ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అంటారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పరిశుద్ధ గ్రంథం (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంథం.
యూదుల మతం (Judaism) సుమారు samanya s kam పూర్వం 2000 సంవత్సరాల్లో (భారతదేశంలో వేద కాలం నడుస్తున్న కాలంలో) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయకాండం, ద్వితియోపదేశకాండం, సంఖ్యాకాండం వంటి పుస్తకాలు యూదులు (Jews) కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. ఆ కాలంలో యూదులు పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు, కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సులభతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యోషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో కన్య,, యేసేపు లకు యేసు క్రీస్తు జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడిఉంది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్స్ (Romans) పరిపాలనలోకి వెళ్ళిపోయింది.
బాల్యంనుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేర్చుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభతరం చేసి క్రొత్త నిబంధనగా బోధించాడు. [యేసుక్రీస్తు] బోధనలకు పలు యూదులు, ఇతర జాతుల వారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందసులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాదస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. యూదుల కోరిక ప్రకారం రోమన్ రాజు ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేయించారు. తర్వాత శిలువ కారణంగా Death చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు, రోమన్స్ అంగీకరించారు. ఆనాటినుండి క్రైస్తవం అనే మార్గం వాడుకలోకి వచ్చింది. ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు క్రొత్త నిబంధన రచించారు.
బాపీస్మం (Baptism) అనగా ఒక వ్యక్తి తాను చేసిన పాపాలు దేవుడి ఎదుట ఒప్పుకొని అప్పటినుండి పరిశుద్ధంగా జీవిస్తానని, తీర్మానించుకొని దేవుడికి ప్రమాణం చేయుట. దీన్నే మారు మనస్సు అని బైబిలు పరిభాషలో అంటారు. గ్రామాల్లో అయితే కాలువల్లోను, చెరువుల్లోను, నగరాల్లో అయితే వాటర్ ట్యాంకుల్లోను బాప్తిస్మం ఇస్తారు. ఒక విశ్వాసి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తానని ఆత్మీయంగా సిద్ధపడాలి. బాప్తిస్మము గురించి క్రొత్త నిబంధనలో కొరింధీయులకు వ్రాసిన పత్రికలోను, మత్తయి సువార్తలోను ప్రస్తావించబడినది . బాపిస్మం తీసుకొన్న వారు అనగా రక్షింపబడినవారు . ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకొంటేనే రక్షణ లభిస్తుంది అని క్రైస్తవుల నమ్మకం. బాప్తిస్మం తీసుకొన్నవారు మాత్రమే చర్చిల్లో రొట్టె - ద్రాక్ష రసం (సంస్కారం / బల్ల) స్వీకరించాలి. రొట్టె క్రీస్తు శరీరానీకి, ద్రాక్షరసం క్రీస్తు రక్తానికి సాదృశ్యం. బల్ల గురించి మత్తయి 26, యోహాను 6 లో వ్రాయబడియున్నది.
మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల మధ్య యుగంలో క్రైస్తవులు సంప్రదాయాల ననుసరించి రోమన్ కాథలిక్కులు, సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం అనే ప్రధాన వర్గాలుగా చీలిపోయారు.
పరలోకమందున్న మా తండ్రీ! మీ నామం పరిశుద్ధపరచబడును గాక! మీ రాజ్యం వచ్చును గాక! మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందునూ నెరవేరును గాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి! మా యెడల అపరాధం చేయువారిని మేము క్షమించులాగున మీరు మా అపరాధాలను క్షమించండి! మమ్మల్ని శోధనలోనికి తేక సమస్త కీడునుండి దుష్టత్వం నుండి తప్పించండి. (మత్తయి 6:10 - 14) రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము మీరైయున్నారు తండ్రీ! ఆమెన్!.
భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించినది క్రీస్తు శకం 52 వ సంవత్సరంలో.యేసు క్రీస్తు శిష్యుడు అయిన సైంట్ థామస్ కెరళలో యేసుక్రీస్తు గురించి ప్రకటించి క్రైస్తవ్యాన్ని భారతదేశానికి పరిచయం చేసాడు.
This article uses material from the Wikipedia తెలుగు article క్రైస్తవ మతం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.