి, రాజకీయ అనుభవాలలోని రెండు భూభాగాల మధ్య అసమానత కారణంగా తరువాత రెండు భాగాలను కలిపేందుకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది.

1948 లో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిత్రరాజ్యాల వత్తిడికి భయపడి, 1897 లో ఒడంబడిక ఆధారంగా బ్రిటిషు హౌదు (1884 - 1886 లో సోమాలీయులతో బ్రిటిషు ఒప్పందాలచే రక్షితప్రాంతంగా మారిన ఒక ముఖ్యమైన సోమాలి మేత ప్రాంతం), ఒడగాను ప్రాంతాలను ఇథియోపియను చక్రవర్తికి మెనెలికుకు అప్పగించారు.

బ్రిటను సోమాలి నివాసితులు తమ స్వయంప్రతిపత్తిని నిలబెట్టుకోవచ్చనే నిబంధనను కూడా చేర్చింది. కానీ ఇథియోపియా వెంటనే ఈ ప్రాంతంలో సార్వభౌమత్వం ఉందని పేర్కొంది. ఇది 1956 లో బ్రిటను సోమాలి భూములను తిరిగి కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నం విజయవంతం కాలేదు. బ్రిటను కెన్యా జాతీయవాదులకు దాదాపుగా (ప్రత్యేకించి సోమాలీలు-నివసించిన) నార్తర్ను ఫ్రాంటియరు డిస్ట్రిక్టు (ఎన్.ఇ.డి) పరిపాలనను మంజూరు చేసింది. బ్రిటీషు వలసరాజ్య కమీషను ఆధారంగా ఈ భూభాగంలోని సోమాలీ జాతీయులు కొత్తగా ఏర్పడిన సోమాలీ రిపబ్లిక్లో చేరడానికి ఇష్టపడుతున్నప్పటికీ సొమాలీయుల అభీష్టానికి వ్యతిరేకంగా బ్రిటిషు ఈ నిర్ణయం తీసుకున్నది.

1960 లో సోమాలియా స్వాతంత్ర్యం సందర్భంగా సోమాలియాలో చేరాలా లేదా ఫ్రాంసుతో ఉండాలా అనేదానిని నిర్ణయించుకొనడానికి 1958 లో పొరుగున ఉన్న జిబౌటీలో (అప్పుడు సోమాలియాండు అని పిలుస్తారు) ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఫ్రాంసులో నిరంతరాయంగా ఉన్న సంబంధం కారణంగా అఫారు జాతి సమూహం, ఐరోపావాసులు సంయుక్తంగా ఫ్రాంసుకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎన్నికకు ముందు ఫ్రెంచి వేలాదిమంది సొమాలీయులను బహిష్కరించి ప్రజాభిప్రాయ ఓటింగు రిగ్గింగుకు పాల్పడింది.

ప్రభుత్వ మండలి ఉపాధ్యక్షుడు మహ్మౌదు హర్బి ప్రతిపాదించిన విధంగా సోమాలిసు " యునైటెడు సోమాలియాలో " చేరినందుకు అనుకూలంగా ఉన్నారు. హర్బి రెండు సంవత్సరాల తరువాత ఒక విమాన ప్రమాదంలో చంపబడ్డాడు. 1977 లో జిబౌటి చివరకు ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందింది. 1976 ప్రజాభిప్రాయ సేకరణలో 'అవును' ఓటు కొరకు పోరాటం చేసిన హసను గుల్లే అప్టిడాను (సోమాలి) చివరికి జిబౌటి మొదటి అధ్యక్షుడు (1977-1999) అయ్యాడు.

1960 జూలై 1 న రెండు భూభాగాలు సోమాలియా రిపబ్లిక్గా ఏర్పడి ఇటలీ, బ్రిటను రూపొందించిన సరిహద్దులలోనే ఉన్నాయి. అబ్దుల్లాహీ ఇసా, ముహమ్మదు హాజీ ఇబ్రహీం ఎగల్లు ఇతర దేశాలతో ట్రస్టీ, రక్షిత రాజ్యాల సభ్యులతో కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. " కొత్తగా రూపొందించిన ప్రభుత్వంలో సోమాలి నేషనలు అసెంబ్లీ అధ్యక్షుడిగా హాజీ బషీర్ ఇస్మాయిలు యూసుఫు, సోమాలియా రిపబ్లికు అధ్యక్షుడిగా అడెను అబ్దుల్లా ఒస్మాను దారు , అబ్దిరాషిదు అలీ షెర్మార్కు ప్రధాన మంత్రిగా (తరువాత 1967 నుండి 1969 వరకు అధ్యక్షుడు అయ్యారు) నియమించబడ్డారు. 1961 జులై 20 న ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సోమాలియా ప్రజలు కొత్త రాజ్యాంగంను ఆమోదించారు. ఇది 1960 లో మొట్టమొదటిసారి రూపొందించబడింది. 1967 లో షెర్మార్కె ముహమ్మదు హాజీ ఇబ్రహీం ఎగల్ పు ప్రధాన మంత్రిగా నియమించాడు. తరువాత ఎగలు వాయువ్య సోమాలియాలో స్వయంపాలిత సోమాలియాండు ప్రాంత అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

1969 అక్టోబరు 15 న సోమాలియా అప్పటి అధ్యక్షుడు అబ్దిరశిదు అలీ షేర్మార్కు ఉత్తర పట్టణం లాసు అనోదుకు వెళ్లినప్పుడు తన సొంత అంగరక్షకులలో ఒకరు కాల్చి చంపబడ్డాడు. అతని హత్యకు వెంటనే 21 అక్టోబరు 1969 అక్టోబరు 21(అతని అంత్యక్రియల మరుసటి రోజు) లో ఒక సైనిక తిరుగుబాటు జరిగింది. సోమాలి సైన్యం సాయుధ ప్రతిపక్షాన్ని ఎదుర్కోకుండా రక్తపాతరహితంగా అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. తిరుగుబాటుకు ఆ సమయంలో మేజరు జనరలు మొహమ్మదు సియాదు బేరే నాయకత్వం వహించాడు.

సొమాలి డెమొక్రటికు రిపబ్లికు (1969–1991)

సొమాలియా 
Major General Mohamed Siad Barre, Chairman of the Supreme Revolutionary Council, meeting with President of Romania Nicolae Ceauşescu.

అధ్యక్షుడు షార్మార్కు హత్య తర్వాత అధికారాన్ని తీసుకున్న , లెఫ్టినెంటు కల్నలు సెలాడు గబీరు కెడియా (పోలీసు జమాసు కోర్సాలు) నాయకత్వంలో జరిగిన తురుగుబాటులో అధ్యక్షుడు షర్మార్కే హత్యచేయబడిన తరువాత సుప్రీం రివల్యూషనరీ కౌన్సిలు (ఎస్.ఆర్.సి) అధికారాన్ని కైవశం చేసుకుంది. కేడియి అధికారికంగా " ఫాదరు ఆఫ్ రివల్యూషను " అనే శీర్షికను స్వీకరించారు. త్వరలోనే ఎస్.ఆర్.సి. అధిపతిగా మారాడు. తరువాత ఎస్.ఆర్.సి. దేశానికి సోమాలియా డెమొక్రాటికు రిపబ్లికుగా పేరు మార్చింది. పార్లమెంటు, సుప్రీం కోర్టును రద్దు చేసి, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసింది.

విప్లవ సైన్యం పెద్ద ఎత్తున ప్రజా పనుల కార్యక్రమాలను స్థాపించింది. పట్టణ, గ్రామీణ అక్షరాస్యత పోరాటాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఇది అక్షరాస్యత రేటును నాటకీయంగా అధికరింపజేసింది. పరిశ్రమ, భూమి, జాతీయీకరణ చేయబడింది. అదనంగా, నూతన పాలన విదేశాంగ విధానం సోమాలియా సాంప్రదాయ, మతపరమైన సంబంధాలతో అరబు ప్రపంచానికున్న అనుబంధాన్ని ఉద్ఘాటించి చివరికి 1974 లో అరబు లీగులో చేరింది. అదే సంవత్సరం బర్రే " ఆర్గనైజేషను ఆఫ్ ఆఫ్రికా యూనిటీ " (ఒ.ఎ.యు) చైర్మనుగా పనిచేసాడు.

1976 జూలైలో బారె ఎస్.ఆర్.సి. స్థానంలో సోమాలి రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఎస్.ఆర్.సి.పి) స్థాపించబడింది. ఇది శాస్త్రీయ సోషలిజం, ఇస్లామికు సిద్ధాంతాలపై ఆధారపడిన ఏక-పార్టీ ప్రభుత్వం. ఎస్.ఆర్.ఎస్.పి. స్థానిక పరిస్థితులకు మార్కిస్టు సూత్రాలకు అనుగుణంగా అధికారిక ప్రభుత్వ మతంతో సమన్వయపరచడానికి ప్రయత్నం చేసింది. ముస్లిం సూత్రాల ఆధారంగా సాంఘిక పురోగతి, సమానత్వం, న్యాయం ఉండాలని ఉద్ఘాటించింది. ఇది ప్రభుత్వం శాస్త్రీయ సామ్యవాదం ప్రధాన అంశంగా మారింది. స్వీయ-సంవృద్ధి, ప్రజల భాగస్వామ్యం, ప్రజా నియంత్రణ, దానితో ఉత్పత్తి మీద ప్రత్యక్ష యాజమాన్యానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎస్.ఆర్.ఎస్.పి. పరిమిత స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించినప్పటికీ పరిపాలన దిశలు కమ్యూనిస్టు వైపు సాగింది.

1977 జూలైలో ఇథియోపియాలోని సోమాలీలు-నివసించిన ఓగాడెను ప్రాంతం, ఈశాన్య ఇథియోపియాకు చెందిన గొప్ప వ్యవసాయ భూములను ఒక పాన్-సోమాలి గ్రేటరు సోమాలియాలో వీలీనం చేయడం ఆవసరం అని నేషనలు యూనిటీ నిర్ణయించిన తరువాత " ఒగాడెను యుద్ధం " మొదలైంది. యుద్ధం మొదలైన మొదటి వారంలో, సోమాలి సైనిక దళాలు దక్షిణ, కేంద్ర ఓగాడెను ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. యుద్ధంలో చాలాభాగం సోమాలి సైన్యం ఇథియోపియా సైన్యం మీద నిరంతర విజయాలు సాధించింది. సిడామో వరకు వారిని వెనుకకు పంపింది. 1977 సెప్టెంబరు నాటికి ఓగాడెనులో 90% సోమాలియా నియంత్రణలో ఉంది. జిజిగా వంటి వ్యూహాత్మక నగరాలను స్వాధీనం చేసుకుంది. డైరు డావాపై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది. ఇది జిబౌటి నుండి రైలు మార్గానికి బెదిరింపుగా మారింది. హరారు ముట్టడి తరువాత 20,000 క్యూబా దళాలు, వేలమంది సోవియటు నిపుణుల బృందంతో కూడిన అతిపెద్ద అపూర్వమైన సోవియటు జోక్యం ఇథియోపియా కమ్యూనిస్టు డెర్గు పాలనకు సాయపడింది. 1978 నాటికి సోమాలి దళాలు చివరకు ఒగడెను నుండి బయటకు వచ్చాయి. సోవియెటు యూనియను మద్దతుతో ఈ మార్పు మిత్రరాజ్యాలు, ఇతర ప్రాంతాల మద్దతు కోరేలా బారే ప్రభుత్వానికి ప్రేరణ కలిగించింది. చివరికి సోవియటు కోల్డు వారు సోవియటు ప్రత్యర్థి అయిన యునైటెడు స్టేట్సు వైపు తిరిగేలా చేసింది. ఎలాగైతే ఏం సొమాలియా స్నేహం సోవియటు యూనియనుతో ఆరంభమై యునైటెడు స్టేట్సుతో మైత్రి చేయడంతో ముసింది.

1979 లో పీపుల్సు ఒక కొత్త రాజ్యాంగం ఆధారంగా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయినప్పటికీ బారె సోమాలి రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ పొలిటుబ్యూరో పాలన కొనసాగింది. 1980 అక్టోబరులో ఎస్.ఆర్.ఎస్.పి. రద్దు చేయబడి దాని స్థానంలో సుప్రీం రివల్యూషనరీ కౌన్సిలు తిరిగి స్థాపించబడింది. ఆ సమయానికి బారె ప్రభుత్వం అధిక ప్రజాదరణ పొందలేదు. చాలామంది సోమాలియన్లు సైనిక నియంతృత్వంలో జీవితంతో నిరాశకు గురయ్యారు.

1980 లో ప్రచ్ఛన్న యుద్ధం రావడం, సోమాలియా వ్యూహాత్మక ప్రాముఖ్యత తగ్గడంతో పాలన బలహీనపడింది. ఇథియోపియా ప్రోత్సహించిన ప్రతిఘటన ఉద్యమాలు దేశవ్యాప్తంగా విస్తరించి చివరకు సోమాలి పౌర యుద్ధానికి దారితీసింది. అంతర్యుద్ధం సోమాలియా సాల్వేషను డెమోక్రాటికు ఫ్రంటు (ఎస్ఎస్‌డిఎఫ్), యునైటెడు సోమాలియా కాంగ్రెసు (యుఎస్‌సి), సోమాలియా జాతీయ ఉద్యమం (ఎస్ఎన్ఎం), సోమాలి పేట్రియాటికు మూవ్మెంటు (ఎస్‌పిఎం), సోమాలియలు డెమోక్రటికు మూవ్మెంటు (ఎస్.డి.ఎం) అహింసారహిత రాజకీయ వ్యతిరేకత, సోమాలియలు డెమోక్రటికు అలయంసు (ఎస్.డి.ఎ) సోమాలి మ్యానిఫెస్టో గ్రూపు (ఎస్.ఎం.జి) తిరుగుబాటు బృదాల మద్య పౌర యుద్ధం జరిగింది.

1990 లో మొగడిషు రాజధాని నగరంలో నివాసితులు 3-4 కంటే ఎక్కువ సమూహాలలో బహిరంగంగా తిరగడాన్ని నిషేధించారు. ఇంధన కొరత పెట్రోలు స్టేషన్లలో కార్ల పొడవాటి పంక్తులు ఏర్పడింది. ద్రవ్యోల్బణం పాస్తా ధర (సాధారణ పొడి ఇటాలియన్ నూడుల్స్, ఆ సమయంలో ఒక ప్రధానమైన) కిలోగ్రాముకు ఐదు అమెరికా డాలర్లకు చేరేలా చేసింది. కెన్యా నుండి రోజువారీ దిగుమతి చేసుకున్న ఖాత్ ధర కూడా ప్రామాణిక బంచు ఐదు అమెరికా డాలర్లు. కాగితం కరెన్సీ నోట్లు అటువంటి తక్కువ విలువను కలిగి ఉన్నాయి. ఇవి సాధారణ రెస్టారెంటు భోజనాలకు చెల్లించడానికి అనేకం అవసరమయ్యాయి.

నగరంలో కేంద్రీకృతమై ఉన్న నల్ల మార్కెటు అధికరించి బ్యాంకులు స్థానిక మార్పిడి కోసం కరెన్సీ కొరతను ఎదుర్కొన్నది. రాత్రివేళ మొగడిషు నగరం చీకట్లో ఉంది. సందర్శకుల విదేశీయుల పర్యాటకుల మీద ఇది ప్రభావం చూపింది. విదేశీ కరెన్సీ ఎగుమతిని నిరోధించడానికి కఠినమైన ఎక్స్చేంజి నియంత్రణ నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. విదేశీ ప్రయాణీకులకు ఎటువంటి ప్రయాణ ఆంక్షలు లేనప్పటికీ అనేక ప్రాంతాలలో ప్రవేశం నిషేధించారు. మొగడిషులో పగటిపూట ఏ ప్రభుత్వ సైనిక బలగం కనిపించడం చాలా అరుదు. ప్రభుత్వ అధికారులు రాత్రిపూట కార్యకలాపాలు అధికరించినప్పటికీ గృహాల్లోని వ్యక్తుల "అదృశ్యం" కూడా సంభవిస్తునే ఉంది.

అంతర్యుద్ధం

1991 లో బారే పరిపాలన ఇథియోపియా అప్పటి పాలక డెర్గు ప్రభుత్వం, లిబియాల మద్దతుతో వంశాల ఆధారిత ప్రతిపక్ష సమూహాల సంకీర్ణం తొలగించింది. సోమాలియా జాతీయ ఉద్యమం, ఉత్తర వంశాల పెద్దల సమావేశం తరువాత ఉత్తరప్రాంతం మాజీ బ్రిటీషు భూభాగం 1991 మేలో సోమాలియాండు స్వాతంత్రాన్ని ప్రకటించింది. దక్షిణ ప్రాంతంలో పాలన స్థిరంగా ఉన్నప్పటికీ దానిని ఏ ఇతరదేశం గుర్తించలేదు.

సొమాలియా 
పౌర యుద్ధానికి ముందు మొగడిషును "హిందూ మహాసముద్రం యొక్క వైట్ పెర్ల్" గా పిలిచేవారు.

బారే పాలనను తొలగించిన తరువాత అధికార శూన్యత భర్తీ చేయడంలో అనేక ప్రతిపక్ష బృందాలు అంతర్గతంగా ఒకరితో ఒకరు పోటీపడ్డారు. దక్షిణాన యు.ఎస్.సి. కమాండర్లు జనరలు మొహమెదు ఫరా ఎయిదీడు, అలీ మహదీ మొహమ్మదు నేతృత్వంలోని సాయుధ దళాలు, ఇతరులూ రాజధాని మీద అధికారాన్ని నిర్వహించాలని కోరాయి. 1991 లో పొరుగున ఉన్న జిబౌటిలో సోమాలియా బహుళ దశల అంతర్జాతీయ సమావేశం జరిగింది. మొదటి నిరసన సమావేశంలో సహాయం బహిష్కరించబడింది.

జిబౌటి సదస్సులో ముహమ్మదుకు చట్టబద్ధత ఇచ్చిన కారణంగా సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఆయనను అంతర్జాతీయ సమాజం గుర్తించింది. జిబౌటి, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇటలీలు ముహమ్మదు పరిపాలనకు అధికారికంగా గుర్తింపు తెచ్చాయి. అతను రాజధాని వెలుపల తన అధికారాన్ని స్థిరపరచలేక పోయాడు. దక్షిణ ప్రాంతాలలోని సోమాలియాలోని ఇతర నాయకులు ఉత్తరప్రాంతంలో స్వయంప్రతిపత్తి కలిగిన ఉప-జాతీయ సంస్థలు అధికారాన్ని ఉపయోగించారు. జాతీయ సయోధ్య, నిరాయుధీకరణ కొరకు రెండు అబేటివు ఒప్పందాలు 15 రాజకీయ వాటాదారులచేత సంతకం చేయబడ్డాయి: జాతీయ సయోధ్యంపై అనధికారిక ప్రిపరేటరీ సమావేశాన్ని నిర్వహించటానికి, జాతీయ సయోధ్య సమావేశంలో చేసిన 1993 అడ్డిస్ అబాబా ఒప్పందం.

1990 ల ప్రారంభంలో శాశ్వత కేంద్ర అధికారం లేకపోవడంతో సోమాలియా ఒక "విఫలమైన దేశం" గా వర్ణించబడింది. రాజకీయ శాస్త్రవేత్త కెను మెంఖాసు వాదన ప్రకారం 1980 వ దశకం మధ్యకాలంలో దేశం విఫలమైంది.ఐ. రాబర్టు అదేవిధంగా దేశం వైఫల్యం బారే పరిపాలనను తొలగించటానికి ముందు ఉందని తెలిపింది. హొన్నే (2009), బ్రాన్వెను (2009), వేరోయోవెను (2009) సోమాలియాలను "దేశం వైఫల్యం" సంభాషణ వివిధ కోణాలలో విమర్శలు చేయడానికి కేస్ స్టడీగా ఈ సమయంలో ఉపయోగించారు.

సొమాలియా 
Women in Somaliland wearing the colors of the Somaliland flag, prior to parliamentary elections in 2005.

" ఐఖ్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిలు రిజల్యూషను 733 " ఐఖ్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిలు రిజల్యూషను 746 " యునైటెడు నేషంసు ఆపరేషంసు ఇన్ సోమాలియా " ఏర్పాటుకు దారితీసింది. ఇది దాని కేంద్ర ప్రభుత్వం రద్దు తరువాత సోమాలియాలో స్థిరత్వం కొరకు సహాయపడటానికి ఏర్పాటు చేయబడింది. 1992 డిసెంబరు 3 న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పష్టత 794 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇది సంయుక్త రాష్ట్రాల నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి శాంతిభద్రతల సంకీర్ణాన్ని ఆమోదించింది. పరిస్థితిని స్థిరీకరించడం లక్ష్యంగా చేసుకున్న మానవతావాద ప్రయత్నాలు ఐక్యరాజ్యసమితికి బదిలీ చేయబడే వరకు భద్రతకు హామీ ఇవ్వడం జరిగింది. 1993 లో ఐఖ్యరాజ్యసమితి శాంతి పరిరక్షక సంకీర్ణం సోమాలియా (UNOSOM II) లో ప్రధానంగా దక్షిణప్రాంతంలో రెండు సంవత్సరాల యునైటెడు నేషన్సు ఆపరేషనును ప్రారంభించింది. ఇది విజయవంతమైంది.

రెండవ UNOSOM ను రెండవ అయిదిదు తన అధికారానికి బెదిరింపుగా చూసింది. 1993 జూన్ లో ఆయన సైన్యం UNOSOM II లో భాగంగా ఉన్న పాకిస్థాన్ సైన్యం సోమాలియాలో (1992 మార్చి - ఫిబ్రవరి 1996 వరకు) దాడి చేసింది. దాడిలో మొగాడిషులో 80 మంది మరణించారు. 1993 అక్టోబరులో మొగడిషు దాడిలో 19 అమెరికా దళాలు, 1,000 కన్నా ఎక్కువ మంది పౌరులు, సైన్యం చంపబడ్డారు. 1995 మార్చి 3 న ఐక్యరాజ్య సమితి ఆపరేషను యునైటెడు షీల్డును ఉపసంహరించుకుంది. గణనీయమైన సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రభుత్వ పాలన పునరుద్ధరించబడలేదు. 1996 ఆగస్టులో అయిదిదు మొగడిషులో చంపబడ్డాడు. మాజీ ఐఖ్యరాజ్యసమితి సెక్రటరీ జనరలు బోటోసు బౌత్రోసు ఘాలి, అహ్మౌ ఔల్దు అబ్దాల్లా, సోమాలియాకు ఐఖ్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఈ సంఘర్షణ సమయంలో సంభవించిన మరణాలను "జాత్యహంకార మారణకాండ " గా సూచించారు.

శాంతి ప్రక్రియలో భాగంగా ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా సమాఖ్య, అరబు లీగు, ఐ.జి.ఎ.డి. ఆధ్వర్యంలో, అదనపు జాతీయ సయోధ్య సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ సదస్సులలో 1997 లో (సోడ్రే; ఇథియోపియా), నేషనలు సాల్వేషను కౌన్సిలు, 1997 కైరో పీసు కాన్ఫరెన్సు (కైరో డిక్లరేషను), 2000 లో సోమాలియా నేషనలు పీసు కాన్ఫరెన్సు; (ఆర్టా, జిబౌటిలో) ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ట్రాంసిషనలు నేషనలు గవర్నమెంటు ఆధ్వర్యంలో ది 2002 సోమలీ రికాన్సిలేషను కాన్ఫరెన్సు (ఎల్డోర్టు, కెన్యా), ట్రాన్సిషనలు ఫెడరలు ప్రభుత్వం స్థాపించబడినప్పుడు 2003 జాతీయ పుంర్నిర్మాణ సదస్సు (నైరోబీ,కెన్యా)లో ట్రాంసిషనలు ఫెడరలు చార్టరు స్వీకరించబడింది, 2004 నైరోబి కాన్ఫరెన్సు, మొగాదిషులో 2007 జాతీయ పునర్నిర్మాణ సదస్సు ఉన్నాయి.


పౌర యుద్ధం జరగడంతో సోమాలియా నివాసితులు అనేక మంది ఆశ్రయం కోసం వెతుకారు. 2016 నాటికి UNHCR ప్రకారం సుమారుగా 9,75,951 నమోదైన శరణార్ధులు పొరుగునున్న దేశాలలో ఉన్నారు. అదనంగా, 1.1 మిలియన్ల మంది స్థానికులు అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన ప్రజలు (ఐ.డి.పి) ఉన్నారు. ఉత్తరప్రాంతంలో ఉన్న స్థానికులతో సహా దక్షిణ ప్రాంతాల నుండి వచ్చిన బాంటసు, ఇతర అల్పసంఖ్యాక జాతి ప్రజలు ఐ.డి.పి.లలో ఉన్నారు. ఐ.డి.పి.లలో 60% మంది పిల్లలు ఉన్నారు. స్థానభ్రంశానికి కారణాలు ఆయుధ హింస, పునరావృత్త కరువులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. దారిమళ్ళించబడిన సహాయ ప్రవాహాలు ఐ.డి.పి ల సురక్షితమైన ఆశ్రయం, వనరుల లభ్యతను అడ్డుకున్నాయి. దక్షిణ మధ్య సోమాలియాలో (8,93,000) ఐ.డి.పి. స్థావరాలు కేంద్రీకృతమై ఉన్నాయి. తరువాత ఉత్తర పుంట్ల్యాండు (1,29,000), సోమాలిలాండు (84,000) ప్రాంతాలు ఉన్నాయి. అదనంగా సుమారు 9,356 నమోదైన శరణార్థులు, సోమాలియాలో 11,157 నమోదైన శరణు కోరేవారు ఉన్నారు. 2015 లో హౌటి తిరుగుబాటు తర్వాత విదేశీ పౌరులలో యెమెన్ నుండి ఉత్తర సోమాలియాకు వలస వచ్చారు. అయినప్పటికీ సోమాలియాకు వలస వచ్చిన వారిలో ఎక్కువమంది కొనసాగుతున్న పోస్టు-సంఘర్షణ పునర్నిర్మాణ ప్రక్రియలో పాల్గొనడానికి, మొగాడిషు, ఇతర పట్టణ ప్రాంతాలలో పెట్టుబడుల అవకాశాల కొరకు తిరిగి వచ్చిన సోమాలీ ప్రజలు ఉన్నారు.

కులిపోయిన ప్రభుత్వాధికారం కారణంగా ఏర్పడిన పౌర యుద్ధం ఫలితంగా సోమాలియా తీరంలోని కాపలా లేని హిందూ మహాసముద్ర జలాలలో పైరసీ మొదలైంది. విదేశీ మత్స్యకారుల అక్రమణ నుండి స్థానిక మత్స్యకారులు వారి జీవనాధారమును కాపాడటానికి పోరాడవలసిన పరిస్థితి మొదలైంది. 2008 ఆగస్టులో బహుళజాతి సంకీర్ణం సముద్రపు దొంగలను అడ్డగించడంతో అడెను గల్ఫులోని మారిటైం సెక్యూరిటీ పెట్రోలు ఏరియా (ఎం.ఎస్.పి.ఎ) ను స్థాపించింది. తరువాత పున్లాండు ప్రాంతంలో ఒక మారిటైం పోలీసు ఫోర్సు ఏర్పాటు చేయబడింది. ప్రైవేటు సాయుధ దళాలను నియమించి ఓడ యజమానులచే ఉత్తమ నిర్వహణ పద్ధతులు అనుసరించబడ్డాయి. ఈ మిశ్రమ ప్రయత్నాల కారణంగా పైరసీ సంఘటనలు తీవ్రంగా క్షీణించాయి. 2012 అక్టోబరు నాటికి పైరేటు దాడులు ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి. 2011 లో అదే కాలంలో 36 దాడులు ఉండగా 2012 లో కేవలం ఒక ఓడ మాత్రమే మూడవ త్రైమాసికంలో దాడికి గురైంది.

మధ్యంతర సంస్థలు

ట్రాంసిషనలు నేషనలు గవర్నమెంటు (టి.ఎన్.జి) 2000 ఏప్రిలు-మేలో ఆర్టా, జిబౌటిలో " సోమాలియా నేషనలు పీసు కాన్ఫరెన్సు " (ఎస్.ఎన్.పి.సి) లో ఏర్పాటు చేయబడింది. అబ్దికాసిం సలాదు హస్సను దేశం నూతన ట్రాంసిషనలు నేషనలు గవర్నమెంటు (టి.ఎన్.సి) అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. సోమాలియా మూడవ శాశ్వత రిపబ్లికన్ ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసేందుకు ఒక తాత్కాలిక పరిపాలన ప్రభుత్వం ఏర్పడింది.టి.ఎన్.సి. అంతర్గత సమస్యలు కారణంగా మూడు సంవత్సరాలలో నాలుగు ప్రధాని మార్చబడ్డాడు. 2003 లో పాలనాధికారి దివాలా గురించి వెల్లడించడంతో దాని అధికారం ముగిసింది. .

2004 అక్టోబరు 10 న " ట్రాంసిషనలు నేషనలు గవర్నమెంటు " వారసుడిగా ట్రాంసిషనలు ఫెడరలు గవర్నమెంటు (టి.ఎఫ్.జి) మొట్టమొదటి అధ్యక్షుడిగా అబ్దుల్లాహి యూసఫు అహ్మదును శాసన సభ్యులు ఎంపిక చేశారు. 1991 నాటి సియాడు బారే పాలన పతనం, తదుపరి అంతర్యుద్ధం తరువాత సోమాలియాకు జాతీయ సంస్థలను పునరుద్ధరించే లక్ష్యంతో రెండవ తాత్కాలిక పరిపాలనగా టి.ఎఫ్.జి అవతరించింది.


ట్రాంసిషనలు ఫెడరలు గవర్నమెంటు (టి.ఎఫ్.జి) సోమాలియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం 2012 ఆగస్టు 20 లో పదవీకాలం ముగిసిన తరువాత. ట్రాంసిషనలు ఫెడరలు పార్లమెంటు (టిఎఫ్.పి) 2004 నవంబరులో ట్రాంసిషనలు ఫెడరలు చార్టరు (టి.ఎఫ్.సి.) లో స్వీకరించింది. ట్రాంసిషనలు ఫెడరలు ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖను కలిగి ఉంది. టి.ఎఫ్.పి. శాసన శాఖగా పనిచేస్తోంది. ప్రభుత్వానికి సోమాలియా అధ్యక్షుడు నేతృత్వం వహించాడు. ప్రధానమంత్రి నిర్వహణలో మంత్రివర్గం పనిచేస్తుంది. మొత్తం మూడు శాఖలను సమిష్టిగా సూచించడానికి టి.ఎఫ్.సి. సాధారణ పదంగా కూడా ఉపయోగించబడింది.

ఇస్లాం న్యాయస్థానాలు, ఇథియోపియా జోక్యం

సొమాలియా 
Map showing the ICU at the peak of its influence.

2006 లో ఇస్లామికు కోర్ట్సు యూనియను (ఐ.సి.యు), ఒక ఇస్లామికు సంస్థ, దేశంలోని దక్షిణ భాగంలో అధికభాగం నియంత్రణను పొందింది. వెంటనే షరియా చట్టాన్ని విధించింది. పరిణామాత్మక ఫెడరలు ప్రభుత్వం తన అధికారాన్ని పునఃస్థాపించాలని కోరింది. ఇథియోపియా దళాల సహాయంతో ఆఫ్రికా సమాఖ్య శాంతిదళం, అమెరికా సంయుక్తరాష్ట్రాల వైమానిక మద్దతుతో, ప్రత్యర్థి ఐ.సి.యు.ను వెలుపలకు పంపి దాని పాలనను పటిష్టపరిచింది.


2007 జనవరి 8న రాసు కంబోని యుద్ధం, టి.ఎఫ్.జి. అధ్యక్షుడు, స్థాపకుడు అబ్దుల్లాహి యూసఫు అహ్మదు, సోమాలి సైన్యంలో మాజీ కల్నలు, యుద్ధ హీరో ఎథియోపియన్ సైనిక మద్దతుతో మొగడిషులో ప్రవేశించారు. ప్రభుత్వం తరువాత బైడోవాలోని మధ్యంతర నుండి రాజధాని విల్లా సోమాలియాకు మార్చబడింది. 1991 లో సియాద్ బారే పాలన పతనమైన తరువాత మొదటిసారిగా ఫెడరలు ప్రభుత్వం దేశంలోని అధిక భాగాన్ని నియంత్రించింది.

ఈ ఓటమి తరువాత ఇస్లామిక్ కోర్టు యూనియను అనేక విభిన్న వర్గాలుగా చీలిపోయింది. అల్-షాబాబుతో సహా మరికొన్ని మౌలిక అంశాలు, టి.ఎఫ్.జి.కు వ్యతిరేకంగా తమ తిరుగుబాటు కొనసాగించడానికి, సోమాలియాలో ఇథియోపియా సైన్యం ఉనికిని వ్యతిరేకిస్తాయి. 2007 - 2008 సంవత్సరాల్లో, అల్-షబాబు సైనిక విజయాలు సాధించి, కేంద్ర, దక్షిణ సోమాలియాలో కీలక పట్టణాలు, ఓడరేవులపై నియంత్రణను సాధించింది. 2008 చివరిలో ఆ బృందం బైడోవాను స్వాధీనం చేసుకుంది. కాని మొగడిషు కాదు. 2009 జనవరి నాటికి అల్-షబాబు, ఇతర సైనికులు ఇథియోపియా దళాలను రిరిగివెళ్ళాలని బలవంతం చేసారు. ట్రాంసిషనలు ఫెడరలు గవర్నమెంటు ప్రభుత్వ దళాలకు సహాయంగా ఒక ఆఫ్రికాసమాఖ్య శాంతి పరిరక్షక బలగాల వదిలివేశారు.

నిధులు, మానవ వనరుల లేకపోవడంతో ఒక జాతీయ భద్రతా దళం పునః స్థాపనకు కష్టతరంచేసే ఆయుధాల ఆంక్షలు, అంతర్జాతీయ సమాజం ఉదాసీనత కారణంగా అధ్యక్షుడు యూసఫు దేశం దక్షిణ భాగంలో తిరుగుబాటు అంశాలతో యుద్ధం కొనసాగించడానికి వేల మంది దళాలను పుంట్ల్యాండు నుండి తరలించి మొగడిషులో నియమించాడు. ఈ ప్రయత్నానికి ఆర్థిక మద్దతు స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం అందించింది. ఇది పుట్ల్యాండు సొంత భద్రతా దళాలకు పౌర సేవా ఉద్యోగులకు తక్కువ ఆదాయాన్ని మిగిల్చింది. ఈ భూభాగం పైరసీ, తీవ్రవాద దాడులకు గురైంది.

2008 డిసెంబరు 29 న అబ్దుల్లాహి యూసఫు అహ్మదు బైడోవాలో ఒక యునైటెడు పార్లమెంటు సమావేశంలో సోమాలియా అధ్యక్షుడిగా తన రాజీనామా ప్రకటించారు. ఆయన ప్రసంగం జాతీయ రేడియోలో ప్రసారం చేయబడినది. యూసఫు తన 17 సంవత్సరల సంఘర్షణను తన ప్రభుత్వం ముగించడంలో విఫలమయ్యిందని. పేర్కొన్నాడు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో వారు చేసిన వైఫల్యానికి ఆయన అంతర్జాతీయ సమాజాన్ని నిందించాడు. ట్రాంసిషనలు ఫెడరలు ప్రభుత్వం చార్టరుకు పార్లమెంటు స్పీకరు కార్యాలయంలో వారత్వ బాధ్యతలు నిర్వహిస్తాడని పేర్కొన్నాడు.

సంకీర్ణ ప్రభుత్వం

సొమాలియా 
Former Foreign Minister of Somalia Mohamed Abdullahi Omaar in a meeting with UNDP Administrator Helen Clark and other diplomats at the UN headquarters in New York (May 2009)

2008 మే 31-జూన్ 9 మధ్య సోమాలియా ఫెడరలు ప్రభుత్వ ప్రతినిధులు, ఇస్లామిస్టు తిరుగుబాటుదారుల సోమాలియా సమూహం కూటమి జిబౌటిలో శాంతి చర్చలలో పాల్గొన్నారు. సోమాలియాకు మాజీ ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి, అహ్మౌ ఔల్దు-అబ్దుల్లాహు. సాయుధ పోరాటం విరమణకు బదులుగా ఇథియోపియా దళాల ఉపసంహరణకు సంతకం చేయడంతో సమావేశం ముగిసింది. తరువాత ఎ.ఆర్.ఎస్. సభ్యులను చేర్చుకోవటానికి పార్లమెంటును 550 స్థానాలకు విస్తరించింది. తరువాత అప్పటి ఎఐఎస్ చైర్మనుగా ఉన్న షేకు షరీఫు షేకు అహ్మదును ఎన్నికచేసారు. అధ్యక్షుడు షరీఫు చంపబడిన తరువాత మాజీ అధ్యక్షుడు అబ్దిరశిదు అలీ షర్మార్కు కుమారుడు ఒమరు అబ్దిరాషిదు అలీ షర్మార్కు, దేశంలోని కొత్త ప్రధాన మంత్రిగా నియమితుడయ్యాడు.

ఆఫ్రికా సమాఖ్య దళాల చిన్న బృందం సహాయంతో సంకీర్ణ ప్రభుత్వాలు 2009 ఫిబ్రవరిలో దేశంలోని దక్షిణ భాగంలో పూర్తి నియంత్రణను చేపట్టడానికి ప్రయత్నించాయి. దాని పాలనను ధృఢపరచటానికి టి.ఎఫ్.జి. ఇస్లామికు కోర్టు సమాఖ్య సోమాలియా పునః విముక్తి కొరకు సంకీర్ణంలోని ఇతర సభ్యులు ఒక ఆధునిక సుఫీ సైనికబృందం అయిన అహ్లూ సున్నా వల్జామాతో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షంలో రెండు ప్రధాన ఇస్లామికు గ్రూపులైన అల్-షాబాబు, హిజ్బులు ఇస్లాం 2009 మధ్యకాలంలో తమలో తాము పోరాడటం ప్రారంభించారు.

2009 మార్చిలో సోమాలియా సంకీర్ణ ప్రభుత్వం, షరియాను దేశ అధికారిక న్యాయవ్యవస్థగా తిరిగి అమలు చేయాలని ప్రకటించింది. ఏదేమైనా దేశం దక్షిణ, మధ్య భాగాలలో పోరాటం కొనసాగింది. కొన్ని నెలలలో సంకీర్ణ ప్రభుత్వం దక్షిణ మధ్య సోమాలియా వివాదాస్పద మండలాలలో 70% మీద (మునుపటి యూసఫు పరిపాలన నుండి వారసత్వంగా వచ్చిన భూభాగం, ఇస్లామిస్టు తిరుగుబాటుదారులకు వివాదాస్పద భూభాగంలో 80% ) ఆధీనత కోల్పోయింది.

సంకీర్ణ ప్రభుత్వం సంక్షిప్త పదవీకాలం, ఒక సంవత్సరం తరువాత శాశ్వత కేంద్ర అధికారం లేకపోవడంతో " ఫండు ఫర్ పీసు ఫ్రాజిలు స్టేట్సు ఇండెక్సు " (గతంలో విఫలమైంది దేశాల జాబితా అని పిలవబడింది) సోమాలియాను వరుసగా ఆరు సంవత్సరాలు వరుసగా జాబితా చేసింది (2008- 2013) 2009 లో ట్రాస్ఫరెన్సీ ఇంటర్నేషనలు తన వార్షిక అవినీతి పర్సెప్షను ఇండెక్సు (సిపిఐ) లో సోమాలియాకు స్థానాన్ని ఇచ్చింది. ఇది ఒక దేశ ప్రభుత్వ రంగంలో అవినీతి ప్రాబల్యాన్ని ప్రదర్శించడానికి ఉద్దేశించిన పరిమాణం. 2010 మధ్యలో ఇన్స్టిట్యూటు ఫర్ ఎకనామిక్సు అండ్ పీసు కూడా సోమాలియాను గ్లోబల్ పీసు ఇండెక్సులో ఇరాకు, ఆఫ్గనిస్తాన్ల మధ్య స్థానం దక్కించుకుంది.

సొమాలియా 
Mohamed Abdullahi Mohamed (Farmajo), current President and former Prime Minister of Somalia.

మొహమ్మద్ అబ్దుల్లాహ్ మహ్మద్ (ఫార్మ్జో), ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ సోమాలియా ప్రధాన మంత్రి]]

2010 అక్టోబరు 14 న రాయబారి మొహమెదు అబ్దుల్లాహి మహ్మదు (ఫార్మజో అని కూడా పిలుస్తారు) సోమాలియా కొత్త ప్రధాన మంత్రిగా నియమితుడయ్యాడు. మాజీ ప్రధాని ఒమరు అబ్దిరశిదు అలీ షర్మార్కు రాజీనామా చేసిన ఒక మాసం తరువాత ప్రతిపాదిత ముసాయిదా రాజ్యాంగం గురించి అధ్యక్షుడు షరీఫుతో సుదీర్ఘకాలంగా వివాదం కొనసాగింది. సోమాలియా రిపబ్లికు ట్రాంసిషనలు ఫెడరలు చార్టరు 2010 నవంబరు 12 న ప్రధాన మంత్రి మొహమ్మదు కొత్త మంత్రిమండలిని ప్రకటించారు. ఇది అంతర్జాతీయ సమాజంచే ప్రశంసించబడింది. ఊహించిన విధంగా కేటాయించిన మంత్రివర్గ పదవులు గణనీయంగా 39 నుండి 18 వరకు తగ్గాయి.

స్వతంత్ర రాజ్యాంగ కమిషను అదనపు సభ్యులు సోమాలియా రాజ్యాంగ న్యాయవాదులు, మత గురువులు, సోమాలి సంస్కృతిలోని నిపుణులు రాబోయే నూతన రాజ్యాంగం ప్రభుత్వం ట్రాంసిషనలు ఫెడరలు కార్యాలయాల కీలక భాగంలో పాల్గొనడానికి కూడా నియమించబడ్డారు. అదనంగా అనేక ప్రాంతాలలో అధిక స్థాయి సమాఖ్య ప్రతినిధులను వంశానికి సంబంధించిన ఉద్రిక్తతలు తగ్గించటానికి పంపించబడ్డాయి. సోమాలియా ప్రధాన మంత్రి అభిప్రాయంలో పారదర్శకతను మెరుగుపరిచేందుకు, కేబినెటు మంత్రులు తమ ఆస్తులను పూర్తిగా బహిర్గతం చేసే నైతిక నియమావళిపై సంతకం చేశారు. అధికారిక దర్యాప్తులను నిర్వహించడానికి, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రోటోకాలును సమీక్షించేందుకు అధికారం కలిగిన ఒక అవినీతి నిరోధక కమిషను కార్యకలాపాలను మరింతగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ అధికారుల వర్గం ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ప్రభుత్వ సభ్యుల అనవసర విదేశ పర్యటనలు నిషేధించబడ్డాయి. మంత్రుల పర్యటనకు ప్రీమియరు అనుమతి అవసరం. 2011 ఫెడరలు వ్యయాలను పార్లమెంటు సభ్యులు ఆమోదించిన ఒక బడ్జెటులో పౌర సేవా ఉద్యోగుల చెల్లింపుకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అదనంగా ప్రభుత్వ ఆస్తి, వాహనాల పూర్తి ఆడిటు జరుగుతుంది. యుద్ధం ముందు కొత్త ప్రభుత్వం, దాని AMISOM మిత్రులు కూడా 2011 ఆగస్టు నాటికి మోగాడిషుని నియంత్రించగలిగారు. ఆఫ్రికా సమాఖ్య, ప్రధానమంత్రి మహ్మదు అభిప్రాయంలో పెరుగుతున్న దళాల బలంతో ప్రాదేశిక ప్రయోజనం వేగవంతమైంది.

ఫెడరల్ ప్రభుత్వం

సొమాలియా 
Political map of Somalia.

2011 జూన్ 19 న మొహమ్మదు అబ్దుల్లాహి మొహమ్మదు సోమాలియా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వివాదాస్పదమైన కంపాలా అకార్డు నిబంధనలలో భాగం, అధ్యక్షుడు పార్లమెంటు స్పీకరు, డిప్యూటీల ఆదేశాలను 2012 ఆగస్టు వరకు విస్తరించాడు. తరువాత మొహమ్మదు మాజీ ప్రణాళికా, అంతర్జాతీయ సహకార మంత్రి అబ్దీలి మహ్మదు ఆలీ శాశ్వత ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు.

2011 అక్టోబరులో దక్షిణ సోమాలియాలోని అల్-షబాబ్ సమూహ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సోమాలి, కెన్యా సైన్యం, బహుళజాతి దళాల మధ్య సమన్వయ చర్యగా " ఆపరేషన్ లిండా నచీ " ప్రారంభమైంది. సోమాలి బలగాలు కార్యకలాపాలకు దారితీసినట్లు ఒక ఉమ్మడి సందేశం జారీ చేయబడింది. 2012 సెప్టెంబరు నాటికి సోమాలియా, కెన్యా, రాస్కంబని దళాలు అల్-షబాబు ఆఖరి ప్రధాన స్థావరం అయిన కిస్సాయో దక్షిణ నౌకాశ్రయాన్ని బంధించగలిగాయి. 2012 జూలైలో, సోమాలియా: EUTM సొమాలియా, EU నావలు ఫోర్సు సోమాలియా ఆపరేషను అట్లాంటా ఆఫ్ హార్ను ఆఫ్ ఆఫ్రికా, EUCAP నెస్టరప్రుతో కలిసి 3 ఐరోపాసమాఖ్య కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి.

సొమాలియా 
ఫెడరలు పార్లమెంటు ఆఫ్ సోమాలియా నిర్మాణం

అధికారిక "రోడుమ్యాపు ఫర్ ది ఎండ్ ఆఫ్ ట్రాన్సిషను " భాగంగా సోమాలియాలో ట్రాంసిషను ఫెడరలు గవర్నమెంటు తాత్కాలిక ఆదేశాలను 2012 ఆగస్టు 20 న శాశ్వత ప్రజాస్వామ్య సంస్థల ఏర్పాటుకు దారితీసే స్పష్టమైన బెంచిమార్కర్లను అందించిన ఒక రాజకీయ ప్రక్రియ భావించబడింది. సోమాలియా ఫెడరలు పార్లమెంటు ఏకకాలంలో ప్రారంభించబడింది.

2012 ఆగస్టులో పౌర యుద్ధం ప్రారంభం నుండి దేశంలో మొట్టమొదటి శాశ్వత కేంద్ర ప్రభుత్వంగా " సోమాలియా ఫెడరలు గవర్నమెంటు " స్థాపించబడింది. 2014 నాటికి సోమాలియా అస్థిరమైన దేశాల జాబితాలో అగ్రస్థానం నుండి రెండవ స్థానంలో నిలిచింది. దక్షిణ సుడాన్ ప్రధమస్థానంలో ఉంది.ఐఖ్యరాజ్యసమితి సోమాలియా ప్రతినిధి నికోలసు కే, ఐరోపా సమాఖ్య ప్రతినిథి కాథరీన్ అష్టను, ఇతర అంతర్జాతీయ వాటాదారులు, విశ్లేషకులు కూడా సోమాలియా " అస్థిర దేశంగా " వర్ణించడం ప్రారంభించారు. ఇది స్థిరత్వం వైపు ప్రయాణం చేస్తోంది. 2014 ఆగస్టులో గ్రామీణ ప్రాంతాలలో తిరుగుబాటుదార్ల పాకెట్లకు వ్యతిరేకంగా సోమాలియా ప్రభుత్వం నేతృత్వంలో " ఆపరేషన్ హిందూ మహాసముద్రం " ప్రారంభమైంది. 2017 వరకు యుద్ధం కొనసాగుతుంది.

2017 అక్టోబరులో సోమాలియా రాజధాని మొగాదిషులో జంట బాంబు పేలుళ్ల కారణంగా 500 మందికిపైగా చంపబడ్డారు.

పాత రాతియుగపు కాలం నుంచే ఇక్కడ మానవ జాతి నివసిస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఉత్తర సోమాలియాలో క్రీ.పూ 9000 సంవత్సరానికి చెందినవిగా భావిస్తున్న కొన్ని రాతి చిత్రాలను కనుగొనడం జరిగింది. కానీ పురాతత్వ శాస్త్రజ్ఞులు మాత్రం ఆ లిపిని సరిగా అర్థం చేసుకోలేకున్నారు.

భౌగోళికం

ప్రాంతాలు

Somalia is officially divided into eighteen regions (gobollada, singular gobol), which in turn are subdivided into districts. The regions are:

సొమాలియా 
A map of Somalia's regions.
Regions of Somalia
Region Area (km2) Population Capital
Awdal 21,374 673,263 Borama
Woqooyi Galbeed 28,836 1,242,003 Hargeisa
Togdheer 38,663 721,363 Burao
Sanaag 53,374 544,123 Erigavo
Sool 25,036 327,428 Las Anod
Bari 70,088 719,512 Bosaso
Nugal 26,180 392,697 Garowe
Mudug 72,933 717,863 Galkayo
Galguduud 46,126 569,434 Dusmareb
Hiran 31,510 520,685 Beledweyne
Middle Shabelle 22,663 516,036 Jowhar
Banaadir 370 1,650,227 Mogadishu
Lower Shabelle 25,285 1,202,219 Barawa
Bakool 26,962 367,226 Xuddur
Bay 35,156 792,182 Baidoa
Gedo 60,389 508,405 Garbahaarreey
Middle Juba 9,836 362,921 Bu'aale
Lower Juba 42,876 489,307 Kismayo

ఉత్తర సోమాలియా ప్రస్తుతం వాస్తవానికి పుట్లాండు స్వయంప్రతిపత్త ప్రాంతం (స్వయంగా ఒక స్వతంత్ర రాజ్యంగా పరిగణిస్తుంది), సొమాలియాండు (స్వయంగా ప్రకటించబడిన కానీ గుర్తించలేని సార్వభౌమ రాజ్యం)గా విభజించబడింది. మద్య సోమాలియాలో గల్ముడాగు మరో ప్రాంతీయ సంస్థ, ఇది పుంట్ల్యాండుకు దక్షిణం ఉంది. సుదూర దక్షిణప్రాంతంలో జుబాలాండు సమాఖ్యలో నాల్గవ స్వయంప్రతి ప్రాంతంగా ఉంది. 2014 లో ఒక కొత్త నైరుతీ రాజ్యం కూడా ఏర్పాటు చేయబడింది. 2015 ఏప్రెలులో కొత్త సెంట్రలు రీజన్సు స్టేటు కోసం ఒక సమావేశ సమావేశం కూడా ప్రారంభించబడింది.


ఫెడరలు పార్లమెంటు స్వయంప్రతిపత్త ప్రాంతీయ రాజ్యాల (అధికారికంగా ఫెడరలు సభ్యుల స్టేటుస్) ఖచ్చితమైన సంఖ్య, సరిహద్దులను నిర్ణయించడానికి బాధ్యత వహిస్తారు.

లొకేషను

సొమాలియా 
The Cal Madow mountain range in northern Somalia features the nation's highest peak, Shimbiris.

సోమాలియా సరిహద్దులుగా వాయువ్య దిశలో జిబౌటి, నైరుతి సరిహద్దులో కెన్యా, ఉత్తరాన ఏడెన్ గల్ఫ్, గుయార్డఫ్ఫు కాలువ, తూర్పున హిందూ మహాసముద్రం, పశ్చిమాన ఇథియోపియా ఉన్నాయి. ఇది 2 ° దక్షిణ - 12 ° ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుంది. 41 ° నుండి 52 ° తూర్పు రేఖాంశంలో ఉంది. ఎర్ర సముద్రం, సూయజు కాలువ బాబెలు ఎల్ మండే ముఖద్వారం వద్ద ఉన్న ఈ ప్రాంతం కొనను మాప్లో రింసోసెరోసు (కొమ్ము) పోలి ఉన్న కారణంగా సాధారణంగా ఈ దేశాన్ని హార్ను ఆఫ్ ఆఫ్రికా అంటారు.

జలాశయాలు

సోమాలియా ఆఫ్రికా ప్రధాన భూభాగంలో పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది 3,025 కిలోమీటర్లు (1,880 మైళ్ళు) సముద్ర తీరంతో విస్తరించింది. దాని భూభాగం ప్రధానంగా పీఠభూములు, మైదానాలు, పర్వత ప్రాంతాలను కలిగి ఉంటుంది. దేశవిస్తీర్ణం 6,37,657 చ,కి.మీ (246,201చ.మై). జలభాగం 10,320 చ.కి.మీ (3,980 చదరపు మైళ్ళు) ఉంది. సోమాలియా భూ సరిహద్దులు సుమారు 2,340 చ.కి.మీ (1,450 చ.మైళ్ళు) విస్తరించాయి; కెన్యాతో 682 కిలోమీటర్లు (424 మైళ్ళు), ఇథియోపియాతో 1,626 కిలోమీటర్లు (1,010 మైళ్ళు), జిబౌటీతో 58 కిలోమీటర్లు (36 మైళ్ళు) పంచుకుంది. 200 నాటికలు మైళ్ల (370 కి.మీ., 230 మైళ్ళు) ప్రాదేశిక జలాలలో సముద్ర భాగ వివాదాలు ఉన్నాయి.

సోమాలియాలో అనేక దీవులు, ద్వీపసమూహాలు ఉన్నాయి. వీటిలో బజుని ద్వీపాలు, సాద్ద్ డి-దీన్ ద్వీపసమూహం ఉన్నాయి: సోమాలియా దీవులను చూడండి.

సొమాలియా 
The Jubba River

వన్యప్రాణుల నివాసాలు

ఉత్తరప్రాంతంలో గల్ఫు ఆఫ్ ఏడెను లిటోరాలుకు సమాంతరంగా గుబ్బరు అని పిలువబడే ఒక పొదలతో కప్పబడిన, పాక్షిక ఎడారి మైదానం ఉంటుంది. పశ్చిమప్రాంతంలో 12 కిలోమీటర్ల వెడల్పున తూర్పున రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న కారణంగా, వర్షపు రుతువులలో మినహాయించి తప్పనిసరిగా పొడి ఇసుక పడకలు ఉన్న నీటి వనరులు ఈ మైదానం రెండుభాగాలుగా చేస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు గుబను తక్కువ రకాల పొదలు, గడ్డి దట్టమైన వృక్షప్రాంతంగా మారతాయి. ఈ తీరప్రాంతం ఇథియోపియా జిరామికు గడ్డి భూములు, పొడుగు భూముల పర్యావరణ ప్రాంతంగా ఉంది.

దేశం ఈశాన్య భాగంలో ఒక పర్వత శ్రేణి కాల్ మాడో. ఎసిగావో వాయువ్య దిశగా బోసాస్యో నగరానికి పశ్చిమాన ఉన్న అనేక కిలోమీటర్ల విస్తరించి ఉన్న సోమాలియా శిఖరం షిమ్బిసు 2,416 మీటర్లు (7,927 అడుగులు) ఎత్తున ఉంది. కర్కారు పర్వతాల కఠినమైన తూర్పు-పడమర శ్రేణులు కూడా అడెను లిటొరాలు గల్ఫు అంతర్భాగంగా ఉంటాయి. మధ్య ప్రాంతాలలో దేశంలోని ఉత్తర పర్వత శ్రేణులు, లోతులేని పీఠభూములు, సాధారణంగా పొడిగా ఉండే నీటి వనరులు, (ఇవి స్థానికంగా ఓగోగా సూచించబడతాయి) ఉన్నాయి. ఓగో పశ్చిమ పీఠభూమి క్రమంగా పశువుల కోసం ఒక ముఖ్యమైన మేత ప్రాంతం అయిన హౌడులో విలీనం ఔతుంది.

సోమాలియా రెండు శాశ్వత నదులు (జుబ్బా, షబెలే)మాత్రమే ఉన్నాయి. ఇవి ఇథియోపియా పర్వతాలలో మొదలవుతాయి. ఈ నదులు ప్రధానంగా దక్షిణం వైపు ప్రవహిస్తాయి. జుబ్బా నది కిస్మాయాలో హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది. ఒక సమయంలో షాబెలె నది మెర్కాకు సమీపంలో సముద్రంలోకి ప్రవేశించినప్పటికీ ఇప్పుడు మొగడిషులో కేవలం నైరుతి దిశలో ఉన్నది. ఆ తరువాత జబ్బా నదికి సమీపంలో జిలిబు ఎడారి భూభాగం తూర్పున చివరకు కొనసాగుతుంది.

పర్యావరణం

సొమాలియా 
Somalia's coral reefs, ecological parks and protected areas

సోమాలియా ఒక పాక్షిక-శుష్క దేశంగా ఉంటుంది. ఇందులో సుమారు 1.64% సాగున భూమి ఉంది. మొట్టమొదటి స్థానిక పర్యావరణ సంస్థలు అయిన " ఎకోటెర్రా సోమాలియా, సోమాలి ఎకోలాజికల్ సొసైటీ " పర్యావరణ సంబంధిత ఆందోళనల గురించి అవగాహనను ప్రోత్సహించటం, అన్ని ప్రభుత్వ రంగాలలో, పౌర సమాజంలో పర్యావరణ కార్యక్రమాలను సమీకరించటానికి సహాయపడింది. పట్టణాలు, రోడ్లు, వ్యవసాయ భూములను ఆక్రంస్తున్న వేలాది ఎకరాల పవన ఇసుక దిబ్బలను అడ్డుకునేందుకు సియాడు బారే ప్రభుత్వం 1971 నుండి దేశవ్యాప్త స్థాయిలో భారీగా చెట్లునాటే ప్రచారకార్యక్రమం ప్రవేశపెట్టింది.1988 నాటికి ప్రణాళిక చేయబడిన 336 హెక్టార్లలో 265 హెక్టార్లలో చెట్లు నాటబడ్డాయి, 39 రకాల రిజర్వు ప్రాంతాలు 36 అటవీ ప్లాంటేషన్లు ప్రాంతాలు ఏర్పడ్డాయి. 1986 లో పర్యావరణ సమస్యలను ప్రజలలో అవగాహన కల్పించడానికి ఎకోటెర ఇంటర్నేషనలు " వైల్డులైఫు రెస్క్యూ, రీసెర్చి & మానిటరింగ్ సెంటరు " లను స్థాపించింది. ఈ విద్యా కృషి 1989 లో "సోమాలియా ప్రతిపాదన" అని పిలుస్తారు. వైల్డు ఫ్యూనా & ఫ్లోరా (సి.ఐ.టి.ఇ.ఎస్) అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యం కట్టుబాటు చేయడానికి సోమాలి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది మొదటి సారి ప్రపంచవ్యాప్తంగా ఏనుగు దంతం వాణిజ్య నిషేధం విధించింది.

సొమాలియా 
మోగాదిషు దక్షిణ తీరం

ప్రముఖ సోమాలి పర్యావరణ కార్యకర్త ఫాతిమా జిబ్రేలు సోమాలియా ఈశాన్య భాగంలో అకాసియా వృక్షాలను రక్షించడానికి విజయవంతంగా ప్రచారం సాగించాడు. అరేబియా ద్వీపకల్పంలో బొగ్గు తయారు చేయడానికి 500 సంవత్సరాల పాటు జీవించే ఈ చెట్లు తగ్గించబడుతున్నాయి. ఈ ప్రాంతంలోని బెడుౌను తెగలు అకాసియా పవిత్రమైనదని నమ్ముతారు. అయితే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చవకైన ఇంధనం ఉన్నప్పటికీ బొగ్గు ఉత్పత్తికి తరచుగా అటవీ నిర్మూలన చేయడం ఎడారీకరణకు దారి తీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గంగా జిబ్రేలు (సంస్థ వ్యవస్థాపకురాలు,ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు), హార్ను ఆఫ్ ఆఫ్రికా రిలీఫు & డెవలప్మెంటు ఆర్గనైజేషను (హోర్ను రిలీఫ్; ప్రస్తుతం అడెసో), టీనేజి విధ్యార్ధుల బృందానికి శిక్షణ ఇచ్చి ప్రజలలో అవగాహన కల్పించడానికి కృషిచేసింది. ఈ శిక్షణలో బొగ్గును ఉత్పత్తి చేస్తే కలిగే నష్టం గురించి వివరించబడింది. 1999 లో సోమాలియాలోని ఈశాన్య పుంట్ల్యాండు ప్రాంతంలో హార్ను రిలీఫు "బొగ్గు యుద్ధాలు" పేరుతో శాతియాత్ర సాగించింది. జిబ్రేలు లాబీయింగు, విద్య ప్రయత్నాల ఫలితంగా 2000 లో పుంట్ల్యాండు ప్రభుత్వం బొగ్గు ఎగుమతిని నిషేధించి అమలుచేసింది. ఇది బొగ్గు ఉత్పత్తి ఎగుమతులు 80% పడిపోవటానికి కారణమైంది. 2002 లో పర్యావరణ క్షీణత, ఎడారీకరణకు వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాల కోసం జిబ్రేలు గోల్డ్మను ఎన్విరాన్మెంటలు బహుమతిని అందుకున్నది. 2008 లో ఆమె లీడర్షిపు కన్జర్వేషనులో నేషనలు జియోగ్రాఫికు సొసైటీ బఫ్ఫెటు ఫౌండేషను పురస్కారం గెలిచింది.

2004 డిసెంబరులో భారీ సునామీ తరువాత, 1980 ల చివరలో సోమాలియా పౌర యుద్ధం సంభవించిన తర్వాత సోమాలియా సుదూర తీరప్రాంతాన్ని విష వ్యర్ధాలను పారవేసేందుకు డంపు స్థలంగా ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. సునామి తరువాత ఉత్తర సోమాలియలో భారీ తరంగాలలో ఒడ్డుకు చేరిన వ్యర్ధాలకు విదేశీ సంస్థలచే చట్టవిరుద్ధంగా అక్రమంగా దేశసంద్రతీరంలో విడిచిన టన్నుల అణు, విష వ్యర్థాలకు చెందినవని విశ్వసిస్తున్నారు.


ఇటాలియను స్విసు సంస్థ, ఆచెయిరు పార్ట్నర్సు, ఒక ఇటాలియను వేస్టు బ్రోకరు, ప్రొగ్రోస్కో - తరువాత ప్రెసిడెంటు ప్రతినిధులు, రెండు యూరోపియను కంపెనీల కాంట్రాక్టుల కాపీలలో ప్రెసు, యూరోపియను పార్లమెంటులో సమర్పించింది. సోమాలియాలోని నాయకుడు ఆలీ మహ్దీ మొహమ్మదు $ 80 మిలియన్లు తీసుకుని (£ 60 మిలియన్లు) బదులుగా 10 మిలియన్ టన్నుల విష వ్యర్ధాలను ఇక్కడ కుమ్మరించడానికి అంగీకరించాడని ౠజువైంది.

ఈ వ్యర్థాలు హిందూ మహాసముద్ర తీరంలోని ఈశాన్యంలోని బెనాడిరు - హొబ్యో పట్టణాలలో రేడియేషను అస్వస్థతకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు, నోటి పూతలు, రక్తస్రావం, ఉదర హేమోర్హేజెసు, అసాధారణ చర్మ సంక్రమణల వ్యాధులు సంభవించాయని యునైటెడు నేషన్సు ఎన్విరాన్మెంటు ప్రోగ్రాం (యు.ఎన్.ఇ.పి) నివేదిక పేర్కొన్నది. సోమాలియా తీరం వెంట ఉన్న ప్రస్తుత పరిస్థితిలో సోమాలియాలోనే కాకుండా, తూర్పు ఆఫ్రికా ఉప-ప్రాంతంలో కూడా చాలా తీవ్రమైన పర్యావరణ ప్రమాదం ఉంది అని యు.ఎన్.ఇ.పి. పేర్కొంది.

వాతావరణం

సొమాలియా 
Somalia map of Köppen climate classification.

సోమాలియా భూమధ్యరేఖకు సమీపంలో ఉండటం వలన దాని వాతావరణంలో చాలా కాలానుగుణ వైవిధ్యం లేదు. కాలానుగుణ రుతుపవన గాలులు, క్రమరహిత వర్షపాతంతో సంవరం పొడవునా అధిక ఉష్ణోగ్రతలు వ్యాప్తి చెందుతాయి. సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు 30 - 40 ° సెం (86 నుండి 104 ° ఫా) వరకు ఉంటుంది. తూర్పు సముద్ర తీరం వెంట ఉన్నత పర్వతప్రాంతాలలో మినహా ఒక చల్లని సముద్రతీర వాతావరణ ప్రభావాలు ఉంటాయి. ఉదాహరణకు మొగడిషులో సగటు మధ్యాహ్నం ఉష్ణోగ్రత అత్యధికంగా 28 - 32 ° సెం (82 - 90 ° F) వరకు ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక సగటు వార్షిక ఉష్ణోగ్రతలలో కొన్ని నమోదు చేయబడ్డాయి; వాయువ్య తీరంలోని బెర్బెరా మధ్యాహ్నం ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఇది జూన్ నుండి సెప్టెంబరు వరకు 38 ° సెం(100 ° ఫా) కంటే అధికం ఉంటుంది. దేశీయంగా రోజువారీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 15 నుంచి 30 ° సెం (59 నుండి 86 ° ఫా) వరకు ఉంటాయి. జూలైలో ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు జూలైలో 45 డిగ్రీల సెల్సియసు (113 ° ఫా) కు చేరుకుంటాయి. ఉత్తర సోమాలియాలో డిసెంబరులో పర్వత ప్రాంతాలలో గడ్డకట్టే వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆర్ద్రత రాత్రి మధ్య నుండి మధ్యాహ్నం వరకు 40% నుండి రాత్రికి 85% వరకు ఉంటుంది. ఈ అక్షాంశంలో ఉన్న ఇతర దేశాల శీతోష్ణస్థితులా ఉండక సోమాలియాలోని పరిస్థితులు ఈశాన్య, మధ్య ప్రదేశాలలో శుష్క వాతావరణం, వాయవ్య, దక్షిణాన అర్ధత ఉంటుంది. ఈశాన్య ప్రాంతంలో వార్షిక వర్షపాతం 100 మి.మీ (4 అం) కంటే తక్కువగా ఉంటుంది; కేంద్ర పీఠభూములలో ఇది 200 నుండి 300 మిమీ (8 నుండి 12 అం) వరకు ఉంటుంది. అయితే దేశం వాయువ్య, నైరుతీ భాగాలలో సంవత్సరానికి 510 నుండి 610 మి.మీ (20 నుండి 24 అం) సగటు వర్షపాతం ఉంటుంది. తీర ప్రాంతాలు సంవత్సరం పొడవునా వేడిగా, తేమగా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాలలో సాధారణంగా పొడి, వేడిగా ఉంటుంది.


ఇక్కడ నాలుగు ప్రధాన సీజన్లు ఉన్నాయి. వీటిలో మతసంబంధ, వ్యవసాయ జీవితం సంబంధితమై ఉంటుంది. ఇవి వాయు నమూనాలలో మార్పుల ద్వారా నిర్దేశించబడతాయి. డిసెంబరు నుండి మార్చి వరకు సంవత్సరం పొడవునా కఠినమైన పొడి సీజను (జిలాలు) ఉంటుంది. ప్రధాన వర్షకాల కాలం (గు) ఏప్రిలు నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలము నైరుతి రుతుపవనాలుగా వర్గీకరించబడుతుంది. ఇది పచ్చిక బయళ్ళను, ముఖ్యంగా కేంద్ర పీఠభూమిని చైతన్యవంతం చేస్తుంది. ఎడారిని అటవీ వృక్షమయంగా మారుస్తుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు రెండవ పొడి సీజను, క్సాగా ("హగా" అని ఉచ్ఛరిస్తారు). అతి తక్కువ వర్షపు సీజను అయిన డేరు అక్టోబరు నుండి డిసెంబరు వరకు ఉంటుంది. రెండు వర్షాలు (అక్టోబరు-నవంబరు - మార్చి-మే) మధ్య ఉండే (టాంగమ్బిలి) కాలాలు వేడిగా, తేమగా ఉంటాయి.

వన్యజీవితం

సొమాలియా 
A camel in the northern mountains.

భౌగోళిక, శీతోష్ణస్థితి వైవిధ్యం కారణంగా సోమాలియాలో వివిధ క్షీరదాలు ఉన్నాయి. వీటిలో చిరుత, సింహం, ఏనుగు, పొదల పంది, గాజెల్లె, ఐబెక్సు, కుడు, డిక్-డిక్, ఒరిబి, సోమాలి అటవీ గాడిద, రీడబ్కు, గ్రెవిసు జీబ్రా, ఎలిఫెంటు ష్ర్యూ, రాక్ హైరాక్సు, గోల్డెను మోలు, యాంటెలోపు ఉన్నాయి. ఇక్కడ డ్రోమేడియరీ ఒంటెలు పెద్ద సంఖ్యలో ఉంది.

సోమాలియాలో ప్రస్తుతం 727 పక్షిజాతులు ఉన్నాయి. వాటిలో ఎనిమిది జాతులు ఉన్నాయి. ఒకటి మానవులచేత ప్రవేశపెట్టినది. ఒకటి అరుదైనది లేదా అప్రయత్నంగా ఇక్కడకు చేరుకున్నది ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నవి 14 జాతులు ఉన్నాయి. దేశంలో ప్రత్యేకంగా కనిపించే పక్షుల జాతులు సోమాలి పావురం, అలేమోను హామెర్టోని (అల్యుడిడే), లెస్సెరు హోపెయో-లార్కు, హెటరొమిరాఫ్రా ఆర్చెరి (అల్యుడిడే), ఆర్చర్సు లార్కు, మిరాఫ్రా ఆషి, ఆష్సి బుషు లార్కు, మిరాఫ్రా సోమాలికా (అలాడీడే), సోమాలి బుషు లార్కు, స్పిజికోరిసు ఓబ్బియెన్సిసు (అలోడీడే), ఓబ్బియా లార్కు, కార్డ్యులిసు జోహనీసు (ఫ్రిజ్లింగుడే), వార్సాంగ్లి లిన్నెటు.

సోమాలియా ప్రాదేశిక జలాలు అత్యంత ప్రఖ్యాత సముద్ర జాతులు, టునా వంటి ప్రధాన చేపలను కలిగి ఉన్నాయి. అనేక డెమెసరలు చేప, క్రస్టేసే జాతులు ఉన్నాయి. దేశంలో ప్రత్యేకంగా కనిపించే చేపల జాతులు సిర్రితిచత్యాసు రండల్లి (సిర్రిటిడే), సింఫురసు ఫస్కసు (సైనోగ్లోసిడె), పారపెర్సిసు సిమ్యులేటా ఒ.సి. (పింగ్యుయిపెడిడే), కోసిఎల్ల సోమాలియన్సు ఒ.సి.(ప్లాటిసెఫలిడే), సూడోక్రోమిసు మెలనోటాసు (సూడోక్రోమిడే).

దాదాపు 235 జాతుల సరీసృపాలు ఉన్నాయి. వీటిలో ఉత్తర ప్రాంతాలలో దాదాపు సగం నివసిస్తున్నారు. సోమాలియాలో ఉన్న సరీసృపాలు హుఘ్సు, సా స్కేలు వైపరు, దక్షిణ సోమాలి గార్టెరు పాము, ఒక రేసరు (ప్లాటిసెప్సు మెసనాయి), డయాడెం పాము (స్పలేర్యోసిసు జోసెఫ్స్కోర్ట్కీ), సోమాలి ఇసుక బోయా, ఏగిల్డు వర్ము లిజార్డు, స్పినీ టెయిల్డు లిజార్డు (ఉరోమాస్ట్యిక్సు మెక్ఫాడియేని), , లాంజాసు అగ్మా, జిక్కో (హేమిడాక్టిలసు గ్రాన్చి), సోమాలి సేమ్ఫోరే జిక్కో, శాండు లిజార్డు, (మెసాలినా లేదా ఇరెమియాసు) ఉన్నాయి. ఒక కొలుబ్రిడు పాము (అపోస్డోకెటోఫిస్ ఆరెనెనీ), హేకే-గ్రీరు స్కిన్కు (హాక్గ్రేరియసు మైయోపసు)అంతరించిపోతున్న స్థానిక జాతులు ఉన్నాయి.

ఆర్ధికరగం

సొమాలియా 
Air Somalia Tupolev Tu-154 in Sharjah, United Arab Emirates. Somalia today has several private airlines

సి.ఐ.ఎ. సెంట్రలు బ్యాంకు ఆఫ్ సోమాలియా ప్రకారం పౌర అశాంతి అనుభవించినప్పటికీ, సోమాలియా ప్రధానంగా పశుసంపద, చెల్లింపు (డబ్బు బదిలీ సంస్థలు), టెలీకమ్యూనికేషన్ల ఆధారంగా ఒక ఆరోగ్యకరమైన అనధికార ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అధికారిక ప్రభుత్వ గణాంకాలు, ఇటీవలి అంతర్యుద్ధం, కరవు కారణంగా, ఆర్థిక వ్యవస్థ పరిమాణం లేదా పెరుగుదలను అంచనా వేయడం కష్టం. 1994 లో సి.ఐ.ఎ.$ 3.3 బిలియన్ల అమెరికాడాలర్ల జి.డి.పి.గా అంచనా వేసింది. 2001 లో ఇది $ 4.1 బిలియన్ల అమెరికా డాలర్లు. 2009 నాటికి జిడిపి 5.731 బిలియన్ల అమెరికా డాలర్లకు పెరిగినట్లు వాస్తవిక వృద్ధిరేటు 2.6% గా ఉంది. 2007 బ్రిటిషు ఛాంబర్సు ఆఫ్ కామర్సు రిపోర్టు ప్రకారం ప్రైవేటు రంగం కూడా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సేవా రంగంలో. అనేక సేవలు, పారిశ్రామిక రంగం ప్రభుత్వం నిర్వహణలో ఉన్న సమయంలో పౌర యుద్ధం సంభవించిన కారణంగా వ్యాపార కార్యకలాపాల్లో ప్రైవేటు పెట్టుబడులు అధికరించాయి. దీనికి అధికంగా సొమాలియా డయాస్పోరా నిధులు సమకూర్చింది. వాణిజ్యం & మార్కెటింగు, డబ్బు బదిలీ సేవలు, రవాణా, సమాచార, ఫిషింగు పరికరాలు, ఎయిర్లైన్సు, టెలీకమ్యూనికేషన్సు, విద్య, ఆరోగ్యం, నిర్మాణం, హోటళ్ళు ఉన్నాయి. లిబరేరియను ఆర్ధికవేత్త పీటరు లేసను సోమాలి సంప్రదాయ చట్టం (జియెర్ గా పిలవబడ్డాడు) కు ఈ పెరుగుతున్న ఆర్ధిక కార్యకలాపాన్ని ఆపాదించాడు. ఇది వ్యాపారాన్ని నిర్వహించడానికి స్థిరమైన పర్యావరణాన్ని అందిస్తుంది.

సోమాలియా సెంట్రలు బ్యాంకు ప్రకారం దేశం తలసరి జి.డి.పి 2012 నాటికి $ 226 అమెరికా డాలర్లుగా ఉంది. ఇది 1990 నుండి స్వల్పంగా తగ్గిపోయింది. జనాభాలో 43% మంది రోజుకు 1 అమెరికా డాలరు కంటే తక్కువ ఆదాయంతో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో 24%, గ్రామీణ ప్రాంతాలలో 54% నివసిస్తున్నారు.

సొమాలియా 
మొగాడిషులో హమార్వేను మార్కెట్లో విక్రయదారులు

సోమాలియా ఆర్ధిక వ్యవస్థ సంప్రదాయ, ఆధునిక ఉత్పత్తి రెండింటినీ కలిగి ఉంది. ఆధునిక పారిశ్రామిక పద్ధతులకు క్రమంగా మార్పు చెందుతూ ఉంది. సోమాలియాలో ప్రపంచంలో ఒంటెల అతిపెద్ద జనాభా ఉంది. సెంట్రలు బ్యాంకు ఆఫ్ సోమాలియా ప్రకారం జనాభాలో సుమారు 80% మంది సంచార లేదా పాక్షిక-సంచార జంతుపెంపకదార్లుగా ఉన్నారు. వీరు మేకలు, గొర్రెలు, ఒంటెలు, పశువులను పెంచుకుంటారు. వారి ఆదాయాన్ని భర్తీ చేయడానికి చెట్ల నుండి బంకను సేకరిస్తుంటారు.

వ్యవసాయం

సోమాలియాలో వ్యవసాయం అత్యంత ముఖ్యమైన ఆర్థిక రంగం. ఇది జీడీపీలో దాదాపు 65% వాటాను కలిగి ఉంది. 65% శ్రామిక శక్తిని కలిగి ఉంది. పశుసంపద జి.డి.పిలో 40%, ఎగుమతి ఆదాయాలలో 50% కంటే ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రధాన ఎగుమతులు చేపలు, బొగ్గు, అరటి; చక్కెర, జొన్న, మొక్కజొన్నలు దేశీయ మార్కెటు కోసం ఉత్పత్తి చేయబడుతున్నాయి. సోమాలియా సెంట్రలు బ్యాంకు ప్రకారం వస్తువుల దిగుమతులు సంవత్సరానికి సుమారు $ 460 మిలియన్ల అమెరికా డాలర్లు ఉంటుందని అంచనా. సంవత్సరానికి 270 మిలియన్ల అమెరికా డాలర్ల ఎగుమతులు పూర్వ యుద్ధ ఎగుమతుల ఎగుమతుల స్థాయిని అధిగమించాయి . సోమాలియాకు సుమారు $ 190 మిలియన్ల వాణిజ్య లోటు ఉంది. కానీ ఇది సోమాలి విదేశీ ఉపాధిదారులు పంపిన చెల్లింపుల ద్వారా( $ 1 బిలియన్ల వద్ద అంచనా వేయబడింది) భర్తీ చేయబడుతుంది.

అరేబియా ద్వీపకల్పం సమీపంలో ఉండటం వల్ల, సోమాలి వ్యాపారులు గల్ఫు అరబు పశువుల మాంసం, మాంసం మార్కెటు మీద ఆస్ట్రేలియా సాంప్రదాయిక ఆధిపత్యాన్ని సవాలు చేయడం ప్రారంభించారు. నాణ్యతగల జంతువులను చాలా తక్కువ ధరలకు అందిస్తున్నారు. ప్రతిస్పందనగా గల్ఫు అరబు రాష్ట్రాలు దేశంలో వ్యూహాత్మక పెట్టుబడులను ప్రారంభించాయి. సౌదీ అరేబియా పశువుల ఎగుమతి మౌలికనిర్మాణాలు, యునైటెడు అరబు ఎమిరేట్సు పెద్ద వ్యవసాయ భూములను కొనుగోలు చేసింది. సోమాలియా ఫ్రాంకింసెంసు, మిరు ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా ఉంది.

సొమాలియా 
బోసాసు నౌకాశ్రయం

వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిన నిరాడంబరమైన పారిశ్రామిక రంగం సోమాలియా జి.డి.పి లో 10% వాటాను కలిగి ఉంది. సోమాలి చాంబరు ఆఫ్ కామర్సు అండ్ ఇండస్ట్రీ ప్రకారం, ఆరు ప్రైవేటు ఎయిర్లైను సంస్థలు డాల్లా ఎయిర్లైన్సు, జుబ్బా ఎయిర్వేసు, ఆఫ్రికా ఎక్సుప్రెసు ఎయిర్వేసు, తూర్పు ఆఫ్రికా 540, సెంట్రలు ఎయిరు, హజారాలతో సహా దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాలకు వాణిజ్య విమానాలను అందిస్తున్నాయి. 2008 లో పూట్ల్యాండు ప్రభుత్వం మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో పనిచేస్తున్న ప్రాంతీయ పారిశ్రామిక సమూహమైన దుబాయి లూటా గ్రూపుతో ఒక బహుళ-డాలర్ల ఒప్పందం మీద సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం పెట్టుబడి మొదటి దశ Dhs 170 m విలువ, బొసాసొ ఉచిత వాణిజ్య జోను, సముద్ర, విమానాశ్రయం సౌకర్యాలు నిర్వహించడానికి, నిర్మించడానికి కొత్త కంపెనీల ఏర్పాటు చూస్తారు. బోస్సావు ఎయిర్పోర్టు కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయ సముదాయాన్ని అభివృద్ధి పరచటానికి, ఒక కొత్త 3,400 మీ (11,200 అ) రన్ వే, ప్రధాన, సహాయక భవనాలు, టాక్సీ ఆప్రాను ప్రాంతాలు, భద్రతా పరిమితులను కలిగి ఉంటుంది.

1991 లో పౌర యుద్ధం సంభవించకముందే సుమారు 53 ప్రభుత్వ రంగ సంస్థలు చిన్న, మధ్య, భారీ తయారీ సంస్థలు స్థాపించబడ్డాయి. యుద్ధం తరువాతి వివాదం మిగిలిన అనేక పరిశ్రమలను నాశనం చేసింది. అయితే ప్రధానంగా సోమాలి డయాస్పోరా ద్వారా గణనీయమైన స్థానిక పెట్టుబడుల ఫలితంగా ఈ చిన్న-చిన్న పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి, కొత్తవి సృష్టించబడ్డాయి. ఉత్తర ప్రాంతాలలో చేపల-కాన్నింగు & మాంసం-ప్రాసెసింగ్ ప్లాంట్లు, మొగాడిషు ప్రాంతంలో సుమారు 25 కర్మాగారాలు ఉన్నాయి, ఇవి పాస్తా, మినరలు వాటరు, కంబెక్షన్సు, ప్లాస్టికు సంచులు, తోలు, డిటర్జెంటు, సోపు, అల్యూమినియం , ఫోం పరుపులు, దిండ్లు, చేపలు పట్టే పడవలు, ప్యాకేజింగు, రాళ్ళ ప్రాసెసింగ్ చేపట్టడం.2004 లో సోమాలియాలోని వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన పెట్టుబడిదారులు నగరంలో 8.3 మిలియన్ల డాలర్ల కోకా-కోలా బాట్లింగు కర్మాగారం కూడా ప్రారంభించారు. విదేశీ పెట్టుబడులలో జనరలు మోటార్సు, డోలు ఫ్రూతో సహా పలువురు సంస్థలు ఉన్నాయి.

ధ్రవ్యవ్యవస్థ

సోమాలియాలో " సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సొమాలియా " ద్రవ్విధానానికియ అధికారం కలిగి ఉంది. ఆర్ధిక నిర్వహణ పరంగా ద్రవ్య విధానాన్ని సూత్రీకరించడం, అమలు చేయడం రెండింటి బాధ్యతను ఇది నిర్వహిస్తుంది.

స్థానిక కరెన్సీలో విశ్వాసం లేని కారణంగా, సోమాలి షిల్లింగుతో పాటుగా డాలరు విస్తృతంగా మారకం మాధ్యమంగా అంగీకరించబడింది. డాలరైజేషను అయినప్పటికీ, సోమాలి షిల్లింగు పెద్ద జారీ అధిక ధరల పెంపుకు (ప్రత్యేకించి తక్కువ విలువ లావాదేవీలకు) దారితీసింది. సెంట్రలు బ్యాంకు ఈ ద్రవ్యోల్బణ పర్యావరణం ద్రవ్య విధానంలో పూర్తి నియంత్రణను చేపట్టడం, ప్రైవేటు రంగం ప్రవేశపెట్టిన ప్రస్తుత వాడకం కరెన్సీని భర్తీ చేయడంతో వెంటనే ముగిసే అవకాశం ఉందని భావిస్తుంది.

1991 లో సోమాలియా అంతర్యుద్ధం 2009 లో పునఃస్థాపన మధ్య 15 సంవత్సరాలుగా సెంట్రలు బ్యాంకు ఆఫ్ సోమాలియా ఎటువంటి కేంద్ర ద్రవ్య అధికారాన్ని కలిగి లేనప్పటికీ దేశం చెల్లింపు వ్యవస్థ ప్రధానంగా ప్రైవేటు డబ్బు బదిలీ ఆపరేటర్లు (ఎం.టి.వి)అనధికారిక బ్యాంకింగు నెట్వర్కుగా వ్యవహరించడం ద్వారా ద్రవ్యవిధానం కొనసాగింది.

సోమాలియాలో ఈ చెల్లింపు సంస్థలు (హవాలాస్) ఒక పెద్ద పరిశ్రమగా మారాయి. డబ్బును బదిలీ చేసే కంపెనీల ద్వారా సోమాలీయులు ఈ ప్రాంతానికి సంవత్సరానికి $ 1.6 బిలియన్ల అమెరికా డాలర్లు చెల్లించారు. మనీ ట్రాన్స్ఫరు అసోసియేషను (ఎస్.ఒ.ఎం.టి.ఎ.)లోని చాలామంది సోమాలి సభ్యులు కమ్యూనిటీ డబ్బు బదిలీ రంగం లేదా దాని పూర్వీకుడైన సోమాలీయుల ఫైనాన్షియలు సర్వీసెసు అసోసియేషను (ఎస్.ఎఫ్.ఎస్.ఎ.)ను నియంత్రించే ఒక సంస్థ సభ్యులుగా ఉన్నారు. సోమాలిటీ ఎం.టి.ఒ.లలో అతిపెద్దది సోహాకి చెందిన యాజమాన్య సంస్థకు 144 దేశాలలో 2,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను లండను, దుబాయిలలో శాఖలను కలిగి ఉంది.

సొమాలియా 
500 సోమాలి షిల్లింగు బ్యాంకునోటు

పునర్నిర్మించిన సెంట్రలు బ్యాంకు ఆఫ్ సోమాలియా పూర్తిగా తన ద్రవ్య విధాన బాధ్యతలను స్వీకరిస్తుండటంతో ఇప్పటికే ఉన్న డబ్బు బదిలీ కంపెనీలు కొద్దికాలంలో పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకులుగా అభివృద్ధి చేయడానికి లైసెంసులను కోరుకుంటాయి. దేశీయ మైక్రోఎకనామికు మేనేజ్మెంటులో ద్రవ్య విధానాన్ని ఉపయోగించడం సామర్ధ్యాన్ని మరింత బలపరుస్తుంది. అధికారిక తనిఖీలను చేర్చడానికి జాతీయ చెల్లింపుల వ్యవస్థను విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుంది.

స్థానిక భద్రతలో గణనీయమైన పురోభివృద్ది సంభవించడంతో సోమాలియా విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి అవకాశాల కోసం దేశానికి తిరిగి రావడం ప్రారంభించారు. నిరాడంబరమైన విదేశీ పెట్టుబడులతో కలిసి సోమాలీ షిల్లింగు విలువ గణనీయంగా పెరిగింది. 2014 మార్చి నాటికి ఈ కరెన్సీ గత 12 నెలల్లో అమెరికా డాలరు మీద దాదాపు 60% అధికరించింది. బ్లూంబర్గు పరివర్తన చేయబడుతున్న 175 ప్రపంచ కరెన్సీలలో సోమాలి షిల్లింగు బలమైనదిగా ఉంది. ఇదే కాలానికి తదుపరి అత్యంత బలమైన ప్రపంచ కరెన్సీ కంటే 50% అధికం. 2012 లో సోమాలియా " సొమాలియా స్టాకు ఎక్స్ఛేంజి (ఎస్ఎస్ఇ)ని" సోమాలి దౌత్యవేత్త ఇద్దు మహ్మదు (ఐక్యరాజ్యసమితికి అంబాసిడరు ఎక్సుట్రాడినరీ, ఐఖ్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధి) స్థాపించారు. ఎస్.ఎస్.ఇ. సోమాలియాలో జరుగుతున్న పునర్నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయడానికి సోమాలీ-యాజమాన్యంలోని సంస్థలు, ప్రపంచ సంస్థల నుండి పెట్టుబడిని ఆకర్షించడానికి స్థాపించబడింది.

విద్యుత్తు, సహజ వనరులు

సొమాలీలో విద్యుత్తును ప్రస్తుతం స్థానిక వ్యాపారులు సరఫరా చేస్తున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిస్తుంది. ఈ దేశీయ సంస్థలలో సోమాలి ఎనర్జీ కంపెనీ విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ చేస్తుంది. 2010 లో దేశం 310 మిలియన్ల కిలోవాట్లను ఉత్పత్తి చేసి, 288.3 మిలియన్ల కిలోవాట్ల విద్యుత్తును వినియోగించింది. ఇది సి.ఐ.ఎ. వర్గీకరణలో వరుసగా 170 వ, 177 వ స్థానంలో ఉంది.

సొమాలియా 
పుంటులాండు ఆయిలు బ్లాక్సు

సోమాలియా యురేనియం, ఇనుము ధాతువు, టిను, జిప్సం, బాక్సైటు, రాగి, ఉప్పు, సహజ వాయువు వంటి అనేక సహజ వనరుల నిల్వలను కలిగి ఉంది. నిరూపితమైన సహజవాయువు నిల్వలు 5.663 బిలియన్లు క్యూబికు మీటర్లు ఉన్నాయి అని సి.ఐ.ఎ. నివేదిస్తుంద.

యెమెను వంటి చమురు సంపద కలిగిన గల్ఫు అరబు దేశాలకు సామీప్యత, భౌగోళిక సారూప్యత కారణంగా శక్తి ఉత్పాదక పరిశ్రమ ప్రతినిధులు ఈ దేశంలో గణనీయమైన రీతిలో లేని చమురు నిల్వలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ సోమాలియాలో నిరూపితమైన చమురు నిక్షేపాల ఉనికి అస్పష్టంగా ఉంది. 2011 నాటికి దేశంలో నిరూపితమైన నిక్షేపాలు లేవు అని సి.ఐ.ఎ. పేర్కొంది. సోమాలియా ప్రాంతంలో నిరూపితమైన చమురు నిక్షేపాలు దాని వాయువ్య తీరప్రాంతాలలో ఉంటాయని యు.ఎన్.టి.ఎ.డి సూచిస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఐఖ్యరాజ్యసమితి హార్ను ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికా సర్వే సోమాలియా చమురు నిల్వలు ఆఫ్రికాఖండంలో రెండవ స్థానంలో (మొదటి స్థానంలో సూడాన్ ఉంది) ఉన్నది. సిడ్నీ, రేంజి రిసౌర్సెసు జాబితా తయారుచేసిన ఒక చమురు బృందం ఈశాన్యంలోని పుంట్ల్యాండు ప్రాంతం 5 బిలియన్ల బారెల్సు (790 × 106 m3) నుండి 10 బిలియన్ల బారెల్సు (1.6 × 109 m3) చమురును నిక్షేపాలు ఉన్నాయని తెలియజేసింది. సుడానులో 6.7 బిలియన్ల బారెల్స్ నిరూపితమైన చమురు నిల్వలు ఉన్నాయి. ఈ పరిణామాలు ఫలితంగా సోమాలియా పెట్రోలియం కార్పొరేషను ఫెడరలు ప్రభుత్వంచే స్థాపించబడింది.

1960 ల చివరలో ఐఖ్యరాజ్యసమితి భూగోళ శాస్త్రవేత్తలు సోమాలియాలో అతిపెద్ద యురేనియం డిపాజిట్లు, ఇతర అరుదైన ఖనిజ నిల్వలను గుర్తించారు. ఈ రకమైన వాటిలో పెద్దది కనుగొనబడింది. పరిశ్రమ నిపుణులు అంచనా ప్రకారం ప్రపంచంలోని అప్పటి యురేనియం నిల్వలలో సుమారు 25% పైగా డిపాజిట్లు మొత్తం 8,00,000 టన్నులని అంచనా వేశారు. 1984 లో సోమాలియాకు ఐ.యు.ఆర్.ఇ.పి. ఓరియెంటేషను దశ మిషను ఆధారంగా దేశంలో 5,000 టన్నుల యురేనియం సహేతుక హామీ వనరులు (ఆర్.ఎ.ఆర్), అదనపు సర్వేలు కాలిక్రేటులో 11,000 టన్నుల యురేనియం ఖనిజ నిల్వలును (ఇ.ఎ.ఆర్) ఉన్నాయని అంచనా వేసింది. అలాగే యురేనియం స్పెక్యులేటివు ననరులు 0-150,000 టన్నులు ఇసుక రాళ్ళ, కాలిక్రేటు ఖనిజ నిల్వలలో ఉన్నాయని తెలియజేసింది. సోమాలియా ప్రధానంగా ప్రపంచ యురేనియం సరఫరాదారుగా ఉంది. సొమాలియా యురేనియం వెలికితీత హక్కుల కొరకు అమెరికా, యు.ఎ.ఇ, ఇటలీ & బ్రెజిలియను ఖనిజ సంస్థలు పోటీ పడుతున్నాయి. సెంట్రలు ప్రాంతంలో లింకు నేచురలు రిసోర్సెసు వాటాను కలిగి ఉంది. యురేనియ అన్వేషణలో ఉన్న కిలిమంజారో కాపిటల్ 11,61,400 ఎకరాల (4,70,002 హెక్టార్లు) అమాసు-కొరియోలె- అఫ్గొయి) (ఎ.సి.ఎ) బ్లాకులో వాటాను కలిగి ఉంది.

మొగడిషులో "ట్రాన్సు-నేషనలు ఇండస్ట్రియలు ఎలక్ట్రిసిటీ & గ్యాసు " శక్తి ఉత్పాదక సంస్థ కేంద్రీకృతమైన. 2010 లో ఇస్తాంబులులో ఒక ఉమ్మడి ఒప్పందం మీద సంతకం చేయబడింది. దీనిని అనుసరించి ఇది సోమాలియాలో విద్యుత్తు, గ్యాసు మౌలిక సౌకర్యాలను అందించటానికి వాణిజ్య, ఆర్థిక, భద్రత, సమాచార విభాగాలతో ఐదు అతిపెద్ద సోమాలీ కంపెనీలను కలుపుతుంది. $ 1 బిలియన్ల మొదటి పెట్టుబడి బడ్జెటుతో కంపెనీ స్థానిక పారిశ్రామికీకరణ కార్యక్రమాలు సులభతరం చేయటానికి సోమాలియా పీస్ డివిడెండ్ ప్రాజెక్టును ప్రారంభించి కార్మికశక్తిని అభివృద్ధిచేయడానికి ప్రయత్నించింది.


పునర్నిర్మాణం మార్గంలో దేశం ముందుకుపోతుంది అని సోమాలియా సెంట్రలు బ్యాంకు భావించింది. ఆర్థిక వ్యవస్థ దాని పూర్వ-పౌర యుద్ధం స్థాయిలకు చెరితేమాత్రమే సరిపోదు. సోమాలియాలో అసంపూర్తిగా ఉన్న సహజ వనరులను అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచిస్తుంది.

సమాచార రంగం

సొమాలియా 
The Hormuud Telecom building in Mogadishu

అంతర్యుద్ధం ప్రారంభమైన తరువాత వివిధ నూతన టెలికమ్యూనికేషను కంపెనీలు ఆవిర్భవించాయి. ఇవి క్షీణించిన మౌలిక సదుపాయాలను అందించటానికి పోటీ పడ్డాయి. చైనా, దక్షిణ కొరియా, ఐరోపా నుండి నైపుణుల సహకారంతో సోమాలి టెలీకమ్యూనికేషను సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ నవజాత టెలీకమ్యూనికేషన్సు సంస్థలు ఖండంలోని అనేక ఇతర ప్రాంతాలలో అందుబాటులో లేనంత తక్కువ రుసుముతో మొబైలు ఫోను, ఇంటర్నెటు సేవలు అందిస్తున్నాయి. వినియోగదారుడు డబ్బు బదిలీలు (ప్రముఖ డహబ్షియిలు ద్వారా), మొబైలు ఫోన్ల ద్వారా ఇతర బ్యాంకింగు కార్యకలాపాలను అలాగే వైర్లెసు ఇంటర్నెటు సదుపాయాన్ని పొందవచ్చు.

స్ప్రింటు, ఐ.టి.టి, టెలినారు వంటి బహుళజాతి సంస్థల భాగస్వామ్యాలు ఏర్పడిన తరువాత ఈ సంస్థలు ఆఫ్రికాలో చౌకైన, స్పష్టమైన ఫోను కాల్సు అందిస్తున్నాయి. ఈ సోమాలి టెలి కమ్యూనికేషను కంపెనీలు సోమాలియాలోని ప్రతి నగరానికి, పట్టణాలకు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం 1,000 మందికి 25 ప్రధానలైన్లు ఉన్నాయి. పొరుగు దేశాల కంటే టెలిఫోను లైన్ల (టెలి-డెన్సిటీ) స్థానిక లభ్యత ఎక్కువగా ఉంది. ప్రక్కన ఉన్న ఇథియోపియాలో కంటే మూడు రెట్లు ఎక్కువ.ప్రముఖ సోమాలియా టెలికాం కంపెనీలలో గోలిసు టెలికాం గ్రూపు, హోర్ముడు టెలికాం, సోమఫోను, నేషన్లింకు, నెట్కో, టెల్కాం, సోమాలి టెలికాం గ్రూపు ఉన్నాయి. హార్మ్యుడు టెలికాం ఒక్క సంవత్సరానికి $ 40 మిలియన్లు వసూలు చేస్తోంది. వారి ప్రత్యర్థి సంస్థలు ఉన్నప్పటికీ ఈ కంపెనీలలో చాలా కంపెనీలు 2005 లో ఇంటరు-కనెక్టివిటీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అవి ధరలను నిర్ణయించటానికి తమ నెట్వర్కులను నిర్వహించటానికి, విస్తరించటానికి, పోటీని నియంత్రణ పరిధిని దాటలేదు నిర్ధారించడానికి వీలు కల్పిస్తాయి.

దేశం భాగాలలో పౌర కలహాలు ఉన్నప్పటికీ టెలికాం పరిశ్రమలో పెట్టుబడులు సోమాలియా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్పష్టమైన సంకేతాలలో ఒకటిగా నిలిచింది.

సోమాలి నేషనలు టెలివిజను ప్రభుత్వ ప్రధాన ప్రజా సేవ టీవీ ఛానలుగా ఉంది. 2011 ఏప్రెలు 4 న ఇరవై ఏళ్ళు విరామం తరువాత ఈ స్టేషను అధికారికంగా తిరిగి ప్రారంభించబడింది. రాజధాని నుండి ""రేడియో మోగాడిషు " ప్రసారం చేయబడుతుంది. ఉత్తర ప్రాంతాల నుండి సోమాలిలాండు నేషనలు టివి, పుంట్ల్యాండు టి.వి & రేడియో ప్రసారం చేయబడుతుంది.

అదనంగా, సోమాలియా అనేక ప్రైవేట్ టెలివిజను, రేడియో నెట్వర్కులను కలిగి ఉంది. వీటిలో హార్ను కేబులు టెలివిజను, యూనివర్సలు టి.వి. ఉన్నాయి. రాజకీయ జోగు డూను, జోగు ఓగలు, హోర్సాలు స్పోర్ట్సు బ్రాడషీట్లు రాజధాని నుండి ప్రచురించబడ్డాయి. పలు ఆన్ లైను వార్తా వెబ్సైట్లు స్థానిక వార్తలు అందిస్తున్నాయి. గరోవ్ ఆన్లైను, వార్తేర్నేన్సు, పుంటు ల్యాండు పోస్టులతో సహా పలు ఆన్లైను మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.

సోమాలియా కోసం ఇంటర్నెటు దేశం కోడు ఉన్నత-స్థాయి డొమైను (ccTLD). ఇది 2010 నవంబరు 1 న అధికారికంగా పునఃప్రారంభించబడింది. దేశీయ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ దీనిని నియంత్రిస్తుంది.

2012 మార్చి 22 న సోమాలియా క్యాబినెటు కూడా ఏకగ్రీవంగా నేషనలు కమ్యూనికేషన్సు యాక్టును ఆమోదించింది. ఈ బిల్లు ప్రసార & సమాచార విభాగాలలో నేషనలు కమ్యునికేషన్సు రెగ్యులేటరు స్థాపనకు దారి తీస్తుంది.

ఏప్రెలు మాసంలో " అండస్టాండింగు ఆఫ్ మమొరాండం " ఎమిరేటు పోస్టుతో సంతకం చేసిన తరువాత ఫెడరలు మినిస్ట్రీ ఆఫ్ పోస్టు, టెలికమ్యూనికేషన్లు అధికారికంగా సోమాలియలు పోస్టలు సర్వీసు (సోమాలి పోస్ట్) ను పునర్నిర్మించాయి. 2014 అక్టోబరులో విదేశాల్లో నుండి తపాలా సరఫరాను మంత్రిత్వ శాఖ పునఃప్రారంభించింది. తపాలా వ్యవస్థ దేశంలోని 18 పరిపాలనా ప్రావీంసులలో కొత్త పోస్టలు కోడింగు నంబరింగు ద్వారా అమలు చేయబడుతుంది.

పర్యాటకం

సొమాలియా 
Ancient cave paintings near Hargeisa

సోమాలియాలో స్థానిక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఇందులో చారిత్రక స్థలాలు, బీచ్లు, జలపాతాలు, పర్వత శ్రేణులు, జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. పర్యాటక రంగం జాతీయ పర్యాటక మంత్రిత్వ శాఖచే నియంత్రించబడుతుంది. స్వయంప్రతిపత్తమైన పుంట్ల్యాండు, సొమాలియాండు ప్రాంతాలు తమ సొంత పర్యాటక కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. సోమాలి పర్యాటక అసోసియేషను (ఎస్,ఒ.ఎం.టి.ఎ.) కూడా జాతీయ పర్యాటక పరిశ్రమలో దేశంలో నుండి సంప్రదింపు సేవలను అందిస్తుంది. 2015 మార్చి నాటికి సౌత్ వెస్టు స్టేటు పర్యాటక & వన్యప్రాణుల మంత్రిత్వశాఖ అదనపు గేం రిజర్వులు, వన్యప్రాణుల శ్రేణులను ఏర్పాటు చేయాలని ప్రకటించింది.

గుర్తించదగిన ప్రదేశాలలో లాయిల్సు గీలు గుహలు నియోలిథికు రాక్ కళలు ఉంటాయి; కాలు మాడో, గోలిసు పర్వతాలు, ఓగో పర్వతాలు; ఇస్కుషుబను, లామాదయ జలపాతాలు; హరిజిసా నేషనలు పార్కు, జిలిబు నేషనలు పార్కు, కిస్సాయో నేషనలు పార్కు, లాగు బాడానా నేషనల్ పార్కు ఉన్నాయి.

రవాణా

సొమాలియా 
The Aden Adde International Airport

సోమాలియా రహదారుల నెట్వర్క్ 22,100 కిమీ (13,700 మైళ్ళు) పొడవు ఉంది. 2000 నాటికి 2,608 కి.మీ (1,621 మై) వీధులు కాలిబాట నిర్మించబడ్డాయి. రహదారులకు 19,492 km (12,112 mi) కాలిబాట నిర్మించబడలేదు. దేశంలోని ఉత్తర భాగంలో బోసస్యో, గల్కాయో, గరోవు రహదారులు 750 కి.మీ (470 మైళ్ళు) హైవే దక్షిణాన ఉన్న పట్టణాలు, ప్రధాన నగరాలను కలుపుతుంది.

సోమాలి సివిలు ఏవియేషను అథారిటీ (ఎస్.ఒ.ఎం.సి.ఎ.ఎ) సోమాలియా జాతీయ పౌర విమానయాధికార సంస్థ. సోమాలియా కోసం సివిలు ఏవియేషను కేర్టేకరు అథారిటీ (సి.ఎ.సి.ఎ.ఎస్) సుదీర్ఘకాల నిర్వహణ తరువాత సోమాలియా 2013 డిసెంబరు 31 నాటికి సోమాలియా వైమానిక ప్రాంతం నియంత్రణను తిరిగి పొందాలని ఎస్.ఒ.ఎం.సి.ఎ.ఎ. నిర్ణయించింది.

సోమాలియా అంతటా 62 విమానాశ్రయాలు వైమానిక రవాణాకు అనుగుణంగా ఉంటాయి; వీటిలో 7 విమానాశ్రయాలకు రన్వేలు ఉన్నాయి. మిగిలిన వాటిలో నాలుగు విమానాశ్రయాలలో 3,047 మీటర్ల రన్వేలు ఉన్నాయి; రెండు 2,438 మీటర్లు, 3,047 మీటర్లు; 1,524 మీ నుండి 2,437 మీ పొడవు ఉంటుంది. చదునైన ల్యాండింగు ప్రాంతాలతో యాభై-ఐదు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒక్కటి 3,047 మీటర్ల రన్వే ఉంది; నాలుగు 2,438 మీటర్ల నుండి 3,047 మీటర్ల పొడవు; ఇరవై 1,524 మీ నుండి 2,437 మీ; ఇరవై నాలుగు 914 మీ నుండి 1,523 మీ; ఆరు 914 మీటర్ల ఉన్నాయి. దేశంలో ప్రధాన విమానాశ్రయాలు మొగాడి షులో ఉన్న ఏడెన్ అడియ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హర్జిసాలోని హర్జిసా అంతర్జాతీయ విమానాశ్రయం, కిస్మయోలో ఉన్న కిస్మయో విమానాశ్రయం, బైడోవాలో బైడోవా విమానాశ్రయం, బోసాసో లోని బెండరు కస్సిం ఇంటర్నేషనలు ఎయిర్పోర్టు ఉన్నాయి.

1964 లో స్థాపించబడిన సోమాలియా జెండా క్యారియరు సోమాలియా ఎయిర్లైన్సు పౌర యుద్ధం సమయంలో కార్యకలాపాలను నిలిపివేసింది. ఏదేమైనా పునర్నిర్మించిన సోమాలి ప్రభుత్వం 2012 లో డిసెంబర్ చివరినాటికి డెలివరీ కోసం మొట్టమొదటి కొత్త సోమాలి ఎయిర్లైన్సు విమానంతో వైమానిక సంస్థ పునఃప్రారంభం కోసం సన్నాహాలు ప్రారంభించింది. సోమాలి చాంబరు ఆఫ్ కామర్సు అండ్ ఇండస్ట్రీ ప్రకారం, సోమాలి ఎయిర్లైన్సు మూసివేతచే సృష్టించబడిన శూన్యత సోమాలి యాజమాన్యంలోని ప్రైవేటు వాహనాలచే భర్తీ చేయబడింది. ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థలలో ఆరు కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాలకు వాణిజ్య విమానాలను అందిస్తున్నాయి. వాటిలో డాల్లో ఎయిర్లైన్స్, జుబ్బా ఎయిర్వేస్, ఆఫ్రికన్ ఎక్స్ప్రెస్ ఎయిర్వేస్, తూర్పు ఆఫ్రికా 540, సెంట్రల్ ఎయిర్, హజారా ఉన్నాయి.

ఖండంలోని అతి పొడవైన సముద్రతీరప్రాంతం కారణంగా సోమాలియాలో అనేక ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. మొగడిషు, బోసాసా, బెర్బెరా, కిస్మాయొ, మెర్కా వంటి నౌకాశ్రయ నగరాలలో సముద్ర రవాణా సౌకర్యాలు కనుగొనబడ్డాయి. 2008 లో స్థాపించబడిన కార్గో ఆధారంగా వ్యాపారి సముద్రతీరం కూడా ఉంది.

Demographics

Population
Year Million
1950 2.3
2000 9.0
2016 14.3

2016 నాటికి సుమారు 14.3 మిలియన్ల మంది పౌరులు ఉన్నారు. 2016; 1975 గణాంకాల ఆధారంగా మొత్తం జనసంఖ్య ప్రకారం 3.3 మిలియన్లు. చారిత్రాత్మకంగా దేశంలోని ఉత్తర భాగంలో స్థానిక నివాసితులలో 85% జాతి సోమాలిసు ఉన్నారు. వారు సాంప్రదాయకంగా సంచార మతసంబంధ వంశాలు, అస్థిర సామ్రాజ్యాలు, సుల్తానేట్లు, నగర-రాజ్యాలు నిర్వహించారు. 1990 ల ప్రారంభంలో పౌర యుద్ధాలు సోమాలి డయాస్పోరా పరిమాణాన్ని బాగా అధికరింపజేసాయి. ఎందఱో ఉత్తమ విద్యావంతులైన సోమాలియాలు దేశం విడిచిపోయారు.

దేశంలో సోమాలియా జాతికి చెందని అల్పసంఖ్యాక సమూహాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా దక్షిణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. వీరిలో బ్రవెనె ప్రజలు, బెనాడిరి, బంటూ ప్రజలు, బాజుని, ఇథియోపియన్లు (ముఖ్యంగా ఓరోమోప్రజలు), యెమెనీ ప్రజలు, భారతీయులు, పర్షియన్లు, ఇటాలియన్లు, బ్రిటన్లు ఉన్నారు. సోమాలియాలో అతిపెద్ద అల్పసంఖ్యాక జాతి సమూహం అయిన బాంటసు ప్రజలు ఆగ్నేయ ఆఫ్రికా నుండి అరబు, సోమాలి వ్యాపారులచే తీసుకురాబడిన బానిసల వారసులు. 1940 లో ఇటలీ సోమాలిలాండులో సుమారు 50,000 మంది ఇటాలియన్లు నివసిస్తున్నారు. స్వాతంత్ర్యం తరువాత చాలామంది ఐరోపియన్లు విడిపోయారు. సోమాలియాలో కొద్దిమంది పాశ్చాత్యులు ఇప్పటికీ సోమాలియాలో ఉన్న అంతర్జాతీయ సంస్థల కోసం పనిచేస్తున్నారు.

సొమాలియా 
వయస్సు గల జనాభా

సొమాలీ విదేశీ ఉపాధిదారులు యునైటెడు స్టేట్సు (ముఖ్యంగా మిన్నెసోట రాష్ట్రంలో), యునైటెడ్ కింగ్డం (ముఖ్యంగా లండన్లో), స్వీడన్, కెనడా, నార్వే, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, ఫిన్లాండ్, లాస్ ఏంజిల్సు, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండు, ఆస్ట్రియా, ఇటలీ, అలాగే అరేబియా ద్వీపకల్పం, అనేక ఆఫ్రికా దేశాలు, ఉగాండా, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలలో పనిచేస్తున్నారు. సోమాలియా విదేశీ ఉపాధిదారులు రాజకీయాలలో, సోమాలియా అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. సోమాలియా ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మదు అబ్దుల్లాహి మహ్మదు మాజీ సొమాలీ డయాస్పోరా ఇప్పటికీ అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు.

సోమాలియా జనాభా సంవత్సరానికి 1.75% వృద్ధిరేటు, 1,000 మందికి 40.87 జనన రేటుతో విస్తరిస్తోంది.సి.ఐ.ఎ. వరల్డు ఫాక్టు బుకు ప్రకారం సోమాలియా మొత్తం సంతానోత్పత్తి రేటు మహిళకు పుట్టిన (2014 అంచనాలు) 6.08 కు గాను, ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్దదిగానూ ఉంది. వివాహ వయసు 17.7; జనాభాలో 0-14 సంవత్సరాల మద్య వయస్సుకులు 44% ఉంటారు, 15-64 సంవత్సరాల మద్య వయస్సుకులు 52.4% ఉంటారు, 2.3% 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సుకులు 2.3% మంది మాత్రమే ఉంటారు. లింగ నిష్పత్తిని దాదాపుగా సమతుల్యంతో మహిళల సంఖ్యకు సమానంగా పురుషులు ఉన్నారు.

సోమాలియాలో పట్టణీకరణపై తక్కువగా ఉందని విశ్వసనీయ గణాంక సమాచారం ఉంది. పట్టణీకరణకు 4.79% సంవత్సరానికి (2005-2010 నాటికి) పట్టణీకరణ రేటు ఉందని అనధికార అంచనాలు సూచిస్తూ ఉన్నాయి. అనేక పట్టణాలు నగరాలుగా వేగవంతంగా అభివృద్ధి చెందాయి. పౌర యుద్ధం ప్రారంభమైనప్పటినుండి అనేక జాతి మైనారిటీలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు (ముఖ్యంగా మొగాడిషు, కిస్మాయోకు) తరలించబడ్డాయి. 2008 నాటికి దేశ జనాభాలో 37.7% పట్టణాలు నగరాల్లో నివసిస్తున్నారు. ఈ శాతం వేగంగా పెరుగుతోంది.

భాషలు

సోమాలియాలో అరబికు భాష, సోమాలియా అధికారిక భాషలుగా ఉన్నాయి. సోమాలి భాష అనేది సోమాలి ప్రజల మాతృభాష, దేశంలో అత్యధిక జనాభాకు వాడుకభాషగా ఉంది. ఇది ఆఫ్రో-ఆసియన్ భాషా కుటుంబం కుషిటికు శాఖలో సభ్యత్వం కలిగి ఉంది. దాని సమీప భాషలు ఓరోమో, అఫారు, సహో భాషలు. సోమాలి కుషిటికు భాషలును చక్కగా బధ్రపరచింది. ఉత్తమ పత్రాలు 1900 కి ముందు ఉన్న విద్యావిషయక అధ్యయనాలకు చెందినవని భావిస్తున్నారు.

సొమాలియా 
ఓస్మాన్య లిపి

సోమాలి మాండలికాలు మూడు ప్రధాన సమూహాలుగా విభజించబడ్డాయి: ఉత్తర, బెనాడిరు, మాయే. ఉత్తర సోమాలి (లేదా నార్తు-సెంట్రలు సోమాలి) ప్రామాణిక సోమాలికి ఆధారాలు. బెనాడిర్ తీరంలో బెనాడిరు భాష మాట్లాడతారు. మెర్కాకు దక్షిణంలోని అడాలు నుండి మొగడిషుతో సహా హిండర్ల్యాండులో బెనడిరు మాట్లాడతారు. అదనపు తీర మాండలికాలు ప్రామాణిక సోమాలిలో లేని అదనపు శబ్దాలను కలిగి ఉన్నాయి. సోమాలియా దక్షిణ ప్రాంతాలలో డిజిలు, మిరిఫ్లే (రహాన్ వైన్) వంశాలు ప్రధానంగా మాట్లాడతారు.

అనేక సంవత్సరాలలో రాత వ్యవస్థలు లిప్యంతీకరణ కోసం సోమాలి భాషను ఉపయోగించారు. సోమాలీ వర్ణమాల విస్తృతంగా ఉపయోగించబడింది. ఇది సోమాలియాలో అధికారిక లిపిగా ఉంది. సుప్రీం రివల్యూషనరీ కౌన్సిలు దీన్ని 1972 అక్టోబరులో అధికారికంగా ప్రవేశపెట్టింది. సోమాలి భాషకు సోమాలి భాషావేత్త షిరు జమా అహ్మదు ప్రత్యేకంగా లిపిని అభివృద్ధి చేశాడు. పి.వి & జెడ్ మినహా ఆంగ్ల లాటిను వర్ణమాల అన్ని అక్షరాలను ఉపయోగిస్తుంది. అహ్మదు లాటిను లిపి కాకుండా, సోమాలిని వ్రాయడానికి శతాబ్దాలుగా ఉపయోగించిన ఇతర వర్గీకరణలు దీర్ఘ-కాల అరబికు లిపి, వాడాదు లిపి ఉన్నాయి. ఉస్మాను యూసుఫు కనాడిడు, షేకు అబ్దురాహ్మాను షేకు నూరు, హుస్సేను షేకు అహ్మద్ కడ్రేలచే కనుగొనబడిన ఓస్మాన్య, బోరామా, కద్దరే లిపిలు ఉన్నాయి. 20 వ శతాబ్దంలో అభివృద్ధి చేయబడిన స్థానిక లిపి ఉంది.

ఆఫ్రో-ఏషియాటికు భాషగా గుర్తించబడుతున్న సొమాలీ -అరబికు ఇది ఒక సోమాలియాలో అధికారిక జాతీయ భాషగా ఉంది. అనేక సోమాలియాలు అరబు ప్రపంచానికి మద్య ఉన్న శతాబ్దాల పూర్వ సంబంధాలు అరబికు మీడియా ప్రాభావం మతపరమైన విద్య కారణంగా ఇది అధికంగా వాడుకలో ఉంది.

ఇంగ్లీషు విస్తారంగా వాడుకలో ఉంది. ఇది బోధనా భాషగా ఉంది. ఇది బ్రిటిషు సోమాలియాండు ప్రొటొక్టరేటులో కార్యాలయ భాషగా కూడా ఉంది. ఇటలీ సోమాలిలాండులో ఇటలీభాష అధికారిక భాషగా ఉంది. స్వాతంత్ర్యం తరువాత ఇటలీ భాషా గణనీయంగా తగ్గిపోయింది. పాత తరాల ప్రజలు, ప్రభుత్వ అధికారులు, విద్యావంతులైన వర్గాలలో ఇది చాలా తరచుగా వినబడుతోంది. ఇతర అల్పసంఖ్యాక భాషలలో బ్రావనేసే మాండలికం, బంటుభాషావైధ్యమైన స్వాహిలి భాష సముద్రతీరంలో నివసించే బ్రావనేసె ప్రజలకు వాడుకభాషగా ఉంది. మాట్లాడబడుతుంది, అలాగే బజుని అనే ఒక స్వాహిలీ మాండలికం అల్పసంఖ్యాక బాజిని ప్రజలకు వాడుక భాషగా ఉంది.

మతం

Religion in Somalia 2010
Religion Percent
Islam
  
99.8%
Other
  
0.2%
సొమాలియా 
The Mosque of Islamic Solidarity in Mogadishu is the largest mosque in the Horn region

ప్యూ రీసెర్చి సెంటరు ప్రకారం సోమాలియా జనాభాలో 99.8% ముస్లింలు ఉన్నారు. వీరిలో సుఫీ ముస్లిములు అధికంగా ఉన్నారు. ఇది ఇస్లామికు న్యాయ మీమాంస షాఫీ'ఇ పాఠశాలకు చెందినది. సుఫీయిజం ఇస్లాం మతం ఆధ్యాత్మిక విభాగం. అనేక స్థానిక జామా (జువియా), వివిధ టారిఖా, సుఫీ ఆదేశాలు సమ్మేళనాలతో స్థాపించబడింది. ముస్లిం మతాన్ని సోమాలియా రాజ్యాంగం " ఫెడరలు రిపబ్లికు ఆఫ్ సోమాలియా " దేశీయ మతంగా మార్చింది. ఇస్లామికు షరియా చట్టం సొమాలియా న్యాయవ్యవస్థకు ప్రధాన వనరుగా ఉంది. షరియా ప్రాథమిక సిద్ధాంతాలకు భిన్నంగా ఏ చట్టాన్ని అమలు చేయరాదని కూడా ఇది నిర్దేశిస్తుంది.

ఇస్లాం మతం ప్రవక్త ముహమ్మదు విజ్ఞప్తి మీద హార్ను ఆఫ్ ఆఫ్రికాలో ఎర్ర సముద్రం గుండా జాతిహింసలకు భయపడి ముస్లిములు బృందంగా ఈ ప్రాంతంలో ప్రవేశించి ఆశ్రయం కోరడంతో ఇస్లాం మతం ఈ ప్రాంతంలో ప్రవేశించింది. అయినప్పటికి ఇస్లాం సోమాలియాలోకి ప్రవేశపెట్టబడింది.

అదనంగా సోమాలి కమ్యూనిటీ అనేక శతాబ్దాలుగా అనేక ముఖ్యమైన ఇస్లామికు షేకులను, మతాచార్యులను ఉత్పత్తి చేసింది. వీరిలో ఎక్కువ మంది హార్ను అఫ్ ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం దాటి ముస్లిం అభ్యాసం గణనీయంగా ఆకృతి చేశారు. ఈ ఇస్లామీయ పండితులలో 14 వ శతాబ్దపు సోమాలి వేదాంతి జైలాకు చెందిన జుర్టిస్టు ఉత్మాను బిను అలీ జైలాయి ఒకరు. ఆయన ఇస్లాం లోని హనాఫీ పాఠశాలలో అత్యంత సాధికార రచనను వ్రాశాడు. ఇందులో టాబియాను అల్ హక్కీక్లి అని పిలిచే నాలుగు సంపుటాలు ఉన్నాయి. షర్హు కాన్జు అలు-దాఖికు.

ప్యూ రీసెర్చి సెంటరు ప్రకారం 2010 లో జనాభాలో క్రైస్తవులు 0.1% కంటే తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోమాలియాలో క్రైస్తవ మతం ఒక మైనారిటీ మతంగా ఉంది. మొత్తం దేశానికి ఒక కేథలికు డియోసిసు అయిన మొగడిషు డియోసెసులో 2004 లో కేవలం వంద కేథలికు అభ్యాసకులు మాత్రమే ఉన్నారని అంచనా వేసింది.

1913 లో సోమాలి భూభాగాలలో కాలనీల కాలం ప్రారంభంలో క్రైస్తవులు లేరు. బ్రిటీషు సోమాలియాండు సంరక్షక ప్రాంతంలో కొన్ని కాథలికు బృందాల పాఠశాలలు, అనాధ శరణాలయాలలో సుమారు 100-200 మంది అనుచరులు మాత్రమే ఉన్నారు. ఇదే సమయంలో ఇటాలీ సోమాలియాండులో కాథలికు మిషన్లు ఏవీ లేవు. 1970 వ దశకంలో సోమాలియా మార్క్సువాద ప్రభుత్వం పాలనలో చర్చి నిర్వహిస్తున్న పాఠశాలలు మూతబడ్డాయి. మిషనరీలు ఇంటికి పంపబడ్డారు. 1989 నుండి దేశంలో బిషపు ఎవరూ లేరు. మోగాడిషులో కేథడ్రలు పౌర యుద్ధం సమయంలో తీవ్రంగా దెబ్బతింది. 2013 డిసెంబరులో జస్టిసు & రిలిజియసు అఫైర్సు మంత్రిత్వశాఖ కూడా దేశంలో క్రైస్తవ ఉత్సవాలను వేడుకలను నిషేధించింది.

ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 2010 లో సోమాలియా జనాభాలో 0.1% కంటే తక్కువ స్థానిక మతాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా దేశం దక్షిణ ప్రాంతాలలో కొంతమంది సోమాలి జాతి అల్పసంఖ్యాక వర్గాలలో ఉన్నాయి. వారు స్థానిక ఆధ్యాత్మికను అభ్యసిస్తారు. బంటు విషయంలో ఈ మత సంప్రదాయాలు ఆగ్నేయ ఆఫ్రికాలో వారి పూర్వీకుల నుండి సంక్రమించాయి.

అదనంగా ప్యూ రీసెర్చి సెంటరు ప్రకారం 2010 లో సోమాలియా జనాభాలో 0.1% కంటే తక్కువగా జుడాయిజం, హిందూయిజం, బౌద్ధమతం, ఇతర మతానికి అనుబంధించబడనివారు ఉన్నారు.

ఆరోగ్యం

1991 లో ఫెడరలు ప్రభుత్వం కూలిపోయే వరకు సోమాలియా ఆరోగ్య సంరక్షణ రంగం సంస్థాగత నిర్వహణ నిర్మాణాన్ని ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిచింది. ప్రాంతీయ వైద్య అధికారులు కొంత అధికారాన్ని అనుభవించినప్పటికీ ఆరోగ్య రక్షణ ఎక్కువగా కేంద్రీకృతమైనది. 1972 లో మాజీ అధ్యక్షుడు సోమాలియా సియాడు బారె సోషలిస్టు ప్రభుత్వం ప్రైవేటు వైద్య అభ్యాసం ముగిసింది. జాతీయ బడ్జెటులో ఎక్కువ భాగం మిలటరీ ఖర్చులకు అంకితమైనది కొన్ని ఇతర వనరులను ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలకు వదిలివేసింది.

తరువాతి పౌర యుద్ధం సమయంలో సోమాలియా పబ్లికు హెల్తుకేరు సిస్టం ఎక్కువగా నాశనం చేయబడింది. అంతకుముందు జాతీయం చేసిన రంగాల మాదిరిగా అనధికారిక ప్రొవైడర్లు ఖాళీని నింపి ఆరోగ్య సంరక్షణ మీద మాజీ ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని భర్తీ చేశారు. దీనితో గణనీయమైన పెరుగుదలకు అవకాశాలు లభ్యమయ్యాయి. హోం గ్రోను సొమాలీ ఇంషియేటివు స్థాపించి అనేక కొత్త ఆరోగ్య కేంద్రాలు, క్లినిక్లు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు ఈ ప్రక్రియలో ఉన్నాయి. ఈ సదుపాయాలలో వైద్య సంప్రదింపులు, తక్కువ వ్యయంలో చికిత్స అందుబాటు, ఆరోగ్య కేంద్రాలు (95% జనాభా కవరేజితో)ఒకవిజిటుకు $ 5.72 అమెరికా డాలర్లు, ఔటు పేషెంటు సందర్శనకు $ 1.89-3.97 అమెరికా డాలర్లు, తృతీయ ఆసుపత్రులు ప్రాధమికంగా రోజుకు 7.83-13.95 అమెరికా డాలర్లు రుసుము వసూలు చేస్తుంది.

(1985-1990) సంఘర్షణ సమయంలో ఆయుఃపరిమితి పురుషులు, మహిళలకు సగటున 47 సంవత్సరాలు 2005-2010 మహిళలకు 51 సంవత్సరాలుగా పురుషులకు 48.2 సంవత్సరాలకు అధికరించింది.అదే విధంగా 1985-1990లో ఒక వ్యాధినిరోధక చికిత్స అందించబడిన సంవత్సరం వయసు లోపు పిల్లలు 30% ఉండగా 2000-2005 లో అది 40% కు అధికరించింది. క్షయవ్యాధి కోసం ఇది 31% నుండి 50% కు (దాదాపు20% పెరిగింది).

తక్కువ బరువు కలిగిన శిశువుల సంఖ్య 1,000 కు 16 నుండి 0.3 కు పడిపోయింది. అదే సమయంలో మొత్తం మీద 15% తగ్గిపోయింది. 1985-1990 మధ్యకాలంలో 1,000 మందిలో 152 శిశుమరణాలు ఉండగా 2005 - 2010 మధ్యకాలంలో 1000 జననాలకి 109.6 కి తగ్గాయి. 1985-1990 అర్ధ-దశాబ్దంలో ప్రసూతి మరణాలు 1,00,000 మందిలో 1,600 ఉండగా 2005-2010 మద్య కాలంలో 1,00,000 మందిలో 1,100 కు పడిపోయింది. పారిశుధ్యం సేవలను ప్రాప్తి చేయగల జనాభాలో 18% నుండి 26% వరకు అధికరించింది. జనాభాలో 1,00,000 మందికి వైద్యుల సంఖ్య కూడా అదే సమయములో 3.4 నుండి 4 కు అధికరించింది.


" యునైటెడు నేషన్సు పాపులేషను ఫండు " సమాచారం ప్రకారం సోమాలియాలో మొత్తంగా 429 మంది మంత్రసాధులు (నర్సు-మంత్రసానులతో సహా) ఉన్నారు. 1,000 ప్రసవాలకు ఒక మంత్రసాని సాంద్రత ఉంది. ప్రస్తుతం ఎనిమిది మిడ్వైబ్రరీ సంస్థలు దేశంలో ఉన్నాయి. వీటిలో రెండు ప్రైవేటు సంస్థలు. 12 నుండి 18 నెలల వరకు సగటున ప్రసూతి శిక్షణా కార్యక్రమాలు వరుస క్రమంలో పనిచేస్తాయి. మొత్తం అందుబాటులో విద్యార్ధుల ప్రవేశాల సంఖ్య గరిష్టంగా 100% ఉంది. 2009 నాటికి 180 మంది విద్యార్థులు చేరారు. మిడ్వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రిస్తుంది. వృత్తిపరంగా సాధన చేసేందుకు లైసెన్సు అవసరం. మంత్రసానులను ట్రాకు చేయడానికి లైవ్ రిజిస్ట్రీ లైసెన్సు కూడా ఉంది. అదనంగా దేశంలో అధికారికంగా 350 మంది నమోదిత సభ్యులతో స్థానిక మంత్రసానుల సంఘం ప్రాతినిధ్యం వహిస్తుంది.

సొమాలియా 
పోలియో టీకాను పొందిన సోమాలి బాలుడు

2005 వరల్డు హెల్తు ఆర్గనైజేషను అంచనా ప్రకారం సోమాలియా మహిళల, బాలికలలో సుమారు 97.9% మహిళలలో సత్నా ఆచారం ఉంది. హార్ను ఆఫ్ ఆఫ్రికా, నియరీస్టు ప్రాంతాలలో ప్రధానంగా స్థానికులు వివాహానికి ముందుగానే ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. సమాజంలో మహిళల ప్రోత్సాహంతో ఇది ప్రాధమికంగా పవిత్రతను కాపాడటానికి, దాడుల నుండి రక్షణ కల్పించడానికి ఉద్దేశించబడింది. నాటికి యూనిసెఫు సోమాలీ అధికారులతో కలిసి సామాజిక, మత అవగాహన ప్రచారం తరువాత స్వతంత్ర ఉత్తర పుంట్ల్యాండు, సోమాలియాండు ప్రాంతాలలో 1 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలు 25% కు పడిపోయాయని నివేదించింది. సోమాలియా మగ జనాభాలో 93% మంది సున్నతి పొందారు.

ఖండంలోని అతి తక్కువ హెచ్ఐవి సంక్రమణ రేట్లు ఉన్న దేశాలలో సోమాలియాలో ఒకటి. సోమాలి సమాజం ముస్లిం స్వభావం, ఇస్లామికు నైతికాలకు కట్టుబడి ఉండడం కారణంగా ఉందని భావిస్తున్నారు. సోమాలియాలో 1987 (మొదటి కేసు నివేదిక సంవత్సరం) అంచనా వేసినప్పుడు 1% పెద్దలు యు.ఎన్.ఎన్.ఎ.ఐ.డి.ఎస్. నుండి వచ్చిన నివేదిక ప్రకారం 2004 నుండి 0.7% - 1% వరకు ఉంటుందని అంచనా వేయబడింది.

ఆరోగ్య సంరక్షణ ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో ఉంది. దీనిని ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత ఆరోగ్యం మంత్రి ఖమరు అడాను అలీ. స్వయంప్రతిపత్తమైన పుంట్ల్యాండు ప్రాంతం తన స్వంత ఆరోగ్య మంత్రిత్వ శాఖను నిర్వహిస్తుంది, వాయువ్య సోమాలియాలోని సోమాలియాండు ప్రాంతానికి ప్రత్యేక ఆరోగ్యమంత్రి ఉన్నట్లు.

ప్రఖ్యాతి చెందిన ఆరోగ్యసంరక్షణా సౌకర్యాలలో తూర్పు బర్దరా మదర్సు అండు చిల్డ్రన్సు హాస్పిటలు, అబ్దువాకు ప్రసూతి & చిల్డ్రన్సు హాస్పిటలు, ఎడ్నా ఆదను మెటర్నిటీ హాస్పిటలు, వెస్టు బర్డెరా ప్రసూతి యూనిట్లలో కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణా సదుపాయాలు ఉన్నాయి.

విద్య

1991 లో పౌర యుద్ధం ప్రారంభించిన తరువాత సోమాలియాలో పాఠశాలలు నడుపేపనిని కమ్యూనిటీ ఎడ్యుకేషను కమిటీలు చేపట్టి స్థానిక పాఠశాలల్లో 94% లో స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి లింగ వివక్ష, విద్యా సదుపాయాల నాణ్యత, పాఠశాల విద్యాప్రణాళిక, విద్యా ప్రమాణాలు, నియంత్రణలు, నిర్వహణ, ప్రణాళికా సామర్థ్యం, ఫైనాన్సింగు వంటి సమస్యలు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, విద్యా విధానాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. స్వయంప్రతిపత్తి కలిగిన పుంట్ల్యాండు ప్రాంతంలో రెండింటిలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం, పిల్లల హక్కుల కన్వెన్షను (సి.ఆర్.సి), స్త్రీలపై అన్ని రకాల వివక్ష నిర్మూలన కొరకు కన్వెన్షను(ఉదా.సి.ఇ.డి.ఎ.డబల్యూ). ఇతర విద్యాపరమైన చర్యలు పిల్లల విద్యాసంబంధ ప్రయోజనాలను తల్లిదండ్రులకు చేరుకోవడానికి రూపొందించిన ఎర్లీ చైల్డు హుడు డెవలప్మెంటు (ఈసిడి) ప్రోగ్రాం వృద్ధిని ప్రోత్సహించే, ప్రాంతీయ ప్రభుత్వం చట్టం. గృహాలు అలాగే ఇ.సి.డి కేంద్రాలలో 0 నుండి 5 ఏళ్ల పిల్లలకు, ఉపాధ్యాయులను రిమోటు గ్రామీణ ప్రాంతాలలో పని చేయడానికి ప్రోత్సహించడానికి ప్రేరేపిత ప్యాకేజీలను పరిచయం చేస్తాయి.

సోమాలియాలో విద్యకు అధికారికంగా విద్యా మంత్రిత్వశాఖ బాధ్యత వహిస్తుంది. దేశం ప్రాధమిక, ద్వితీయ, సాంకేతిక, వృత్తిపరమైన పాఠశాలలను, అలాగే ప్రాథమిక, సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ, నాన్- ఫార్మలు విద్యను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ బడ్జెట్లో సుమారు 15% నిపుణుల సూచనకు కేటాయించబడింది. స్వయంప్రతిపత్తమైన పుంట్ల్యాండు, సొమాలియాండు స్థూల-ప్రాంతాలు వారి స్వంత మంత్రిత్వశాఖలను నిర్వహించాయి.


2006 లో పుంటాల్యాండు ఉచిత ప్రాధమిక పాఠశాలలను ప్రవేశపెట్ట పుట్లాండు ప్రభుత్వం ఉపాధ్యాయులకు వేతనాలను అందించింది. సొమాలీలో ఉచిత ప్రాధమికవిద్యను ముందుగా సొమాలీల్యాండు ప్రవేశపెట్టింది. 2005-2006 నుండి 2006-2007 వరకు పుంట్ల్యాండులోని పాఠశాలల సంఖ్య గణనీయంగా అధికరించింది. కేవలం ఒక సంవత్సరంలో కేవలం 137 సంస్థల వరకు అధికరించింది. అదే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న తరగతుల సంఖ్య 504 కు అధికరించింది. 762 మంది ఉపాధ్యాయులు వారి సేవలను అందించారు. మొత్తమ్మీద విద్యార్ధుల నమోదు గత ఏడాది కంటే 27% పెరిగింది. చాలా ప్రాంతాలలో బాలికల హాజరు, బాలుర కంటే వెనుక కొంచెం వెనుకబడింది. ఉత్తర ప్రాంతంలో ఉన్న బార్సిలో అత్యధిక తరగతి నమోదును ఉన్నట్లు గమనించారు. అయను ప్రాంతంలో అత్యల్ప నమోదు ఉన్నట్లు గమనించబడింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తరగతి గదుల పంపిణీ దాదాపు సమానంగా విభజించబడింది. పట్టణ ప్రాంతాల్లో తరగతులకు బోధనలో పాల్గొంటున్న శిక్షకులు, బోధనా సిబ్బంది అధికంగా ఉన్నారు.

సొమాలియా 
Mogadishu University's main campus in Mogadishu.

సోమాలియాలో ఉన్నత విద్య ఇప్పుడు ఎక్కువగా ప్రైవేటుయాజమాన్యంలో ఉంది. కఠినమైన పర్యావరణం ఉన్నప్పటికీ దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు (మొగడిషు విశ్వవిద్యాలయంతో సహా) ఆఫ్రికాలోని 100 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఉన్నాయి. దక్షిణాన ఉన్నత విద్యను అందించే ఇతర విశ్వవిద్యాలయాలలో బెనాడిరు విశ్వవిద్యాలయం, సోమాలియా నేషనలు యూనివర్శిటీ, కిస్మయో యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ గెడో ఉన్నాయి. పుంట్లాండులో ఉన్నత విద్యను పుంట్లాండు స్టేటు యూనివర్సిటీ, తూర్పు ఆఫ్రికా విశ్వవిద్యాలయం అందించింది. సొమాలీల్యాండులో ఉన్నత విద్యను అమౌడు విశ్వవిద్యాలయం, హర్జిసా విశ్వవిద్యాలయం, సోమాలిలాండు యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, బురావో విశ్వవిద్యాలయం అందించాయి.

క్వరానికు పాఠశాలలు (డగ్జి ఖురాను లేదా మాల్'అమాద్ ఖురాను అని కూడా పిలుస్తారు) సోమాలియాలోని సాంప్రదాయిక మత బోధన ప్రాథమిక వ్యవస్థగానే ఉన్నాయి. వారు పిల్లలకు ఇస్లామికు విద్యను అందిస్తారు. తద్వారా దేశంలో స్పష్టమైన మతపరమైన, సామాజిక పాత్ర కనిపిస్తుంది. ప్రాధమిక మత, నైతిక బోధనను అందించే అత్యంత స్థిరమైన స్థానిక, విద్యా వ్యవస్థగా పిలువబడే ఈ విధానం కమ్యూనిటీ మద్దతుపై ఆధారపడి ఉంటుంది. స్థానికంగా తయారు చేయబడిన, విస్తృతంగా అందుబాటులో ఉన్న బోధనా సామగ్రిని ఉపయోగించడం. ఇతర విద్యా ఉప రంగాలల విద్యార్ధులకు అత్యధిక సంఖ్యలో విద్యార్ధులకు బోధించే కురానికు వ్యవస్థ, తరచూ పట్టణ ప్రాంతాలకంటే సంచార సోమాలీయులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 1993 లోని ఒక అధ్యయనంలో ఇతర విషయాలతో పాటు ఖుర్ఆన్ పాఠశాలల్లో 40% మంది స్త్రీలు ఉన్నారు. మత బోధనలో లోపాలను పరిష్కరించడానికి, దాని స్వంత భాగంలో సోమాలి ప్రభుత్వం కూడా తరువాత ఎండోన్మెంటు, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను స్థాపించింది. దీని కింద ఖురాన్యుయి విద్య ఇప్పుడు నియంత్రించబడింది.

సంస్కృతి

ఆహారం

సొమాలియా 
Various types of popular Somali dishes

ప్రాంతం నుండి ప్రాంతాలకు మారుతూ ఉన్న సోమాలియా వంటకం విభిన్నమైన పాక ప్రభావాలు మిశ్రమంగా ఉంటుంది. ఇది సోమాలియా వాణిజ్యం, వ్యాపారం సోమాలియా గొప్ప సాంప్రదాయం ఉత్పత్తి. విభిన్నమైనప్పటికీ వివిధ ప్రాంతీయ వంటకాలను కలిపే ఒక విషయం ఉంది: హలాల్కు వడ్డించే అన్ని ఆహారాలలో పంది మాంసం, మద్యపానం అందించడం లేదు. దానిలో చనిపోయిన జంతువులను, రక్తాన్ని చేర్చరు. భోజనం (క్వాడో) తరచుగా విస్తారంగా ఉంటుంది.

'బేరిస్' (బియ్యం) రకాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన బాస్మతి బియ్యం సాధారణంగా ప్రధాన వంటకం వలె పని చేస్తాయి. జీలకర్ర, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, తోట సేజి వంటి మసాలా ఈ వివిధ బియ్యం వంటకాలకు సువాసన కొరకు జోడించడానికి ఉపయోగిస్తారు. సోమాలిసు రాత్రి 9 గంటల వరకు విందును అందిస్తారు. రంజాను సందర్భంగా, రాత్రి భోజనంలో తరచూ తారవిహు ప్రార్ధనలు జరుగుతాయి; కొన్నిసార్లు రాత్రి 11 వరకు.

'జలోవు' (హల్వా) అనేది ఈదు ఉత్సవాలు లేదా వివాహ రిసెప్షన్లు వంటి ప్రత్యేక ఉత్సవ సందర్భాలలో రిజర్వు చేయబడిన ఒక ప్రసిద్ధ సమ్మేళనం. ఇది మొక్కజొన్న పిండి, చక్కెర, ఏలకులు పొడి, జాజికాయ పొడి, నెయ్యి మిశ్రమాలతో తయారవుతుంది. రుచిని పెంచడానికి కొన్నిసార్లు వేరుశెనగలు జోడించబడతాయి. భోజనం తర్వాత ఇళ్లను సాంప్రదాయకంగా సున్నితమైన సువాసన (లూబాన్) లేదా ధూపం (క్యూబుసి) ఉపయోగించి సుగంధ ద్రవ్యాలతో " డబుక్వాదు " వేస్తారు.

సంగీతం

సోమాలియా సాంప్రదాయ సోమాలి జానపద నృత్య కేంద్రంగా ఉంది. ఇది సోమాలీయుల గొప్ప సంగీత వారసత్వంగా గుర్తించబడుతుంది. చాలా సోమాలి పాటలు పెంటటోనిక్గా ఉన్నాయి. అనగా వారు ప్రధాన స్థాయి వంటి హిప్టాటోనికు (ఏడు నోటు) స్థాయికి భిన్నంగా కేవలం ఎనిమిదేవ్కి ఐదు పిచ్లను ఉపయోగిస్తారు. మొట్టమొదట వినిపించే సోమాలీ సంగీతం ఇథియోపియా, సుడాన్, అరేబియా ద్వీపకల్పం వంటి సమీప ప్రాంతాల శబ్దాలలా సోమాలి సంగీతం పొరపాటున గ్రహించబడుతుంది. కానీ చివరికి దాని స్వంత ప్రత్యేక స్వరాలు, శైలులు గుర్తించబడతాయి. సంగీత రూపకర్తలు (మిదో), పాటల రచయితలు (లక్సాను), గాయకులు (కొడ్కా లేదా "వాయిసు") మధ్య సహకారంగా సోమాలి పాటలు ఉత్పత్తి చేయబడుతుంది.

సాహిత్యం

సోమాలి పండితులు శతాబ్దాలుగా కవిత్వం నుంచి హదీసులు వంటి ఇస్లామికు సాహిత్యానికి ముఖ్యమైన ఉదాహరణలను నిర్మించారు. 1972 లో లాటిను అక్షరక్రమాన్ని దేశం ప్రామాణిక లేఖన శాస్త్రంగా స్వీకరించడంతో సమకాలీన సోమాలి రచయితలు కూడా నవలలను విడుదల చేశారు. వాటిలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందాయి. ఈ ఆధునిక రచయితలలో నరుద్దిను ఫరా చాలా ప్రసిద్ధి చెందారు. ఫ్రం ఎ క్రూకెడు రిబు, లింక్సు ముఖ్యమైన సాహిత్య సాధనాలుగా పరిగణించబడుతున్నాయి. ఆయన రచనలు 1998 వ సంవత్సరపు " న్యూస్సెడు ఇంటర్నేషనలు ప్రైజు ఫరు లిటరేచరు" ప్రశంశలు పొందాయి. ప్రముఖ సోమాలి రచయిత ఫారెక్సు ఎం.జె. కావలు " డెర్విషు ఎరా " నవలకు ప్రసిద్ధి చెందింది. ఇగ్నోరెన్సు ఇస్ ది ఎనిమీ ఆఫ్ ది లవ్ " అనే రచనలు ప్రజాదరణ పొందాయి.

క్రీడలు

సొమాలియా 
Abdi Bile, Somalia's most decorated athlete and holder of the most national records.

సోమాలియాలో ఫుట్ బాలు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. ముఖ్యమైన దేశీయ పోటీలలో సోమాలియా లీగు, సోమాలియా కప్పు, సోమాలియా జాతీయ ఫుట్బాలు జట్టు అంతర్జాతీయంగా పాల్గొంటున్నాయి.

బాస్కెట్బాలు కూడా దేశంలో ప్రజాదరణ పొందుతుంది. 1981 డిసెంబరు 15-23 వరకు మొగడిషులో ఎఫ్.ఐ.బి.ఎ. ఆఫ్రికా ఛాంపియన్షిప్పు నిర్వహించబడింది. ఈ క్రీడలలో నేషనలు బాస్కెట్బాలు జట్టు కాంస్య పతకం పొందింది. జట్టు కూడా పాన్ అరబు క్రీడలలో బాస్కెట్బాలు పోటీలో పాల్గొన్నది.

2013 లో బోర్లాంగెలో ఒక సోమాలియా జాతీయ బాండీ జట్టు ఏర్పడింది. ఇది తరువాత రష్యాలోని ఇర్కుట్సుకు, షెల్లోకోవులలో నిర్వహించబడిన " బండి వరల్డు ఛాంపియన్షిపు " లో పాల్గొంది.

యుద్ధ కళలలో నేషనలు టైక్వాండో జట్టులోని ఫైసల్ జైలనీ ఆయీసు, మొహమెదు డేకు అబ్దులు వరుసగా టొరనేన్లోని 2013 ఓపెను వరల్డు (టీకువుడు) ఛాలెంజి కప్పులో రజత పతకాన్ని సాధించి నాల్గవ స్థానానికి చేరుకున్నారు. సోమాలి ఒలంపికు కమిటీ ఒలింపికు టోర్నమెంట్లలో విజయవంతమయ్యేలా ఒక ప్రత్యేక మద్దతు కార్యక్రమాన్ని రూపొందించింది. అదనంగా మొహమ్మదు జమా కె-1, థాయి బాక్సింగులో ప్రపంచ, ఐరోపియను టైటిల్లను గెలుచుకున్నారు.

నిర్మాణకళ

సొమాలియా 
The Citadel of Gondershe

రాతి నగరాలు, కోటలు,చర్చీలు, మసీదులు, సమాధులు, దేవాలయాలు, బురుజులు, స్మారక చిహ్నాలు, కైర్నులు, మెగాలితులు, మెన్హిర్లు, డోల్మెన్లు వంటి అనేక రకాలైన నిర్మాణాలు, భవనాలుతో సోమాలి వాస్తుశాస్త్రం, నిర్మాణనైపుణ్యాల వైవిధ్యాలతో సుసంపన్నంగా ఉంటుంది. తుమ్యులి, స్టెల్లు, సిస్టెర్నులు, ఫౌంటెన్లు, లైటుహౌసులు దేశం పురాతన, మద్యయుగ ప్రారంభ ఆధునిక కాలాలలో విస్తరించాయి. ఇది సమకాలీన పాశ్చాత్య డిజైన్లను సోమలో-ఇస్లామికు వాస్తుకళకు జతచేస్తుంది.

పురాతన సోమాలియాలో, సోమాలీలో టాలో అని పిలిచే పిరమిడు నిర్మాణాలు ప్రముఖ ఖనన శైలిగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న వందలాది రాళ్ళ స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇళ్ళు పురాతన ఈజిప్టులో ఉన్నట్లు అలకరించిన రాయితో నిర్మించబడ్డాయి. ప్రాంగణాలు, వర్గాడ్ వాల్ వంటి పెద్ద రాతి గోడల ప్రాంతాలు కూడా ఉన్నాయి.

సోమాలియా ప్రారంభ మధ్యయుగ చరిత్రలో ఇస్లాం స్వీకరించడం అరేబియా, పర్షియా నుండి ఇస్లామికు శిల్పకళ ప్రభావాలు తీసుకువచ్చాయి. ఇది పొడి రాయి, ఇతర సంబంధిత పదార్థాల నుండి పగడపు రాయి, ఎండిన ఇటుకలను ఉపయోగించి నిర్మించబడ్డాయి. సోమాలి శిల్ప శైలిలో సున్నపురాయి విస్తృత ఉపయోగం నిర్మాణంలో ఒక మార్పును ప్రేరేపించింది. పాత నిర్మాణాల శిధిలాలపై నిర్మించిన అనేక నూతన నిర్మాణ నమూనాలు, మసీదులు వంటివి, తరువాతి శతాబ్దాల్లో తిరిగి కొనసాగుతాయి.

మూలాలు

బయటి లింకులు

    ప్రభుత్వము

Tags:

సొమాలియా చరిత్రసొమాలియా భౌగోళికంసొమాలియా ఆర్ధికరగంసొమాలియా Demographicsసొమాలియా సంస్కృతిసొమాలియా మూలాలుసొమాలియా బయటి లింకులుసొమాలియా1960అరబ్బీ భాషఆఫ్రికాఇటలీఇథియోపియాకెన్యాజిబౌటిజూన్ 26జూలై 1యెమన్

🔥 Trending searches on Wiki తెలుగు:

జోల పాటలుభారత రాజ్యాంగ పరిషత్ఓపెన్‌హైమర్కంప్యూటరుకర్బూజతిరుమల తిరుపతి దేవస్థానంచాకలి ఐలమ్మసర్పంచిఅవకాడో2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుకర్ణుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశివలింగంఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంగర్భాశయముబర్రెలక్కఅయోధ్య రామమందిరంప్రకృతి - వికృతిజైన మతంగుంటూరుయూట్యూబ్అల్లూరి సీతారామరాజుత్రినాథ వ్రతకల్పంఐశ్వర్య రాయ్బంగారంఈస్టర్కోవూరు శాసనసభ నియోజకవర్గంవిశ్వబ్రాహ్మణజోర్దార్ సుజాతప్రశ్న (జ్యోతిష శాస్త్రము)యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాబలగంతీహార్ జైలుజీమెయిల్గురువాయూరు శ్రీకృష్ణ మందిరంతిరుమల చరిత్రతెలుగు భాష చరిత్రప్రజాస్వామ్యంహస్తప్రయోగంకొత్తపల్లి గీతరోహిణి నక్షత్రంభారత రాజ్యాంగంధనూరాశిరావుల శ్రీధర్ రెడ్డిఉండవల్లి శ్రీదేవికంసాలిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుబుర్రకథభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాప్రహ్లాదుడుఎర్ర రక్త కణంబి.ఆర్. అంబేద్కర్టిల్లు స్క్వేర్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావాయు కాలుష్యంమలావిస్వాతి నక్షత్రమురక్త పింజరిదివ్యవాణిసావిత్రి (నటి)పరశురాముడుదానం నాగేందర్కుష్టు వ్యాధిఇస్లామీయ ఐదు కలిమాలుప్రభాస్ఇందిరా గాంధీసెక్స్ (అయోమయ నివృత్తి)గరుడ పురాణంకరోనా వైరస్ 2019అశ్వగంధసుడిగాలి సుధీర్వరిపాల్కురికి సోమనాథుడుఋగ్వేదంమదర్ థెరీసారక్తంముహమ్మద్ ప్రవక్తసమాసం🡆 More