దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా (లేదా Republic of South Africa ) అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని పిలువబడుతుంది.

అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి 2,798 కి.మీ పొడవైన అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల తీరాలు సరిహద్దులుగా ఉన్నాయి ; ఉత్తర సరిహద్దులో నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే ఉన్నాయి. తూర్పు సరిహద్దులో మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి. లెసోతో అనే స్వాతంత్ర్య ప్రాంతాన్ని దక్షిణాఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణాఫ్రికా కామన్ వెల్త్ దేశాలలో ఒకటి. దక్షిణాఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని 25 వ అతిపెద్ద దేశంగా ఉంది. 57 మిలియన్ల మంది ప్రజలతో ప్రపంచంలోని 24 వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ఇది పాత ప్రపంచం (తూర్పు అర్ధగోళం) ప్రధాన భూభాగంలో ఉన్న దక్షిణ దేశం. దక్షిణాఫ్రికాలో సుమారు 80% సబ్-సహారా ఆఫ్రికా వంశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా వివిధ ఆఫ్రికా భాషలు మాట్లాడే విభిన్న జాతుల సమూహాలుగా విభజించబడి ఉంది. వీటిలో 9 భాషలు అధికారిక హోదా కలిగి ఉన్నాయి. మిగిలిన ప్రజలలో ఐరోపా (శ్వేత), ఆసియా (భారతీయులు), బహుళజాతి (రంగు) పూర్వీకుల ఆఫ్రికా అతిపెద్ద వర్గాలు ఉన్నాయి.

రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా
  • Republiek van Suid-Afrika (Afrikaans)
  • IRiphabliki yeSewula Afrika (Sth. Ndebele)
  • IRiphabliki yaseMzantsi Afrika (Xhosa)
  • IRiphabliki yaseNingizimu Afrika (Zulu)
  • IRiphabhulikhi yeNingizimu Afrika (Swazi)
  • Rephaboliki ya Afrika-Borwa (Nth. Sotho)
  • Rephaboliki ya Afrika Borwa (Sth. Sotho)
  • Rephaboliki ya Aforika Borwa (Tswana)
  • Riphabliki ra Afrika Dzonga (Tsonga)
  • Riphabuiki ya Afurika Tshipembe (Venda)
Flag of South Africa South Africa యొక్క Coat of arms
నినాదం
!ke e: ǀxarra ǁke  (ǀXam)
“Unity In Diversity” (literally “Diverse People Unite”)
జాతీయగీతం
en:National anthem of South Africa
South Africa యొక్క స్థానం
South Africa యొక్క స్థానం
రాజధానిప్రిటోరియా (executive)
Bloemfontein (judicial)
Cape Town (legislative)
అతి పెద్ద నగరం Johannesburg(2006) 
అధికార భాషలు en:Afrikaans
ఇంగ్లీషు
Southern Ndebele
Northern Sotho
Southern Sotho
Swazi
Tsonga
Tswana
వెండ
Xhosa
జులు
జాతులు  79.5% Black
9.2% White
8.9% Coloured
2.5% Asian
ప్రజానామము సౌత్ ఆఫ్రికన్
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు సిరిల్ రామ ఫోసా
 -  ఉపాధ్యక్షుడు Baleka Mbete
 -  NCOP ఛైర్మన్ M. J. Mahlangu
 -  జాతీయ అసెంబ్లీ స్పీకర్ Gwen Mahlangu-Nkabinde
 -  చీఫ్ జస్టిస్ Pius Langa
స్వాతంత్య్రము యునైటెడ్ కింగ్డం నుండి 
 -  యూనియన్ 31 మే 1910 
 -  వెస్ట్ మినిస్టర్ చట్టం 11 డిసెంబరు 1931 
 -  రిపబ్లిక్ 31 May 1961 
 -  జలాలు (%) Negligible
జనాభా
 -  2008 అంచనా 47900000 (25వది)
 -  2001 జన గణన 44819778 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $467.381 billion (25వది)
 -  తలసరి $9,767 (76వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $283.071 billion (30వది)
 -  తలసరి $5,915 (68వది)
జినీ? (2000) 57.8 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) 0.674 Increase (medium) (121వది)
కరెన్సీ ర్యాండ్ (ZAR)
కాలాంశం SAST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .za
కాలింగ్ కోడ్ +27

దక్షిణాఫ్రికా అనేక రకాలైన సంస్కృతులు, భాషలు, మతాలు కలిగి ఉన్న ఒక బహుళ జాతి సమాజం. ప్రపంచంలోని నాలుగో అత్యధిక సంఖ్యలో ఉన్న 11 అధికారిక భాషల రాజ్యాంగ గుర్తింపు దాని బహుళజాతి వైవిధ్యం అలంకరణ ప్రతిబింబిస్తుంది. ఈ భాషలలో రెండు ఐరోపా మూలాలకు చెందిన భాషలు ఉన్నాయి. డచ్చి నుండి అభివృద్ధి చెందిన అనేక దక్షిణాఫ్రికన్లకు మొదటి భాషగా పనిచేస్తుంది. ఇంగ్లీషు బ్రిటీషు వలసవాదం వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని సాధారణంగా ప్రజాజీవితంలో, వాణిజ్య జీవితంలో ఉపయోగిస్తారు. అయితే ఇది మొదటి వాడుకభాషగా భాషగా నాల్గవ స్థానంలో ఉంది. ఆఫ్రికా దేశాలలో ఎప్పుడూ తిరుగుబాటుజరగని కొన్ని దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి. దాదాపు ఒక శతాబ్దం పాటు ఎన్నికలు నిర్వహించిన దేశంగా దక్షిణాఫ్రికా ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది. 1994 వరకు అత్యధిక సంఖ్యలో నల్లజాతి ఆఫ్రికన్లను ఆమోదించలేదు. 20 వ శతాబ్దంలో అత్యధికసంఖ్యలో నల్లజాతీయులు ఆధిక్యత చేస్తున్న అల్పసంఖ్యాక నుండి తమ హక్కులు తమకు కావాలని కోరింది. 1948 లో జాతీయ పార్టీ వర్ణవివక్షను విధించింది జాతి వేర్పాటును వ్యవస్థీకరించింది. దేశం లోపలా, దేశం వెలుపలా ఉన్న ఆఫ్రికా నేషనలు కాంగ్రెసు, ఇతర జాతివివక్షను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు దీర్ఘకాల పోరాటం (హింసాత్మక పోరాటం) తరువాత 1990 లో వివక్షత చట్టాలను రద్దు చేయడం ప్రారంభమైంది.

1994 నుండి జాతి, భాషా సమూహాలు అన్ని దేశం ఉదార ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి. పార్లమెంటరీ రిపబ్లికు, తొమ్మిది రాష్ట్రాలను కలిగి ఉంది. ప్రత్యేకించి వర్ణవివక్ష నేపథ్యంలో దేశం బహుళ సాంస్కృతిక వైవిధ్యాన్ని వివరించడానికి దక్షిణాఫ్రికాను తరచూ "ఇంద్రధనస్సు దేశం"గా సూచిస్తారు. ప్రపంచ బ్యాంకు ఎగువ-మధ్య-ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థగా, కొత్తగా పారిశ్రామికీకరణ చెందిన దేశంగా దక్షిణాఫ్రికాను వర్గీకరించింది. దీని ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద, ప్రపంచంలోని 34 వ అతి పెద్దదిగా ఉంది. కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం, దక్షిణాఫ్రికా ఆఫ్రికాలో 7 వ అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉంది. ఏదేమైనా పేదరికం, అసమానత కొనసాగుతున్నాయి. జనాభాలో దాదాపుగా 4 వ వంతు నిరుద్యోగులు ఉన్నారు. ప్రజలు దినసరి $ 1.25 అమెరికా డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. అయినప్పటికీ అంతర్జాతీయ వ్యవహారాలలో దక్షిణాఫ్రికా మధ్యవర్తిత్వ శక్తిగా గుర్తింపు పొందింది. ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా అభివృద్ధి చెందింది.

పేరు వెనుక చరిత్ర

భౌగోళికంగా ఆఫ్రికా దక్షిణ కొనలో ఉన్న దేశం కాబట్టి దీని పేరు దక్షిణాఫ్రికా అని వచ్చింది. దేశంగా ఏర్పడిన తరువాత ఈ దేశాన్ని ఆంగ్లంలో "యూనియను ఆఫ్ సౌత్ ఆఫ్రికా" అన్నారు. పూర్వపు నాలుగు బ్రిటిషు కాలనీల ఏకీకరణ నుండి తన పూర్వీకతను ప్రతిబింబిస్తుంది. 1961 నుండి ఆంగ్లంలో "రిపబ్లికు ఆఫ్ సౌత్ ఆఫ్రికా"గా ఉంది. డచ్చిలో దేశం " రిపబ్లికు వాను జుయిదు -ఆఫ్రికా "గా పిలువబడింది. 1983 లో ఆఫ్రికన్లు దీనిని " రిపబ్లిక్ వాన్ సుయిదు -ఆఫ్రికా " అని పిలిచారు. 1994 నుండి రిపబ్లికు 11 అధికారిక భాషలలో అధికారిక పేరును కలిగి ఉంది.

ఖ్సొసా నామవాచకం ఉంజాంట్సి (అంటే "దక్షిణ" అని అర్ధం) జాంట్సి పేరు వచ్చింది. దక్షిణాఫ్రికాకు ఇది వ్యవహార నామాలలో ఒకటిగా ఉంది. కొన్ని పాన్-ఆఫ్రికా రాజకీయ పార్టీలు "అజానియా" అనే పదంతో పిలుస్తారు.

చరిత్ర

చరిత్ర పూర్వ కాలం

దక్షిణాఫ్రికాలో ప్రపంచంలో కెల్లా అత్యంత పురాతన మానవ-శిలాజ స్థలాలు ఉన్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు గౌటెంగు ప్రావిన్సులో ఉన్న గుహల నుండి విస్తృతమైన శిలాజ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించి దీనికి " క్రేడిలు ఆఫ్ మాన్కైండు" (మానవ జాతికి పురిటిగడ్డ) అని పేరు పెట్టింది. ఈ సైట్లలో ప్రపంచంలో అత్యధికంగా హోమినిన్ శిలాజాలు లభించిన స్టెర్కఫోంటేన్ ఉన్నాయి. ఇతర ప్రాంతాలలో స్టెర్కుఫాంటియను, గోండోలిను కేవు క్రోమడ్రాయి, రాయి, కూపర్సు కేవు, మాలాప ఉన్నాయి. రేమండు డార్టు కనుగొన్న మొట్టమొదటి హోమినిను శిలాజము ఆఫ్రికాలో కనుగొన్న మొదటి మానవ శిలాజంగా భావిస్తున్నారు. 1924 లో తౌంగు చైల్డు (తౌంగు సమీపంలో కనుగొనబడింది) శిలాజం గుర్తించబడింది. ఇంకా హోమినిను అవశేషాలు లిమ్పోపో ప్రావిన్సు, కార్నెలియాలలో కనుగొనబడిన మకపంస్క్వటు, ఫ్రీ స్టేట్ ప్రావిన్సులో ఫ్లోరిస్బాడు, క్వాజులు- నటలు ప్రావిన్సులో బార్డరు గుహ, ఈస్ట్రను కేపు ప్రావిన్సులో క్లేసియసు నదీ ముఖద్వారం, ఎల్యాండ్సుఫోంటైనులో పిన్నకిలు పాయింటు, వెస్ట్రను కేపు ప్రావిన్సులో డై కెల్డర్సు గుహలు ఉన్నాయి.

ఈ పరిశోధనలు దక్షిక్షాఫ్రికాలో మూడు మిలియను సంవత్సరాల క్రితం నుండి పలు మానవ జాతులు ఉనికిలో ఉన్నాయి. ఇవి ఆస్ట్రోపోటీస్కసు ఆఫ్రికానసు మొదలయ్యాయి. ఆస్టాలోపితెకసు సెవిబా, హోమో ఎరాక్వేస్టరు, హోమో ఎరెక్టసు, హోమో రోడేసీసియంసిసు, హోమో హెల్మీ, హోమో నలేడి, ఆధునిక మానవులు (హోమో సేపియన్సు) జాతులు అనుసరించాయి. ఆధునిక మానవులు కనీసం 170,000 సంవత్సరాల నుండి దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారని భావిస్తున్నారు.

దక్షిణాఫ్రికా 
ఆధునిక రెయిన్బో దేశం ఏర్పడిన వలసలు

వివిధ పరిశోధకులు వాలు నదీ లోయలో గులకతి ఉపకరణాలు ఉన్నాయని కనుగొన్నారు.

బంటు విస్తరణ

దక్షిణాఫ్రికా 
మ్యాపుంగుబ్వు హిలు, మ్యాపుంగుబ్వు రాజ్యం మాజీ రాజధాని

దక్షిణాఫ్రికాలో లిమ్పోపో నదికి దక్షిణాన (ఇప్పుడు బోత్స్వానా, జింబాబ్వేతో ఉత్తర సరిహద్దు) ఇనుము ఉపయోగం, వ్యవసాయదారులు, పశువుల కాపరులు అయిన బంటు-మాట్లాడే ప్రజల స్థావరాలు ఉన్నాయి. సా.శ.4 వ - 5 వ శతాబ్దం (బంటు విస్తరణ చూడండి). వారు ఖోవాను భాషావాడుకరులు, ఖోఖోయి, సాను ప్రజలను జయించడం, తరిమికొట్టడం, విలీనంచేసుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. బంటు నెమ్మదిగా దక్షిణంగా విస్తరించారు. ఆధునిక క్వాజులు-నాటల్ ప్రావీంసులో మొట్టమొదటి ఇనుప కాలానికి చెందిన ప్రజలు 1050 నాటికి స్థిరపడ్డారని భావిస్తున్నారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖోసాన్ ప్రజల భాషలో కొన్ని భాషా విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఖోసా ప్రజలు ప్రస్తుత తూర్పు కేప్ ప్రావీంసులో గ్రేట్ ఫిష్ రివరుకు చేరుకున్నారు. వారు వలసవచ్చినప్పుడు పెద్ద ఇనుప యుగ జనాభా స్థానభ్రంశం చెందడం, పూర్వ ప్రజలను కలవడం జరిగింది. మ్పుమలంగా ప్రావీంసులో ఆడమ్ క్యాలెండర్ అనే పేరుతో ఉన్న రాతితో పాటు అనేక రాయి వృత్తాలు కనుగొనబడ్డాయి.[ఆధారం చూపాలి]

పోర్చుగీసు పాలన

ఐరోపా ప్రవేశించే సమయంలో బంటు భాషా వాడుకరులైన ప్రజలు ఇక్కడ ఆధిపత్య జాతిగా ఉంది. బంటు ప్రజలు వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. మరొక రెండు ప్రధాన చారిత్రక సమూహాలలో ఖొసా, జులు ప్రజలు ఉన్నారు.

1487 లో పోర్చుగీసు అన్వేషకుడు " బార్టోలోమేయు డయాసు " దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి ఐరోపా యాత్రకు నాయకత్వం వహించాడు. డిసెంబరు 4 న ఆయన వల్ఫిచు బేలో (ప్రస్తుతం నమీబియాలోని వాల్విసు బే అని పిలుస్తారు) అడుగుపెట్టాడు. 1485 లో తన పూర్వీకుడు పోర్చుగీసు నావిగేటరు డియోగో కాయో (కేప్ క్రాసు, బేకు ఉత్తరాన) చేరిన ప్రాంతానికి దక్షిణంలో లేదు. డయాసు దక్షిణాఫ్రికా పశ్చిమ తీరంలో దిగువకు తన అన్వేషణ కొనసాగించాడు. 1488 జనవరి 8 తర్వాత తీరప్రాంతాల నుండి తుఫానులచే ఆయన ప్రయాణం నిరోధించబడింది. ఆయన భూమికి దూరంగా ప్రయాణించి ఆఫ్రికా దక్షిణ తీరం దాటాడు. 1488 మేలో ఆయన (ప్రస్తుత గ్రోటు నది అని పిలిచే) ఆఫ్రికా తూర్పు తీరానికి చేరుకుని దానిని " రియో డీ ఇన్ఫాంటే " అని పిలిచాడు. తిరిగి వచ్చేటప్పుడు అతను కేపును చూసి " కేబు దాసు టెర్మేంట్సు (కేప్) తుఫానులు)" అని పిలిచాడు. డయాసు సముద్రయానం విన్యాసం తర్వాత లూయిసు డి కామోసు పోర్చుగీసు పురాణ కవిత, ది లుసియడ్సు (1572) లో అమరత్వాన్ని పొందింది.

డచ్చి పాలన

దక్షిణాఫ్రికా 
Charles Davidson Bell's 19th-century painting of Jan van Riebeeck, who founded the first European settlement in South Africa, arrives in Table Bay in 1652

17 వ శతాబ్దం ప్రారంభంలో పోర్చుగలు సముద్ర శక్తి క్షీణించడం ప్రారంభమైంది. ఇంగ్లీషు, డచి వ్యాపారులు సుగంధ వాణిజ్యంలో లిస్బను గుత్తాధిపత్యం నుండి తొలగించేందుకు పోటీ పడ్డారు. 1601 నాటికి బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ ప్రతినిధులు కేప్ వద్ద స్థావరం ఏర్పరచడానికి పిలుపునిచ్చారు. కానీ తర్వాత ఆస్కెంషను ద్వీపం, సెయింటు హెలెనాకు ప్రత్యామ్నాయ నౌకాశ్రయాలకు అనుమతించబడ్డారు. 1647లో ఇద్దరు ఉద్యోగులు నౌకవిరిగిన కారణంగా ఇక్కడ కొన్ని మాసాలకాలం నివసించిన తరువాత డచ్చి ఈస్టు ఇండియా కంపెనీకి ఈ ప్రాంతం మీద ఆసక్తి అధికరించింది. నావికులు స్వచ్ఛమైన నీరు, స్థానికుల నుండి మాంసం పొందడం ద్వారా మనుగడ సాధించారు. వారు సారవంతమైన నేలలో కూరగాయలు కూడా పండించారు. హాలండుకు తిరిగి వచ్చిన తరువాత దీర్ఘకాల ప్రయాణాలకు నౌకలను నడిపించే నావికులకు కేప్ "గిడ్డంగిగా, ఆహార అవసరాలు తీర్చడానికి తోట"గా ఉంటుందని పేర్కొన్నారు.

1652 లో కేప్ సముద్ర మార్గం కనుగొన్న 150 సంవత్సరాల తరువాత " జాను వాను రిబీకు " స్టేషనును ఏర్పాటు చేశాడు. దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ " అని నామకరణం చేసాడు. అది ప్రస్తుతం " కేప్ టౌన్ "గా మారింది. కొద్దికాలానికే కేప్ "వ్రిజబ్లైడెన్సు" అనే పేరుతో పెద్ద సంఖ్యలో "విర్జిబర్గర్సు" (స్వేచ్ఛాయుతమైన పౌరులు) డచ్చి భూభాగాలలో నిలిచిన వారి మాజీ ఉద్యోగులు ఒప్పందాల తరువాత విదేశీ భూభాగాలలో సేవలు అందించారు. డచ్చి వ్యాపారులు కూడా వేలాదిమంది బానిసలను ఇండోనేషియా, మడగాస్కర్, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల నుండి తీసుకువచ్చి కాలనీకి దిగుమతి చేసుకున్నారు. కొంతమంది వ్రిర్జిబర్గర్లు, వారి బానిసలు, వివిధ దేశీయ ప్రజల మధ్య సంబంధాల ద్వారా దేశంలో మొట్టమొదటి మిశ్రమ జాతి సమూహాలు ఏర్పడ్డాయి. ఇది కొత్త జాతి సమూహమైన కేప్ కలర్ల అభివృద్ధికి దారితీసింది. వీరిలో చాలామంది డచ్చి భాష వాడుకరులుగా ఉండి క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించారు.

డచ్చి వలసవాదుల తూర్పు విస్తరణ సమయంలో నైరుతీప్రాంతాలకు వలస వచ్చిన ఖోసా తెగలతో వరుస యుద్ధాలు జరిగాయి. ఇవి ఖోసా యుద్ధాలు అని పిలువబడ్డాయి. ఎందుకంటే గ్రేట్ ఫిష్ నది దగ్గర వారి పశువుల పెంపకానికి అవసరమైన రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడింది. సరిహద్దులో స్వతంత్ర రైతులుగా మారిన విర్జిబర్గర్లను బోయర్సు అని పిలిచేవారు. కొంతమంది స్వల్ప సంచార జీవన విధానాలను ట్రెక్కర్లుగా సూచిస్తారు. బోయర్సు అవసరసమయాలలో సహకరించే సైనికులను ఏర్పాటు చేశారు. వారు కమాండోలుగా పిలువబడ్డారు. ఖోసా సమూహాల గొలుసు దాడులను తిప్పికొట్టడానికి పొత్తులు కుదుర్చుకున్నారు. రెండు వైపులా రక్తపాత కానీ అసంబద్ధమైన దాడి, అప్పుడప్పుడు హింస, తరచుగా పశువుల దొంగతనం అనేక దశాబ్దాలుగా ఉండిపోయాయి.

బ్రిటిషు పాలన

1795 - 1803 ల మధ్య కేప్ టౌన్ ఫ్రెంచి రిపబ్లికు నియంత్రణలో పడకుండా నిరోధించడానికి గ్రేటు బ్రిటను కేప్ టౌనును ఆక్రమించింది. 1803 లో బటావియన్ రిపబ్లిక్ పాలనలో డచ్చి పాలనకి తిరిగి చేరుకున్నప్పటికీ, కేప్ ను బ్రిటీషువారు 1806 నాటికి తిరిగి ఆక్రమించుకున్నారు. నెపోలియను యుద్ధాలు ముగిసిన తరువాత ఇది అధికారికంగా గ్రేటు బ్రిటనుకు కేటాయించబడింది. బ్రిటీషు సామ్రాజ్యం అంతర్భాగంగా మారింది. దక్షిణాఫ్రికాకు బ్రిటీషు వలసలు 1818 లో ప్రారంభమయ్యాయి. తరువాత 1820 సెటిలర్సు రాకతో ముగిసింది. నూతన వలసదారులు వివిధ కారణాల కోసం ఇక్కడ స్థిరపడేలా ప్రోత్సహించబడ్డారు. ఐరోపా కార్మికుల పరిమాణాన్ని పెంచుకునేందుకు, ఖోసా చొరబాట్లకు వ్యతిరేకంగా సరిహద్దు ప్రాంతాలను పటిష్ఠపరచాలని వారు భావించారు.

దక్షిణాఫ్రికా 
1838 ఫిబ్రవరిలో బోయెరు క్యాంపులో జులూ దాడి చిత్రణ

19 వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలో జులు ప్రజలు అధికారంలోకి వచ్చారు. వారి నాయకుడు షకా నాయకత్వంలో విస్తరించారు. షాకా యుద్ధం పరోక్షంగా ఫెకానె ("అణిచివేత") కు దారితీసింది. ఇందులో 10,00,000 నుండి 20,00,000 మంది ప్రజలు చనిపోయారు. 1820 లో ప్రారంభంలో దేశంలో పీఠభూమి ప్రాంతాన్ని నాశనంచేసి జనావాసరహితంగా మార్చారు. జులు ఒక శాఖ అయిన మతాబెలె ప్రజలు వారి రాజు జిలికాజి కింద ఉన్నతస్థాయిలో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించింది

1800 ల ఆరంభంలో బ్రిటీషు నియంత్రణకు గురై అనేక డచ్చి వలసదారులు కేప్ కాలనీ నుండి వెళ్ళారు. వారు ప్రస్తుత నాటలు, ఆరెంజు, ఫ్రీ స్టేటు, ట్రాన్స్వాలు ప్రాంతాలకు వలస వెళ్ళారు. బోయర్సు రిపబ్లిక్సు, దక్షిణాఫ్రికా రిపబ్లికు (ప్రస్తుత గౌతెంగు, లింపోపో, పుమలంగా, నార్తు వెస్టు ప్రావిన్సు), నటాలియా రిపబ్లికు (క్వాజులు-నాటలు), ఆరంజు ఫ్రీ స్టేట్ (ఫ్రీ స్టేట్) ను స్థాపించారు.

1867 లో వజ్రాల ఆవిష్కరణ 1884 లో బంగారం ఆవిష్కరణ అంతర్భాగంలో " ఖనిజ విప్లవం " ప్రారంభమైంది. ఆర్థిక వృద్ధి, ఇమ్మిగ్రేషను అధికరించింది. దేశీయ ప్రజలపై నియంత్రణ సాధించేందుకు బ్రిటీషు ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. ఈ ముఖ్యమైన ఆర్థిక వనరులను నియంత్రించే పోరాటం ఐరోపియన్లు, దేశీయ ప్రజల మధ్య సంబంధాలు, బోయర్సు, బ్రిటీషు మధ్య కూడా ఒక ప్రధానాంశంగా మారాయి.

1879 లో బ్రిటిషు సామ్రాజ్యం, జులు రాజ్యం మధ్య ఆంగ్లో-జులు యుద్ధం జరిగింది. లార్డు కార్నార్వాను కెనడాలో విజయవంతంగా ప్రవేశపెట్టిన ఫెడరేషనును అనుసరిస్తూ ఇలాంటి రాజకీయ ప్రయత్నాలు ఆఫ్రికా రాజ్యాలు, గిరిజన ప్రాంతాలు, దక్షిణాఫ్రికాలో బోయెరు రిపబ్లిక్కులతో విజయవంతం కావచ్చని భావించారు. 1874 లో సర్ హెన్రీ బార్టిలు ఫెరె బ్రిటిషు సామ్రాజ్యం హై కమిషనరుగా దక్షిణాఫ్రికాకు పంపబడ్డాడు. అలాంటి ప్రణాళికలను తీసుకురావడానికి బోయర్సు స్వతంత్ర రాజ్యాలు, జులులండు సామ్రాజ్యం, దాని సైన్యం అడ్డంకులుగా ఉన్నాయి. జులు జాతీయుడు బ్రిటీషువారిని ఐసాండల్వానా యుద్ధంలో ఓడించారు.

దక్షిణాఫ్రికా 
యుద్ధంలో బోయర్స్ (1881)

బోయెరు రిపబ్లికు విజయవంతంగా మొదటి బోయరు యుధ్ధం (1880-1881) సమయంలో గొరిల్లా యుద్ధతంత్ర వ్యూహాలను ఉపయోగించి బ్రిటీషు ఆక్రమణలను విజయవంతంగా అడ్డుకుంది. ఇవి స్థానిక పరిస్థితులకు బాగా సరిపోతాయి. బ్రిటీషు అధిక సంఖ్యలో రెండో బోయెరు యుద్ధంలో (1899-1902) ఎక్కువ అనుభవం, కొత్త వ్యూహాన్ని తిరిగి పొందింది కానీ ఘర్షణ ద్వారా భారీ ప్రాణనష్టం జరిగిపోయింది. అయినప్పటికీ చివరకు వారు విజయం సాధించారు.

స్వాతంత్రం

దేశంలో శ్వేత జాతీయులు, దక్షిణ ఆఫ్రికన్ల మధ్య విభేదాలు సృష్టించే బ్రిటిషు విధానాలు స్వాతంత్ర్యంపై దృష్టి కేంద్రీకరించేలా చేసాయి. డచ్చి, బ్రిటీషు కాలనీల కాలంలో, జాతి వివక్ష చాలా సాధారణం అయింది. స్థానిక ప్రజల నివాసాలు, ఉద్యమాలను నియంత్రించడానికి " స్థానిక చట్టం 1879 " కొన్ని చట్టాలు అమలు చేయబడ్డాయి.

రెండవ బోయరు యుధ్ధం ముగిసిన ఎనిమిది సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల చర్చలు జరిపి బ్రిటిషు పార్లమెంటు (సౌత్ ఆఫ్రికా యాక్ట్ 1909) చట్టం ద్వారా నామమాత్ర స్వతంత్రాన్ని అందించింది. అదే సమయంలో 1910 31 న దక్షిణాఫ్రికా యూనియను ఏర్పడింది. ఇందులో కేప్, ట్రాన్స్వాలు, నాటలు కాలనీలు, అలాగే ఆరెంజు ఫ్రీ స్టేటు రిపబ్లికు ఉన్నాయి.

1913 నాటి స్థానికుల భూమి చట్టం నల్లజాతీయుల భూ యాజమాన్యాన్ని తీవ్రంగా పరిమితం చేసింది. ఆ దశలో 7% భూమి మాత్రమే స్థానికుల నియంత్రణలో ఉంది. తరువాత స్థానిక ప్రజల కోసం కేటాయించిన మొత్తం భూమి స్వల్పంగా పెరిగింది.

1931 లో యునైటెడు కింగ్డం నుండి వెస్టుమినిస్టరు శాసనం ఆమోదంతో యూనియను పూర్తిగా సార్వభౌమాధికారం కలిగి ఉండేది. ఇది దేశంలో బ్రిటిషు ప్రభుత్వ చివరి అధికారాలను రద్దు చేసింది. 1934 లో ఆఫ్రికా ప్రజలు, ఇంగ్లీషు మాట్లాడే శ్వేతజాతీయుల మధ్య సయోధ్య కోరుతూ దక్షిణాఫ్రికా పార్టీ, నేషనలు పార్టీ విలీనమై యునైటెడు పార్టీని ఏర్పరిచాయి. 1939 లో యూనియను రెండవ ప్రపంచ యుద్ధంలో యూనియను యునైటెడు కింగ్డం మిత్రరాజ్యంగా ప్రవేశించడంతో యునైటెడు పార్టీ విడిపోయింది. ఈ చర్యను జాతీయ పార్టీ అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు.

జాతి వివక్ష

దక్షిణాఫ్రికా 
"For use by white persons" – apartheid sign in English and Afrikaans

1948 లో జాతీయ పార్టీ అధికారంలోకి ఎన్నుకోబడింది. ఇది డచ్చి, బ్రిటీషు వలసరాజ్య పాలనలో ప్రారంభమైన జాతి విభజనను బలపరిచింది. కెనడా భారతీయ చట్టాన్ని ఒక నమూనంగా తీసుకుని ప్రజలందరినీ మూడు జాతులగా వర్గీకరించారు. ప్రతి ఒక్కరికి హక్కులు, పరిమితులను అభివృద్ధి చేశారు. తెలుపు మైనారిటీ (20% కంటే తక్కువ) బృహత్తరమైన సంఖ్యలో ఉన్న నల్లజాతి ప్రజలను నియంత్రించింది. చట్టబద్ధంగా సంస్థాగతంగా జరిగిన విభజన వివక్షత అని పిలవబడింది. మొదటి ప్రపంచం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాలలో శ్వేతజాతీయులు అత్యధిక జీవన ప్రమాణాలను ఆస్వాదించగా నల్లజాతీయుల ఆదాయం, విద్య, గృహ నిర్మాణం, ఆయుఃప్రమాణంతో సహా దాదాపు అన్ని ప్రమాణంతో వెనుకబడి ఉంది. 1955 లో కాంగ్రెసు కూటమి స్వతంత్ర చార్టరు స్వీకరించింది. ఒక జాతికి చెందిన సమాజ వివక్షతకు ముగింపు ఇవ్వాలని నిర్బంధించింది.

రిపబ్లికు

1961 మే 31 న ప్రజాభిప్రాయ సేకరణ (1960) తరువాత దక్షిణాఫ్రికా రిపబ్లికుగా మారింది. ప్రజాభిప్రాయసేకరణలో శ్వేతజాతీయ ఓటర్లు తమకు అనుకూలంగా ఓటు వేసుకున్నారు (బ్రిటీష్-ఆధిపత్యం కలిగిన నాటాలు ప్రావిన్సు ఈ సమస్యకు వ్యతిరేకంగా సమావేశం అయింది). దక్షిణాఫ్రికా రాణిగా రెండవ ఎలిజబెతు రాణి పేరును తొలగించారు. చివరి గవర్నరు-జనరలు " చార్లెసు రాబెర్ట్సు స్వార్టు " దేశాధ్యక్షుడు అయ్యాడు. వెస్టుమినిస్టరు వ్యవస్థ విధానంలో నియమించబడిన పార్లమెంటరీ- 1983 వరకు వాస్తవంగా బలహీనంగా ఉండి పి.డబల్యూ బోథా రాజ్యాంగ చట్టం కొనసాగింది. ఇది ప్రధాన మంత్రి కార్యాలయాన్ని తొలగించి బదులుగా పార్లమెంటుకు బాధ్యతవహించడానికి ఏకైక "బలమైన ప్రెసిడెన్సీ"ను స్థాపించింది. 1961 లో ఇతర కామన్వెల్తు దేశాల ఒత్తిడితో దక్షిణాఫ్రికా సంస్థ నుండి వైదొలిగి 1994 లో తిరిగి చేరింది.

దేశం లోపల, వెలుపల వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రభుత్వం వర్ణవివక్ష కొనసాగింపు చట్టబద్ధం చేసింది. ఆఫ్రికా నేషనలు కాంగ్రెసు, అజానియా పీపుల్సు ఆర్గనైజేషను, పాను-ఆఫ్రికనిస్టు కాంగ్రెసు పార్టీలు గెరిల్లా యుద్ధతంత్రంతో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను, పట్టణప్రాంత రాజద్రోహం చర్యలను భద్రతా దళాలు అణిచివేసాయి. స్థానిక ప్రజల మద్ధతుతో మూడు ప్రత్యర్థి నిరోధక ఉద్యమాలు అప్పుడప్పుడు అంతర్గత సంఘర్షణ ఘర్షణల్లో పాల్గొన్నాయి. జాతి వివక్షత వివాదాస్పదంగా మారింది. పలు దేశాలు జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికా ప్రభుత్వంతో వ్యాపారాన్ని బహిష్కరించడం ప్రారంభించాయి. ఈ చర్యలు తరువాత అంతర్జాతీయ ఆంక్షలు, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి.

దక్షిణాఫ్రికా 
ఎఫ్.డబల్యూ. డి క్లార్కు, నెల్సను మండేలా 1992 జనవరిలో చేతులు కదిలిపారు

1970 ల చివరలో దక్షిణాఫ్రికా అణు ఆయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. తరువాతి దశాబ్దంలో ఇది ఆరు అణు ఆయుధాలను ఉత్పత్తి చేసింది.

వర్ణ వివక్ష ముగింపు

" 1974 లో మహ్లాబతిని డిక్లరేషను ఆఫ్ ఫెయితు " మీద మంగోసుతు బుతెలెజి, హ్యారీ స్చ్వర్జులు సంతకం చేసారు. దక్షిణాఫ్రికాలోని నల్లజాతి, శ్వేతజాజాతి రాజకీయ నాయకుల ఈ ఒప్పందం మొట్టమొదటి అధికారం, సమానత్వం శాంతియుత బదిలీ విధానాలను ప్రతిబింబిస్తుంది. 1993 లో అంతిమంగా ఎఫ్.డబల్యూ డి క్రాలెకు నెల్సను మండేలాతో విధానాలు, ప్రభుత్వం పరివర్తన కొరకు ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించారు.

1990 లో ఎ.ఎన్.సి, ఇతర రాజకీయ సంస్థల మీద నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా జాతీయ పార్టీ ప్రభుత్వం వివక్షను తొలగిస్తూ మొదటి అడుగు వేసింది. విద్రోహానికి శిక్ష విధించిని నెల్సను మండేలాను 27 సంవత్సరాల తర్వాత విడుదల చేసింది. సంధి ప్రక్రియ కొనసాగింది. 1992 ప్రజాభిప్రాయ సేకరణలో శ్వేతజాతి ఓటర్ల ఆమోదంతో వర్ణవివక్షను రద్దు చేయడానికి ప్రభుత్వం చర్చలు కొనసాగించింది. దక్షిణాఫ్రికా కూడా దాని అణు ఆయుధాలను నాశనం చేసి అణ్వాయుధ నాన్-ప్రొలిఫెరేషన్ ట్రీటీకి ఒప్పుకుంది. 1994 లో దక్షిణాఫ్రికా తొలి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించింది. ఇందులో ఎ.ఎన్.సి. అధిక సంఖ్యలో విజయం సాధించ అప్పటి నుండి అధికారంలో ఉంది. దేశం కామన్వెల్తు ఆఫ్ నేషంసులో తిరిగి చేరింది. దక్షిణాఫ్రికా డెవలప్మెంటు కమ్యూనిటీలో సభ్యదేశంగా మారింది.

దక్షిణాఫ్రికా 
Nelson Mandela, first black African President of Republic of South Africa

తరువాత దక్షిణాఫ్రికాలో నిరుద్యోగం సమస్యతో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేకమంది నల్లజాతీయులు మధ్యతరగతి నుండి ఉన్నత తరగతులకు అభివృద్ధి చెందారు. 1994 - 2003 మధ్యకాలంలో నల్లజాతీయుల మొత్తం నిరుద్యోగ శాతం అధికారిక కొలమానాలలో మరింత దిగజార్చింది. గతంలో అరుదుగా ఉన్న శ్వేతజాతీయులలో పేదరికం తరువాతి కాలంలో అధికరించింది. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం సంపద, ఆర్థిక వృద్ధి పునఃపంపిణీని నిర్ధారించడానికి ద్రవ్య, ఆర్థిక క్రమశిక్షణను సాధించడానికి చాలా కష్టపడింది. 1990 లో మధ్యకాలం వరకు స్థిరంగా ఉన్న దక్షిణాఫ్రికా ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచిక 1995 నుండి 2005 మధ్యకాలంలో పడిపోయింది. 2013 లో తిరిగి దాని గరిష్ఠ స్థాయిని చేరుకుంది. ఎయిడ్సు ప్రాబల్యత కారణంగా 1992 లో 62.25 సంవత్సరాల దక్షిణాఫ్రికా ఆయుర్దాయం 2005 లో 52.57 కు తగ్గింది. ప్రారంభ సంవత్సరాలలో చర్యలు చేపట్టడంలో, పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా సంభవించింది.

2008 మేలో అల్లర్లలో 60 మంది మరణించాయి. " సెంటరు ఆఫ్ హౌసింగు రైట్సు అండ్ ఎవిక్షంసు " 1,00,000 మంది ప్రజలను వారి గృహాల నుండి వెలుపలకు నడిపాయి. న్యాయబద్ధమైన, చట్టవిరుద్ధవిరుద్ధమైన వలసదారులు, శరణార్ధుతూ కోరుతూ వచ్చే శరణార్థులు ప్రధాన లక్ష్యంగా ఉండేవి. అయితే బాధితులలో మూడవ వంతు దక్షిణాఫ్రికా పౌరులు ఉన్నారు. 2006 లో జరిగిన ఒక సర్వేలో దక్షిణాఫ్రికా వలస ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా ఇతరదేశాల కంటే ఇమ్మిగ్రేషనుకు వ్యతిరేకత ఎక్కువగా ఉందని తీర్మానించింది. 2008 లో శరణార్ధుల ఐక్య హై కమిషనరు దక్షిణాఫ్రికాలో శరణు కోసం 2,00,000 మంది శరణార్థులు అభ్యర్థించారని ప్రస్తావించారు. ఇది అంతకుముందు అంతకు ముందు నాలుగు రెట్లు ఎక్కువ. ఈ వ్యక్తులలో ప్రధానంగా జింబాబ్వే అధికంగా ఉన్నారు. వీరిలో చాలామంది బురుండి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, ప్రజా సేవలు, గృహాల మీద పోటీల విషయంలో శరణార్థులు, హోస్టు కమ్యూనిటీల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. జెనోఫోబియా ఇప్పటికీ ఒక సమస్యగా ఉన్నప్పటికీ ఇటీవల హింస మొదట భయపడినంతగా వ్యాపించలేదు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా జాతివిషయాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ప్రతిపాదిత పరిష్కారాలలో పెండింగులో ఉన్న హేటు క్రైమ్సు, ద్వేషపూరిత ప్రసంగ బిల్లు వంటివి అనుమతించబడాలని పేర్కొనబడింది.

Geography

దక్షిణాఫ్రికా 
A map of South Africa showing the main topographic features: the Central Plateau edged by the Great Escarpment, and the Cape Fold Belt in the south-west corner of the country
దక్షిణాఫ్రికా 
Important geographical regions in South Africa. The thick line traces the course of the Great Escarpment which edges the central plateau. The eastern portion of this line, coloured red, is known as the Drakensberg. The Escarpment rises to its highest point, at over 3,000 m (9,800 ft), where the Drakensberg forms the border between KwaZulu-Natal and Lesotho. None of the regions indicated on the map has a sharp well-defined border, except where the Escarpment or a range of mountains forms a clear dividing line between two regions. Some of the better known regions are coloured in; the others are simply indicated by their names, as they would be in an atlas

దక్షిణాఫ్రికా ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉంది. రెండు సముద్రాల (దక్షిణ అట్లాంటికు, హిందూమహా సముద్రం) తీరం పొడవు 2,500 కి.మీ (1,553 మై)ఉంది. వైశాల్యం 12,19,912 చ.కి.మీ ఉంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ఆధారంగా దక్షిణాఫ్రికా ఆఫ్రికాలో 25 వ అతిపెద్ద దేశం. ఇది కొలంబియా, ఫ్రాన్స్లకు రెండు రెట్లు, జపాన్ మూడు రెట్లు, ఇటలీ పరిమాణం నాలుగు రెట్లు, యునైటెడ్ కింగ్డమ్కు ఐదు రెట్లు పరిమాణంతో సమానంగా ఉంది.

3,450 మీ (11,320 అ) ఎత్తైన డ్రాకెనుస్బర్గు లోని మఫాడి దక్షిణాఫ్రికాలో ఎత్తైన శిఖరం. ప్రిన్సు ఎడ్వర్డు దీవుల మినహాయించి దేశం 22 ° నుండి 35 ° దక్షిణ అక్షాంశం, 16 ° నుండి 33 ° తూర్పు రేఖాంశంలో ఉంది.

దక్షిణాఫ్రికా అంతర్భాగం చాలా విస్తీర్ణంలో ఉంది, దాదాపుగా చాలా భూభాగం చదునైన పీఠభూమిలో 1,000 మీటర్ల (3,300 అడుగులు) నుండి 2,100 మీ (6,900 అడుగులు) ఎత్తులో ఉంటుంది. తూర్పుప్రాంతం ఎత్తైనదిగా ఉంటూ క్రమంగా పశ్చిమప్రాంతం, ఉత్తరప్రాంతాల వైపుగా క్రిందికి వాలుతూ, దక్షిణప్రాంతం, నైరుతిప్రాంతం తక్కువగా ఉంటుంది. ఈ పీఠభూమి చుట్టూ గ్రేటు ఎస్కార్పుమెంటు ఉంటుంది. దీని తూర్పు ఎత్తైన భుభాగాన్ని డ్రాకెన్స్బర్గు అని పిలుస్తారు.

పీఠభూమి దక్షిణ నైరుతీ భాగాలలో (సముద్ర మట్టానికి దాదాపు 1100-1800 మీటర్లు), దిగువన భాగం (సముద్ర మట్టం నుండి సుమారు 700-800 మీటర్ల ఎగువన కుడివైపున ఉన్న సన్సెసీ మ్యాప్) గ్రేటు కాయు తక్కువ జనాభా కలిగిన పొదలతోకూడిన భూభాగంగా ఉంటుంది. ఉత్తరప్రాంతంలో ఉన్న గ్రేటు కారో ఫెడేలు కూడా పొడి, మరింత శుష్కమైన పొదలతోకూడిన భూభాగంగా మారుతుంది. చివరికి దేశంలోని వాయవ్య ప్రాంతంలో కలహరి ఎడారఉంటుంది. మధ్య తూర్పు, పీఠభూమి అత్యధిక భాగం హైవేల్డు అని పిలువబడుతుంది. చక్కటి నీటిపారుదల కలిగిన ఈ ప్రాంతం అత్యధిక శాతం దేశంలోని వాణిజ్య వ్యవసాయ భూములకు స్థావరంగా ఉంది. ఇది దేశంలో అతిపెద్ద పరీవాహక (గౌటెంగు) ప్రాంతంగా ఉంది. హైవెల్డు ఉత్తరప్రాంతం 25 ° 30 'దక్షిణ అక్షాంశం నుండి, పీఠభూమి వాలుగా బుష్వెల్డు లోకి ప్రవేశిస్తుంది. చివరికి లింపోపో లోతట్టు లేదా లోవ్వెల్డుకు దారితీస్తుంది.

దక్షిణాఫ్రికా 
Flat topped hills (called Karoo Koppies) are highly characteristic of the southern and southwestern Karoo landscape. These hills are capped by hard, erosion resistant dolerite sills. This is solidified lava that was forced under high pressure between the horizontal strata of the sedimentary rocks that make up most of the Karoo's geology about 180 million years ago. Since then, Southern Africa has undergone a prolonged period of erosion removing the relatively soft Karoo rocks, except where they are protected by a cap of dolerite. This photograph was taken near Cradock in the Eastern Cape

గ్రేటు ఎస్కార్పుమెంటు క్రింద ఉన్న తీర ప్రాంతం, ఈశాన్యం నుండి సవ్యదిశలో కదిలే లింపోపో లోవ్వెల్డు ఉంటుంది. ఇది మపుమంగా డ్రాక్సెంసుబర్గు (గ్రేటు ఎస్కార్పుమెంటు తూర్పు భాగం) కంటే తక్కువగా ఉన్న మ్పుమలంగా లోవెల్డులో విలీనం చేస్తుంది. ఇది హైపర్డు కంటే ఎక్కువ వేడి, పొడిగా ఉండి తక్కువగా సాగు చేయబడుతుంది. ఈశాన్య దక్షిణాఫ్రికాలోని లిమ్పోపో, మ్పుమలంగా రాష్ట్రాలలో ఉన్న క్రుగేరు నేషనలు పార్కు, లోవ్వెల్డు విస్తీర్ణం 19,633 చదరపు కిలోమీటర్లు (7,580 చదరపు మైళ్ళు) ఉంది. లోవెల్డు దక్షిణాన వార్షిక వర్షపాతం అధికరిస్తుంది. క్వాజులు -నాటా ప్రావిన్సు, ముఖ్యంగా తీరప్రాంతాల సమీపంలో ఉపఉష్ణమండల వేడి, తేమ ఉంటుంది. గ్రేటు ఎస్కార్పుమెంటు, డ్రేకెంసుబర్గు అత్యధిక భాగం క్వాజులు-నాటలు-లెసోతో అంతర్జాతీయ సరిహద్దు ఏర్పరుస్తుంది. ఇది 3,000 మీ (9,800 అ) ఎత్తులో ఉంటుంది. డ్రేకెను బెర్గు ఈ భాగం పర్వత పాదాల వద్ద వాతావరణం సమశీతోష్ణ స్థితి.

దక్షిణాఫ్రికా 
Drakensberg, the eastern and highest portion of the Great Escarpment which surrounds the east, south and western borders of the central plateau of Southern Africa

గ్రేటు ఎస్కార్ప్మెంటు దక్షిణ, నైరుతి విస్తీర్ణానికి దిగువ తీరప్రాంతంలో కేపు ఫోల్డు పర్వతాలు ఉంటాయి. ఇవి తీరానికి సమాంతరంగా ఉంటాయి. ఇది సముద్రం నుండి గ్రేటు ఎస్కార్పుమెంటును వేరు చేస్తుంది. (ఈ సమాంతర పర్వతాలు పటం పైభాగాన చూపించబడ్డాయి. ఈ పర్వత శ్రేణుల ఉత్తరాన గ్రేటు ఎస్కార్పుమెంటు గమనాన్ని గమనించండి.) ఈ రెండు శ్రేణుల మధ్య భూమి (సముద్ర మట్టానికి దాదాపు 400-500 మీటర్లు) దక్షిణాన రాతి పర్వతాలను (దక్షిణం వైపున ఉన్న అవుెన్తిక్యూ, లాంగేబర్గు పర్వతాల మధ్య, ఉత్తరాన స్వర్టుబర్గు శ్రేణుల మధ్య) లిటిలు కారూ అని పిలుస్తారు. ఇక్కడ గ్రేటు కారు వలె పాక్షికంగా ఎడారి పొదలభూమి ఉంటుంది, స్వర్టుబర్గు పర్వతాల వెంట దాని ఉత్తర భాగాన్ని మినహాయించి, కొంతవరకు ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అందువలన గ్రేటు కారు కంటే ఎక్కువ సాగు చేయబడుతుంది. లిటిలు కారు చారిత్రాత్మకంగా ఇప్పటికీ, ఔదుషూర్ను పట్టణంపై ఉష్ట్రపక్షి పెంపకానికి ప్రసిద్ధి చెందింది. గ్రేటు ఎస్కార్పుమెంటు వరకు ఉన్న స్వర్టుబర్గు పర్వత శ్రేణికి ఉత్తరాన ఉన్న లోతట్టు ప్రాంతం (సముద్ర మట్టానికి 700-800 మీటర్లు) గ్రేటు కారు దిగువ భాగం (ఎగువ కుడివైపున ఉన్న మ్యాపు చూడండి), దాదాపుగా గుర్తించలేనంతగా గ్రేట్ ఎస్కార్పుమెంటు కారులా ఉంటుంది. సముద్రజలాల వైపు ఉన్న కేపు ఫోల్డు పర్వత శ్రేణి (అనగా లాంగేర్బెర్గ్-అవుటేన్వివా పర్వతాలు), మహాసముద్రాల మధ్య సన్నటి తీరప్రాంతాన్ని ప్రత్యేకించి జార్జి-నైస్నా-ప్లేట్టేన్బెర్గు బే ప్రాంతంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. దీనిని గార్డెను రూటు అంటారు. దక్షిణాఫ్రికాలోని స్థానిక అడవుల విస్తార ప్రాంతంగా (ఇది సాధారణంగా అటవీ-పేద దేశం) ప్రసిద్ధి చెందింది.

దేశం నైరుతి మూలలో కేప్ ద్వీపకల్పం అట్లాంటికు మహాసముద్రం సరిహద్దులో ఉన్న తీరప్రాంతానికి దక్షిణపు కొనను ఏర్పరుస్తూ నమీబియాతో సరిహద్దులో ముగుస్తుంది. కేప్ ద్వీపకల్పంలో మధ్యధరా వాతావరణం ఉంది. సహారా దక్షిణాన ఉన్న ఈ భూభాగంలో శీతాకాలంలో వర్షపాతం ఎక్కువగా లభిస్తుంది. కేప్ ద్వీపకల్పంలో అధికంగా కేప్ టౌన్ మహానగర ప్రాంతం ఉంది. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 3.7 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు. ఇది దేశం శాసన రాజధానిగా ఉంది.

దక్షిణాఫ్రికా 
నమక్వాలాండులో వసంతకాల పువ్వులు

కేప్ ద్వీపకల్పం ఉత్తరాన తీరప్రాంత బెల్టు పశ్చిమాన అట్లాంటికు మహాసముద్రం, తూర్పున ఉత్తర-దక్షిణ కేప్ ఫోల్డు పర్వతాల మొదటి వరుసల సరిహద్దుగా ఉంది. కేప్ ఫాల్టు పర్వతాలు 32 ° దక్షిణ అక్షాంశంలో ఉన్నాయి. తీరప్రాంత మైదానం సరిహద్దున గ్రేట్ ఎస్కార్పుమెంటు ఉంది. ఈ తీర ప్రాంతపు దక్షిణకొన భాగంలో స్వర్టుల్యాండు, మాల్మేస్బరీ మైదానం అని పిలుస్తారు. ఇది ఒక ముఖ్యమైన గోధుమ పెరుగుతున్న ప్రాంతం, ఇది శీతాకాలపు వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతం ఉత్తరభాగం నమక్వాల్యాండు అని పిలువబడుతుంది. అది అధికంగా పొడి ప్రాంతంగా మారుతూ ఆరంజి నదికి చేరుకుంటుంది. శీతాకాలంలో ఇక్కడ స్వల్పంగా వర్షపాతం ఉంటుంది. ఇది ఆరెంజ్ నదికి చేరుకున్నప్పుడు మరింత శుష్కంగా మారుతుంది. వసంతకాలంలో (ఆగస్టు-సెప్టెంబరు) భారీ వర్షాల కారణంగా పూల తివాసిలా ఉన్న ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటిగా ఉంటుంది.

దక్షిణాఫ్రికా 
Cape Floral Region Protected Areas

దక్షిణాఫ్రికాలో ఒక చిన్న అట్లాంటికు ద్వీపసమూహం భాగంగా ఉంటుంది. ఎడ్వర్డు రాకుమారుని ద్వీపాలు అని పిలువబడే ఈ ద్వీపసముహంలో మారియను ద్వీపం (290 km2 or 110 sq mi) ప్రింసు ఎడ్వర్డు ద్వీపం, (45 km2 or 17 sq mi) (అదే పేరుతో ఉన్న కార్డియను ప్రొవింసులో ఉన్నది కాదు).

Climate

దక్షిణాఫ్రికా 
Köppen climate types of South Africa

మూడు వైపులా అట్లాంటికు, హిందూ మహాసముద్రాల ఆవృత్తితమైన దక్షిణాఫ్రికాలో వాతావరణం దక్షిణార్థగోళంలో సమశీతోషణస్థితి ఉంటుంది. సగటు ఎత్తులో ఉండి ఉత్తరంవైపు (భూమధ్యరేఖ వైపుగా), మరింత లోతట్టుప్రాంతాలు క్రమంగా పెరుగుతూ ఉండటం వలన దక్షిణాఫ్రికా సాధారణంగా సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంది. ఈ వైవిధ్యభరితమైన భౌగోళిక స్థితి, సముద్ర ప్రభావం కారణంగా అనేక రకాల వాతావరణ మండలాలు ఉన్నాయి. సుదూర వాయవ్య దిశలో దక్షిణ నమిబు ఎడారి నుండి ఉప ఉష్ణమండలీయ వాతావరణం మొజాంబిక్, హిందూ మహాసముద్రం సరిహద్దు వరకు వ్యాపించి ఉంటాయి. దక్షిణాఫ్రికాలో జూన్, ఆగస్టు మధ్య శీతాకాలాలు ఉంటాయి.

నైరుతి ప్రాంతంలో మధ్యధరా వాతావరణం నెలకొని ఉంటుంది. మధ్యప్రాచ్యంలో తడి శీతాకాలాలు, వేడి, పొడి వేసవికాలాలు ఉన్నాయి, ఇవి పొదలు, దట్టమైన ప్రసిద్ధ ఫైన్బోసు జీవపదార్ధాలను కలిగి ఉంటాయి. దక్షిణాఫ్రికాలోని ఈ ప్రాంతంలో వైన్ అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ ప్రాంతం ప్రత్యేకంగా గాలికి ప్రసిద్ధి చెందింది. సంవత్సరమంతటా ఇక్కడ నిరంతరాయంగా గాలి వీస్తుంటుంది. ఈ గాలి తీవ్రత కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ ప్రయాణిస్తుండే నావికులకు ప్రమాదకరమైనది. దీనివల్ల అనేక ఓడలు బద్దలు ఔతుంటాయి. దక్షిణ తీరంలో మరింత తూర్పున, వర్షపాతం ఏడాది పొడవునా ఒకేవిధంగా వర్షపాతం ఉంటుంది. ఫలితంగా ఇది ఒక పచ్చని భూభాగాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాంతం ప్రముఖంగా గార్డెను రూటుగా పిలువబడుతుంది.

ఫ్రీ స్టేట్ ముఖ్యంగా చదరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అధిక పీఠభూమిలో కేంద్రంగా ఉంది. వాలూ నదికి ఉత్తరాన, హైవేల్డు బాగా నీటిపారుదల కలిగిన ప్రాంతంగా ఉంది. ఇది ఉష్ణ ఉపఉష్ణమండల తీవ్రతను అనుభవించదు. హైవెల్డు కేంద్రంలో ఉన్న జోహాంసుస్బర్గు సముద్ర మట్టానికి 1,740 మీ (5,709 అడుగులు) ఎత్తులో ఉంది. వార్షిక వర్షపాతం 760 మి.మీ (29.9 అం) గా ఉంటుంది. మంచు అరుదుగా హిమపాతం ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో శీతాకాలాలు చల్లగా ఉంటాయి.

హైవేల్డు ఆగ్నేయ దిక్కున ఉన్న అధిక డ్రేకెన్స్బర్గు పర్వతాలు శీతాకాలంలో పరిమిత స్కీయింగు అవకాశాలను అందిస్తాయి. దక్షిణాఫ్రికా ప్రధాన భూభాగంలో అత్యంత చల్లగా ఉన్న పశ్చిమ రోగెజెల్డు పర్వతాలలో సదర్లాండు ఉంది. ఇక్కడ మద్యశీతాకాల ఉష్ణోగ్రతలు -15 ° సెం (5 ° ఫా) వరకు ఉంటాయి. ప్రిన్సు ఎడ్వర్డు దీవులు వార్షిక ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. కానీ సదర్లాండులో విపరీత చల్లని వాతావరణం ఉంటుంది. దక్షిణాఫ్రికా ప్రధాన భూభాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగివున్నాయి: 1948 లో ఉపనది సమీపంలోని నార్తర్ను కేప్ కలహరిలో వద్ద అధిక ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత నమోదైంది అయితే ఈ ఉష్ణోగ్రత అనధికారికమైనదిగా భావించబడుతుంది. ప్రామాణిక పరికరాలు అధికారిక అత్యధిక ఉష్ణోగ్రత 48.8 ° సెం (119.84 ° ఫా).ఇది 1993 జనవరిలో వియూల్డ్రిఫులో నమూదైంది.

Biodiversity

1994 జూన్ 4 న జీవవైవిధ్యంపై రియో కన్వెన్షను మీద దక్షిణాఫ్రికా సంతకం చేసింది. 1995 నవంబరు 2 న సమావేశానికి పార్టీగా మారింది. ఇది తరువాత జాతీయ బయోడైవర్శిటీ స్ట్రాటజీ అండ్ యాక్షను ప్లానును ఉత్పత్తి చేసింది. ఇది 2006 జూన్ 7 న సమావేశానికి సమర్పించబడింది. ప్రపంచంలోని 17 మహావైద్యం కలిగిన దేశాలలో దేశం 6 వ స్థానంలో ఉంది.

Animals

దక్షిణాఫ్రికా 
South African giraffe, Kruger National Park
దక్షిణాఫ్రికా 
African buffalo (Syncerus caffer) male with red-billed oxpecker (Buphagus erythrorhynchus), Phinda Private Game Reserve, KwaZulu Natal, South Africa

ఆఫ్రికా చిరుతలు, దక్షిణాఫ్రికా చిరుతలు, దక్షిణాది తెల్లని ఖడ్గమృగాలు, నీలం వన్యప్రాణి, కుడసు, ఇపాలాసు, హైనాయసు, హిప్పోపోటంసు, దక్షిణాఫ్రికా జిరాఫీలు వంటి అనేక క్షీరదాలు బుషువెల్డులో కనిపిస్తాయి. ఉత్తరాన ఉన్న ఈశాన్య ప్రాంతంలో బుషువెల్డులో గణనీయమైన స్థాయిలో క్రుగేరు నేషనలు పార్కు, సాబి ఇసుక గేం రిజర్వు, అదే విధంగా " వాటర్బర్గు జీవావరణం " ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఎన్నో స్థానిక జాతులు ఉన్నాయి. వాటిలో కరూ ప్రాంతంలో ఉన్న " రివరైను రాబిటు " (నది కుందేలు) తీవ్రంగా అంతరించిపోతున్న స్థితిలో ఉంది.

Fungi

1945 వరకు 4900 జాతుల శిలీంధ్రాలు (లైకెన్-ఏర్పడిన జాతులతో సహా) నమోదు చేయబడ్డాయి. 2006 లో దక్షిణాఫ్రికాలో శిలీంధ్రాల సంఖ్య సుమారు 2,00,000 జాతులు ఉన్నట్లు అంచనా వేయబడింది. కాని కీటకాలతో సంబంధం కలిగి ఉన్న ఖాతా శిలీంధ్రాలను తీసుకోలేదు.

సరిగ్గా ఉంటే దక్షిణాఫ్రికా శిలీంధ్రాల సంఖ్య దాని మొక్కల కంటే అధికంగా ఉంటుంది. కనీసం కొన్ని ప్రధాన దక్షిణాఫ్రికా పర్యావరణ ప్రాంతాలలో అరుదైన అధిక శాతం శిలీంధ్రాలు ఉంటాయి. అవి సంభవించే మొక్కల పరంగా అత్యంత ప్రత్యేకమైనవి. దేశం జీవవైవిధ్యం వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక శిలీంధ్రాలు (లైకెన్-ఏర్పడే శిలీంధ్రాలతో సహా) గురించి పేర్కొనలేదు.

Plants

దక్షిణాఫ్రికా 
Subtropical forest near Durban
దక్షిణాఫ్రికా 
Lowveld vegetation of the Kruger National Park

దక్షిణాఫ్రికా 22,000 కంటే ఎక్కువ వేర్వేరు మొక్కలు, లేదా భూమిపై ఉన్న అన్ని జాతుల 9% లో, ముఖ్యంగా మొక్కల వైవిధ్యంలో గొప్పదిగా గుర్తించబడుతుంది. దక్షిణాఫ్రికాలోని హైవెల్డులో అత్యంత ప్రబలమైన పచ్చిక ప్రాంతం ఉంది. వర్షపాతం తక్కువగా ఉండే వాయవ్యప్రాంతంలో మొక్కలు అరుదుగా ఉంటాయి. ఇక్కడ మొక్కల వివిధ గడ్డి, తక్కువ పొదలు, అకాసియా వృక్షాలు, ప్రధానంగా ఒంటె-ముల్లు (వచేలియా ఎరియోబాబా), తెల్లకాయ ఉంటాయి. తక్కువ వర్షపాతం కారణంగా వాయవ్య దిశగా మరింత తక్కువగా ఉంటుంది. చాలా వేడిగా, పొడిగా ఉన్న నమకలాండు ప్రాంతంలో, అలోయిసు, యుఫోర్బియాసు వంటి అనేక రకాల నీటిని నిల్వచేసే స్కలెంట్లు ఉన్నాయి. ఈశాన్యంలో దట్టమైన గడ్డి, ముళ్ళ సవన్నా నెమ్మదిగా పొదల సవన్నా లోకి మారుతుంది. క్రూగరు జాతీయ ఉద్యానవనానికి ఉత్తరాన ఉన్న ప్రాంతంలో బాబోబ్ చెట్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి.

కేప్ ఫ్లోరిస్టికు ప్రాంతంలో ఉన్న వృక్షసంపద ఎక్కువ భాగం ఉన్న ఫింబోసు బయోమే పశ్చిమ పూర్వీకుల కేంద్రానికి చెందిన ఒక చిన్న ప్రాంతంలో ఉంది. దీనిలో 9,000 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. మొక్కల వైవిధ్యం పరంగా భూమిపై అత్యంత సంపన్న ప్రాంతాలు.[ఆధారం చూపాలి] మొక్కలలో అధికంగా పైను, సూది వంటి ఆకులు సతతహరిత హార్డు-ఆకు మొక్కలు ఉంటాయి. దక్షిణాఫ్రికా పుష్పించే మొక్కల సమూహం ప్రోటీయ జాతి ప్రాధాన్యత వహిస్తుంది. దక్షిణాఫ్రికాలో ఇవి సుమారు 130 రకాల జాతులు ఉన్నాయి.

దక్షిణాఫ్రికా పుష్పించే మొక్కల గొప్ప సంపద కలిగి ఉంది. దక్షిణాఫ్రికాలో 1% మాత్రమే అటవీప్రాంతాన్ని కలిగి ఉంది. దాదాపుగా క్వాజులు-నాటాలు వంటి తేమతోకూడిన తీరప్రాంత మైదానాలలో దాదాపుగా నదీ ముఖద్వారాలలో దక్షిణాఫ్రికా మడ అడవుల ప్రాంతాలు కూడా ఉన్నాయి. మంటనే అడవులు అని పిలవబడే వన్యప్రాంతంలో కాల్పుల నుండి దూరంగా ఉన్న చిన్న అడవులు కూడా ఉన్నాయి. దిగుమతి చేసుకున్న చెట్ల జాతుల పెంపకం ప్రధానంగా స్థానికజాతికి చెందని యూకలిప్టసు, పైను వంటివి ఉన్నాయి.

రక్షితప్రాంతాల వివాదాలు

గత నాలుగు దశాబ్దాల్లో దక్షిణాఫ్రికా వన్యప్రాణుల సహజ నివాస ప్రాంతాలను కోల్పోయింది. ముఖ్యంగా 19 వ శతాబ్దంలో అధిక జనాభా, అభివృద్ధి విధానాల కారణంగా జరిగిన అటవీ నిర్మూలన వన్యప్రాణుల నివాసాలకు విధ్వంసకరంగా మారింది. స్థానిక జీవవైవిధ్యానికి ముప్పు, ఇప్పటికే అరుదుగా ఉన్న అనేక వన్యప్రాణుల (ఉదాహరణకు బ్లాక్ వాట్లె, పోర్టు జాక్సను విల్లో, హకీయా, లాంటానా, జాకరండా)లకు, ఇప్పటికే క్షీణించిపోతున్న నీటి వనరులకు దక్షిణాఫ్రికా అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా భావించబడుతుంది. మొట్టమొదటి ఐరోపా స్థిరనివాసులచే కనుగొనబడిన మొట్టమొదటి సమశీతోష్ణ అడవిలో ప్రస్తుతం చిన్న పాచెసు మాత్రమే మిగిలివుండే వరకు నిర్దాక్షిణ్యంగా దోపిడీ చెయ్యబడింది. ప్రస్తుతం దక్షిణప్రాంతంలో పసుపు పచ్చని చెట్లు (పడోకోర్పసు లటిఫోలియసు), స్టింక్వుడు (ఓకోటె బల్లట), దక్షిణాఫ్రికా నల్ల ఐరన్వుడు (ఒలీ లారిఫోలియా) వంటివి ప్రభుత్వ రక్షణలో ఉన్నాయి. 2014 లో దక్షిణాఫ్రికా డిపార్ట్మెంటు ఆఫు ఎన్విరాన్మెంటలు ఎఫైర్సు గణాంకాలు రికార్డు స్థాయిలో 1,215 ఖడ్గమృగాలు చనిపోయాయని తెలియజేసాయి.

శీతోష్ణస్థితి మార్పు ఎక్కువ వేడిని కలిగిస్తూ ఇప్పటికే పాక్షిక-శుష్క ప్రాంతాలను మరింత శుష్కింపజేస్తాయని భావిస్తున్నారు. తీవ్రమైన వాతావరణ విపత్తులు తరచుగా సంభవిస్తాయని, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికా నేషనలు బయోడైవర్శిటీ ఇంస్టిట్యూటు దక్షిణాఫ్రికా ప్రాంతాలలో ఉష్ణోగ్రత అధికరించింది. 2050 నాటికి ఇప్పటికే " హాటు హింటరులాండు "గా గుర్తించబడిన నార్తర్ను కేప్ ప్రాంతంలో వసంత ఋతువు, వేసవికాలంలో తీరం వెంట సుమారుగా 1 ° సెం (1.8 ° ఫా) ఉష్ణోగ్రత 4 ° సెం (7.2ఫా) చేరుకుంటుందని భావిస్తున్నారు. కేప్ ఫ్లోరలు కింగ్డం గ్లోబలు బయోడైవర్సిటీ హాటుస్పాట్లలో ఒకటిగా గుర్తించబడింది. ఇది వాతావరణ మార్పుల ద్వారా చాలా తీవ్రంగా బాధించబడుతుంది. కరువు, తరచుగా, తీవ్రంగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. ఉష్ణోగ్రతలు అధిరోహించడం ఇప్పటికే ప్రమాద స్థాయిలో ఉన్న జంతుజాతులు పూర్తిగా తుడిచిపెట్టుకు పోతాయని భావిస్తున్నారు.

Biodiversity of South Africa
King protea, national flower
Fynbos, Cape Floristic Region
Blue crane, national bird
Flowers in the West Coast National Park

ఆర్ధికరంగం

దక్షిణాఫ్రికా 
Annual per capita personal income by race group in South Africa relative to white levels
దక్షిణాఫ్రికా 
The Johannesburg Stock Exchange (JSE) is the largest stock exchange on the African continent

దక్షిణాఫ్రికా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన ఆఫ్రికాదేశాలలో రెండవ స్థానంలో (నైజీరియా తర్వాత) ఉంది. ఇది ఆఫ్రికాలోని ఇతర ఉప-సహారా దేశాలలో అత్యధిక తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి) కలిగిన దేశంగా ఉంది. (2012 నాటికి $ 11,750 అమెరికా డాలర్లు కొనుగోలు సామర్థ్యం). అయినప్పటికీ దక్షిణాఫ్రికా ఇప్పటికీ తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం సమస్యలను ఎదుర్కొంటున్నది. గినా కోఎఫీషియంట్ చేత లెక్కించబడిన ఆదాయ అసమానత అత్యధింగా ఉన్న ప్రపంచ దేశాలలో మొదటి 10 దేశాలలో ఒకటిగా ఉంది.

ప్రపంచంలోని చాలా పేద దేశాల ఉన్నట్లు దక్షిణాఫ్రికాలో అభివృద్ధి చెందుతున్న అనధికారిక ఆర్థిక వ్యవస్థ లేదు. దక్షిణాఫ్రికా ఉద్యోగాలలో కేవలం 15% మాత్రమే అనధికారిక రంగంలో ఉన్నాయి. బ్రెజిలు భారతదేశంలో సగానికంటే అధికం, ఇండోనేషియాలో దాదాపు మూడవ వంతు ఉన్నాయి. ఆర్గనైజేషను ఫర్ ఎకనామికు కో-ఆపరేషను అండ్ డెవలప్మెంటు (ఒ.ఇ.సి.డి) ఈ వ్యత్యాసాన్ని దక్షిణాఫ్రికా సంక్షేమ వ్యవస్థ కారణమని ఆపాదిస్తుంది. ప్రపంచ బ్యాంకు పరిశోధన ఆధారంగా తలసరి జిడిపి, మానవ అభివృద్ధి సూచిక వర్గీకరణలో విపరీతమైన వ్యత్యాసాలు కలిగిన ఆఫ్రికా దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి అని భావిస్తున్నారు. బోత్సువానాలో మాత్రమే అత్యధికవ్యత్యాసం ఉంది.

1994 తరువాత ప్రభుత్వ విధానం ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, ప్రజా నిధులను స్థిరీకరించి అలాగే కొన్ని విదేశీ పెట్టుబడిని ఆకర్షించింది. అయితే వృద్ధి మాత్రం ఇప్పటికీ సగటుకంటే తక్కువగానే ఉంది. 2004 నుండి ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగింది; ఉద్యోగావకాశాలు, రాజధాని నిర్మాణం రెండూ అభివృద్ధి చెందాయి. జాకబ్ జుమా అధ్యక్ష పదవీ కాలంలో ప్రభుత్వం ప్రభుత్వ-యాజమాన్య సంస్థల (ఎస్.ఒ.ఇ) పాత్రను అభివృద్ధి చేసింది. అతిపెద్ద ఎస్.ఒ.ఇ.లలో కొన్ని ఎస్కోం, ఎలెక్ట్రికు పవర్ మోనోపోలీ, సౌత్ ఆఫ్రికా ఎయిర్వేసు (ఎస్.ఎ.ఎ), ట్రాంసునెట్, రైలురోడు, పోర్టు మోనోపోలీ. ఈ ఎస్.ఒ.ఇ. లలో కొన్ని లాభదాయకంగా పనిచేయడం లేదు. ఎస్.ఎ.ఎ. వంటివి 20 సంవత్సరాలలో R30 బిలియన్లు గడించాయి.

దక్షిణాఫ్రికా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. పర్యాటకం నుండి గణనీయమైన ఆదాయం వస్తుంది.

ఇతర ఆఫ్రికా దేశాలతో సహా దక్షిణాఫ్రికా ప్రధాన అంతర్జాతీయ వ్యాపార భాగస్వాములు - జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్, యునైటెడ్ కింగ్డం, స్పెయిన్.

దక్షిణాఫ్రికా వ్యవసాయ పరిశ్రమ సుమారు 10% ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఇది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా శ్రామికులకు పనిని అందిస్తూ దేశ జి.డి.పి.లో 2.6%కి భాగస్వామ్యం వహిస్తూ ఉంది. భూమి శుష్కత కారణంగా, పంట ఉత్పత్తికి 13.5% భూభాగం మాత్రమే సహకరిస్తుంది. అధిక సారవంతమైన భూమి కేవలం 3% మాత్రమే ఉన్నట్లు భావిస్తారు.

2013 ఆగస్టులో " ఎఫ్.డి.ఐ. మాగజైను " ఆధారంగా దక్షిణాఫ్రికా ఆర్థిక సమర్ధతలో, కార్మిక పర్యావరణం, వ్యయ-సమర్థత, మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూలత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వ్యూహంలో ఆఫ్రికాదేశాలలో అగ్రస్థానంలో ఉందని భావిస్తున్నారు.

ఫైనాంసు సీక్రెటు ఇండెక్సు (ఎఫ్డిఐ) దక్షిణాఫ్రికా ప్రపంచంలో 50 వ సురక్షితమైన పన్ను స్వర్గంగా ఉంది.

కార్మిక రంగం

దక్షిణాఫ్రికా 
Workers packing pears for export in the Ceres Valley, Western Cape

1995-2003 లో మద్యకాలంలో అధికారిక ఉద్యోగాల సంఖ్య తగ్గింది. అనధికారిక ఉద్యోగాలు అధికరించాయి; మొత్తం నిరుద్యోగం మరింత అధికరించింది.

నల్లజాతి ప్రజల వ్యక్తిగత యాజమాన్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించడం కోసం, దక్షిణాఫ్రికా అభివృద్ధి బ్యాంకులో పరిశోధన, సమాచారం కోసం ప్రధాన ఆర్థికవేత్త అయిన " నెవా మక్గేట్లా " ప్రభుత్వం బ్లాక్ ఎకనమికు సాధికారత (బీఎఎ) విధానాలు విమర్శలను ఎదుర్కొన్నాయి. అధికారిక నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు నల్లజాతీయుల ఆర్థిక సంపద, నల్లజాతి మధ్యతరగతి ప్రజలసంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఇతర సమస్యలలో ప్రభుత్వ యాజమాన్యం, జోక్యం ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. ఇది పలు రంగాలలో ప్రవేశించడానికి అధిక అడ్డంకులను విధించింది. కఠినమైన కార్మికుల నియంత్రణ నిరుద్యోగ సమస్యలకు దోహదం చేసింది.

అనేక ఆఫ్రికన్ దేశాలతో పాటు గత 20 సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా "బ్రెయిన్ డ్రెయిన్"ను ఎదుర్కొంటోంది. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మీద ఆధారపడే వారి శ్రేయస్సు దాదాపుగా హానికరంగా ఉంటుంది. దక్షిణాఫ్రికాలో నైపుణ్యం ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా నైపుణ్యాల పంపిణీ వారసత్వాన్ని ప్రదర్శించేందుకు జాతిసంఘర్షణలు, విదేశాకు చెందిన దక్షిణాఫ్రికా శ్వేతజాతి విధానాలు అడ్డంకులుగా ఉన్నాయి. అయినప్పటికీ మేధోశుష్కత చూపించడానికి ఉద్దేశించిన గణాంకాలు వివాదాస్పదంగా ఉన్నాయి. విదేశీ పని ఒప్పందాల గడువు దాటి స్వదేశానికి చేరుకున్న కార్మికుల నైపుణ్యం లెక్కకట్టలేదని భావిస్తున్నారు. అనేక సర్వేల ప్రకారం, 2008-2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, విదేశీ పని ఒప్పందాల గడువు తర్వాత మేధోశుష్కత మొదలైంది. 2011 మొదటి త్రైమాసికంలో ప్రొఫెషనల్ ప్రావిడెంట్ సొసైటీ (పిపిఎస్) సర్వేలో 84% స్థాయిని గ్రాడ్యుయేటు నిపుణులను విశ్వసనీయ స్థాయిలో నమోదు చేశారు. చట్టవిరుద్ధ వలసదారులు అనధికారిక వ్యాపారంలో పాల్గొంటారు. దక్షిణాఫ్రికాకు చెందిన అనేక వలసదారులు నిరుపేదలుగా జీవించడం కొనసాగుతుంది. 1994 నుండి ఇమ్మిగ్రేషను పాలసీ మరింత నిషేధించబడింది.

సైంసు, సాంకేతికత

దక్షిణాఫ్రికా 
Mark Shuttleworth in space

దక్షిణాఫ్రికాలో అనేక ముఖ్యమైన శాస్త్రీయ, సాంకేతిక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1967 డిసెంబరులో గ్రోటు స్కురు హాస్పిటలులో కార్డియాక్యాను బర్నార్డు మొట్టమొదటి మానవ హృదయ మార్పిడికి చికిత్స చేసాడు. మాక్సు థాయిలరు పసుపు జ్వరానికి వ్యతిరేకంగా టీకాను అభివృద్ధి చేశాడు. అలెను మెక్లీడ్ కోర్మాకు ఎక్సు- రే కంప్యూటు టోమోగ్రఫీ (సి.టి. స్కాన్)మార్గదర్శకం వహించాడు. ఆరోను క్లగు క్రిస్టలోగ్రాఫికు ఎలక్ట్రాను మైక్రోస్కోపీ పద్ధతులు అభివృద్ధి చేసాడు. బర్నార్డు మినహా, ఈ పురోభివృద్ధులన్నీ నోబెలు బహుమతులతో గుర్తించబడ్డాయి. సిడ్నీ బ్రాన్నేరు ఇటీవల 2002 లో పరమాణు జీవశాస్త్రంలో తన మార్గదర్శక రచన కొరకు నోబులు పురస్కారం గెలిచాడు.

మార్కు షటిల్వేవరు తొలి ఇంటర్నెటు భద్రతా సంస్థ తవెటును స్థాపించాడు. దీనిని తర్వాత ప్రపంచ-నాయకుడు వెరిసైను కొనుగోలు చేశారు. బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషను టెక్నాలజీ, ఇతర హై టెక్నాలజీ రంగాలలో వ్యవస్థాపకతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ దక్షిణాఫ్రికాలో గుర్తించదగ్గ ఇతర సంచలనాత్మక కంపెనీలు స్థాపించబడలేదు. దక్షిణాఫ్రికా ఉత్పాదనలో అత్యధికంగా సాంకేతికాభివృద్ధితో ముడిపడి ఉందని భావించబడుతుంది. ఫారు ఈస్ట్రను ఆర్థికవ్యవస్థలతో పోటీపడలేదని భావించబడుతుంది. రిపబ్లికు దాని ఖనిజ సంపదను శాశ్వతత్వంగ నిబెట్టడానికి అధిక సాంకేతికత మీద దృష్టిసారించి ఆర్థిక వ్యవస్థ మరింత బదిలీ చేయటానికి ప్రభుత్వానికి లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నారు.

దక్షిణాఫ్రికా అభివృద్ధి చెందుతున్న ఖగోళ కమ్యూనిటీని అభివృద్ధి చేసింది. దీనికి సదరన్ ఆఫ్రికన్ పెద్ద టెలిస్కోప్ను ఉంది. ఇది దక్షిణ అర్థగోళంలో అతిపెద్ద ఆప్టికలు టెలిస్కోపుగా గుర్తించబడుతుంది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం కారో అర్రే టెలిస్కోప్ను 1.5 బిలియన్ల స్క్వేరు కిలోమీటరు అర్రే ప్రాజెక్టు కొరకు పాతుఫైండరుగా నిర్మిస్తోంది. 2012 మే 25 న స్క్వేరు కిలోమీటరు అర్రే టెలిస్కోపు హోస్టింగు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సైట్లు రెండింటికీ విభజించబోతున్నట్లు ప్రకటించబడింది.

నీటి సరఫరా, పారిశుధ్యం

దక్షిణాఫ్రికా నీటిసరఫరా రంగం ఉచిత ప్రాథమిక నీటి విధానం, నీటి బోర్డుల ఉనికిలో ఉన్నాయి. నీటిబోర్డులు పైపులైనుల, జలాశయాల మునిసిపాలిటీలకు నీటిని విక్రయించే భారీ నీటి సరఫరా సంస్థలను నిర్వహిస్తున్నాయి. ఈ విధానాలు సర్వీసు ప్రొవైడర్ల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలకు దారితీశాయి. నిర్వహణ మీద దృష్టిని ఆకర్షించటానికి దారితీసింది. జాతి వివక్ష ముగిసిన తరువాత 1990 నుండి 2010 వరకు నీటిసరఫరాను 66% నుండి 79%కు అభివృద్ధి చేసారు. అదే కాలములో పారిశుద్ధ్య సదుపాయం 71% నుండి 79%కి పెరిగింది. అయినప్పటికీ దక్షిణాఫ్రికాలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం సేవలను ప్రమాణాలను మెరుగుపర్చడానికి, నీటి పరిశ్రమకు పెట్టుబడి రాయితీలను అందించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో ఒత్తిడి అభివృద్ధి చెందుతూ ఉంది.

దక్షిణాఫ్రికా తూర్పు ప్రాంతాలలో ఎల్ నీనో పర్యావరణ సంబంధం కలిగి ఉన్న కాలానుగుణ కరువుల వలన బాధపడుతోంది. 2018 ప్రారంభంలో కేప్ టౌను దేశంలోని మిగిలిన ప్రాంతాలకంటే వ్యత్యాసమైన వాతావరణ నమూనాలను కలిగి ఉంది. నగరం నీటి సరఫరా జూన్ చివరిలో పొడిగా ఉంటుందని నగరం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొందని ఊహించబడింది. నీటి పొదుపు చర్యలలో ప్రతి పౌరుడు ఒక రోజుకు 50 లీటర్ల కంటే తక్కువ (13 US గ్యాలన్లు) ఉపయోగించవలసిన అవసరం ఏర్పడింది.

గణాంకాలు

దక్షిణాఫ్రికా 
Map of population density in South Africa
  <1 /km2
  1–3 /km2
  3–10 /km2
  10–30 /km2
  30–100 /km2
  100–300 /km2
  300–1000 /km2
  1000–3000 /km2
  >3000 /km2
Population
Year Million
1950 13.6
2000 45.7
2016 56

దక్షిణాఫ్రికా వైవిధ్య మూలాలు, సంస్కృతులు, భాషలు, మతాలకు చెందిన సుమారు 55 మిలియన్ల మంది (2016)జనసంఖ్య కలిగిన దేశంగా ఉంది. 2011 లో జనాభా గణనను నిర్వహింనిన తరువాత 2016 లో నిర్వహించిన ఇటీవలి సర్వేల జాతీయ సర్వే నిర్వహించబడింది. దాదాపు 3 మిలియన్ల మంది జింబాబ్వేయులతో సహా 5 మిలియన్ల అక్రమ వలసదారులు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. 2008 మే 11 న దక్షిణాఫ్రికాలో వలస ప్రజలకు వ్యతిరేకంగా అల్లర్లు సంభవించాయి.

దక్షిణాఫ్రికా గణాంకాలు ప్రజల ఐదు జాతి జనాభా సమూహాల గణాంకాల వివరాలను మాత్రమే నమోదు చేస్తుంది. ఈ సమూహాలకు సంబంధించిన 2011 జనాభా లెక్కలు:నల్లజాతి ఆఫ్రికన్లు 79.2%, శ్వేతజాతి ప్రజలు 8.9%, ఇతర వర్ణాలకు చెందిన ప్రజలు 8.9%, ఆసియన్లు 2.5%, ఇతర ప్రజలు ప్రత్యేకంగా 0.5% గుర్తించబడలేదు. 1911 లో నిర్వహించబడిన దక్షిణాఫ్రికాలో మొదటి జనాభా గణనలో శ్వేతజాతీయులు 22% ఉండగా 1980 నాటికి వీరి శాతం 16%కి తగ్గింది. దక్షిణాఫ్రికా గణనీయమైన శరణార్థ, ఆశ్రయం కోరుకునే ప్రజలను కలిగి ఉంది. ప్రపంచ శరణార్ధుల సర్వే 2008 ఆధారంగా " యు.ఎస్. కమిటీ ఫర్ రెఫ్యూజీస్ అండ్ ఇమ్మిగ్రాంట్సు " ప్రచురణలో ఈ జనాభా 2007 లో సుమారుగా 1,44,700 గా ఉంది. జింబాబ్వే ప్రజలు (48,400), డి.ఆర్.సి. ప్రజలు (24,800), సోమాలియా ప్రజలు (12,900), 10,000 మందికి పైగా ఇతర ప్రజలు శరణార్థులు, ఆశ్రయం కోరే ప్రజలను లెక్కించారు. ఈ ప్రజలు ప్రధానంగా జోహాంసుబర్గు, ప్రిటోరియా, డర్బను, కేప్ టౌను, పోర్టు ఎలిజబెతు ప్రాంతాలలో నివసించాయి.

భాషలు

దక్షిణాఫ్రికా 
Map showing the dominant South African languages by area
  జులు (22.7%)
  షోసా (16.0%)
  ఆఫ్రికాన్స్ (13.5%)
  ఉత్తర సోతో (9.1%)
  ట్స్వానా (8.0%)
  దక్షిణ సోతో (7.6%)
  ట్సోంగా (4.5%)
  స్వాజీ (2.5%)
  వెండా (2.4%)
  దక్షిణ ఎన్డెబెలె (2.1%)
  None dominant

దక్షిణాఫ్రికాలో 11 అధికారిక భాషలు ఉన్నాయి: జులూ, షోసా, ఆఫ్రికాన్సు, ఇంగ్లీషు, ఉత్తర సోతో, ట్వావానా, దక్షిణ సోతో, సోంగా, స్వాజీ, వెండా, దక్షిణ దెబెలె (మొదటి భాష మాట్లాడేవారు). బహుళభాషలు అధికార భాషలుగా ఉన్న ప్రపంచ దేశాలలో దక్షిణాఫ్రికా 4 వ స్థానంలో ఉంది. మిగిలిన 3 దేశాలలో బొలీవియా, భారతదేశం, జింబాబ్వేలు ఉన్నాయి. అన్ని భాషలు అధికారికంగా సమానం అయినప్పటికీ కొన్ని భాషలు ఇతరులకంటే అధికంగా వాడుకలో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జులు (22.7%), షోసా (16.0%), ఆఫ్రికాన్సు (13.5%) మొదటి భాషలుగా ఉన్నాయి. ఇంగ్లీషు వాణిజ్య, విజ్ఞాన భాషగా గుర్తింపు పొందినప్పటికీ ఇది నాలుగో స్థానంలో ఉంది. 2011 లో దక్షిణాఫ్రికాలో కేవలం 9.6% మంది మొదటి భాషగా జాబితా చేయబడింది; కానీ దేశం వాస్తవ లింగుయా ఫ్రాంకాగా మిగిలిపోయింది.

దేశం అనేక అనధికారిక భాషలను కూడా గుర్తించింది. వాటిలో ఫనగలో, ఖో, లోబేడు, నామా, ఉత్తర తెదేవి, ఫుతి, దక్షిణాఫ్రికా సంకేత భాష ఉన్నాయి. ఈ అనధికారిక భాషలను కొన్ని అధికారిక ఉపయోగాలలో పరిమిత ప్రాంతాలలో వాడబడుతున్నాయి. ఇక్కడ ఈ భాషలు ప్రబలంగా ఉన్నాయని నిర్ధారించబడింది.

ప్రజల అనధికారిక భాషలలో శాను, ఖోఖోయి భాషలు అనేక ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయి. ఉత్తరసరిహద్దులో ఉన్న నమీబియా, బోత్సువానా, ఇతర ప్రాంతాలలోకి విస్తరించాయి. ఇతర ఆఫ్రికన్ల నుండి శారీరక వైవిధ్యమైన ఈ ప్రజలు తమ వేట-సేకరణ సమాజాల ఆధారంగా వారి స్వంత సాంస్కృతిక గుర్తింపును కలిగి ఉన్నారు. వారు ఒక గొప్ప విస్తృతికి పరిమితమయ్యారు. మిగిలిన భాషలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

శ్వేతజాతి దక్షిణాఫ్రికన్లు ఇటాలియను, పోర్చుగీసు (నల్ల అంగోలాన్సు, మోజాంబికన్ల కూడా వాడుకభాషలుగా ఉన్నాయి), జర్మన్, గ్రీకు భాషలు శ్వేతజాతి ఆఫ్రికన్లకు వాడుకభాషలుగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఫ్రాంకోఫోన్ ఆఫ్రికా నుండి వచ్చిన వలసదారులు ఫ్రెంచి మాట్లాడతారు.భారతీయ దక్షిణాఫ్రికా ప్రజలకు హిందీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి కొన్ని భారతీయ భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి.

మతం

దక్షిణాఫ్రికా 
Nederduits Gereformeerde Kerk in Wolmaransstad
దక్షిణాఫ్రికాలో మతం (2010)
మతం శాతం
ప్రొటెస్టంట్లు
  
73.2%
మతం లేదు
  
14.9%
కాథలిక్
  
7.4%
ఇస్లాం
  
1.7%
హిందూ
  
1.1%
ఇతరాలు
  
1.7%

2001 జనాభా లెక్కల ఆధారంగా క్రైస్తవులు జనాభాలో 79.8% మంది ఉన్నారు. వీరిలో అధికభాగం పలు ప్రొటెస్టంటు తెగల సభ్యులు (విస్తృతంగా సింక్రటికు ఆఫ్రికన్లు ప్రారంభించిన చర్చిలు), మైనార్టీ రోమను కాథలిక్కులు, ఇతర క్రైస్తవుల సభ్యులు ఉన్నారు. రోమను కాథలికు (7.1%), మెథడిస్టు (6.8%), డచ్చి సంస్కరణ (నెదరు డీట్సు గెరెఫార్మీర్డే కెర్కు; 6.7%), ఆంగ్లికను (3.8%) ఉన్నారు. మిగిలిన క్రైస్తవ చర్చిల సభ్యులు మరొక 36% జనాభాలో ఉన్నారు. ముస్లిం జనాభా 1.5%, హిందువులు 1.2%, సంప్రదాయ ఆఫ్రికా మతం 0.3%, జుడాయిజం 0.2% ఉన్నారు. 15.1% ప్రజలకు మతపరమైన అనుబంధం లేదు. 0.6% "ఇతర",1.4% "పేర్కొనబడలేదు."

ఆఫ్రికన్లు ప్రారంభించిన చర్చిలు క్రైస్తవ సమూహాలలో అతిపెద్దవిగా ఏర్పడ్డాయి. సాంప్రదాయ ఆఫ్రికన్ మతాలకు వ్యవస్థీకృత మతంతో ఏ విధమైన అనుబంధం లేదని పలువురు విశ్వసించారు. దక్షిణాఫ్రికాలో దాదాపుగా 2,00,000 మంది స్థానిక సంప్రదాయ చికిత్సకారులు ఉన్నారు, దక్షిణాఫ్రికాలో 60% ప్రజలు ఈ నొప్పి నివారణలకు వీరిని సంప్రదిస్తారు. వీరిని సాధారణంగా సాంగోమసు (ఇన్యాంగాసు) అని పిలుస్తారు. ఈ నొప్పి నివారణదారులు పూర్వీకుల ఆధ్యాత్మిక విశ్వాసాలను, స్థానిక జంతుజాలం, వృక్షసంపదకు సంబంధించిన విశ్వాసాలను మిశ్రితం చేసి చికిత్సకు ఉపయోగిస్తారు. సాధారణంగా మ్యుటి అని అంటారు. ఇది ఖాతాదారులకు వైద్యం చేయడానికి వీలు కల్పిస్తుంది. చాలామంది ప్రజలు క్రిస్టియను, స్వదేశీ మతసంప్రదాయాల కలయికతో సంక్లిష్ట మతపరమైన పద్ధతులను కలిగి ఉన్నారు.

దక్షిణాఫ్రికాలోని ముస్లింలలో ప్రధానంగా రంగులలో ఉన్నవారు, భారతీయులుగా వర్గీకరించబడినవారు. నల్లజాతీయులు, తెల్ల దక్షిణాఫ్రికా మతమార్పిడి చేయబడిన ప్రజలుగా ఉన్నారు. మిగిలినవారు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల నుండి ఇతరులు చేరారు. దక్షిణాఫ్రికా ముస్లింలు విశ్వాసం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 1991 లో 12,000 ఉండగా 2004 లో 74,700 కు నల్లజాతి ముస్లింల సంఖ్యతో అభివృద్ధి చెందింది.

దక్షిణాఫ్రికాలో ఇతర ఐరోపాలో స్థిరపడినవారిలో అల్పసంఖ్యాకులుగా వచ్చిన ఐరోపా యూదులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ జనాభా 1970 నాటికి 120,000 ఉండగా ప్రస్తుతం 67,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిగిలిన వారు ఇజ్రాయెలుకు వలసవెళ్లారు. అయినప్పటికీ దక్షిణాఫ్రికాలో యూదు సమూహం సంఖ్యాపరంగా ప్రపంచంలో 12 వ స్థానంలో ఉన్నారు.

సంస్కృతి

దక్షిణాఫ్రికా నల్లజాతి మెజారిటీ ఇప్పటికీ గ్రామీణ నివాసులలో గణనీయమైన సంఖ్యలో ఉంది. సాంస్కృతిక సంప్రదాయాలు అత్యంత బలంగా మనుగడ సాగిస్తున్నాయి. నల్లజాతీయులలో పట్టణీకరణ, పాశ్చాత్యీకరించబడినందువల్ల, సాంప్రదాయక సంస్కృతి అంశాలు తగ్గాయి. ప్రారంభంలో మద్యతరగతి వారిలో శ్వేతజాతీయులు అధికంగా ఉన్నప్పటికీ క్రమంగా నల్లజాతి, రంగు, భారతీయ ప్రజల సంఖ్య అధికరించింది. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలేసియాలో కనిపించే ప్రజలలా దక్షిణాఫ్రికా అనేక విధాలుగా జీవనశైలిని కలిగి ఉంటారు.

కళలు

దక్షిణాఫ్రికా 
డ్రాకెన్స్‌బర్గ్ లోని రాతి చిత్రం

దక్షిణాఫ్రికా కళా ప్రపంచంలో అత్యంత పురాతన కళ వస్తువులు ఉన్నాయి. ఇవి దక్షిణాఫ్రికా గుహలో 75,000 సంవత్సరాల క్రితం నాటి కళాఖండాలు కనుగొనబడ్డాయి. క్రీస్తు పూర్వం సుమారు 10,000 లో దక్షిణాఫ్రికాలోకి వెళ్లిన ఖోసా ప్రజల గిరిజన గుహాచిత్రాల సమూహం నేటికి తమ స్వచ్ఛమైన కళల శైలులను ప్రదర్శిస్తున్నాయి. కళలు రూపాలను బంటు ప్రజలు (నగుని ప్రజలు) వారి సొంత పదజాలంతో భర్తీ చేశారు. ఆధునిక గనులు, పట్టణాలలో కొత్త కళాసంస్కృతులు పుట్టుకొచ్చాయి: ప్లాస్టికు స్ట్రిప్సు నుంచి సైకిళ్లకు సంబంధించిన ప్రతిదాన్నీ ఉపయోగించి ఒక డైనమికు కళ అభివృద్ధి చేయబడింది. 1850 ల నుండి ఐరోపా సంప్రదాయాలకు మారడం ద్వారా ఆఫ్రికాను ట్రెక్కర్లు, పట్టణ తెల్ల కళాకారుల డచ్చి-ప్రభావిత జానపద కళ, దృఢంగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ ఉంది.

దక్షిణాఫ్రికా 
ఆలివ్ స్చ్రేనర్

దక్షిణాఫ్రికా సాహిత్యం ఒక ప్రత్యేక సామాజిక, రాజకీయ చరిత్ర నుండి ఉద్భవించింది. ఒక ఆఫ్రికా భాషలో ఒక నల్ల రచయిత వ్రాసిన మొట్టమొదటి ప్రసిద్ధ నవలలో ఒకటి 1930 లో రాయబడిన సోలోమోన్ థీసిసో ప్లోట్జే మహుడి. 1950 లలో డ్రం పత్రిక రాజకీయ వ్యంగ్య, కల్పన, వ్యాసాల కేంద్రంగా మారింది. ఇది పట్టణ నల్లజాతి సంస్కృతి వెలుగులోకి తీసుకువచ్చింది.

ప్రసిద్ధి చెందిన తెల్ల దక్షిణాఫ్రికా రచయితలలో అలాన్ పాటోన్ ఉన్నాడు. ఆయన 1948 లో " క్రై, ది బిలవ్డు కంట్రీ " నవలను ప్రచురించాడు. నాడిను గోర్డిమెరు 1991 లో సాహిత్యంలో నోబెలు బహుమతిని పొందిన మొట్టమొదటి దక్షిణాఫ్రికా పౌరుడు అయ్యాడు. జి.ఎం. కాట్జీ సాహిత్యంలో నోబెలు బహుమతిని గెలుచుకున్నాడు. బహుమతిని ప్రదానం చేసినప్పుడు స్వీడిషు అకాడమీ ఇలా పేర్కొంది " కోట్జీ అసంఖ్యాకమైన గూయిసు "లో వెలుపలి నుండి ఆశ్చర్యకరమైన పాత్రను పోషించాడు."

అథోలు ఫ్యూగార్డు నాటకాలు దక్షిణాఫ్రికా లండను (రాయలు కోర్టు థియేటరు) న్యూ యార్కులో ప్రదర్శించాడు. ఆలివు స్చ్రేనేరు ది స్టోరీ ఆఫ్ యాన్ ఆఫ్రికను ఫార్ము (1883) విక్టోరియను సాహిత్యంలో ఒక ప్రచురించబడింది. ఇది అనేకమందిని ఫెమినిజాన్ని నవల రూపంలో పరిచయం చేసింది.

బ్రెయిటెను బ్రైటెన్బాకు వర్ణవివక్షకు వ్యతిరేకంగా గెరిల్లా ఉద్యమంతో అతని ప్రమేయం కోసం జైలు పాలయ్యారు. ఆండ్రే బ్రింకు మొట్టమొదటిగా ఆఫ్రికా రచయితగా ఏ డ్రై వైటు సీజను విడుదల చేసిన తరువాత ప్రభుత్వం పుస్తకాన్ని నిషేధించింది.

ప్రబల సంస్కృతి

దక్షిణాఫ్రికా మీడియా రంగం పెద్దది. దక్షిణాఫ్రికా ఆఫ్రికా ప్రధాన మీడియా కేంద్రాలలో ఒకటిగా ఉంది. దక్షిణాఫ్రికా అనేక ప్రసారకులు, ప్రచురణలు మొత్తం జనాభా వైవిధ్యతను ప్రతిబింబిస్తున్నప్పటికీ, సాధారణంగా ఉపయోగించే భాష ఆంగ్లం. అయినప్పటికీ మొత్తం పది ఇతర అధికారిక భాషలు కొంతవరకు లేదా మరొకటి ప్రాతినిధ్యం వహిస్తాయి.

దక్షిణాఫ్రికా సంగీతంలో గొప్ప వైవిధ్యం ఉంది. నల్లజాతి సంగీతకారులు అభివృద్ధి చేసిన క్వైటో శైలిని రేడియో, టెలివిజను, మ్యాగజైన్లు స్వీకరించాయి. బ్రెండా ఫాస్సీ "వీకెండ్ స్పెషల్" పాటతో కీర్తి పొందింది. ఇది ఆంగ్లంలో పాడినది. సోవియెటు స్ట్రింగు క్వార్టెటు ఒక ఆఫ్రికా బాణితో సాంప్రదాయిక సంగీతాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో, సాంప్రదాయ సంగీత విద్వాంసులు లడీస్మితు బ్లాకు మామ్బాజోను స్వీకరించారు. దక్షిణాఫ్రికా ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాజ్ సంగీతకారులలో ముఖ్యంగా హ్యూ మాసెకెలా, జోనాసు గ్వాంగ్వా, అబ్దుల్లా ఇబ్రహీం, మిరియం మేక్బా, జోనాథను బట్లరు, క్రిసు మెక్గ్రెగారు, సతిమా బీ బెంజమిన్లు ప్రజాదరణ సంపాదించుకున్నారు. ఆఫ్రికన్ మ్యూజికులో సమకాలీన స్టీవు హోఫ్మేయరు, పానికి రాక్ బ్యాండు ఫోకోఫ్పోలిసికరు, గాయకుడు-గేయరచయిత జెరెమీ లూప్సు వంటి పలు కళా ప్రక్రియలు ఉన్నాయి. అంతర్జాతీయ విజయం సాధించిన దక్షిణాఫ్రికా ప్రముఖ సంగీతకారులు జానీ క్లెగ్గు, అలాగే సీథరు కూడా ఉన్నారు.

దక్షిణాఫ్రికా వెలుపల కొన్ని దక్షిణాఫ్రికా చలన చిత్ర నిర్మాణాలు ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికా గురించి అనేక విదేశీ చిత్రాలు తయారు చేయబడ్డాయి. దక్షిణాఫ్రికాని ఇటీవల సంవత్సరాల్లో చిత్రీకరించిన అత్యంత గొప్ప చిత్రం జిల్లా 9. ఇతర గుర్తించదగిన మినహాయింపులు చలనచిత్రం తోసీ. ఇది 2006 లో 78 వ అకాడెమి అవార్డులలో విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డును గెలుచుకుంది. అలాగే యు- కార్మెను ఇ 2005 లో బెర్లిను ఖాయీలిషా ఇంటర్నేషనలు ఫిల్ము ఫెస్టివలలో గోల్డెను బేరు గెలుచుకుంది. 2015 లో ఆలివరు హెర్మన్ల చిత్రం ది ఎండ్లెసు నది వెనిసు ఫిలిం ఫెస్టివలుకు ఎంపికైన మొట్టమొదటి దక్షిణాఫ్రికా చిత్రంగా పేరు గాంచింది.

Cuisine

దక్షిణాఫ్రికా 
An example of bunny chow served in Durban, originated in the Indian South African community

దక్షిణాఫ్రికా వంటకాలు విభిన్నంగా ఉన్నాయి; అనేక రకాల సంస్కృతుల నుండి ఆహారాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ప్రత్యేకించి విస్తార ఆహారాల రుచులను శాపుల్సుగా పర్యాటకులకు విక్రయిస్తారు.

దక్షిణాఫ్రికా వంటకం భారీగా మాంసం ఆధారితంగా ఉంటాయి. ప్రత్యేకంగా దక్షిణాఫ్రికా సాంఘిక సేకరణను బ్రైయి అంటారు. ఇది బార్బెక్యూ వైవిధ్యం. దక్షిణాఫ్రికా కూడా ఒక పెద్ద వైను నిర్మాతగా అభివృద్ధి చెందింది. స్టెల్లియన్బొషు, ఫ్రాంక్షోకు, పార్లు, బ్యారీడాలు చుట్టూ ఉన్న లోయలలో కొన్ని ఉత్తమ ద్రాక్ష తోటలు ఉన్నాయి.

క్రీడలు

దక్షిణాఫ్రికా అత్యంత జనాదరణ పొందిన క్రీడలు సాకరు, రగ్బీ, క్రికెటు.

దక్షిణాఫ్రికా 
Kagiso Rabada, South African cricketer

ముఖ్యమైన ఇతర క్రీడలు ఈత, అథ్లెటిక్సు, గోల్ఫు, బాక్సింగు, టెన్నిసు, రింగుబాలు, నెట్బాలు ఉన్నాయి. బాస్కెటు బాలు, సర్ఫింగు, స్కేట్బోర్డింగు వంటి ఇతర క్రీడలలో సాకరు యువతకు గొప్ప ఆధిక్యత కల్పిస్తూ మరింత ప్రజాదరణ పొందింది.

ప్రధాన విదేశీ క్లబ్బులకు ఆడిన సాకరు ఆటగాళ్ళు స్టీవెను పియనేరు, లుకాసు రెడ్బే, ఫిలేమోన్ మసింగ్సా, బెన్నీ మెక్కార్తి, ఆరోను మోకోనా, డెల్రాను బక్లేలు ఉన్నారు. దక్షిణాఫ్రికా 2010 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్పుకు ఆతిథ్యం ఇచ్చింది. ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రెసిడెంటు " సెప్ బ్లాటరు" ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు (దక్షిణాఫ్రికాకు 10 లో 9 వ స్థానంలో నిలిచింది) అవార్డును బహుకరించాడు.

దక్షిణాఫ్రికా 
2007 రగ్బీ ప్రపంచ కప్ గెలిచిన తరువాత బస్ కవాతులో స్ప్రింగ్బోక్సు

ప్రముఖ బాక్సింగు క్రీడాకారులలో బేబీ జేక్ జాకబు మాట్లాలా, వుయని బుంగ్యు, సుశి నసిటా, దింగాను తోబెల, గెర్రి కోట్జీ, బ్రయాను మిట్చెలు ప్రాధాయత వహిస్తూ ఉన్నారు. డర్బను సర్ఫరు జోర్డి స్మితును " 2010 బిల్బాబాంగు జే-బే ఓపెను" ప్రపంచంలోని అత్యధిక ర్యాంకులను కలిగిన సర్ఫరుగా చేసింది. ఫార్ములా వను మోటారు రేసింగు 1979 ప్రపంచ ఛాంపియను జోడి స్కెకెటరు దక్షిణాఫ్రికా పౌరుడు. ప్రముఖ ప్రస్తుత క్రికెటు ఆటగాళ్ళు కగిసో రబడ, ఎబి డి విల్లియర్సు, హషీమ్ ఆమ్లా, డేలు స్టెయిను, వెర్నను ఫిలండరు, ఫాఫు డ్ ప్లెస్సిసు వంటి చాలా మంది క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగులో కూడా పాల్గొంటారు.

దక్షిణాఫ్రికా ఫ్రాంకోయిసు పియనేరు, జోస్టు వాను డెరు వెస్టుహ్యూజెను, డాని క్రావెను, ఫ్ర్రికు డు ప్రీజు, నాసు బోథా, బ్రయాను హబానా వంటి అనేక ప్రపంచ తరగతి రగ్బీ ఆటగాళ్లను కూడా తయారు చేసింది. దక్షిణాఫ్రికా " 1995 రగ్బీ ప్రపంచ కప్పు "కు ఆతిథ్యమిచ్చి అందులో విజయం సాధించింది. ఫ్రాంసులో 2007 రగ్బీ వరల్డు కప్పును గెలుచుకుంది. ఇది 2007 క్రికెట్ ప్రపంచ కప్పు 2007 ప్రపంచ ట్వంటీ 20 ఛాంపియన్షిపుకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించడం ద్వారా దక్షిణాఫ్రికా జాతీయ క్రికెటు జట్టు 1998 ఐసిసి నాక్అవుట్ ట్రోఫీ ప్రారంభ ఎడిషనును కూడా గెలుచుకుంది. దక్షిణాఫ్రికా జాతీయ బ్లైండు క్రికెట్ జట్టు కూడా 1998 లో బ్లైండు క్రికెటు ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషనును గెలుచుకుంది.

2004 లో ఏలాండ్సు లోని ఒలంపికు క్రీడలలో రోలాండు స్తోమను, లిండను ఫెర్నుసు, డారియను టౌన్సెండు, రైకు నీథింగ్ల స్విమ్మింగు జట్టు 4 × 100 ఫ్రీస్టైలు రిలేలో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. 1996 అట్లాంటా ఒలింపికు క్రీడలలో పెన్నీ హెయిన్సు ఒలింపికు గోల్డు గెలుచుకున్నాడు. 2012 లో ఆస్కారు పిస్టోరియసు లండనులో ఒలింపికు గేమ్సు పోటీ మొదటి డబులు ఆంపిటీ స్ప్రింటరు అయ్యాడు. గోల్ఫులో గారీ ప్లేయరును సాధారణంగా అన్ని కాలాలలోనూ గొప్ప గోల్ఫు ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడుతారు. దీనితో కెరీర్ గ్రాండు స్లాం గెలిచాడు. ఇది సాధించిన ఐదుగురు గోల్ఫు క్రీడాకారులలో ప్గారీ ప్లేయరు ఒకరు బాబీ లాకు, ఎర్నీ ఎల్సు, రిటఫు గూసెను, టిం క్లార్కు, ట్రెవరు ఇమ్మెల్మను, లూయిసు ఓస్తుయిజెను, చార్లు స్క్వార్టుజెలు వంటి ఇతర దక్షిణాఫ్రికా గోల్ఫు క్రీడాకారుల ఇతర టోర్నమెంట్లలో గెలుపొందరు.

అధ్యక్షులు

జాకబ్ జుమా - 2009 నుండి అధ్యక్షుడు

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

South Africa గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

దక్షిణాఫ్రికా  నిఘంటువు విక్షనరీ నుండి
దక్షిణాఫ్రికా  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
దక్షిణాఫ్రికా  ఉదాహరణలు వికికోట్ నుండి
దక్షిణాఫ్రికా  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
దక్షిణాఫ్రికా  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
దక్షిణాఫ్రికా  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Tags:

దక్షిణాఫ్రికా పేరు వెనుక చరిత్రదక్షిణాఫ్రికా చరిత్రదక్షిణాఫ్రికా Geographyదక్షిణాఫ్రికా ఆర్ధికరంగందక్షిణాఫ్రికా గణాంకాలుదక్షిణాఫ్రికా సంస్కృతిదక్షిణాఫ్రికా అధ్యక్షులుదక్షిణాఫ్రికా ఇవీ చూడండిదక్షిణాఫ్రికా మూలాలుదక్షిణాఫ్రికా బయటి లింకులుదక్షిణాఫ్రికాఅట్లాంటిక్ మహాసముద్రంఆఫ్రికాఎస్వాటినీజింబాబ్వేనమీబియాపాత ప్రపంచంబోత్సువానామొజాంబిక్లెసోతోహిందూ మహాసముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

హైదరాబాదు మెట్రోరుద్రమ దేవిరాశికర్కాటకరాశిచిరుధాన్యంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)పార్వతినందమూరి తారక రామారావుప్రేమలునితీశ్ కుమార్ రెడ్డిషర్మిలారెడ్డితీన్మార్ సావిత్రి (జ్యోతి)నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంచైనామొయీన్ అలీకుష్టు వ్యాధిసజ్జల రామకృష్ణా రెడ్డిమేడిరావి చెట్టుసైరన్తెలుగు సినిమాలు 2022దశదిశలువిష్ణుకుండినులుభారత ఎన్నికల కమిషనుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుచెట్టురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుగౌడఆలంపూర్ జోగులాంబ దేవాలయంAగ్లోబల్ వార్మింగ్సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుజపాన్తెలంగాణ ఉద్యమంభలే మంచి రోజువిజయశాంతికరోనా వైరస్ 2019నందిగం సురేష్ బాబుసమంతజక్కంపూడి రాజాపేర్ని వెంకటరామయ్యపూజా హెగ్డేనితిన్బెంగళూరుఉత్తరాషాఢ నక్షత్రముశుక్రుడు జ్యోతిషంఆంధ్రప్రదేశ్తెలుగు వికీపీడియామధుమేహంచతుర్వేదాలుతిరుమలఇక్ష్వాకులుఆహారంమీనాక్షి అమ్మవారి ఆలయంగుంటూరు జిల్లాకోదండ రామాలయం, ఒంటిమిట్టదగ్గుబాటి వెంకటేష్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసప్తర్షులురాకేష్ మాస్టర్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసర్పంచినువ్వుల నూనెనరసింహ (సినిమా)భువనేశ్వర్ కుమార్ప్లాస్టిక్ తో ప్రమాదాలువసంత వెంకట కృష్ణ ప్రసాద్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుగోల్కొండశోభన్ బాబు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువేంకటేశ్వరుడుసమాచార హక్కుఅధిక ఉమ్మనీరుఢిల్లీ డేర్ డెవిల్స్చార్మినార్అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం🡆 More